మరో వైపు ముస్లిం బలం పెరగటం చాపక్రింద నీరులా నడిచింది. సెక్యులర్ ప్రభుత్వం వారి మత విశ్వాసాల్లో కల్పించుకోకూడదు. అప్పటి నిరుద్యోగ, దారిద్రరేఖకు దగ్గరగా ఉన్న ముస్లింలు సంతాననిరోధ ఆపరేషన్లకు వ్యతిరేకంగా ఉండేవారు. అలా వ్యతిరేకంగా ఉండాలని మసీదుల, మదరసాలు, [అప్పడు ఇవి ఎక్కువుగా లేవులెండి. వాటిని ఆరబిక్ స్కూల్స్ అనేవాళ్ళు.] ముల్లాలు, ముస్లింలకి నూరిపోసేవారు. ముల్లాల గ్రిప్ ముస్లింల మీద ఎంత ఉంటుందంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఫలానా ప్రాంతంలోని ముస్లింలందరూ ఫలానా పార్టీ అభ్యర్ధికే ఓటు వేయాలంటే తూచా తప్పకుండా ఓటు వేసేంత. దీని వలన ముస్లిం సామాన్య జనంకు ఎలాంటి లాభం ఉండదు. వాళ్ళలో అభద్రతాభావం పెంచి, వాళ్ళు అనివార్యంగా మసీదుకు తలవొగ్గేటట్లు చూసుకోవడమే ఇక్కడి స్ట్రాటజీ. అందుకు అవసరమైతే హిందూ – ముస్లింల మధ్య ఘర్షణలు పెరిగేటట్లు చూడగలరు. వాళ్ళ ఓట్లు మసీదును అనుసరించి ఉండేటట్లు చూసుకుంటారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఒకటి చెబుతాను. ముస్లిం ఓటుబ్యాంకు కోసం రాజకీయపార్టీలు నానాగడ్డీ కరుస్తాయి. ‘14% ముస్లిం ఓట్లు అంత ముఖ్యమైనప్పుడు 79% హిందూ ఓట్లు ఎందుకు ముఖ్యం కాదు?’ అని తార్కికంగా ఆలోచించి ఆశ్చర్యపోతుంటాం మనం. కాని ముస్లిం ఓట్లను మసీదులు ప్రభావితం చేస్తుంటాయి. వాటికి వెనుక కారణాలు చాలా ఉంటాయి. వీళ్ళ మసీదులకి సౌదీ అరేబియా మొదలైన ముస్లిం దేశాలనుండి ఫండ్స్ వస్తుంటాయి. ఆ నిధులతో మదరసాల నిర్వహణ చేస్తుంటారు. ముషారప్ సీటు దిగేటప్పుడు సౌదీ పాత్ర చాలా ఉంది. అమెరికా, బ్రిటన్ లను సంప్రదించినంతగా సౌదీనీ సంప్రదించిన తరువాతే ముషారప్ సీటు దిగాడు. అలాగే, 1992 లో బాబ్రీ మసీదు విషయంలో కూడా సౌదీ అలాంటి పాత్రే తీసుకోవటానికి ప్రయత్నించగా, అప్పటి భారత ప్రభుత్వం అంత అవకాశం ఇవ్వలేదు. ఇలా మన దేశపు మసీదుల మీద సౌదీ ప్రభావం చాలా ఉంది. ఆ విధంగా కుట్రదారుల పై ముఖం [over leaf reason]గా సౌదీరాజులాంటి వారు ఉంటారు.

ఇక – ఓట్ల విషయానికి వస్తే హిందూ ఓట్లు చీల్చటానికి కుట్రదారులు ఓట్లు చీల్చగల పార్టీలనూ, ఆయా నియోజక వర్గాలలో తిరుగుబాటు అభ్యర్దుల పేరుతో ఎక్కువ మంది పోటీలో ఉండేటట్లు చూస్తారు. చాలా పార్టీలను, చాలా మంది అభ్యర్దులను నిలబెట్టి హిందూ ఓట్లను చీల్చుతారు. ఆవిధంగా ముస్లీం ఓట్లు, అభ్యర్ధుల గెలుపుఓటమిలను ప్రభావితం చేస్తాయి. అంతేగాక మసీదుల నుండి ఓట్లను ఫలానా పార్టీ అయితేనే మనకు భద్రత అని, కాబట్టి తాము చెప్పిన పార్టీకే ఓట్లు వేయమని ఓటర్లులను ప్రభావితం చేస్తారు. కొద్దిశాతం ఓట్లు చీలినా అధిక శాతం ఓట్లు ముద్దరగా ఒకే పార్టీకి పడతాయి. ఏపార్టీని గెలిపించాలన్న నిర్ణయం కుట్రదారులు తీసుకుంటారు.

ఈవిధంగా ముస్లిమేతరులలో ‘విభజించు పాలించు’ అన్న నీతి అమలుచేయబడితే, ముస్లింలలో ముల్లాలు, మతపెద్దల ద్వారా ’కలిసి ఉండు, లాభం పొందు’ అన్న పాలసీ అమలు చేయబడుతుంది. ఈ కిటుకు తెలుసు కాబట్టే రాజకీయనాయకులు పార్టీల కతీతంగా ముస్లింలకు అనుకూలంగా ఉంటారు. ఈవిధంగా ముస్లిం గారాబం నడిపింపబడుతుంది. ఇలాంటి చాలా స్ట్రాటజీలు ముస్లింలకి ప్రపంచవ్యాప్తంగా అనుకూలంగా నడిపింపబడుతున్నాయి. అయితే అది చాలామంది ముస్లింలకి కూడా తెలియదు. వారిలో అత్యధికులు విద్యాహీనులు, చేతి వృత్తుల వారు. ముల్లా ఏంచెబితే అది చేయటానికి అలవాటు పడిన వారు. ఆట అంతా పైస్థాయిలోనే ఉంటుంది. ప్రయోజనమూ పైవారికే కలుగుతుంది. మధ్యలో పేదముస్లిం ఓటరు పావుమాత్రమే. తనకి తాను కూడా ఏమాత్రమూ ఉపయోగపడని పావు.

ఇదే నెట్ వర్క్ ని ఉపయోగించి, అప్పట్లో అంటే 1975 నాటికి, దేశంలో ముస్లిం జనాభా వృద్ధి రేటు అందోళనకర స్థాయిలో ఉండింది. అలాగే వదిలేస్తే ఇండియా ఇప్పటికి మరో ఇండోనేషియా అయ్యేది. ఒకప్పటి బౌద్ద దేశం ఇండోనేషియా, ఇప్పుడు ముస్లిం దేశం. ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలున్న దేశంగా ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. రెండో ర్యాంకులో పాకిస్తాన్ ఉంది. ఆనాడు భారత్ లో పెరుగుతున్న ముస్లిం జనాభా వృద్దిరేటు ఈ భవిష్యస్థితి ఊహకందే దూరంలో ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థని గానీ, చివరికి కుటుంబస్థితిని గాని పరిగణనలోకి తీసుకొనే స్థితిలో ముల్లాలు లేరు. దాంతో ముస్లిం పేదలూ లేరు. తినడానికి తిండి గింజలకు ఇంట్లో కరువుండేదేమో గానీ పిల్లలకి కాదు. ఇంతకు ముందు నేను ఒకసారి వ్రాసినట్లు నాబాల్యం గుంటూరు మాయా బజార్ లో గడిచింది. అక్కడ పేద ముస్లింలు చాలామంది ఉండేవారు. చిన్న గదుల్లో కాపురం. ఇంట్లో కనీసం 7 నుండి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ముక్కుపచ్చలారని పిల్లల్ని, ఆటోమొబైల్ సర్వీస్ షాపుల్లో, మేస్త్రీకి హెల్పర్లుగా తెచ్చివదిలిపెట్టేవారు. బొడ్డుకోసి పిల్లల్ని మాయా బజార్లో వదలిపెడతారని సాక్షాత్తూ ఆ ముస్లిం మేస్త్రీలే అనేవారు. ఆటా పాటా, ముద్దు మురిపం అన్నీ పనిలోనే, మేస్త్రీతోనే. బేరం హడావుడీలో ఉన్నప్పుడు స్ర్కూడ్రైవర్ సరిగా అందించని పసి హెల్పర్ ని గుండు మీద అదే స్ర్కూడ్రైవర్ తో బాదే మేస్త్రీలు, బుగ్గలపై మసి చారికలతో పాటు కన్నీటి చారికలతోనూ పసిహెల్పర్లూ, పనేం లేనప్పుడు, తీరికగా ఉన్నప్పుడు ’ఇందాక పని ఒత్తిడిలో బుడ్డోడినికొట్టానే’ అన్న పశ్చాతాప్తంతో చేగోడిలో, పుల్ల ఐస్ లో పసివాళ్ళకీ కొనిచ్చి ముద్దు చేసే మేస్త్రీల చేతుల్లో, దెబ్బలు మరిచిపోయి నవ్వులు కురిపించే పిల్ల హెల్పర్లూ – అక్కడ సర్వసాధారణ దృశ్యాలు.

ఇంత దారుణ దరిద్ర స్థితిలోనూ “ఏమయ్యా! ఇంతమంది పిల్లలతో ఎందుకంత కష్టం? చదివించలేవు. పైకి తేలేవు. ఆపరేషన్ చేయించుకోకూడదు?" అంటే “మనమేం చేస్తాం? దేవుడిస్తున్నాడు. ఆపరేషన్ పాపం. ఖురాన్ ఒప్పకోదు” అనేవాళ్ళు. ఖురాన్ లో ఏముందో చదివేందుకు వారికి అరబిక్ రాదూ, సరికదా తెలుగు కూడా చదవటం, వ్రాయటం రాని నిరక్షరాస్యులే. కానీ ముల్లాలు, మత పెద్దలూ ఖురాన్ లో అలా ఉందని చెప్పారు, నమ్మాలి అంతే. ఈ నమ్మికనీ, అమాయకత్వాన్నీ జయప్రదంగా తమ స్వార్ధానికి ఉపయోగించుకొనే వారు పైస్థాయిలోని కుట్రదారులు.

దాంతో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుందన్న ఆందోళన సర్వత్రా ఉండేది. వారిలో విద్యనీ, సామాజిక స్పృహనీ పెంచే ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించింది ప్రభుత్వం. ఫలితం మాత్రం శూన్యం. దాదాపు ప్రభుత్వ పధకాలన్నీ ఇదే స్థితిలో ఉండేవి. పధక రచనకూ, అమలుకూ కోటానుకోట్లు వెచ్చింపబడేవి. ఫలితం మాత్రం గుండు సున్నాలు వచ్చేవి.

ఈస్థితిలో కుట్రదారులకూ, ఇందిరాగాంధీ ప్రభుత్వానికీ దొంగా పోలీసు ఆట అయ్యింది. ఈ నేపధ్యం ఇందిరాగాంధీ, దేశంలో ఎమర్జన్సీ విధించే వరకూ ప్రయాణించింది. ఆవిడా, ఆవిడకు తోడుగా నిలిచిన కొద్దిమంది మంత్రివర్గ సహచరులూ ఎమర్జన్సీని బాగా సమర్ధించారు. వారికి దేశంలో జరుగుతున్న కుట్ర అనుభవానికి అందుతోంది. నిరూపించేందుకు నిస్సహాయులు.

ఆ కొద్దిమంది మంత్రివర్గ సహచరులూ భారతదేశం పట్ల నిబద్దత, దేశభక్తిగలవారు. వారికి కుట్ర అనుభవానికి అందుతోంది. కానీ ఎక్కడి నుండి అమలు చేయబడుతుందో, ఎవరు సూత్రధారులో తెలియలేదు. తోచిన అన్ని దారుల్లోనూ అన్వేషించారు. అయితే ఇంటి కోడలిగా, గడపదాటని ఇల్లాలిగా సోనియాగాంధీని గానీ, స్థానిక తెలుగు పత్రికకి చెందిన చిన్న వ్యాపారి రామోజీరావుని గానీ అనుమానించలేకపోయారు. చంకలో పిల్లాణ్ణి పెట్టుకొని ఊరంతా వెదికినట్లు వెదికారు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఎందుకంటే మనవారి మీద, ‘మన వారు’ అనుకున్న వారి మీద మనకుండే నమ్మకం. అందుకే ఇందిరాగాంధీ తన కోడల్ని అనుమానించలేకపోయింది. అయినాగానీ, ఎమర్జన్సీ సమయంలో కొన్ని నెలలు రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ స్వదేశం విడిచిపెట్టి దేశాంతర నివాసం చేసారు. అప్పుడు కూడా కుట్రతీరులో ఏమార్పు రాకుండా జాగ్రత్త పడ్డారు కుట్రదారులు. ఒక మనిషిని absent చేసినా కూడా యధాతధంగా పని నడిచినప్పుడు మనం ఏమనుకుంటాం? సదరు పనిలో ఆవ్యక్తి ప్రమేయం ఏమీ లేదనుకుంటాం. సరిగ్గా అదే జరిగింది. అనవసరంగా అనుమానించామే అన్న పశ్చాత్తాపం కూడా ఇందులో ప్రభావం చూపుతుంది. అందుకనే ఎమర్జన్సీ అనంతరం జనతా ప్రభుత్వహయంలో, ఇందిరాగాంధీ క్లిష్టస్థితిలో, సోనియాగాంధీ ఆవిడకి మరింత చేరువయ్యింది. తలలో నాలుక అయ్యింది. మరింత మానసిక మద్దతు ఇచ్చింది. తాము గురిపెట్టిన వ్యక్తికి – కష్టం తామే కలిగించి, తమవారిని దగ్గర చేయటం అనే స్ట్రాటజీ ఇది. అప్పుడు తమ వారి స్థానం మరింత బలపడుతుంది. తాము ఎవరి మీదైతే గురిపెట్టారో ఆవ్యక్తి తమ ఏజంటు మీద పూర్తిగా మానసికంగా ఆధారపడతారు. ఇదీ మానసిక తంత్రమే. గూఢచార మంత్రమే.

మరోవైపు అప్పటికే ఇందిరాగాంధీ క్యాబినేట్ లో స్థిరపడిన కుట్రదారుల మద్దతుదారులు ఆవిడని, ఆవిడకు నమ్మకస్తులైన కొద్దిమంది దేశభక్తుల్నీ అప్పటి విషయాలకు సమస్యలకూ అప్పటికి పైకి కనబడే కారణాలని[over leaf reasons] చూపెట్టి convince చేయటానికి, misguide చేయటానికి విశ్వప్రయత్నం చేసేవాళ్ళు. మీడియా ఎటూ ఉండనే ఉన్నది. అదే ప్రధాన కుట్రదారు అనుకోలేదు గనుక మీడియా వ్రాసేదంతా అబద్దమనో, కుట్ర అనో అనుకోరు. సరిగదా మీడియా వ్రాసే దాన్ని ఎంతోకొంత నిజం అనీ, కొండొకచో ఎక్కువభాగం నిజమనే ఆవిడ వర్గం కూడా అనుకొనే వాళ్ళు.

1975 లో ఎమర్జన్సీ విధింపబడింది. ఎంతోమంది రాజకీయ నాయకుల్నీ, రచయితల్నీ, కాస్తోకూస్తో పేరున్న చాలామందిని జైల్లో పెట్టారు. కొందరు అఙ్ఞాతంలోకి పోయారు. అప్పటి మీడియా వార్తలకి నియంత్రణ విధింపబడింది. అప్పటికి ఈనాడు వైజాగ్ ఎడిషన్ పుట్టి సంవత్సరమే అయ్యింది. హైదరాబాద్ ఎడిషన్ 1975 లో పుట్టింది గనుక ఎమర్జన్సీ అరెస్టుల ప్రమాదం రామోజీరావుకి మిగిలిన వారికి ఉన్నంత తీవ్రంగా లేకపోయింది.

అయితే కుట్రదారుల బలం, కుట్రని ఎదుర్కోనే వారి బలం కన్నా, తీవ్రంగానూ, ఎక్కువుగానూ ఉండింది. అప్పటికే ఆయా స్థానాల్లో స్థిరపడిన కుట్రదారుల ఏజంట్లు, మద్దతుదారుల బలం దీనికి తోడయ్యింది. అలాంటి కుట్రదారుల మద్దతుదారులలో కొందరు రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ కూడా ఉన్నారు.

ఇక్కడ విస్మయకరమైన ఒక విషయాన్ని మీదృష్టికి తెస్తాను. బాబూ జగ్జీవన్ రామ్ అనే దళిత నాయకుడు అప్పట్లో ఇందిరాగాంధీ క్యాబినేట్ లో సీనియరూ, ప్రముఖుడూ కూడాను. అతడు ఎమర్జన్సీ ప్రకటనకి సరిగ్గా ఒకటి రెండు రోజుల ముందు లేదా ప్రకటించిన ఒకటి రెండు రోజుల తర్వాత ఇందిరా గాంధీ ఎమర్జన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశాడు. అతడు రాజీనామా చేసిన రోజున రామోజీ రావు, ఈనాడులో ఇందిరాగాంధీ అతడికి వ్రాసిన లేఖ పూర్తి పాఠాన్ని “బాబూజీ మీరు కూడానా?" అన్న శీర్షికతో ప్రచురించాడు. [షేక్స్ పియర్ నాటకం జూలియర్ సీజర్ లోని ‘యూ టూ బ్రూటస్’ లాగా అన్నమాట] రాజీనామా నిర్ణయానికి జగ్జీవన్ రామ్ కారణాలు ఏమైనా ఉండవచ్చు కానీ, అతడి ప్రవర్తన మాత్రం నైతికత కాదు. అప్పటి వరకూ తాను ప్రయాణించిన నౌకని నట్టేట ముంచుతూ ఉమ్మడి బాధ్యత నుండి తృటిలో తప్పించుకుంటూ, ఎమర్జన్సీ నిర్ణయం క్యాబినెట్ లో చర్చించలేదంటూ, అసలు తనకి ఆవిషయమే తెలియదంటూ, ఇది ఇందిరాగాంధీ నియంతృత్వపోకడ అంటూ ఒక్కసారిగా టీంని వదిలేసాడు. ఇందులోని నిజానిజాలు ఎవరో మేధావుల గ్రంధాల కంటే, అప్పటి మీడియా కధనాలు చూస్తే బాగా తెలుస్తాయి. ఆ జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 5న జాతీయ సెలవుదినంగా నేటి యు.పి.ఏ. ప్రభుత్వకుర్చీవ్యక్తి సోనియాగాంధీ ప్రకటించింది. దళిత ఓట్ల కోసం అన్న పైకారణం [over leaf reason] చూపెట్టబడింది. అయితే ఆవిధంగా జగ్ జీవన్ రామ్ ఆత్మకి, అతడి వారసులకి [return gift] ప్రతి బహుమతి ఇచ్చారు. అదేవిధంగా కుట్రమద్దతుదారులకు సిగ్నల్ ఇచ్చారు. ‘తమని నమ్మి చెడిన వారు లేరు’ అన్నట్లన్న మాట. ఏపార్టీకి అయితే వెన్నుపోటు పోడిచాడో, ఆపార్టీ చేతనే అతడికి గౌరవం దక్కేటట్లు చేయడం ఇక్కడి స్ట్రాటజీ. అప్పడే కదా మరికొందరు ధైర్యంగా ముందుకొస్తారు, తమకి సహకరించడానికి?

ఇక ఎమర్జన్సీని జయప్రదంగా ఓటమి పాలు చేయగలిగారు కుట్రదారులు. సంజయ్ గాంధీ దగ్గరుండి ముస్లిం యువకులకి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించాడనీ, అందులో 12 ఏళ్ళ అబ్బాయిలు కూడా ఉన్నారనీ, డాక్టర్లకి లక్ష్యాలు నిర్ణయించి మూకుమ్మడి ఆపరేషన్లు చేయించాడనీ, దాంతో డాక్టర్లు లక్ష్యం సంఖ్య [Target No.] చేరుకోవడానికి చిన్నపిల్లలకి కూడా ఆపరేషన్లు చేశారనీ, మొదటగా విదేశీ మీడియా బయటపెట్టగా, తదుపరి స్వదేశీ మీడియా గళం, కలం కలిపాయి. జయప్రదంగా ఎమర్జన్సీ భారతదేశచరిత్రలో మాయని మచ్చనీ, ప్రజాస్వామ్యపు ముఖం మ్మీద నల్లమచ్చనీ, చీకటి రోజులనీ, అంధయుగమనీ హోరెత్తించారు.

కుట్ర గురించి అసలు తెలియని, ఊహించని స్వేచ్ఛాప్రియులు అది నిజమని ఎలుగెత్తారు. ప్రజలు అవి నమ్మారు. మొత్తంగా ఎమర్జన్సీ అన్న అంకం అలా పూర్తి అయ్యింది. ఓటమి పొందింది.

ఇందిరాగాంధీ 1977 లో ఎమర్జన్సీ రద్దు చేసి పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించింది. ‘ఇప్పుడు ఎన్నికలు జరిపిస్తే గెలుస్తామని’ నివేదిక ఇచ్చి నిఘా సంస్థలు ఇందిరాగాంధీని తప్పదోవ పట్టించాయని అప్పట్లో వార్తలొచ్చాయి. కుట్రదారులే నిఘా సంస్థల్ని తప్పు దోవపట్టించారో, లేక కుట్రదారులు నిఘా సంస్థలోని కొందరు కీలక వ్యక్తుల్ని లోబరుచుకున్నారో తెలియదు. ఏది చేయటానికైనా కుట్రదారులు సమర్ధులే.

అయితే, ఆవిధమైన వార్త కధనాలు వ్రాయటం ద్వారా భారత గూఢచార, నిఘా సంస్థలకీ, ఇందిరాగాంధీ కి మధ్య అపార్ధాలనీ, కమ్యూనికేషన్ గాప్ నీ సృష్టించగలిగారు. భవిష్యత్తులో తాము కొనసాగించబోయే కుట్రలకు సానుకూల పరిస్థితులు సృష్టించుకొనేందుకు ప్రభుత్వానికి, నిఘా సంస్థలకీ మధ్య అపనమ్మకాన్ని ప్రవేశపెట్టటం, సమన్వయాన్ని దెబ్బతీయటం చేశారు. గూఢచర్యంలో ఇలాంటి స్ట్రాటజీలు అతి నైపుణ్యంతోనూ, దూరదృష్టితోనూ అమలు చేయబడతాయి. ఎంత దూరదృష్టి అంటే దశాబ్దాల కాలాన్ని ముందుగా ఊహించి మరీ పధక రచన చేస్తారు. ఒకోసారి కొన్ని స్ట్రాటజీలకు కాలవ్యవధి 50 సంవత్సరాల కన్నా ఎక్కువుగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. [ఇక అనువంశిక నకిలీ కణికుల సహనం అయితే శతాబ్ధాల పాటిది.] ప్రపంచప్రజలందరికీ instant food, instant result అలవాటు చేసి, ’సహనం, వేచి ఉండటం’ అన్న లక్షణాలని ప్రజల నుండి దూరం చేస్తారు. తాము మాత్రం తమ గూఢచార పధక ఫలితాలని, నెమ్మదిగా సుదీర్ఘంగా చాపక్రింద నీరులా పొందగల సహనం కలిగి ఉంటారు. అప్పుడు ప్రజలు ఈ గూఢచర్య తంత్రాన్ని తెలిసినా నమ్మలేరు కదా!


ఏమయితేనేం – నిఘావర్గాల సలహాలే కానివ్వండి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి రీత్యా కానివ్వండి, ఎమర్జన్సీ చీకటిలో ఇండియాలో దారుణ మారణకాండ, [ముస్లింలకి నిర్బంధ సంతాన నిరోధ ఆపరేషన్ల వంటివి] నియంతృత్వం జరిగిపోతున్నాయని అంతర్జాతీయ మీడియా ప్రచారం వల్ల కానివ్వండి, ఇందిరాగాంధీ 1977 లో ఎమర్జన్సీ రద్దుచేసి ఎన్నికలు ప్రకటించింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu