అన్నిటివెనుకా ఒకే లక్ష్యం, ఒకే అంతస్సూత్రం ఉన్నప్పుడు ఆ చర్యలూ, సంఘటనలూ, ప్రచారాలు వాటంతటవే జరుగుతాయా? అవన్నీ ఓ పద్ధతిప్రకారం నడిపించబడటం ఉన్నప్పుడు ఓ పద్దతి ప్రకారం నడిపించే వాళ్ళెవరో ఉండాలి కదా! అదీ – ఓ విదేశీ [సి.ఐ.ఏ.లాంటిది] వ్యవస్థే కానివ్వండి, ఓ వంశస్థుల వ్యవస్థే కానివ్వండి, ఉండి తీరాలి కదా!

ఇకపోతే …….

1672 AD లో రాజ్యాని కొచ్చిన తానీషా 1687 లో ఔరంగజేబు చేతిలో ఓడిపోయాడు. అప్పుటికి 31 ఏళ్ళుగా గోల్కొండ మీద, 18 సార్లు దాడులు చేసినా గెలవని ఔరంగజేబు స్థానికుల సాయంతో 1687 లో గెలిచాడు. ఎప్పుడైనా స్థానికులు సహకరిస్తేనే ఏ కుట్ర అయినా, ఏ దాడి అయినా జయిస్తుంది. ఇప్పుడూ అంతే కదా! తెలిసీ కావాలనో, తెలియక అమాయకంగా అది నిజమనుకొనో ఎందరో భారతీయులు సహకరించబట్టే నిరాటంకంగా మనదేశం, మన సంస్కృతి పతనమవుతున్నాయి.

1724 AD లో అసఫ్ షాహీ నిజాములు గోల్కొండ గద్దెనెక్కారు. 1687 AD నుండి 1724 AD వరకూ మధ్యలో గల 37 ఏళ్ళల్లో ‘ఏ వారసులు లేదా వంశాలు’ గోల్కొండ సింహాసనం కోసం ఎన్నిప్రయత్నాలు చేశాయో మనకి తెలియదు.

మరోప్రక్క 1498 AD లో ఇండియాలో అడుగుపెట్టిన యూరపు వ్వాపార గుంపులు, ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా, 1768 AD వరకూ తమలో తాము కుమ్ములాడుకుంటూనే ఉన్నాయి. అప్పుడు [1768 AD లో] ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కారు జిల్లాలపై హక్కుని నిజాం నుండి పొందింది. 1800 AD లో రాయలసీమ జిల్లాలని దత్తతగా పొందింది. 1802 AD లో పర్మినెంట్ సెటిల్ మెంటు జరిగింది. ఇది పర్యవసానం. ఈ పర్యవసానానికి కారణం ఏమిటంటే – నిజాం రాజు ప్రజల నుండి పన్నుల సరిగా వసూలు చేసుకోలేక పోయాడు. తమ సైనికుల చేతిలోని బల్లెం, కత్తులూ, ఈటెలు లాంటి ఆయుధాల కన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతుల్లోని తుపాకులకు ప్రజలు భయపడి పన్నులు చెల్లిస్తారని నమ్మాడు. ఆ తుపాకుల్ని కొందామని గానీ, తమ సైనికులకి తుపాకీ వాడకంలో శిక్షణ నిచ్చి వాడుకొందామని అనుకోలేదో, అనుకున్నా ఈస్ట్ ఇండియా కంపెనీ అలాంటి కాంట్రాక్టుకు ఒప్పుకోలేదో గానీ పన్నులు వసూలు చేసి పెట్టే కాంట్రాక్టు కుదిరింది.

అయితే కొన్ని సంవత్సరాలు తిరిగే సరికి మరి ’కంపెనీ’ వసూలు చేసిపెట్టిన పన్నులు సొమ్ము ఏమయ్యిందో గాని నిజామే కంపెనీ వారికి బకాయి పడ్డాడు. ఇప్పుడు పేదవాళ్ళు గనుక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు అప్పు తీసుకొంటారు. వాయిదాలు కడుతూనే ఉంటారు, కడూతూనే ఉంటారు. ఎప్పటికీ అప్పు తీరదు చూడండీ. అలాంటి ఆర్ధిక తంత్రం ఇది. దెబ్బతో నిజాం రాజు భూమిని కంపెనీకి ధారాదత్తం చేశాడు.

అప్పటికి – 1498 AD నుండి 1768 AD వరకూ దాదాపు 270+ ఏళ్ళుగా వ్వాపారం కోసమే నానా అగచాట్లు పడుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1800 AD నుండి 1857 AD వరకూ అంటే 57 ఏళ్ళు లోపు యావద్భారత దేశాన్ని హస్తగతం చేసుకోగలిగింది. దీనికి కారణం నిశ్చయంగా ఈస్ట్ ఇండియా కంపెనీ సామర్ధ్యం కాదు. ఈ విషయం ఇంతకు ముందు టపా డిసెంబరు 5 ‘మన పైన జరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 1 [కణిక నీతి]’ & 6 వ తేదీ ‘మన మీదజరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 2 [ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు] ’ లలో విపులంగా చర్చించాను. ఎందుకంటే తుపాకీ మందు కనిపెట్టినా, బ్రిటిషు వ్యాపార గుంపులు ఇతర యూరపు దేశాల్ని, వ్యాపార పోటీని గ్రిప్ చేయలేకపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఇప్పుడూ, బ్రిటీషు దేశం ప్రపంచాన్ని గ్రిప్ చేయలేక పోతుంది. దాని పాత్ర పరిమితమై పోయింది.

ఎందుకంటే 1687 AD లో తానీషాకి ఏ మేధస్సు ’కల’ వ్యూహం చెప్పిందో, ఆ వ్యూహం లో గూఢచర్యం మిళితమై ఉంది. సాంకేతిక సామర్ధ్యం, నైపుణ్యం కూడా గూఢచర్య నైపుణ్యం తోడయితేనే రాణిస్తాయి. ఆ మేధస్సు బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి తోడ్పడింది. తరతరాలుగా అనువంశికమైన ఆ ఙ్ఞానం, నెట్ వర్క్, కంపెనీ తర్వాత జగజ్జేతగా బ్రిటీషు రాజకుటుంబాన్ని నిలిపింది. దాని ఉత్ధాన పతనాలు తర్వాత వరుసగా రష్యా, అమెరికాల ఉత్థాన పతనాలు జరిగాయి, జరుగుతున్నాయి. తొలిసారిగా బ్రిటీషు ప్రభుత్వం ప్రపంచాన్ని భూగోళంగా [Globalize] చేసింది. అంతర్జాలం కంటే ముందుగానే ఇది జరిగింది.

ఈ గూఢచార మేధో వంశాన్నే నేను ’నకిలీ కణికుడు’ గా సౌలభ్యం కోసం సంభోదించాను. ఎందుకంటే భారతంలోని కణిక నీతిని [Divide and Rule Policy] వీరు మరోసారి క్రొత్తగా కనుగొన్నారు కదా!?

ఈ నకిలీ కణికుడు ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. ఒక తరం కాదు, తరతరాలుగా నిరంతరం నిగూఢంగా పనిచేస్తున్నవాడు. ఒక చోట నుండి కాదు, పలు ప్రదేశాల నుండి, ఇతడి మనుషులు పనిచేస్తునారు. పైకి సి.ఐ.ఏ. ఏజంట్లుగానూ, మోసాద్ లేదా ఐ.ఎస్.ఐ. లేదా బ్రిటీషు ఏజంట్లు గానో కనబడతారు. ఇంకా చెప్పాలంటే వేరు వేరు వృత్తుల్లో కనబడతారు. తరతరాల వ్యాపార కుటుంబాలని [లేమాన్ బ్రదర్స్ 125 ఏళ్ళుగా, రతన్ టాటాల వంశం 150 ఏళ్ళుగా వ్యాపారంలో ఉన్నాయి] తరతరాలుగా కళాకారుల కుటుంబాలని ఒప్పుకుంటాం గానీ, ఇలా రహస్యంగా గూఢచర్యం జరిపే కుటుంబాలుంటాయని నమ్మం అనేవారికి ఎవరు చెప్పగలిగిందీ ఏమీ లేదు.

ఈ నకిలీ కణిక వంశం దగ్గర గూఢచర్య ఙ్ఞానం, కౌశలం ఉంది. దీనితో తానీషాకి ’కల’ వ్యూహాన్ని రచించి పెట్టింది. అది పాక్షిక జయప్రదంగా అమలు జరపబడినది. పూర్తి జయప్రదం చేసుకొనే వ్యవధి తానీషాకి లేకపోయింది. ఔరంగజేబు దాడి అతడికి పులి మీద పుట్ర వంటిది.

ఆనాటి నకిలీ కణికుడుకి ఔరంగజేబుతో ’దోస్తీ’ ఉపయోగపడేట్లు కనబడింది. ఎందుకంటే ఆ మొగలాయిల దగ్గర తరతరాలుగా సామ్రాజ్యాన్ని నడిపిన అనుభవమూ, అవగాహనా ఉంది. ఈ లోపాయి కారీ దోస్తీ, అప్పటి ప్రజల్లో తానీషా మీద ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకొని, గోల్కొండ కోట ద్వారాలు తెరిపించి ఔరంగజేబుకి గోల్కొండ మీద విజయం తెచ్చిపెట్టింది. తర్వాత 37 సంవత్సరాల గోల్కొండ రాజకీయాల్లో ఏం జరిగిందో గానీ అసఫ్ షాహీ ’నిజాం’లు గద్దెనెక్కారు.

తదుపరి, ఆనాటి నకిలీ కణికుడికి ఈస్ట్ ఇండియా కంపెనీతో ’దోస్తీ’ ఉపయుక్తంగా అన్పించింది. ఎందుకంటే వారి దగ్గర సముద్రయానం, తుపాకీ మందు లాంటి సాంకేతిక ఙ్ఞానం, ఖండాంతరాల గురించిన అవగాహన ఉంది. ఆ ఙ్ఞానం, అవగాహనా తాము ఔపోసన పట్టేదాకా ఈస్ట్ ఇండియా కంపెనీకి ’సీన్’ ఇవ్వబడింది. తదుపరి సీన్ లోకి బ్రిటీషు రాజకుటుంబం వచ్చింది. ఇలా నకిలీ కణీకులు [ ఏ తరం వారైనా సరే, వారి ఫార్ములా ఇదే!] ఎవరితో తమకి అవసరం ఉంటుందో, వారికి – ఎంతకాలం అవసరం ఉంటారో అంతకాలం సీన్ ఇస్తారు. అప్పటిదాకా ఓడ మల్లయ్య అంటారు. తర్వాత బోడి మల్లయ్య అంటారు. ఆ కారణంగానే బ్రిటీషు వారి ఉత్ధాన పతనాలూ, తర్వాత రష్యా, ఇప్పుడు అమెరికా ...... ఇలా! మనదేశంలో ఎన్.టి. ఆర్. మొదలుకొనీ నిన్నటి రామలింగరాజు దాకా, ఇదే ఓడ మల్లయ్య, బోడి మల్లయ్య స్ట్రాటజీని చూస్తూనే ఉన్నాము కదా!

గమనించి చూడండి……..

ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిస్థితులు – ఒక దేశానికి ఇంకో దేశం పాస్ట్ ఫార్వర్డ్ లేదా బ్యాక్ వ్యార్డ్. అంతే! అన్ని సంఘటనలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఏ దేశంలోనైనా [ముస్లిం దేశాలు మినహా] వేరే దేశపు సంస్కృతిని పొగుడుతూ, ఆ దేశపు సంస్కృతిని హీన పరుస్తారు. ఏ దేశపు రాజకీయ నాయకులయినా, మీడియా అయినా, వ్యాపార సంస్థలయినా ఆ దేశప్రజలని దోచుకుంటూనే ఉంటాయి. ఇక్కడ ఒకే సారూప్యత ఉంటుంది. ఇంతకు ముందు ప్రపంచాన్ని ఆడిస్తుంది బ్రిటీష్ సామ్రాజ్యం అన్నారు. తర్వాత రష్యా కె.జి.బి., అమెరికా సి.ఐ.ఏ. అన్నారు. ఇప్పుడు లాడెన్, ముస్లిం పెట్రో డాలర్లు తెర పైకి వస్తూన్నాయి.

నిజానికి ఈ నకిలీ కణికుడు ’ఉపయోగించుకొనేందుకు’ ముస్లిం అనుకూలుడు. ఆ ముస్లింల పట్ల నిబద్దత అనుమానస్పదమే. ఈతడు నిజాంలకీ అనుకూలుడు కాదు. అయితే అతడికి ఇండియాలోని హైదరాబాదు మాత్రం ప్రాణం! 1947 AD లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మధ్యపాకిస్థాన్ [హైదరాబాద్ సంస్థానం] ఏర్పరచాలని శతవిధాలా ప్రయత్నించాడు. ఒకవేళ సర్ధార్ పటేల్ గనుక పోలీసు చర్య చేపట్టక పోయిఉంటే, నెహ్రు మెతక వైఖరి కాశ్మీరు పైన లాగా హైదరాబాద్ సంస్థానం పైనా కొనసాగి ఉంటే ఇప్పుడు ఇస్లామాబాద్ స్థానంలో హైదరాబాద్ ఉండేది. అన్ని అగ్రదేశాలూ కలిసి ఇస్లామాబాద్ ని బుజ్జగించి గారాబం చేసినట్లుగా, హైదరాబాద్ ని బుజ్జగించి గారాబం చేసేవి. ఇప్పటికీ పైకారణం [over leaf reason] గా ఇస్లామాబాద్ ఉందే గానీ, ఇస్లామాబాద్ నిర్వహించే అన్నీ తీవ్రవాద కార్యకలాపాలకు, కుట్రలకూ మూలాలు హైదరాబాద్ లోనే కదా తేలుతుంది?

ఏతావాతా 1687 AD నుండి 2009 వరకూ ౩ శతాబ్ధాల పైచిలుకుగా ఏ వంశమైనా ప్రపంచాధిపత్యం కోసం నిగూఢంగా పనిచేస్తూ, సాధ్యాసాధ్యాలని బ్రిటీషు, రష్యా, అమెరికా, నేడు లాడెన్ ల రూపంలో ప్రయోగాత్మకంగా పరీక్షించుకుంటూ ప్రపంచాన్ని గూఢచర్యంతో నడిపిస్తూ ఉంటే ...... అసాధ్యమా?

ఆంత్రోపాలజీలో, ఆది మానవుని ఉనికి తాలుకూ పరిశోధనల్లో కృత్రిమంగా తయారు చేసిన మానవ కంకాళాన్ని లక్షల సంవత్సరాల క్రితపు నాటిదని 4 దశాబ్ధాలు ప్రపంచాన్ని నమ్మించడం [ఫిల్ట్ రాక్ హోల్స్ – ఉదంతం. పూర్తి వివరాలకు నండూరి రామ్మోహన రావు గారు వ్రాసిన నరావతారం చూడగలరు], అంగారకుడు లాంటి ఇతర గ్రహాల్లో కాలువల లాంటి నిర్మాణాలున్నాయనీ, అక్కడ గ్రహాంతర వాసులున్నారనీ ప్రపంచాన్ని నమ్మించడం, [వివరాలకు నండూరి రామ్మోహన రావు గారే వ్రాసిన మరో గ్రంధం ’విశ్వరూపం’ చదవగలరు] మనకు తెలిసిన సంఘటనలే. అలా ఒక ’విషయాన్ని’ [అది నిజం కానివ్వండి అబద్ధం కానివ్వండి] ప్రపంచం మొత్తం చేత కొన్ని దశాబ్ధాలు [అంటే దీర్ఘకాలం] నమ్మించడం సాధ్యమేననడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.

ఇక్కడ గమనించాల్సిన మరోవిషయం ఏమిటంటే – గూఢచర్య సాంకేతిక ఙ్ఞానం మన భారత రామాయణాలలో విపులంగా చర్చించబడింది. నారద నీతి, మార్కండేయ మహర్షి, వ్యాస మహర్షి ఇతరుల చర్చల్లో, విదుర నీతిలో, రామభరత సంవాదంలో ……. ఇలా లెక్కకు మిక్కిలి. సరిగ్గా వాటిల్లో ఏవి చేయమన్నారో వాటికి విలోమ పద్దతులు అవలంభించడం, ఏవి చేయరాదన్నారో అవే చేయటం ద్వారా కుట్రదారులు మన సమాజాన్ని ఇంత జయప్రదంగా భ్రష్ఠుపట్టించగలిగారు. గత ప్రభుత్వాల్ని ఒత్తిడి చేయగలిగారు. ప్రస్తుత ప్రభుత్వాలకు ఆ అవసరం లేదు లెండి. ఇవి స్వచ్ఛందంగానే కుట్రకు మద్ధతుదారులు. ఈ గూఢచర్య ఙ్ఞానం భారత రామాయణాది ఇతిహాసాల్లోనే కాదు భట్టి విక్రమార్క లాంటి జానపద కథల్లోనూ విస్తృతంగా ఉంది. అందుచేతనే కుట్రదారులు ముందుగా భారత రామాయణాలని సమాజం నుండి మాయం చేసారు. ఇక జానపద కథలు ఎంత వక్రీకరించబడ్డయో, జానపద సినిమాల రూపంలో ఎంతగా పలుచన చేయబడ్డాయో చెప్పనలవి కాదు. వాటిలోని లాజికల్ సెన్స్, గూఢచార ఙ్ఞానము, ‘అసలు కథలు’ తెలిస్తే గదా, అర్ధం చేసుకోగలం?

ప్రజలకి ఇవన్నీ తెలిస్తే, అంటే భారత రామాయణాల్లోని, భట్టి విక్రమార్క కథల్లాంటి జానపద కథల్లోని గూఢచార ఙ్ఞానం తెలిస్తే తాముపన్నుతున్న కుట్రలు పసిగట్టగలుగుతారు. అందుకే సినిమాలతో అన్ని కళలనీ నాశనం చేసి, సినిమా అన్న దాన్ని ఏకైక సాధనం చేసి, ఆ సినిమాల సాయంతోనే, ఇతిహాసాలని, జానపద కళలనీ, జానపద కళారూపాలని నిర్వీర్యం చేసారు, నిరాదరణ పాలు చేశారు, క్రమంగా రూపుమాపారు. ఇది – కుట్రలోని ఓ ప్రధాన పార్శ్వం.

ఒక ఉదాహరణ పరిశీలించండి.

కాలినడక మాత్రమే రవాణా సాధనంగా తెలిసిన వ్యక్తికి, విమానాల్లాంటి సాంకేతిక ఙ్ఞానం ఉందని వూహించనైనా లేని వ్యక్తికి, హైదరాబాద్ నుండి ఢిల్లీకి గంటలో చేరగలమంటే చచ్చినా నమ్మడు. చెప్పిన వారికి ‘పిచ్చేమో’ అనగలడు.

మరో ఉదాహరణ పరిశీలించండి.

డోపింగ్ ప్రక్రియ తెలియక ముందు మనందరమూ విదేశీ క్రీడాకారుల అద్భుతవిజయాల్ని అబ్బురపడుతూ చూచి ప్రశంసించాము గదా! డోప్ మందుల సాంకేతిక ఙ్ఞానం, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి మర్మము తెలిసాక కదా ’ఓహో! ఇలాగూ విజయాలు సాధించవచ్చన్న మాట’ అనుకుంటున్నాం?

అలాగే మనందరం ఏ గణాంక వివరాలనైనా, [ఓటర్ల జాబితా దగ్గర నుండీ ఓ ప్రదేశంలోని లక్షలాది వ్యక్తుల వృత్తి, ఆదాయం వివరాల దాకా] కంప్యూటర్ తెలియని చోట, టన్నుల కొద్దీ రికార్డులలో వ్రాసుకోక తప్పదు. ఆ కట్టల కొద్దీ రికార్డుల్లోంచి ప్రత్యేకంగా ఒక వ్యక్తి వివరాలు కావాలంటే కనీసం కొన్ని రోజులు, ఎక్కువమంది కలిసి వెతికితే కొన్ని గంటలు పడుతుంది. అలాంటిది కొన్ని సెకన్లలో ఆ వివరాలు చెప్పవచ్చు. అని ఎవరైనా అంటే నమ్మగలమా? అదే కంప్యూటర్, దాని పనితీరు తెలిస్తే…..? మన కళ్ళముందే, ఒక్క ’నొక్కు’ [క్లిక్] దూరంలో, కొన్ని సెకనులలో వివరాలు తెలుసుకోవటం చూసాక నమ్ముతాం కదా!

ఈ కుట్ర కూడా అలాంటిదే.

ఎంతటి సాంకేతిక పరిఙ్ఞానమైనా గూఢచర్య ఙ్ఞానం ఉంటేనే గిరాకీగా చెల్లుబాటు అవుతుంది. కావాలంటే ఈ ఉదాహరణ పరిశీలించండి. గల్ఫ్ ముస్లిం దేశాలు, తమ ముడి చమురు [మొత్తం ప్రపంచపు అవసరంలో వీరి ఉత్పత్తి 40% కంటే కూడా తక్కువే.] ను పరమ గిరాకీగా అమ్ముకోగలరు. మొత్తం ఇంధన ప్రపంచాన్నీ శాసించగలరు. ప్రపంచ ఆర్ధిక స్థితి మొత్తం ఈ ఒపెక్ దేశాల నిర్ణయాలపై ఆధారపడేంత ’గిరాకీ’గా అమ్ముకోగలరు. అమెరికాతో సహా [ఈ దేశంలోనూ ముడి చమురు నిల్వలున్నాయి] ఎవ్వరూ ఈ ముస్లిం దేశాలకు కళ్ళెం వేయ లేకుండా ఉన్నారు.

ఎన్నో దేశాలకి ఎంతో కొంత స్వంత చమురు వనరులు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ’బైక్ మోడల్ క్రేజ్’ల్లాంటి వ్యూహాలతో పాటు ’పెట్రో ఉత్పత్తులకి’ గిరాకీ ఉండేటట్లుగా చూడటమే ’ఒపెక్’ దేశాలకు గూఢచర్యం అందిస్తున్న అండాదండా!

అదే మరి దక్షిణాఫ్రికా వారైతే తమ వజ్రాల గనుల్లోని, బంగారు గనుల్లోని ఉత్పత్తిని [వజ్రాలు, బంగారం అయినా సరే] గిరాకీగా అమ్ముకొని ఒపెక్ దేశాల మాదిరిగా ధనిక దేశం కాగలిగరా?

అంతెందుకు! మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే పరిటాల [కృష్ణా జిల్లా] లాంటి గ్రామాల దగ్గర నుండి, నేటికీ రాయల సీమలోని ఎన్నో ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమౌతునే ఉన్నాయి. మనం గానీ, మన ప్రభుత్వం గానీ వాటిని ’గిరాకీ’గా అమ్ముకోగలగే పరిస్థితి ఉందా? అలాగే తిండి పెట్టే వ్యవసాయ భూములను పంటలకు కాకుండా సెజ్ ల పేరు మీద అప్పచెబుతూ, డిమాండ్ ఉన్న బియ్యం కూడా రేపు దిగుమతి చేసుకున్నా ఆశ్చర్యం లేదు.

కాబట్టే 1450 AD లోనే తుపాకీ మందు లాంటి సాంకేతిక పరిఙ్ఞానం తెలిసినా, 1800 AD ల తర్వాత గానీ బ్రిటీషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో, అధికారపు పట్టు బిగించలేకపోయింది. 1857 AD లో అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటీషు రాజ కుటుంబానికి సంక్రమించింది.

అలా భారతదేశాన్ని గెలుచుకున్నాకే బ్రిటీషు రాచకుటుంబ రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్నీ స్థాపించగలిగింది. ఎప్పుడైతే ఇండియాని వదులు కుందో, ఆపైన చుట్టుకు పోయిన చాప లాగా ప్రపంచం మొత్తం నుండి వారి సామ్రాజ్యం జారిపోయి ఇంగ్లాండుకు పరిమితమైపోయింది.

అదీ గూఢచర్య బలం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

1674 లో రామదాసు భద్రాచలంలో గుడి కట్టిన నాటికి తానీషా తీవ్ర ఆర్ధికావసరాల్లో ఉన్నాడు. [అవసరం అనే కంటే ఆశ అనడం సరి అయిన పదం.] సుఖభోగాలకీ, ప్రభుత్వం నడపడానికి డబ్బు కావాలి. కరువులూ, వరదలతో అతడి రాజ్యమంతటా కూడా ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లించడం లేదు. బకాయిలు మొండిదేరాయి.

అలాంటి స్థితిలో తానీషాకి రామదాసు లక్షల మొహరీలు ప్రజల నుండి విరాళాలుగా వసూలు చేసి భద్రాచలంలో రాముని గుడి కట్టించాడన్న విషయం తెలిసింది. అంతలేసి విరాళాలు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారన్న నిజం తానీషాకి కళ్ళు మెరిపించింది. రామదాసులో ఉన్న ఆ ’జనాకర్షక శక్తి’, భక్తిపాటలు వ్రాసి, సంగీతం సమకూర్చి, గానం చేసి ప్రజల్ని విరాళాలు గుమ్మరించేలా సమ్మోహన పరచిన ‘శక్తి’ తానీషాకి కావాలి.

రామదాసు చేత ’ఇదే దేవాలయ నిర్మాణ పధకాల్ని’ తన రాజ్యంలోని వేర్వేరు ప్రాంతాల్లో అమలు పరిస్తే విరాళాల వెల్లువెత్తుతుంది. డబ్బే డబ్బు! డబ్బు సమకూరాక ఎంత సద్వినియోగమయ్యిందో, ఎంత గోల్ మాల్ అయ్యిందో ఎవరు చూడొచ్చారు? – ఇదీ అతడి కాంక్ష!

పరోక్షంగానూ, పిదప ప్రత్యక్షంగానూ తానీషా కాంక్ష రామదాసుకి తెలియజేయబడింది. రామదాసులోని అమాయక భక్తుడికిది మొదట అర్ధంగాక పోయినా విపులంగా తెలియచేసే రాజభక్తులకి కొదవుండదు గనుక అర్ధమైంది. అయితే జీర్ణం కాలేదు. శ్రీరాముడి పేరు చెప్పి [నేటి బి.జే.పి., ఆరెస్సెస్ లు చేసినట్లుగా] ప్రజలని మోసగించటం దారుణం అనిపించింది. అందునా శ్రీరాముడు సత్యవాక్పరిపాలకుడు. తండ్రిమాట నిజం చేయటం కోసం స్వసుఖలు వదలి అడవికి పోయినవాడు. దానితో రామదాసు ఈ వ్యూహాన్ని నిర్ధ్వంద్వంగా నిరాకరించాడు. తానీషా తన అవసరం రీత్యానూ, అహంకారం రీత్యానూ, ఒక సామాన్యుడైన వ్యక్తి, రామదాసు ‘తనంతటి నవాబు’ని వ్యతిరేకించడాన్ని, అవిధేయత చూపడాన్ని ఎలా ఉపేక్షించగలడు?

మరుక్షణమే రామదాసు మీద నిందారోపణ చేయబడింది. కొలువులో విచారణ మొదలైంది. గుడి కట్టటానికి నవాబు అనుమతి తీసుకోలేదన్నదీ, పన్నుల సొమ్ము గుడికట్టటం కోసం ఉపయోగించాడన్నదీ అభియోగాలు. నవాబుగా అతడికి అనుమతి పత్రాలు మాయం చేయటం లేదా పుట్టించటం, మంచి లెక్కల్ని దొంగ లెక్కలనడం లేదా దొంగ లెక్కల్ని మంచి లెక్కలనడం అసాధ్యమా? [ఇప్పటికీ ప్రభుత్వపాలకులూ, అధికారులూ తలచుకొంటే ఇలాంటి వెన్నో సుసాధ్యులై మన కళ్ళ ముందు ఎన్నోసార్లు కనబడటం లేదూ!]

అందుకే అంటారేమో ’రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా?’ అని!

ఇంకేముంది! నిరాటంకంగా తానీషా రామదాసుని చెరసాలలో 1675 AD నుండి 1687 AD దాకా 12 ఏళ్ళు పాటు బంధించాడు. ప్రతీ రోజూ చిత్ర విచిత్ర హింసలతో, పస్తులు పెట్టి, సామదానభేద దండోపాయాలతో రామదాసుని ఒప్పించే ప్రయత్నం చేసాడు. లోపలి కథ తెలియక పోయినా, బహిరంగంగా మోపబడిన అభియోగాలూ, జైల్లోని శిక్షలూ ప్రజల్లో ప్రచారమయ్యాయి. ప్రజల్లో అధిక సంఖ్యకులైన హిందువుల్లో ఇది అసంతృప్తికీ, నిరసనకీ దారి తీసింది.

మరో ప్రక్క 1656 AD నుండి ఔరంగజేబు గోల్కొండని పట్టుకునేందుకు దాడులు చేస్తూనే ఉన్నాడు. 31 ఏళ్ళుగా అంటే 1656 నుండి 1687 AD వరకూ ఎన్నోసార్లు [18 సార్లు అంటారు] దాడి చేసినా గెలిచిన పాపాన పోలేదు. అయితే ఇప్పుడు, 1687 లో గోల్కొండ ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, సైనికుల్లోనూ రేగిన అసంతృప్తి, తానీషా పట్ల నిరసన పెరిగిపోయాయి. దాంతో వారి కర్తవ్యనిర్వహణలో నిజాయితీ, నిబద్ధతా లేకుండా పోయాయి. మొక్కుబడిగా కార్యనిర్వహణ చేస్తున్నారు. తానీషాకి తన ’ఏజంట్లు’ అంటే అనుకూలురు, వేగులూ, మొదలైన వారి నుండి ఈ సమాచారమంతా అందిందే. ప్రజల్లో తన పట్ల ఉన్న వ్యతిరేకత, అసహ్యం తానీషా గమనించాడు. ప్రజల్లో ఉన్న గుసగుసలు - “పాపం రామదాసు! శ్రీరాముని కోసం చిన్న గుడి కట్టించాడు. అంతేగాని తన కోసమో, తన వారి కోసమో భవంతి కట్టించుకోలేదు కదా! ఏ హిందూ రాజు కూడా, ఏ ప్రాంతంలో కూడా ఏ ముస్లింనీ ఈద్గా కట్టించాడనో, మసీదు కట్టించాడనో శిక్షించలేదు. ఇంకా కొన్ని ప్రార్ధనా మందిరాలైతే ప్రజల సొమ్ముతో కట్టలేదా! చార్మినార్ అలా కట్టిందే కాదా! అవి మనం కట్టిన పన్ను సొమ్ముతో కావా? ఈ నవాబులు తమ బేగంలకీ, ప్రియురాళ్ళకీ, వేశ్యలకీ, భవంతులు కట్టిందీ, వారి తాతముత్తాతలకి సమాధులు కట్టిందీ మనం కట్టిన పన్ను సొమ్ములు పెట్టి కాదా? అలాంటిది మనం ఇచ్చిన విరాళాల ద్వారా శ్రీరాముని కోసం ఓ చిన్న గుడి కట్టటం అంతనేరమా, 12 ఏళ్ళు జైల్లో పెట్టి చిత్రవధలు చేయటానికి? పన్ను ఎగ్గొట్టిన ఇతర ముస్లింలు లేరా? వాళ్ళనింతగా శిక్షించటం లేదే? ఎంత కౄరుడు ఈ తానీషా?"

ఇలాంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయన్న నిజం నవాబునీ, అతడి అనుచర గణాన్నీ భయపెట్టింది. దాంతో తానీషా తన అనుయాయులతో బాగా ఆలోచించాడు. ప్రజల్లోని వ్యతిరేకతని పోగొట్టానికి ఓ పధకం రూపొందించారు. ఆ పధకంలో భాగంగానే రహస్యంగా శ్రీరామ పట్టాభిషేకం ఓ వైపూ, ఆంజనేయుని బొమ్మ ఓ వైపూ ఉన్న బంగారు శ్రీరామ మాడల్ని తయారు చేయించారు.

ఈ వ్యూహంలో భాగంగా హఠాత్తుగా ఓ రోజు తానీషా, నిండు కొలువులో తన ’కల’ ప్రకటించాడు. అతడి వివరణ ప్రకారం ’ఆ కలలో ఇద్దరు, యువకులూ అందమైన వారూ, కనిపించారు. ఒకరు నల్లగా శ్రీరాముని పోలి ఉన్నారు, పేరు ’రామోజీ’ అని చెప్పారు. మరొకరు తెల్లగా లక్ష్మణుని పోలి ఉన్నారు, పేరు ’లక్ష్మోజీ’ అని చెప్పారు. తన పడక గదిలో ఇలా తమని తాము పరిచయం చేసుకొని, తాము గోపన్న సేవకులమని చెప్పి, నవాబు అప్పు తీర్చి రసీదు పుచ్చుకున్నారు.’

ఆ కలకు సాక్ష్యంగా నవాబు తానీషా, రామ మాడల రాశిని చూపించాడు. ఈ విధంగా ప్రకటించి గోపన్నను చెరవిడిపించాడు. కానుకలూ, ఉద్యోగం ఎర చూపాడు. తానీషా తనని తాను శ్రీరామ భక్తుడు గానూ ప్రకటించుకున్నాడు. ప్రతీ శ్రీరామ నవమి పండుగకీ భద్రాచలానికి పట్టు దుస్తులూ, ముత్యాలూ పంపుతానని ప్రకటించాడు. ఈ ’కల’ నాటకం లేకుండానూ తానీషా రామదాసుని జైలు నుండి విడుదల చేయవచ్చు. కానీ ప్రజల్లో తనపట్ల ఉన్న ఏహ్యతనీ, అసంతృప్తినీ పోగొట్టలేడు. అందుచేతా ఈ వ్యూహం పన్నారు.

అయితే, తప్పు నిప్పూ దాగవంటారు. రామదాసు విడుదల తర్వాత ఈ ’కల’ నాటకపు రహస్యం కూడా ప్రజలకి ’లీక్’ అయ్యింది. దీని గురించిన గుసగుసలూ, రహస్యచర్చలూ రాజ్యమంతా విస్తరించాయి. సాక్షాత్తూ నవాబు తమనిలా మోసగించటం వారిలో ఉక్రోషాన్ని నింపింది. [మనకంటే ఆనాటి ప్రజలు చాలా నయం కదా! తమని ’చవటదద్దమ్మల్నిగా జమకట్టి నాటకాలాడి మోసగిస్తారా’ అని ఉక్రోషపడ్డారు. మనం రోజు నాటకాలు చూస్తూ కూడా వాటిని ఏ సిద్ధాంత ప్రాతిపదికన జరిగింది అని ఉదాసీనంగా చర్చలు జరుపుకుంటూ ఉండగలుగుతున్నాం.]

ఈ పరిస్థితిల్లో ఔరంగజేబు మరోసారి గోల్కొండ మీదకి దాడి చేసాడు. 31 సంవత్సరాలుగా ఎప్పుడూ ఫలించని దాడి ఈ సారి ఫలించింది. ఔరంగజేబు లంచానికే లొంగిపోయారో లేక తానీషా మీది అసహ్యం కొద్దీనే చేశారో గానీ గోల్కొండ కోట తలుపులు లోపాయికారిగా తెరవబడ్డాయి. ఔరంగజేబు తానీషాని బందీగా పట్టుకొని ఢిల్లీ తీసుకుపోయాడు. చచ్చిపోయేవరకూ తానీషా ఔరంగజేబు ఖైదీగానే ఉన్నాడు.

ఇదీ అసలు కథ.

అయితే ఈ కథ అస్సలు బయటికి రానీయరు కుట్రదారులు. మీడియా, ఈ విషయాలు ప్రచారం కానివ్వదు. మరెవ్వరూ ప్రచారించ కుండా కావలసినన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా తానీషా చచ్చిపోయే వరకూ ఔరంగజేబు ఖైదీగా ఉన్నాడన్న విషయం!

తర్వాత అసఫ్ షాహీ వంశమైన నిజాములు 1724 AD లో గోల్కొండ సింహాసనం ఎక్కారు. హిందువుల్ని చల్లబరిచేందుకు, మంచి చేసుకునేందుకు [ఎటూ హిందువులు సెంటిమెంటల్ ఫూల్స్ కదా! భావవాదులకిది బిరుదన్నమాట] భద్రాచలంకి ప్రతీ యేటా శ్రీరామనవమికి పట్టువస్త్రాలు, ముత్యాలూ పంపడం ఆనవాయితీగా చేసారు. దాన్ని ఇప్పటి ప్రభుత్వాలూ కొనసాగిస్తాయి. ఈ విషయాన్నయితే మీడియా పదే పదే వీలయినన్ని సార్లు ప్రచారిస్తుంది.

’రామదాసు విషయంలో తానీషా చెప్పిన ’కల’ వ్యూహాత్మక నాటకమనీ, పైన చెప్పిన కథ వాస్తవ మనీ ఎలా చెప్పడం?’ అంటారా ………

తార్కిక దృష్టితో తర్వాతి దృష్టాంతాలని [సర్ కంస్టాన్షియల్ అయిన సంఘటనల్ని] పరిశీలించండి.

1]. ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన వారికి ఎలాంటి శిక్షలుంటాయో తానీషా నాటి శిక్షాస్కృతి ఏమిటో ఎక్కడా ఉటంకింపబడదు. ఎందుకంటే రామదాసుకు వేసిన శిక్ష తానీషా ఇచ్ఛానుసారం గనుక. ఇతర నేరస్తులకీ నవాబులు ఇష్టానుసారమే శిక్షస్తారేమో గాక! కానీ రోజుకు రోజూ చిత్రహింసలు పెడుతూ 12 ఏళ్ళు శిక్షించటంలో ప్రత్యేకమైన వ్యక్తిగత ఆసక్తి ఉంది . అంటే తానీషా యొక్క ’కామం తీరని క్రోధం’ ఉంది. గోల్కొండ కోటను చూసిన వారికి రామదాసు చెర ఎంత చిన్నదో ఇరుకైనదో తెలిసేఉంటుంది. మనిషి నిటారుగా నిలబడటానికి కూడా వీలుకానంత చిన్నది. ఇంకా సినిమాల్లోనే చాలా పెద్ద చెరసాల గది చూపారు.


2]. 12 ఏళ్ళ చెరసాల తర్వాత శ్రీరాముడు తానీషాకి కలలో కనబడి రామదాసుని కాపాడాడట. రామదాసు తాను పన్ను ఎగవేయలేదని వాదించాడు. మరి శ్రీరాముడు తానీషాకి పన్నుబకాయిగా బంగారు మొహరీలు కట్టి ఎందుకు రసీదు తీసికొన్నాడు? తప్పుచేయని భక్తుణ్ణి, తప్పు చేశాడంటాడా దేవుడు? తప్పు చేసిన వాణ్ణి కాపాడటానికి వస్తాడా? నమ్మకాల ప్రకారమైనా ఇవి పరస్పర విరుద్దాలు కదా?

3]. అంతగా తానీషా భక్తి పూరితుడైతే అతడి నిజాయితీ ప్రజల్ని కదిలించదా? ఔరంగజేబు కి సహకరించి తానీషాని ఖైదీగా మారుస్తుందా? ఈ సంఘటనలో ప్రజలకి తానీషా మీద ఏహ్యతా, వ్యతిరేక భావమూ ఉండటమే ద్యోతకమౌ తోంది కదా!

4]. తర్వాత రోజుల్లో ఈ కట్టుకథని నమ్మించడానికి చాలా ప్రచారాలే ప్రజల్లోకి వ్యాపింపచేయబడ్డాయి. [తానీషా, ఔరంగజేబు చేతిలో ఖైదీ అయి ఢిల్లీకి రవాణా అయిపోయాడు గదా! మరెవరు ఈ ప్రచారాలు చేసినట్లు? – ఈ ప్రశ్నకు ఈ టపా చివరలో జవాబు చెబుతాను.]

అలాంటి ప్రచారాల్లో కొన్ని.

అ] రామదాసు పంజరంలో చిలకల్ని పెంచాడు. ఆ పాపఫలితంగా జైలు జీవితం గడిపాడు. [మరి తానీషా ఏ చిలకల్ని పెంచి ఔరంగజేబు చెరలో మరణపర్యంతం ఉన్నాడు?]

ఆ] రామదాసు భార్య జాతకం ప్రకారం [ఆమె భర్త చెరసాల పాలవుతారని జాతకంలో ఉందట] రామదాసు చెరసాల పాలయ్యాడట. హిందువుల నమ్మకం ప్రకారం ఎవరి కర్మ వారు అనుభవిస్తారు గాని, ప్రక్క వారి కర్మ మనం అనుభవించం గదా?

ఇ] రామదాసు పూర్వ జన్మ కర్మఫలం తీరలేదట. అందుచేత శ్రీరాముడు 12 ఏళ్ళు వేచి ఉండి అప్పుడు తానీషా కలలో కనబడి రామదాసుని కాపాడాడట. ’భగవద్గీత’లోని కర్మసిద్ధాంతానికి విపరీత భాష్యం ఇది. ఇలాంటి భాష్యాలు ఈనాటి సినిమాల్లోనూ [అమితాబ్ ’అక్స్’ మొదలైనవి], కోర్టు జోకుల్లోనూ బొచ్చెడు చూస్తున్నాం.

ఉదాహరణకి:

జడ్జి:
ఎందుకు హత్య చేసావు?

హంతకుడు:
చంపింది నేను కాదు. చచ్చింది అతడు కాదు. శ్రీకృష్ణుడే అన్నీ చేశాడు.

లేదా

హంతకుడు:
ఆత్మని ఎవరూ చంపలేరు. కాబట్టి నేను హత్య చేసినట్లు కాదు.

ఈ] మరి ఏ కర్మ ఫలం పూర్తిగాక తానీషా జైలు పాలయ్యాడు? [అందునా కలలో శ్రీరామ దర్శనం పొందిన తర్వాత కూడా] తానీషా యొక్క ఈ ఓటమి గురించీ, జీవితపు చివరి దుర్దశ గురించి ఎవ్వరూ ఎక్కడా మాట్లాడరు. ఏ మీడియా కిక్కురమనదు. ఏ చరిత్రకారులూ ఇది బయటకు తీయలేదు.

ఎందుకంటే ఇలాంటి నిజాలు బయటి కొస్తే ప్రజలు భక్తి వైపు, దేవుడి వైపు ఆకర్షితులేతారు. అదే జరిగితే అప్పుడు ప్రజలు మంచి వైపు, ’ఐడియలిజం’ వైపుగా ప్రయాణిస్తారు. అదే జరిగితే అప్పుడు ప్రజలు సుఖభోగాలంటూ ’లాలస’ తో పరుగులు పెట్టరు. అదే జరిగితే ఇక పదార్ధవాదపు కార్పోరేట్ రంగం ప్రజల రక్తం ఎలా పిండి, సంపదగా మార్చుకోగలదు?

అందుకే కుట్రదారులు ’తానీషా కల’లాంటి అసత్యాలనే తప్ప, నిజాలని ప్రచారం కానివ్వదు. పదే పదే అదే ప్రచారంతో నలుపుని తెలుపనీ, నీళ్ళని పాలనీ నమ్మించవచ్చన్నదే వాళ్ళ మూలమంత్రం!

ఉ] ఇంకా ఇలాంటి కట్టుకథలు నమ్మించడానికి మరికొన్ని అలాంటి కట్టు కథలు ప్రచారం చేశారు. 1764 AD లో జన్మించిన వాగ్గేయకారుడు, భక్త కవి గాయకుడూ అయిన త్యాగయ్య జీవితగాధలోనూ ఇలాంటి సంఘటనలు జొప్పించారు. పల్లకిలో ప్రయాణిస్తున్న త్యాగయ్య పై గజదొంగలు దాడి చేయగా విల్లంబులు ధరించిన శ్యామ సుందరుడూ, మరో తెల్లని సుందరుడు కలిసి తరిమి వేసారనీ, తనకు కనబడని శ్రీరామ లక్ష్మణులు దొంగలకి కనబడ్డారని త్యాగయ్య దుఃఖించాడనీ చెప్పు కుంటారు. పోతన్న, తులసీ దాసు ఇంకా ఎందరి జీవిత కథల్లోనో ఇదే మాదిరి సంఘటనలు జరిగాయ’ట’.

ఊ]. మరో మౌఖిక ప్రచారం ఏమిటంటే శ్రీరామ భక్తులు ఇబ్బందుల పాలవుతారట. రామదాసు, త్యాగయ్య, పోతన ...... ఇలాగన్నమాట. అదే నిజమైతే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా శ్రీరాముణ్ణి ఎందుకు పూజిస్తారు? అదే నిజమైతే ప్రతి ఊరిలో శ్రీరామ విగ్రహం తో గుడి ఒకటైన ఉంటుంది. మరి ఇదెలా సాధ్యం?

‘ఇక్కడ తెలియటం లేదా మన దేవుణ్ణి మనం పూజిస్తే కష్టాలు వస్తాయి’ అని మనకి ఇంకించటానికి కుట్ర జరుగుతుంది అన్న విషయం.

బు] అక్కన్న మాదన్నల గుడి కట్టడాలలో నిజాలెంత? రామదాసు గుడి కట్టినందుకు తానీషాకి కోపం రాలేదు, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుల సొమ్ముతో కట్టినందుకే కోపం వచ్చి జైల్లో పెట్టాడు’ అన్న వాదనని మరింత ప్రచారం చేసుకొనేందుకే అక్కన్న మాదన్నలు ఓరుగల్లులో చాలా గుడులు కట్టించారన్న ప్రచారం జరిగింది. కుట్రదారులు తలుచుకొంటే సాక్ష్యాలకు కరువా? శాసనాలతో సహా సాక్ష్యాలూ సిద్ధమై పోయాయి.

’తానీషా ఔరంగజేబు చేత బందీ చేయబడి, గోల్కొండ నుండీ ఢిల్లీకి పట్టుకుపోబడ్డ తర్వాత ఎవ్వరీ ప్రచారమంతా చేశారు’ అంటే…….

౧]. ఎవరైతే తానీషాకి ’కల’ వ్యూహం చెప్పారో,

౨]. ఎవరైతే ఔరంగజేబు టోపీలు కుట్టి, ఖురాన్ కి వ్రాతపతులు వ్రాసి, అవి అమ్మి తిండికి సంపాదించుకొనే వాడనీ, అంతేగానీ ప్రజల సొమ్ముతో తిండి తినలేదనీ ప్రచారం చేశారో

౩]. ఎవరైతే అందరు ముస్లింరాజులని [అక్బర్ తోసహా] సర్వోత్తములని ప్రచారం చేశారో

౪]. ఎవరైతే రాముడు గొప్ప హిపోక్రైట్ అంటూ విషవృక్షాలని వ్రాయింపించి ప్రచారించారో……… వారు.

తరతరాలుగా, వందల సంవత్సరాలుగా [కనీసం 300+ సంవత్సరాలు] వారు చేస్తోన్న కుట్రలివే.

కాబట్టే అన్ని చర్యలకీ, అన్ని సంఘటనలకీ అన్ని ప్రచారలకీ అంతిమ లక్ష్యం ‘హిందూ సంస్కృతిని నాశనం చేయటం, భారతీయుల్ని, హిందువుల్ని కించపరచటం, హిందూ మతాన్ని అవహేళన, నాశనం చేయటమే’ అయ్యింది. పరిశీలించి చూడండి – ఇది నిజమో కాదో?

ఇలా అన్నిటివెనుకా ఒకే లక్ష్యం, ఒకే అంతస్సూత్రం ఉన్నప్పుడు ఆ చర్యలూ, సంఘటనలూ, ప్రచారాలు వాటంతటవే జరుగుతాయా? అవన్నీ ఓ పద్ధతిప్రకారం నడిపించబడటం ఉన్నప్పుడు ఓ పద్దతి ప్రకారం నడిపించే వాళ్ళెవరో ఉండాలి కదా! అదీ – ఓ విదేశీ [సి.ఐ.ఏ.లాంటిది] వ్యవస్థే కానివ్వండి, ఓ వంశస్థుల వ్యవస్థే కానివ్వండి, ఉండి తీరాలి కదా!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .
************

అప్పటి వరకూ కొంత బలంగా ఉన్న మొగలాయీ సామ్రాజ్యం, ఉత్తర భారతంలో బలహీన పడటంతో క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్, డచ్చి ఇంకా స్పెయిన్ మొదలైన యూరపు దేశాల వర్తక కంపెనీలు భారతదేశంలో బలం పుంజుకున్నాయి. నిజానికి ఈ వర్తక వ్యాపార గుంపులు క్రీ.శ. 1498 నుండీ భారతదేశానికి వస్తూ ఉన్నా కూడా వ్వాపారావకాశాల కోసం భారతదేశపు రాజుల అనుమతులు పొందటానికి వంగి వంగి దణ్ణాలు పెట్టటంతోనే కాలం గడిచిపోయింది. కాలక్రమంలో క్రీ.శ. 1768 లో ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాం నుండి ఉత్తరకోస్తా జిల్లాలని, 1800AD లో రాయలసీమ జిల్లాలని గుత్తకు దక్కించుకోగలిగింది. ఇక్కడి నుండే ఈస్ట్ ఇండియా కంపెనీకి హఠాత్తుగా ఎంతో మేధస్సు, సామర్ధ్యం గూఢచర్య బలం పెరిగిపోయాయి. పన్నులు వసూలు చేయటానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన నిజాం ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకీ బకాయి పడి 1802 ప్రాంతాల్లో శాశ్వత సెటిల్ మెంట్ చేసుకున్నాడు. [ఎంత విచిత్రం? అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ సరిగ్గా పన్నులు వసూలు చేస్తే మరి నిజాం వారికి ఎందుకు బకాయి పడ్డాడు? ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ముందర నిజాం నవాబులూ, ఇతర రాజులూ భారతదేశంలో ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకోలేదా? అది వారికి కొత్తపనా, ఈ యూరపు కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడానికి? తమ కొరడా, కత్తుల కంటే వారి తుపాకీలకి భయపడి ప్రజలు పన్నులు కట్టేస్తారని కాంట్రాక్టు ఇచ్చారు కాబోలు. ఏమైనా రాజుగా పన్నులు వసూలు చేసుకోలేక పోవటం, అందుకు ’కంపెనీ’కి కాంట్రాక్టు ఇచ్చి, వారికే బకాయి పడటం, దాంతో కొంతభూమిని ధరాదత్తం చేయటం మాత్రం గొప్ప ట్రాపే.]

సరే! ఇలా హఠాత్తుగా సంక్రమించిన గూఢచర్య ఙ్ఞానంతో మన భారతంలోని ’కణికనీతి’ ని యూరపు వారు కొత్తగా కనుకొన్నారు! ఇంతకు ముందు టపా డిసెంబరు 5 ‘మన పైన జరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 1 [కణిక నీతి]’ & 6 వ తేదీ ‘మన మీద జరుగుతున్న సుదీర్ఘ కుట్ర - 2 [ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు]’ లలో ఈ విషయమై విపులంగా చర్చించాను. ఫ్రెంచ్ జనరల్ డూప్లే కనుగొన్నాడని చెప్పబడి, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ చేత భారత రాజుల మీద, పాలెగాళ్ళ మీద ప్రయోగించబడిందని పేర్కొనబడ్డ కణిక నీతికి తాజాగా ‘Divide and Rule’ అని పేరు పెట్టబడింది.

వాస్తవానికి, ఎప్పుడైతే ముస్లింలు భారతదేశంలోకి వచ్చారో [అంటే క్రీ.శ. 1000 లో] , అప్పుడు వాళ్ళు భారత రాజకీయాల్లో కుట్రలు ప్రవేశ పెట్టారు. ఎప్పుడైతే యూరోపియన్లు భారతదేశంలోకి వచ్చారో [అంటే క్రీ.శ. 1498 లో] అప్పుడు వాళ్ళు భారత వ్యాపారాల్లో కుట్రలు ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే కార్పోరేట్ కంపెనీలు భారతదేశంలోకి వచ్చాయో అప్పుడు వాళ్ళు సామాన్యుడి జీవితంలోనూ, [కుటుంబ జీవితాల్లో] కుట్రలు ప్రవేశపెట్టారు. ఆ కుట్రల బాహ్యరూపాలనే టివీ సీరియళ్ళలో కార్పోరేట్ టివీ కంపెనీలు చూపుతుండగా, కార్పోరేట్ నిర్మాణ సంస్థలు నిర్మించగా చూస్తున్నాము. ఆ సీరియళ్ళలో అత్త కోడలి మీద, కోడలు అత్తగారి ఇంట్లోని వారి మీద కుట్రలు పన్నడం లేదా స్నేహితులు ఒకరి పై ఒకరు కుట్రలు పన్నుకోవడం చూస్తున్నాము.

ముస్లిం రాజుల చేతి నుండి ‘భారతదేశం మీద అధికారం, పట్టు’ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి జరిగిన మార్పిడి గురించి చర్చించే ముందు, ఆ మధ్య కాలంలోని సంధి సమయం గురించి తెలుసుకోవాలి. నిజానికి ప్రపంచం ఇప్పుడు అంతర్జాలం మూలంగా ఒక పల్లెగా మారిపోయిందనీ, ప్రపంచం చిన్నదైపోయిందనీ, గ్లోబలైజ్ అయ్యిందనీ చాలామంది మురిసి పోతూ చెబుతుంటారు గానీ, నిజానికి ఈ సంధి సమయం తర్వాతి పర్యవసానంగా, బ్రిటిషు ప్రభుత్వం, రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచాన్ని అంటే భూగోళాన్నే గ్లోబలైజ్ చేసేసింది, చిన్నది చేసేసింది. మనకు సమాచార పరంగా గ్లోబలైజ్ అయ్యింది ఇప్పుడు. బ్రిటిషు వారికి రాజ్యాన్ని స్థాపించటానికి ఎప్పుడో గ్లోబలైజ్ అయ్యింది.

ఇంతకు ముందు టపాల్లో చర్చించినట్లు ఆ బలం బ్రిటిషు వారిది కాదు. కణిక నీతికి Divide and Rule Policy గా పేరు మార్చి ఉపయోగించగలిగిన గూఢచర్య నైపుణ్యం, తరతరాలుగా కలిగిన వారిది.

ఈ మర్మం మరింత బాగా అర్ధం కావాలంటే మనం మరోసారి గోల్కొండ నవాబుల్నీ, నిజాముల్నీ గుర్తుతెచ్చుకోవాలి. అంతేకాదు. ముస్లిం రాజుల ఏహ్యతనీ, నైచ్యాన్నీ, సుఖభోగ లాలసతో కూడిన వారి పదార్ధ వాదాన్ని, సుఖల కోసం వెంపర్లాడటం అందుకోసం ఎంతకైనా తెగించగలిగిన వారి దృక్పధాన్ని విపులంగా పరిశీలించాలంటే ‘రామదాసు’గా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న జీవితాన్ని పరికించాల్సిందే.

అది గోల్కొండ నవాబ్ తానీషా పరిపాలనా కాలం. తానీషా క్రీ.శ. 1672 లో సింహాసనం ఎక్కాడు. 1687 లో ఔరంగజేబు గోల్కొండ పై దాడిచేసి, ఇతణ్ణి ఓడించి బందీగా ఢిల్లీకి పట్టుకుపోయేంత వరకూ అంటే 15 ఏళ్ళపాటు పాలించాడు. ఆ రోజుల్లో, ఇతడి కొలువులో అక్కన్న మాదన్నలు సైన్యాధిపతిగానూ, ప్రధాన సచివుడుగా ఉండేవాళ్ళు. [ఈ ఇద్దరు కొన్ని గుడులని, రామప్ప గుడి తో సహా కట్టించారని చెబుతారు. ఓరుగల్లు వాసులు ఈ విషయమై మరికొంత నిజమైన సమాచారం ఇవ్వగలరను కుంటాను] వీరి సిఫార్సుతో తానీషా కంచెర్ల గోపన్నని హుస్నాబాద్ కు తహసీల్దారుగా నియమించాడు. గోపన్న వీరికి సమీప బంధువు. ప్రస్తుత భద్రాచలం, నాటి హుస్నాబాద్ పరగణాలోనే ఉండేది. అప్పటికి అక్కడ శ్రీరాముని గుడి లేదు. భద్రాచలం కొండపైన శ్రీరామ, సీతా లక్ష్మణుల విగ్రహాలు బహిరంగ ప్రదేశంలోనే ఉండేవి. గిరిజన స్త్రీ ’దమ్మక్క’ కు కలలో కనిపించి భగవానుడు తన విగ్రహాలు చూపాడని ప్రతీతి. స్థానిక గిరిజనులూ, ఇతరులూ శ్రీరాముడి విగ్రహాలు స్వయంభువులనీ, భద్రుడన్న భక్తుని కోరిక మేరకు ఆ కొండపై వెలిసాడని విశ్వసిస్తారు.

గోపన్నకు ఈ విషయాలన్ని తెలిసాయి. హిందువుగా, శ్రీరామ భక్తుడుగా, కవిగా గోపన్న అక్కడ ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించాడు. ఆ నాటికి ప్రజలు కరువు కాటకాలతో లేదా వరదలతో నానా వెతలూ పడుతున్నారు. పంటలు చేతికి రాక సంతోషమూ లేదు, శాంతీ లేదు. గోపన్న శ్రీరాముని మీద భక్తి పాటలు, భజన పాటలూ వ్రాసి, సంగీతం సమకూర్చి పాడసాగాడు. భద్రాచలంలో శ్రీరామ మందిరం కట్టడానికి ప్రజల నుండి విరాళాలు వసూలు చేశాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకూ స్వసుఖాలని వదలి వ్రతం పట్టాడు. గోపన్న కవిత్వానికి, సంగీతానికీ, గానానికీ, భక్తికీ అందులోని నిజాయితీకి ప్రజలు ముగ్ధులయ్యారు. దానితో గోపన్నకి ప్రజల నుండి అపూర్వస్పందన లభించింది. ఆయన్ని ప్రజలు ‘రామదాసు’ అని పిలవసాగారు. తమ తాహత్తుని బట్టి, ఒకోసారి తాహత్తుకి మించీ ధనమూ, బంగారమూ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అది ప్రజల భక్తి, స్వచ్ఛందశక్తి. ఆలయ నిర్మాణంలో శారీరక శ్రమని కూడా పంచుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. ప్రజలెంతో ఆనందించారు.

ఇదంతా గోల్కోండ నవాబు తానీషాకి తెలిసింది. అతడికి కోపం వచ్చింది. గోపన్న నవాబుకి పంపించవలసిన పన్నుల సొమ్ము ఖర్చు పెట్టి భద్రాచలంలో దేవాలయం కట్టించాడన్న నిందారోపణ చేయబడింది. ప్రభుత్వం, అంటే నవాబు నుండి ఆలయ నిర్మాణానికి అనుమతి తీసికోలేదన్న నెపంతోనూ విచారణ ప్రారంభమైంది. గోపన్న తన వాదన విన్పించాడు. “నవాబులు తమ కోసం ఎన్నో భవంతులూ, విలాస మందిరాలూ, కోటలూ కట్టించుకున్నప్పుడు, తమ ప్రియురాళ్ల కోసం, వేశ్యలు కోసం ఎన్నో అంతఃపుర మందిరాలు కట్టించుకొన్నప్పుడు, తాము భగవంతుడని నమ్మిన శ్రీరాముని కోసం ఒక చిన్న గుడి కట్టిస్తే తప్పేమిటీ? ఆలయం ప్రభుత్వ సొమ్ముతో కట్టలేదు. ప్రజల విరాళాలతో కట్టించబడింది. శ్రీరాముడు ప్రజలకి ఆదర్శరాజు, హిందువులకి సాక్షాత్తు భగవంతుడు. అలాంటి దేవుడికి ఓ చిన్న గుడి కడితే తప్పేమిటి? పన్నులు సొమ్ము మొత్తం నేను ప్రభుత్వ ఖజానాకు పంపి వేసాను. ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము ఇసుమంతైనా ఆలయానికి ఖర్చుపెట్టలేదు. ప్రజలిచ్చిన విరాళాలతోనే గుడి కట్టించాను."

తానీషాకి ఈ వాదనతో భగ్గుమన్నంత ఆగ్రహం కలిగింది. గోపన్నని తనకి క్షమాపణ చెప్పవలసిందిగా ఆఙ్ఞాపించాడు. తానేమీ తప్పు చేయలేదు గనుక క్షమాపణ చెప్పనని గోపన్న ఖరాఖండిగా చెప్పేశాడు. ఆకోపంలో తానీషా గోపన్నని ‘12’ సంవత్సరాలు జైల్లో పెట్టి ప్రతీరోజూ చిత్రవిచిత్ర హింసలు పెట్టాడు. [ప్రభుత్వ సొమ్ము తిన్న ఇతర నేరస్తులుంటే వారికీ ఇంత సుదీర్ఘకాలం శిక్ష వేసేవాడా? అసలు వాళ్ళ న్యాయశాస్త్రంలో ప్రభుత్వ సొమ్ము లేదా పన్నులు ఎగవేస్తే ఏదో శిక్ష నిర్ధేశింపబడే ఉంటుందిగా. అది ఇంత అంటే 12 ఏళ్ళ సుదీర్ఘమా?] ఎంత కాలమైనా, ఎన్ని హింసలు పెట్టినా గోపన్న అంటే రామదాసు, తానీషా నవాబుని క్షమాపణ కోరలేదు. ఇంత దుర్భర స్థితిలోనూ, జైలు లోనే రామభక్తి పాటలూ, భజన పాటలూ వ్రాయటం, గానం చేయటం మానలేదు. ఆ పాటలు ప్రజల్లోకి ప్రచార మయ్యాయి.

ఇలా పన్నెండేళ్ళు గడిచాక, ఓ రోజు రాత్రి నిద్రలో తానీషాకి ఓ వింత కల వచ్చింది. [కలొచ్చిందని ఆయన చెబితేనే ఎవరికైనా తెలిసేది. ఒకరి కల మరొకరికి నిరూపితం కాదు గదా!] ఆ కలలో నవాబుకి ఇద్దరు యువసైనికులు కనబడ్డారు. వారు తమని తాము రామదాసు సేవకులు గానూ, తమ పేర్లు ’రామోజీ’ మరియు ’లక్ష్మోజీ’ గానూ చెప్పుకున్నారు. హుస్నాబాద్ తహసీలుదారుగా రామదాసు ప్రభుత్వానికి బకాయి పడిన పన్ను సొమ్ము లక్షల మొహిరీలు తానీషాకి దాఖలు చేసి, రసీదు పుచ్చుకున్నారు. [రామదాసు తాను ప్రభుత్వ సొమ్ము ఎగవేయ లేదన్నాడు. భక్తుడు తను చేయలేదన్న తప్పుని – దేవుడు “కాదు, నా భక్తుడు తప్పు చేశాడు. పన్ను సొమ్ముతోనే గుడి కట్టాడు. కాదని అబద్ధం చెప్పాడు” అని ఒప్పుకుంటూ లక్షల మొహరీలు కట్టి రసీదు తీసుకున్నడన్న మాట. గుడి కట్టడం కోసమైనా సరే తప్పు చేసిన, ఇంకా అబద్దం చెప్పిన భక్తుణ్ణి కాపాడటానికి దేవుడు తానీషా కల్లోకి వచ్చి డబ్బు ఇచ్చి రసీదు పుచ్చుకున్నాడు!]

ఇలాంటి కల రావడంతో తానీషా అర్ధరాత్రి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యం! అతడి పడక గదిలో లక్షల బంగారు మొహరీలు రాశిగా పోసి ఉన్నాయి. ఇదంతా ఎలా జరిగిందో తెలియక ఆశ్చర్యపోయాడు తానీషా! “తన భవనం చుట్టూ గట్టి కాపలా ఉంది. కావలి వాళ్ళ కన్నుగప్పి లోపలి కెవరూ రాలేరు. పోనీ ఇదంతా కలే అందామా అంటే ఎదురుగా మొహరీల కుప్ప కనబడుతోంది. నిశ్చయంగా ఇది రామదాసు అంటే గోపన్న యొక్క రామభక్తి మహత్మ్యమే.”

ఇలా ప్రకటిస్తూ తానీషా గోపన్నని చెరసాల నుండి విడుదల చేసాడు. గోపన్నకి క్షమాపణ చెప్పాడు. గోపన్నకి ధనమూ, విలువైన వస్తువులూ, తహసీలుదారు పదవీ బహుమతిగా ఇస్తానన్నాడు. అయితే గోపన్న అవన్నీ తిరస్కరించి భద్రాచలం వెళ్ళిపోయాడు.

రామదాసు బాధతప్తహృదయంతో “శ్రీరాముడు నాకు దర్శనం ఇవ్వలేదు. తానీషాకి దర్శనమిచ్చాడు. ఎంతైనా రాజూ రాజూ ఒకటీ అన్నట్లు పక్షపాతం చూపాడు. రామదర్శన భాగ్యం నోచుకోని నిర్భాగ్యుణ్ణి నేను.” అనుకున్నాడు. ఈ భావతీవ్రతలో మరింతగా అధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి రామదాసు ముక్తి పొందాడు.

ఇదీ ప్రజా బాహుళ్యంలో క్రీ.శ. 1687 నుండి ఈనాటి వరకూ బహుళ ప్రచారంలో ఉన్న కథ.

కానీ నిజమైన కథ ఇది కాదు. అది వేరే ఉంది. దానికి కావలసినంత తార్కికత, దృష్టాంతాలతో కూడిన సాక్ష్యం ఉంది.

అసలు కథ ఇదీ.......

తానీషా క్రీ.శ. 1672 లో రాజ్యానికొచ్చాడు. కంచెర్ల గోపన్నని నాటి హుస్నాబాద్ నేటి పాల్వంచ ప్రాంతానికి తహసీల్ధారుగా నియమించాడు. భద్రాచలం ఈ ప్రాంతానికి చెందుతుంది. అక్కడ శ్రీరాముని గుడి కట్టించేందుకు గోపన్న ప్రజల నుండి విరాళాలు సేకరించాడు. గోపన్న భక్తి, నిజాయితీ, కవితానురక్తి ప్రజల్ని ఎంతో ముగ్థుల్ని చేశాయి. అది సహజమే కదా! ఎందుకంటే వెలుగుతున్న దీపం మరెన్నో దీపాల్ని వెలిగించినట్లుగా, ఒక హృదయంలోని భక్తీ, నిజాయితీ మరికొన్ని హృదయాల్ని ఉత్తేజపరిచింది. అలా స్ఫూర్తి పొందిన ప్రజలు డబ్బూ, బంగారం విరాళాలుగా ఇవ్వడమే గాక గుడి కట్టడానికి కావలసిన శారీరక శ్రమ కూడా చేశారు. క్రీ.శ. 1674 లో ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. ఆనాటికి ప్రజలు నానా ఈతి బాధలు పడుతున్నారు. అయితే వరదలు, కాకుంటే కరువుతో అల్లాడుతున్నారు. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు సరైన పంటలు లేవు. దానితో ప్రజలు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు సక్రమంగా కట్టలేని స్థితిలో ఉన్నారు.

నిజం చెప్పాలంటే – ఎప్పుడైతే ప్రభుత్వపాలకులు స్వార్ధపూరితులై, భోగలాలసులై, ఎప్పుడూ బావుకోవటంలో ’బిజీ’గా ఉండి పరిపాలనని పట్టించుకోరో, అప్పుడు ఉద్యోగులూ, ప్రభుత్వ అధికారులూ కూడా అలాగే నిర్భాధ్యులుగానూ, లంచగొండులు గానూ ప్రవర్తిస్తారు. ‘యధారాజా తధాప్రజాః’ అన్నట్లు ప్రజలూ అలాగే నిర్భాధ్యులుగా తయారౌతారు. అలాంటి స్థితిలో సహజంగానే చెట్లూ, అడవులూ, నదులూ, చెరువులూ, కాలువలూ అన్నీ సక్రమ నిర్వహణని కోల్పోయి దుర్వినియోగానికి గురౌతాయి. దానితో పర్యావరణం, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. వాటి సహజఫలితం ‘అయితే వరదలూ కాకుంటే కరువులే.’ ప్రస్తుతం ఇదే పరిస్థితి మన కళ్ళముందు నేడు ఉన్నదే కదా!

అందుకేనేమో ప్రాచీన భారతదేశంలో ఓ నమ్మకం ఉండేది. ‘రాజు ధర్మపరుడైతే అతడి రాజ్యంలో నెలకు నాలుగు వానలు కురుస్తాయనీ, కరువు కాటకాలుండవనీ.’ మరో నమ్మకం కూడా ఉండేది. “ఎక్కడైతే ధర్మాత్ములైన ప్రజలు, [వ్యక్తులు] ఉంటారో ఆ ప్రదేశం కరువు కాటకాలు, వరదలు లాంటి ప్రకృతి బీభత్సాలు లేకుండా, సస్యశ్యామలంగా ఉంటుందని”. [భారతంలోని విరాట పర్వంలో పాండవులు ఎక్కడ అఙ్ఞాత వాసం చేస్తున్నారో కనుక్కోవడానికి ఇదే ’సూచిక’ గా చెప్పబడుతుంది. ఇక్కడ ధర్మాత్ముడు అంటే ఆ వ్యక్తి, కర్మ [తన పని] పట్ల నిరంతరం బద్దుడై ఉంటాడు. ప్రజల యోగ క్షేమాలు నిరంతరం విచారిస్తాడు. ఎలా అంటే – తండ్రి తన బిడ్డల గురించి ఎలా నిరంతర అలోచిస్తాడో అలా! కాబట్టి అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు.] ఇలాంటి నమ్మకాలతో అటు రాజూ, ఇటు ప్రజలూ కూడా ధర్మబద్దంగానూ, నీతినియమాల్లాంటి విలువలతోనూ బ్రతికేందుకు ప్రయత్నించేవాళ్ళు. [మేఘమధనం అంటూ కృత్రిమవర్షాలుండవుగా! వళ్ళు దగ్గర బెట్టుకొని వానకోసం ఎదురు చూడాల్సిందే నయ్యె.] నేను ప్రాచీన భారతం అన్నది దాదాపు 1200 సంవత్సరాల క్రితపు భారతదేశాన్ని ఉద్దేశించి. ప్రాచీన భారతం అంటే నా ఉద్దేశం – ముస్లింలు, యూరపు వారు భారతదేశంలోకి రాక ముందున్న భారతదేశం. ఎందుకలా అంటే ముస్లింలు రాకముందు భారతీయులకి రాజకీయ కుట్రలు తెలియవు, యూరపు వారు రాకముందు వ్యాపార కుట్రలు తెలియవు, కార్పోరేట్ కంపెనీలు రాకముందు సామాన్యుడి కుటుంబ జీవితంలో కుట్రలు తెలియవు, తెలిసింది `మంచి’ పట్ల నమ్మకం, చెడు పట్ల భయం మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో కొంత ‘పాపభీతి – పుణ్యప్రీతి’ ఉందన్నమాట.

సరే! 1674 లో రామదాసు భద్రాచలంలో గుడి కట్టిన నాటికి తానీషా తీవ్ర ఆర్ధికావసరాల్లో ఉన్నాడు. [అవసరం అనే కంటే ఆశ అనడం సరి అయిన పదం.] సుఖభోగాలకీ, ప్రభుత్వం నడపడానికి డబ్బు కావాలి. కరువులూ, వరదలతో అతడి రాజ్యమంతటా కూడా ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లించడం లేదు. బకాయిలు మొండిదేరాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

************

శివాజీ ’గెరిల్లా! యుద్ధ వ్యూహం కారణంగా ఆయన శతృవులు శివాజీ సేనలో ఎందరు సైనికులున్నారో, ఎంత సాయుధ సంపత్తి ఉందో, సేన సామర్ధ్యం ఎంతో అంచనా వేయలేక పోయారు.

ఓ సారి ఔరంగజేబు ముస్లిం సైనికులు తమ దుర్గం మీదకి దాడికి వస్తున్నారని శివాజీ సేనకి సమాచారం అందింది. తామున్న చోటుకు చేరాలంటే సన్నని లోయలో నుండి ప్రయాణించాలి. శివాజీ సేన, ముస్లిం సైనికులు లోయలో నుండి ప్రయాణిస్తుండగా, సైనికుల మీదికీ, వారి గుర్రాల మీదికి పెద్దపెద్దబండరాళ్ళని కొండ అంచుల నుండి క్రిందికి దొర్లించారనీ ఆ విధంగా వారిని పార దోలారనీ కథనాలున్నాయి.

మరోసారి ఔరంగజేబు మద్దతుదారులైన ఓ సామంత ముస్లింరాజు శివాజీ దుర్గం మీదకి దండయాత్ర కొచ్చాడట. అంత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు శివాజీ దగ్గర చాలినంత ధనమూ లేదు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు. ఉన్నది సంకల్పమూ, ధైర్యమూ, మేధస్సులే [లగాన్ సినిమాలో ఇండియన్ టీం లాగా]. ఉన్న పరిమిత వనరులతోనే ప్రతివ్యూహం పన్నారు. రాత్రికి శతృశిబిరం ఎక్కడ విడిది చేస్తుందో అంచనా వేసారు, ఆనుపానులు కనిపెట్టారు. దానికి తగిన దూరంలో కనుచూపులో ఉండేటట్లు తమ విడిది [campaign] నిర్మించారు. గుడారాలు వేసారు. కాగడాలు వెలిగించారు. గస్తీ ఏర్పాట్లు చేశారు. దూరం నుండి ఇదంతా చూసిన శతృసైనికులకి ఆ చీకట్లో మండుతున్న కాగడాలు. లెక్కకు మిక్కిలి గుడారాలు గుబులు పుట్టించాయి. గెలవగలమన్న ఆశనీ, ధైర్యాన్ని కోల్పోయారు. కాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇలాంటి ప్రయత్నాల్లో శివాజీ, ఆయన అనుచరులూ, ఉన్నది కొద్దిమందే అయినా గుర్రాలు, ఉడుములూ, కోతులూ, పావురాలని కూడా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకున్నారట.

ఈవిధంగా ధనబలాన్ని, అధికార బలాన్ని, కేవలం మనోబలంతో ఎదుర్కొన్న యోధులు మరాఠాలు. ఒకసారి ఔరంగజేబు శివాజీ తండ్రిని బంధించి, చర్చల కంటూ శివాజీని పిలిపించి బంధించాడు. శివాజీ చెరసాల నుండి మాసిన బట్టల మూటలో దాక్కొని చాకలి వాడి సాయంతోనూ, తన అనుచరుల సాయంతోను తప్పించుకున్నాడట. ఆ సమయంలో ఆ మాసిన బట్టల మూటని చెరసాల కావలి వాళ్ళు గానీ పట్టుకుంటే, శివాజీతో పాటు చాకలి వాడూ మరణాన్ని ఎదుర్కొక తప్పదు. అయినా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. తమ ‘కర్తవ్యం’గా, దేన్ని తమంత తాముగా స్వీకరించారో, ఆ సంస్కృతీ పునఃప్రతిష్ఠ పట్ల వారి కున్న నిబద్దత అది! ధర్మ స్ఫూర్తి అది!

మరోసారి కూడా ఔరంగజేబు శివాజీని, ఆయన జ్యేష్ఠపుత్రుడు శంభాజీని నిర్భందించాడు. శివాజీని చంపితే తన రాజ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న హిందువుల్లో అసంతృప్తి, తిరుగుబాటూ వస్తుందని భయపడి, సరియైన అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. శివాజీ జబ్బుపడినట్లు నమ్మించాడు. అయన అనుచరులు శివాజీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దైవపూజలు నిర్వహించేవారు. ప్రతీరోజూ జైలులోని ఖైదీలకి, కావలి భటులకీ ప్రసాదాలు పంచిపెట్టేవారు.

మొదట్లో జైలు కావలి భటులూ, ఇతర సిబ్బంది ఈ ప్రసాదాలూ, మిఠాయిలు పట్ల జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ముందుగా పరీక్షించాక గానీ పంచి పెట్ట నిచ్చేవాళ్ళు కాదు, తామూ తినే వాళ్ళు కాదు. అయితే మిఠాయిల్లో ఏ మతలబు లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నెమ్మదిగా ప్రసాదాలని పరీక్షించటంలో ఓ సాచాటు వచ్చింది. యధాలాపంగా స్వీకరించటం మొదలు పెట్టారు. పరిస్థితి మామూలుగా, శాంతిపూరితంగా ఉంది.

ఓ రోజు ప్రసాదంగా జైలుకు లడ్డూలు పంపబడ్డాయి. అయితే వీటిలో మత్తు పదార్ధం కలపబడింది. లడ్డూలు తిన్న జైలు సిబ్బంది, కావలి భటులూ, ఇతరులూ స్పృహ కోల్పోయారు. తన అనుచరులూ, జైలులో తన అనుకూలురుల సాయంతో శివాజీ, శంభాజీ కూడా జైలు నుండి తప్పించుకోగలిగారు.

[’ఇది కుట్రకాదా’ అని ఎవరైనా వాదిస్తే వారికి సమాధానం చెప్పకుండా ఊరుకోవాల్సిందే. ఎందుకంటే ముస్లిం రాజుల కుట్రల వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ, శివాజీ జైలు నుండి తప్పించుకోవాడానికి పన్నిన పధకానికి వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ తేడా గమనించని వాళ్ళతో, వాదించి మాత్రం సాధించగల ప్రయోజనం ఏముంది?]

శివాజీ సమాజంలో నీతినీ, ధర్మాన్ని, సంస్కృతినీ తిరిగి స్థాపించడానికి ఎంతో దీక్షతో పోరాడాడు. అదే అయన జీవిత లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొడానికైనా, ప్రాణాలొడ్డానికైనా ఏక్షణమూ వెనుకాడలేదు. తన రాజ్యాన్ని సైతం ప్రజలకు తాను ఆదర్శంగా ఉండేలాగా, ప్రజలు కూడా నీతీ ధర్మాల్ని ఆచరించేలాగా, ఉత్తేజపరుస్తూ పరిపాలించాడు.

ఆయన జీవితంలోని ఈ సంఘటన దీన్ని మనకు స్పష్టంగా చెబుతుంది.

ఓ రోజు శివాజీ కొలువు తీరి ఉండగా, సభలోనికి ఓ అనుచరుడు ఓ అందమైన యువతిని వెంటబెట్టుకొని వచ్చాడు. అతడు వినయము, అతృతా నిండిన గొంతుతో “మహారాజా! ముస్లింల నివాస ప్రాంతంలో ఈ అందమైన ముస్లిం యువతిని పట్టుకున్నాను. ఈమెను మీకు కానుకగా ఇవ్వాలని తెచ్చాను” అన్నాడు.

ఆరోజుల్లో, ముస్లిం రాజ్యాల్లో, ఆ ముస్లిం రాజుల అనుచరులు అందమైన హిందూ యువతుల్ని నిర్భందించి తీసుకుపోవటం, ముస్లిం రాజులకీ, వారి రాజోద్యోగులకీ కానుకలుగా సమర్పించటం చేస్తుండేవాళ్ళు. బదులుగా రాజుల నుండీ, రాజోద్యోగుల నుండి ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు. [అంటే ప్రమోషన్లూ, అవార్డులూ, రివార్డులూ లేదా కేరీర్ లాంటివన్న మాట]ఒక్కోసారి వాళ్ళు ముస్లిం స్త్రీలనీ విడిచి పెట్టేవాళ్ళు కాదు. తమ స్వార్ధం, స్వసుఖవిషయంలో వాళ్ళకి మానవత్వం లేదు, మతం, కులం, పేదరికం, పాపం పుణ్యం – ఏవీ పట్టవు. శివాజీ ముస్లిం రాజులకీ, ముస్లిం చక్రవర్తి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనుక ఆయనకి ముస్లిం లంటే ద్వేషం ఉంటుందని ఆ అనుచరుడు అనుకొన్నాడు. ముస్లిం రాజులు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు గనుక ప్రతీకారంగా శివాజీ కూడా ముస్లిం స్త్రీలని అవమానిస్తాడు, అనుకొన్నాడు. అందుచేత అలాంటి చర్య తీసికున్నాడు. అలాంటి ముస్లిం యువతిని తెచ్చినందుకు తనను సత్కరిస్తాడని కూడా ఆశించాడు.

ఈ సంఘటనతో ఒక్కసారిగా సభమొత్తం నిశ్శబ్థం ఆవరించింది. సభికులంతా ఆశ్చర్యం తోనూ, ఉత్కంఠతోనూ చూస్తున్నారు. శివాజీ ఏమంటాడో నన్న కుతుహలం వాళ్ళందరిలోనూ ఉంది. ఆ ముస్లిం యువతి భయంతో వణుకుతోంది.

శివాజీ ఆమె వైపు తిరిగి “అమ్మా! భయపడకు!” అన్నాడు.

సభికుల వైపు తిరిగి “నిజంగానే ఈమె ఎంతో అందంగా ఉంది. ఈమె కడుపున నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడయ్యేవాడినో కదా! నా తల్లి కూడా ఈమెంతటి సౌందర్యవతి అయితే, నేను మరింత అందంగా ఉండి ఉండేవాడిని. ఈమె నా తల్లి జిజియా బాయి లాగే నాకు పూజ్యనీయురాలు” అన్నాడు.

చివరిగా తన అనుచరుడి వైపు చూచి “స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్చుకో! పరస్త్రీలందరూ మనకు మాతృసమానులు. సగౌరవంగా ఈమెను, ఈమె ఇంట దిగవిడిచిరా!” అని ఆఙ్ఞాపించాడు.

శివాజీ ఆమెకు బహుమతులిచ్చి, రాచమర్యాదలతో ఆమెను స్వగృహానికి పంపించాడు. అదీ ఆయన నిబద్దత – ధర్మంపట్లా, నైతికత పట్లా, మానవతా విలువల పట్లా! వాస్తవానికి ధర్మం, నీతి, మానవీయ విలువలూ ఎప్పటికీ కులమత రాజకీయాలకూ, స్థలకాలమానాలకు అతీతమైనవి. వీటినే హిందూ ధర్మం చెప్తుంది. దానిని ఆచరించటమే నిజమైన హిందువు [మనిషి] చేయవలసినది.

ఇలాంటిదే మరో సంఘటన!

ఒకసారి శివాజీ మాతృశ్రీ జిజియాబాయి ఆయన్ని సింహఘడ్ ను గెలుచుకొని తనకు కానుకగా ఇమ్మని చెప్పింది. ఆయనీ కార్యాన్ని సాధించే పనిని తన అనుచరుడైన తానాజీకి అప్పగించాడు. తానాజీ శివాజీకి ఆప్తమిత్రుడు, అనుంగు అనుచరుడూ, మహా యోధుడు. ఈ వర్తమానం అందుకొనేటప్పటికి తానాజీ తన కుమారుడి వివాహానంతర విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు. అయితే వర్తమానం అందుకున్న మరుక్షణమే తానాజీ సింహఘడ్ మీదకి దాడికి సేనాసమేతుడై వెళ్ళాడు. తీవ్రపోరాటంతో సింహఘడ్ ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే ఆ పోరాటంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.

దుర్గాన్ని గెలుచుకొన్న తర్వాత, విజయచిహ్నంగా ఫిరంగి మ్రోగింపబడింది. ఫిరంగి శబ్థం విన్న శివాజీ సింహఘడ్ కి చేరుకొన్నాడు. కోట గుమ్మం దగ్గర శివాజీకి విజయ స్వాగతం ఇవ్వబడింది. కానీ శివాజీ మరుక్షణమే తానాజీ అక్కడ లేకపోవడాన్ని, ఆయన నిర్జీవ శరీరాన్ని గమనించాడు. ఇంతలో ఓ సైనికుడు సంతోషం, గర్వం నిండిన గొంతుతో “మహారాజా! మీరు సింహఘడ్ ని గెలుచుకొన్నారు” అన్నాడు. [బహుశః విజయవార్తని చెప్పినందుకు శివాజీ మహారాజు నుండి బహుమానాన్ని అతడు ఆశించి ఉండవచ్చు.]

శివాజీ అతడి వైపు వాడి చూపు చూసి, తీవ్రస్వరంతో “ఘడ్ తో ఆయా, లేకిన్ సింహ్ చలాయా!” అన్నాడు. [దుర్గం వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయాను]

అదీ శివాజీ భావవాద దృక్పధం, ఆలోచనా సరళి! సింహఘడ్ దుర్గాన్ని గెలిచిన ఆనందం కన్నా, తన ప్రియమిత్రుడూ, మహా యోధుడు అయిన తానాజీ మరణంపట్ల దుఃఖమే ఆయన హృదయాన్ని తాకింది. ప్రతి విషయాన్ని, అనుభూతినీ రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటున్న నేటి సమాజంలో ఈ ’భావం’ ఎందరికి అర్ధమౌతుందో భగవానుని కెఱుక.

నిజం చెప్పాల్సి వస్తే – ప్రస్తుత పరిస్థితి శివాజీ మహారాజు నాటి పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు. ఆ రోజుల్లో ఒక్క ఔరంగజేబు ఢిల్లీలో ఉన్నాడు. అతడితో సమానులైన మరికొందరు అతడి అనుచరులు దేశంలోని వివిధ ప్రాంతాలను పాలిస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు? ఎంతోమంది ఔరంగజేబులు ఢిల్లీ నుండి గల్లీ దాకా ఉన్నారు. ఔరంగజేబుకి, అతడి అనుచరులకీ ఏమాత్రం తీసిపోని పాలకులే ఇప్పుడు పల్లెనుండి పట్నాల దాకా, మునిసిపాలిటి నుండి అసెంబ్లీలు, పార్లమెంట్ దాకా పాతుకుపోయారు. విలువల్లేవు. నీతి నియామాలు లేవు. సత్యము లేదు, పరిపాలనా విధానమంటూ కూడా ఏదీ లేదు. ఉన్నదొక్కటే – లంచం లేదా అవినీతి లేదా రెడ్ టేపిజం లేదా దందా. ఏ పేరైనా ఒకటే! మనిషి అన్న అస్తిత్వం లేదు, వ్యక్తిత్వం అంటే గౌరవం లేదు, ఆస్తికీ, మానప్రాణాలకి రక్షణా లేదు.

మరి శివాజీ ఎక్కడ? ఆయన చిరునామా ఎక్కడ? శివాజీని మనం మన హృదయాలలోనూ, మెదడులోనూ కనుక్కోవాలి, చూడగలగాలి. అలాగ్గాకుండా ఇక ఈ బ్రతుకెందుకు? విలువలూ, నీతినియమాలూ లేని బ్రతుకుకి అర్ధం మాత్రం ఏముంది? అందుకే అన్నాడేమో మహాకవి శ్రీశ్రీ……..

"మనదీ ఒక బ్రతుకేనా?
కుక్కల వలె నక్కల వలె
సందులలో పందుల వలె
మనదీ ఒక బ్రతుకేనా?"

విలువలూ, నీతినియమలూ లేని జీవితం జంతుప్రాయమే కదా! ’తిన్నామా పడుకున్నామా తెల్లారిందా’ - ఈ Concept తోనే బ్రతికితే, ఆ బ్రతుకు జంతుసదృశం కాదా?

ఇందులో మరీ భయంకరమైన విషయం ఏమిటంటే – స్వలింగ సంపర్కం, అంతటి హేయమైన విషయాన్ని చట్టబద్దం చేయమని గోల. జంతువుల్లో కూడా ఈ అలవాటు ఉందనీ, అది ప్రకృతి సహజం అనీ, అక్కడా ఇక్కడా అడపాదడపా ఆడ ఆడ లేదా మగా మగా పెళ్ళి చేసుకున్నారనీ పత్రికల్లో వార్తలు, సినిమాల్లో కథలూ! ఎంత నీచం గాకపోతే పోయిపోయి జంతువులతోనా పోల్చుకోవాలి? మనిషి జంతువు కంటే పరిణతి చెందిన వాడని కదా దుస్తులు వేసుకొంటాం, వీధుల్లో బహిరంగ ప్రదేశాల్లోనో కాకుండా ఇళ్ళల్లో నివసిస్తాం? అది ప్రకృతి సహజం అంటే. జంతువులకి ప్రకృతి సహజమేమో గానీ మనుఘలకి కూడానా? అదే నిజమైతే జంతువులకీ తల్లీ చెల్లీ అన్న తేడా ఉండదు. వావి వరుసలేని శృంగారం, కొన్ని జంతువుల్లో ఉంటుంది. అలాగే జంతువులు దుస్తులూ వేసుకోవు. బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన దగ్గరనుండీ శృంగార క్రియ వరకూ జరిపేసుకుంటాయి. ’స్వలింగ సంపర్కం’ నిషేధించడం కాదు, చట్టబద్దం చేయాలనే వారు ఇక తర్వాత అడుగులుగా మిగిలిన జంతు ప్రక్రియలు కూడా తెస్తారేమో! ఎక్కడ ఉత్కష్టమైన హిందూ సమాజం – ఎక్కడ అభివృద్ది మంత్రం అంటున్న నేటి సమాజం? 116 సంవత్సరాల క్రితం వివేకానందుడు ఆమెరికా, యూరప్ సమాజంకు హిందూసంస్కృతి గురించి చెప్పి ఉర్రువుతలూగించిన హిందూసంస్కృతి మూలాలెక్కడ? నేటి సమాజం దానికి సరిగ్గా శీర్షాసనం వేసి ఉంది. ఇక్కడ తెలియటం లేదా హిందుమతం మీద కుట్రజరుగుతుందన్న విషయం?

ఇక శ్రీశ్రీ విషయానికి వస్తే – ఆయన కాలం నాటి సామాజిక స్థితి, మానవ సంబంధాలూ చూసి, ఆ మహాకవిలో పొంగిన పాజిటివ్ భావోద్రేకం ఇంకా చెప్పాలంటే ధర్మాగ్రహం ఆ కవితలో కనబడుతుంది. జనాల్లో పౌరుషాన్ని రగిలించడమే ఆయన సంకల్పం. ఎందుకంటే మనిషిగా ఉన్నతుడయ్యేందుకు ప్రతీ వ్యక్తి ప్రయత్నించాలన్న సంకల్పం ఆయన హృదయంలో ఉంది గనుక, ఆ ఉత్తేజాన్ని అందరిలో నింపాలన్న సంకల్పం ఆయనది. ఆ సంకల్పంలో సత్యమూ, నిజాయితీ ఉన్నాయి గనుక అది అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించి, ఉత్తేజ పరిచింది. వెంటనే కుట్రదారులు, వారి మద్దతుదారుల చూపు ఆయన మీద పడింది. ఫలితం – ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వత్తిళ్ళు సృష్టించబడ్డాయి. పై కారణంగా [ overleaf reason] తోటి కవుల, సాటి వాళ్ళ ఈర్ష్యసూయలూ, కవిత్వం, సినిమా రంగల్లోని కుళ్ళు రాజకీయాలు కనబడతాయి. అంతర్లీనంగా ఉంది మాత్రం, కుట్రదారుల నెట్ వర్క్ భారతీయ కళారంగమ్మీద, సినిమా రంగమ్మీదా లోతుకంటా పనిచెయ్యడమే. పైకి కనబడకుండా చాపక్రింద నీరులా పని చేయటమే గూఢచర్య నైపుణ్యం కదా! ఈ వత్తిళ్ళతో తట్టుకోలేక శ్రీశ్రీ మద్యపాన బానిసయ్యాడు. అది మరింత గగ్గోలునీ, వత్తిడినీ ఆయనిపై పెంచింది. ఇంకొంత మత్తు – మరికొంత వత్తిడి! చర్విత చర్వణం లేదా అదో విషచక్రం. సహజంగానే, ఆయనే కాదు మరింకెవ్వరైనా జీవితంలో కుప్పకూలిపోతారు. ఈ రకపు స్ట్రాటజీ ఎంతోమంది కవులూ, రచయితలు, సినిమా దర్శకులూ, నటీనటులూ, ఇతర కళాకారుల మీద ప్రయోగించబడింది. ఈరకపు వత్తిళ్ళనీ మొదట్లోనే తట్టుకోలేకపోయిన వారు కుట్రదారులకు మద్దుతుదారులైపోయారు. క్రమంగా నైపుణ్యం లేని కళాకారులు కూడా ఘోస్టులను వెనక బెట్టుకొని హిట్టయిపోయారు, మరికొందరు అసలే నైపుణ్యమూ లేకపోయినా గొప్పవారుగా చలామణి అయిపోయారు. అయితే ఎవరైతే ప్రజల్లో చైతన్యం తేగలిగేంత నైపుణ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రజల్ని స్ఫూర్తివంతం చేయగలరో, ఎవరి దగ్గరైతే చక్కని భావ సంపద ఉందో – అలాంటి కళాకారులూ, కవులూ మాత్రం జీవితాల్లో ఓటమి పాలయ్యారు, తమ రంగాల్లో విజయం సాధించలేక పోయారు, కొంత మందైతే కనీసం జీవనభృతి కూడా సంపాదించుకోలేక పోయారు.

ఇలాంటి వారిలో కొందరు ఫీల్డులోంచి కనుమరుగయ్యారు. కొందరు ఆత్మహత్యలు చేసుకొన్నారు. [ఆదుర్తి సుబ్బారావులూ, గురుదత్ లూ, ఇంకా నటీమణులెందరో] కొందరు రోగగ్రస్తులై మరణించారు. [గోపిచంద్ తండ్రి టి.కృష్ణ లాంటి వారు ఎందరో] కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు [శంకర్ నాగ్ లాంటి వారెందరో] క్యాన్సర్ లాంటి రోగాలే కాదు, ఏ రోగాలైనా పుట్టించవచ్చు, ఏ యాక్సిడెంట్లయినా ఎవరికీ అనుమానం రానంత సహజంగా జరిపించవచ్చు. అదే గూఢచార నెట్ వర్క్ బలమూ, నైపుణ్యము. ఈ నెట్ వర్క్ బాధితులందరిలోనూ ఉన్న ఒకే లక్షణము ‘డబ్బే ప్రధానం కాదు, భావమే ప్రదానం’ అనే భావవాదాన్ని, భారతీయుల్లో ఉన్న సుగుణాన్ని తట్టిలేపే శక్తికలిగి ఉండటమే. కుట్ర భారతీయ కళారంగమ్మీద పనిచేసిన తీరిది. మరింత విపులంగా Coups On World లో Coup on Indian Arts లో చర్చించాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.

ప్రస్తుతానికి కళారంగాన్ని వదలి మళ్ళీ రాజకీయ రంగమ్మీది కుట్ర దగ్గరకి తిరిగివద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .
************

ప్రారంభంలో శివాజీ దగ్గర సైన్యం లేదు సంకల్పం తప్ప. శివాజీ వ్యక్తిత్వం విప్పారే కొద్దీ, ఆయనలోని సంకల్పబలం, ఇదే ఆలోచన సరళి గల మరికొందరిని ఆయన వైపు ఆకర్షితమయ్యేలా చేసింది. క్రమంగా అలాంటి వ్యక్తులతో బలమైన దళం తయారయ్యింది. హిందూ ధర్మాల్ని, విలువల్ని తిరిగి నిలబెట్టటానికి, ముస్లిం సామ్రాజ్యానికి వ్యతిరేకంగా హిందూ సామ్రాజ్యం స్థాపించాలన్న సంకల్పం వారిలో వజ్ర సదృశ్యమైనది.

భగవద్గీత మనకి

శ్లోకాలు:
యదా యదాహి ధర్మస్య గ్లాని ర్భవతి భారత
అభ్యుత్ధాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహమ్

భావం:
ఓ భారతీయుడా![అర్జునా!] ధర్మం క్రుంగి, ఆధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూంటాను.

***********

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే

భావం:
సజ్జన సంరక్షణకూ, దుర్జన శిక్షణకూ, ధర్మసంస్థాపనకూ ప్రతీయుగంలోనూ నేనవతరిస్తూనే ఉంటాను.

అంతేకాదు ’దైవం మానుష రూపేణా’ అంటారు పెద్దలు. అలా ధర్మసంస్థాపనార్ధం మరోసారి దైవం తనను తాను వ్యక్తుల సమిష్టిగా సృజించుకొన్నాడేమో అన్నట్లుగా శివాజీ జీవితం మన కళ్ళముందు అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. దీన్ని మరింతగా దర్శించాలంటే మనం కొన్ని సంఘటనల్ని గురించి చెప్పుకోవాలి.

క్రమంగా శివాజీ, ఆయన అనుచరులూ పౌరుషవంతులైన యువకుల్ని సమీకరించి, వారికి ఆయుధ ప్రయోగాల్లోనూ, యుద్ధవిద్యల్లోనూ శిక్షణ నిచ్చి సైనిక దళాలుగా తయారుచేసారు. జరుగుతున్న, జరిగిన యధార్ధాల్ని యువతరానికి వివరించి వారిని ఉత్తేజపరచారు. మొదట్లో వారు చిన్న చిన్న దుర్గాలని, కోటలని స్వాధీనం చేసుకొన్నారు. క్రమంగా సామ్రాజ్య స్థాపన చేశారు. ఇదంతా శివాజీ, ఆయన అనుచరులు ఒక్కరోజులోనో, ఒక్క సంవత్సరంలోనో సాధించలేదు. మనం సినిమాల్లో ఒక్క ’సోలో సాంగ్’ లో చూసినంత సులభంగానో, ఈనాటి రాజకీయాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ క్రీడల్లోనూ జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ ల్లాగానో సాధించలేదు.


సామ్రాజ్యస్థాపన వారు తమ స్వసుఖల కోసం చేయలేదు. హిందూ ధర్మాల్ని, సంస్కృతినీ పునఃస్థాపించటానికి చేశారు. అందుకోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు, విపరీతంగా శ్రమించారు, నిబద్దతతో కష్టించారు. తమ ప్రాణాల్ని, జీవితాన్ని ఫణంగా పెట్టారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాల్నీ తీసుకొని అమలు చేశారు. అందులో గెలుపుల్నీ, ఓటముల్నీ కూడా ఎదుర్కొన్నారు. ఓడినప్పుడల్లా లోపాలు సవరించుకొంటు శ్రమించారు. వారి పోరాటం నేటి మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్ క్రీడల్లాగా కృత్రిమ ఉత్కంఠపూరితం కాదు. కుత్తుకలు కోసుకుపోయే రుధిరమయం.

శ్రీశైలంలోని స్థానిక ’చెంచు’గిరిజనులు చెప్పగా విన్న విషయం ఒకటి ఇక్కడ ఉటంకిస్తున్నాను.

పోరాట ప్రారంభ దినాల్లో ఒకసారి శివాజీ తీవ్రనిరాశకీ, నిస్పృహకీ గురయ్యాడట. దానితో శ్రీశైలం వచ్చిన శివాజీ అక్కడ కొంతకాలం – ఆ అడవుల్లో మల్లయ్య స్వామి గుడిలో గడిపాడట. [స్థానికులు శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని ’మల్లయ్య సామీ’ అంటారు.] ఆధ్యాత్మిక చింతనతోనూ, ధ్యానంతోనూ గడిపాడట. దాదాపు తపస్సు చేసాడన్నమాట. ఆ సమయంలోనే ఆయనకి భవానీ మాత[భ్రమరాంబ దేవి]ఖడ్గ ప్రదానం చేసిన స్ఫూర్తిని పొందాడట. ఆ తర్వాత ఇక్కడ నుండి మహారాష్ట్ర చేరిన శివాజీ దిగ్విజయ బాటలో నడిచి సామ్రాజ్యస్థాపన చేశాడు. శ్రీశైలంలో ఆలయానికీ గోపురం కట్టించాడు. ఈ నాటికీ ఆ గోపురాన్ని శివాజీ గోపురమనే పిలుస్తారు. శివాజీ శ్రీశైలంలో తపస్సు చేసిన రోజుల్లో అక్కడి చెంచుప్రజలు ఆయనకి ఆవుపాలూ, ఆహారం సమకూర్చారట. అందుకనే శ్రీశైలంలో అయ్యవారి పల్లకి సేవలోనూ, ప్రత్యేక పూజల్లోనూ చెంచులకి ప్రత్యేక విధులు నిర్వహించే సాంప్రదాయం శివాజీ ఆఙ్ఞతో ప్రారంభమయి ఇప్పటికీ కొనసాగుతుందని అక్కడి చెంచులు అంటారు. ఏదేమైనా శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ జీవిత సచిత్రమాలిక చూస్తే ఎవరికైనా స్ఫూర్తి కలగటం మాత్రం నిశ్చయం.

ఛత్రపతి శివాజీ ’రాజ’ కుటుంబం నుండి రాలేదు. సాధారణ రాజోద్యోగ కుటుంబం నుండే వచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృక్పధం భగవంతుడి నుండీ, పురాణీతిహాసాల నుండి, ధర్మతత్త్వ చింతన నుండీ ఆయన పొందిన స్ఫూర్తి, ఆయనలోని ఉత్తేజం, ఆయన అనుచరుల్లోకి ప్రవహించి ప్రజ్వరిల్లింది. సమిష్టి కృషి అద్భుతాన్ని ఆవిష్కరించింది.

ఈ ప్రయత్నంలో ఓసారి శివాజీ షెయిస్తఖాన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది. షెయిస్తఖాన్ ఏడడుగుల ఎత్తులో, శరీరక బలంతో, కౄరుడిగానూ, రాక్షసుడిగానూ పేరు పడ్డాడు. ఔరంగజేబు తరుపున శివాజీతో చర్చించడానికి వస్తున్నాడు. అయితే ఇది పైకారణం మాత్రమే. ఆ వంకతో శివాజీని చంపడమే అతడి లక్ష్యం. ఈ విషయం శివాజీకి తన వేగుల ద్వారా ముందే తెలుసు. శివాజీ ఆ ప్రమాదాన్ని[రిస్క్ ని] ఎదుర్కొనేందుకే నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటనని ఎదుర్కొడానికి బయలుదేరేముందు శివాజీ తన అనుచరులందర్నీ జాగరూకుల్ని చేసి, తదుపరి కర్తవ్వాన్ని వివరించాడు. ఒకవేళ షెయిస్తఖాన్ తో పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోయినా, సమాజంలో నీతినీ, విలువల్నీ హిందూ సంస్కృతినీ పునఃప్రతిష్టించే పనిని తాము కొనసాగించాలని ప్రభోదించాడు. అవీ వారి ధైర్యసాహసాలూ, ధృఢ సంకల్పాలు!

ప్రతిపాదిత సమయానికి శివాజీ, షెయిస్తఖాన్ ని కలిసేందుకు బయలుదేరాడు. రహస్యంగా తన చేతి పది వెళ్ళకు పులిగోళ్ళను పోలిన ఇనుపగోళ్ళను తగిలించుకున్నాడు. షెయిస్తఖాన్ విశాలంగా నవ్వుతూ శివాజీని ఆహ్వానించాడు. స్నేహాన్ని వ్యక్తీకరిస్తూ శివాజీని కౌగిలించుకున్నాడు. నిజానికది మృత్యుకౌగిలి; శివాజీకైనా, షెయిస్తఖాన్ కైనా. ఆ కౌగిలింతలోనే శివాజీని పిడిబాకుతో పొడిచి చంపాలని షెయిస్తఖాన్ ప్రయత్నించాడు. అయితే శివాజీ షెయిస్తఖాన్ కంటే చురుగ్గానూ, వేగంగానూ కదిలాడు. షెయిస్తఖాన్ తనను బాకుతో పొడవబోయే లోగానే తాను అతని వీపుని తన ఇనుపగోళ్ళతో చీల్చివేశాడు. అది చూసి షెయిస్తఖాన్ సైనికులు మ్రాన్పడిపోయాడు. తమ శిబిరంలోకి వచ్చి తమ నాయకుణ్ణి చంపే సాహసాన్ని వాళ్ళు ఊహించలేదు. వారా దిగ్ర్భమ నుండి తేరు కొనే లోగానే శివాజీ సైన్యం వారిపై దాడి చేసింది. అప్పటికే భయభ్రాంతులైన షెయిస్తఖాన్ సైనికులు పలాయనం చిత్తగించారు.

ఆ విధంగా శివాజీ కర్తవ్యం కంటే ప్రాణాలు విలువైనవి కావని నిరూపించాడు. ఎందుకంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఎప్పటికీ తాత్కాలికమే. కానీ ధర్మం, విలువలు మాత్రం శాశ్వతం. మనం ఎలా బ్రతికినా, ఏదో ఒక రోజున చావడం ఖాయం. కానీ చావనిది సంస్కృతి, ధర్మమే.

ఔరంగజేబు పాలనా కాలం కంటే ప్రస్తుత సమాజం మరింత భ్రష్టస్థితిలో ఉంది. ఈనాడు ప్రతీ వ్యక్తి తనకు తానే ఓ శివాజీలా జీవించగలిగితే గానీ ఈ స్థితిలో మార్పులేదు. అంతేగాని ప్రతీవ్యక్తి తనకు తాను, తనకు వీలైన చోట ఔరంగజేబు అనుచరులా ప్రవర్తిస్తే మార్పుసంగతి దేముడెరుగు మరింత భయానక స్థితికి సమాజం దిగజారడం ఖాయం. జీవితంలో సుఖశాంతులు అవసరం. అయితే సత్యం, ధర్మం మరింత అవసరం. ’నిజం’ నుండి ఎంత దూరం జరిగితే ’శాంతి’ వాళ్ళకి అంత దూరమవ్వడం సత్యం. జీవితంలో కష్టాలని ఎదుర్కొనే ధైర్యాన్ని, నీతిని సత్యాన్ని ధర్మాన్నీ ఆచరించే స్ఫూర్తిని – శివాజీ వ్యక్తిత్వం మనకి ప్రసాదిస్తుంది.

ఔరంగజేబుది అప్పటికే తాతతండ్రుల నుండీ ఏర్పడి ఉన్న పటిష్టమైన వ్యవస్థ. దానితో పోరాడటానికి శివాజీ ’గెరిల్లా యుద్ధం’ అనే ప్రక్రియని ప్రవేశపెట్టాడు. ఔరంగజేబుది వారసత్వంగా సంక్రమించిన సామ్రాజ్యం. అతడికి అపారమైన అర్ధ అంగ బలాలున్నాయి. సైన్యం, సాధన సంపత్తి ఉన్నాయి. శివాజీ సంకల్పమూ, లక్ష్యమూ పెద్దవి. కానీ సైన్యం చాలా చిన్నది. అందుచేత శివాజీ ’గెరిల్లా యుద్ధాన్ని’ రూపొందిచాడు. ఈ పద్దతిలో శివాజీ సైనికులు శతృసైనికులు మీద హఠాత్తుగా, ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడి చేస్తారు. అప్పటి వరకూ రహస్యంగా అడవుల్లోనూ, కొండగుహల్లోనూ ఉంటారు.

కుట్రదారులు [అంటే నకిలీ కణిక సంబంధిత రామోజీరావు, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., ఇంకా వారి మద్ధతుదారులూ] ఇదే ’గెరిల్లా’ పద్దతిని నక్సల్స్, బోడోస్, మావోయిస్టుల, ఇప్పడు పాకిస్తాన్ తీవ్రవాదుల నెట్ వర్కులో ఉపయోగిస్తున్నారు. వారి విశిష్ట వాదన ఏమిటంటే – “శివాజీ ’గెరిల్లా’ యుద్ధం దేశభక్తి పూరితమైనవైతే మరి నక్సల్స్, మావోయిస్టు, బోడోల ’గెరిల్లా’ యుద్ధం ఎందుకు దేశభక్తి కాదు?” ఎంత గొప్ప వాదన? గెరిల్లా యుద్ధరీతిని పోలుస్తారే గానీ దాని వెనకున్న సంకల్పాలను పోల్చరు. శివాజీ ’ఇన్ ఫార్మర్లనో’ మరో అనుమానం తోనో, వంకతోనో సామాన్యప్రజలని చంపలేదు. శివాజీ లక్ష్యం అవినీతి, అనైతికత మూలాల మీద, అందుకు పట్టుగొమ్మలైన నాటి ముస్లిం రాజులు, రాజ మద్దతుదారులు, కౄర రాజోద్యోగుల మీద, వారి పరిపాలనా యంత్రాంగం మీదే.

అదే నక్సల్స్ లేదా తీవ్రవాదులు ప్రైవేట్ వ్వాపార సంస్థల నుండీ, అవినీతి అధికారుల నుండీ దందా వసూలు చేస్తున్నారు. సామాన్యుణ్ణి, అమాయక గిరిజనులనీ పోలీస్ ఇన్ ఫార్మర్లంటూ చంపుతున్నారు. పోలీసు కానిస్టెబుళ్ళనీ, అందులో పేద ధనిక తారతమ్యలు లేకుండా చంపుతున్నారు. బడా పారిశ్రామిక వేత్తలు, కార్పోరేట్ కింగ్ లూ ఎంతగా ప్రజా దోపిడి చేస్తున్న వారి జోలికి వెళ్ళరు. టాటాలూ, అంబానీల జోలికో వెళ్ళరు. ఎందుకంటే వారి మామూళ్ళు వారికి ముడతున్నాయి కావచ్చు లేదా వ్యవస్తీకృతంగా నడుపుతున్న తీవ్రవాదం తమ వారైన కార్పోరేట్ల కు ఇస్తోన్న ’రక్షణ’కావచ్చు.

ఇంకో విచిత్రం ఏమిటంటే మానవహక్కుల సంఘాలన్నీ నక్సల్స్, మావోయిస్టులు పోలీసు ఇన్ ఫార్మర్లంటూ గ్రామీణుల్ని, గిరిజనుల్నీ చంపినప్పుడూ, లేదా పోలీసుల్ని చంపినప్పుడు కిమ్మనరు. అదే పోలీసులు నక్సల్స్ నీ, తీవ్రవాదుల్నీ, చంపినప్పుడు మాత్రం మరుక్షణమే గద్దర్ లూ, వరవరరావులూ, కళ్యాణరావులూ, ఇంకా అలాంటి వారూ, మానవహక్కుల సంఘాలా వారూ – ప్రింటు మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ సింహ గర్జనలు చేస్తారు. మానవహక్కుల్ని ప్రభుత్వం కాలరాచిందని, రాచి రంపాన పెడుతుందనీ ఎలుగెత్తి అరుస్తారు. వారి దృష్టిలో తీవ్రవాదూలూ, నేరస్తులూ మాత్రమే మానవులేమో మరి. నిజానికి పోలీసులు నక్సల్స్ ని చంపినా, నక్సల్స్ పోలీసుల్ని చంపినా రెండూ హింసాత్మకమే; రెండూ జరగకూడని సంఘటనలే. ఈ మానవహక్కుల సంఘాలు రెండు రకాల సంఘటనలకీ ప్రతిస్పందించాలి. కానీ స్పందించరు. అక్కడే కుట్ర నెట్ వర్కు కనబడటం లేదూ? అదే, అడవుల్లో మావోయిస్ట్ నేతని పోలీసు బలగాలు చుట్టిముట్టాయన్న వార్త పొక్కగానే మాత్రం కళ్యాణ రావులు పరుగు పరుగున హోంమంత్రి దగ్గరికి పోయి లాబీయింగ్ మొదలుపెట్తారు.

ఇందులో మరో ఘోర కృత్యం ఏమిటంటే – ఈ నక్సల్స్, మావోయిస్టులూ ’గెరిల్లా యుద్ధం’ ఎందుకు చేస్తారంటే – ప్రజల సొమ్ముతో కట్టిన బ్రిడ్జిలనీ, రోడ్లనీ, ప్రాజెక్ట్ లనీ పేల్చిడానికీ, బస్సులూ, రైళ్ళూ తగలెయ్యడానికి చేస్తారు. ఆ విధంగా వారు ప్రజల కోసం పోరాడినట్లు ఎలా గవుతుందో వారికీ, వారిని ఆర్గనైజ్ చేస్తున్న కుట్రదారులకీ తెలియాలి. ఇలాగ తుపాకీ గొట్టాలతో విప్లవాన్ని ఎలా తెస్తారో, ఎలా ప్రజలకి మేలు చేస్తారో? ఇందులోని మర్మం, మోసం మరింతగా తెలియాలంటే మనం నిశ్చయంగా మాజీ నక్సల్స్, మాజీ మావోయిస్టుల్నీ, ప్రభుత్వానికి లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలిసి పోయామంటూ వసతులూ, ఇన్ సెంటివ్స్ పుచ్చుకొని సమాజంలో స్థిరపడిన ఆయా ’మాజీ’ల జీవన సరళినీ పరిశీలించాల్సి ఉంది. వారిలో చాలామంది ’దందా’ చేస్తూ, వ్యాపార మాఫియాలూ, లాండ్ మాఫియాలూ నిర్వహిస్తూ, తగదాల్లో రెండుపార్టీల నుండీ కమిషన్లు దండుకొని సెటిల్ మెంట్లు చేస్తూ, చిన్న రాయుడిలా, పెద్దరాయుడిలా లేదా పొట్టిరాయుడిలా దర్జాగా బ్రతికేస్తూ, భట్టిప్రోలు పంచాయితీలు తీర్చడం చూస్తున్నాం, వింటున్నాం. నిన్నటి నక్సల్స్, నిన్నటి మావోయిస్టులూ అయిన నేటి మాజీల అవినీతినీ, దందాని చూసి కూడా నక్సల్స్, మావోయిస్టులూ దేశభక్తులనీ, ప్రజా ప్రేమికులనీ, పేదల బాధల పట్లా, వెతల పట్లా సానుభూతి గలవారనీ, వారి కోసం పాటు పడేవారనీ ఎలా నమ్మగలం?

ఈ సోకాల్డ్ దేశభక్త తీవ్రవాదులు, నక్సల్స్, మావోయిస్టులూ, ధనికుల్ని[వ్యాపార, ప్రభుత్యోద్యోగ, రాజకీయ నాయకులు అన్న తేడాపాడాలు లేకుండా] బెదిరించి డబ్బు గుంజుతారని విన్నాం, చదివాం, చూశాం. అడవుల్లో డబ్బు, ఆయుధాల డంపులు దొరకడమూ వార్తలుగా వింటున్నాం. అంతటి డబ్బుతో వారు ప్రజలకి, పేదలకి ఏమేలు చేశారో, చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కొన్నేళ్ళ క్రితం సమ్మయ్య విదేశీ ఎయిర్ పోర్టులో, బాంబు ఉందన్న పుకారు పుట్టించిన తొక్కిడిలో నలిగి చచ్చిపోయి వార్తల్లోకి ఎక్కినప్పుడు నక్సల్స్, మావోయిస్టులు విదేశీ విహారాలకి వెళ్తూంటారని తొలిసారి బయటికి పొక్కింది. ఇప్పుడది సర్వసాధారణ విషయం. విదేశీవిహారాలకీ, అయిదు నక్షత్రాల హోటళ్ళలో విశ్రాంతులకీ, మారు పేర్లతో మారు రూపాలతో వెళ్ళగలరనీ, పాస్ పోర్టు గట్రా తతంగం వారికి చాలా సులభ సాధ్యమనీ ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే. ఈ నక్సల్స్, మావోయిస్టులకీ సమాజంలోని బడా వ్యక్తులు కొందరికీ[బ్యూరోక్రాట్లు కీ, రాజకీయ నాయకులకీ] సంబంధాలుండటమూ వింటున్నాము. నక్సల్స్, మావోయిస్టులకీ, బోడోలకీ, ఎల్.టి.టి.ఇ. లకీ, పాకిస్తాన్ తీవ్రవాదులకీ సంబంధాలను మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ తెలియటం లేదా అన్ని గ్రూపులు ఒకే సంస్థ క్రింద పనిచేస్తున్నాయని? ఎవరు ఏ పేరుతో హింసోన్మాదం చేసినా, కారణం ఏదైనా గాని ఇండియాకి ఆర్ధికంగా, సామాజికంగా నష్టమూ, కీడే జరుపుతున్నాయి. దీన్నీ కుట్ర అనక దేశాభివృద్ధి అనాలా? స్వేచ్ఛవాదం అనాలా? ఇదా చెడుని వ్యతిరేకిస్తూ చేసే ’గెరిల్లా’ యుద్ధం?

ఈ విధంగా కుట్రదారులు [అంటే నకిలీ కణిక సంబంధిత రామోజీ రావు, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.. ఇంకా వారి మద్ధతు దారులూ] చరిత్రలోని, పురాణాల్లోని, సంస్కృతిలోని ప్రతీ విషయాన్ని ఎగతాళి చేయటం, ప్రతి దానిలో నుండీ Disadvantage ని మాత్రమే బయటికి తీయటమే కుట్ర స్వరూపం. ఇందుకు మరో నిదర్శనం స్వాతంత్ర సమరపు రోజుల్లో హిందువుల్ని ఉత్తేజపరచటానికి తిలక్ మహాశయుడు మొదలు పెట్టిన గణపతి నవరాత్రి ఉత్సవాలు నేడు పర్యావరణ ప్రమాదకరంగానూ, మత ఘర్షణలకు పైకారణం గానూ మారడం!

నా ప్రధాన లక్ష్యం కుట్రని విశదీకరించటమే గనుక ఈ కోణాల్ని ఇక్కడ చర్చించాను. ఇది ఇక్కడికి ఆపి తిరిగి శివాజీ దగ్గరికి వద్దాం.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

కొందరు బ్లాగ్ మిత్రులు ఇచ్చిన వివరణలూ, సవరణలూ అంగీకరిస్తూ, మరికొందరు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు చెప్పాలని ఈ టపా వ్రాస్తున్నాను.

అక్బరూ, ఔరంగజేబుల చరిత్రలు లోతుగా పరిశీలిస్తే అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుంది. బహుశః ఔరంగ జేబుని ఎదుర్కొంటూ తలఎత్తిన శివాజీ కారణంగా అబద్దాలన్నీ చరిత్రగా ఏర్చీకూర్చిన కుట్రదారులకూ వారి మద్దతు దారులకూ ఔరంగజేబుని ’ఇంద్రుడు చంద్రుడు’ అనాలంటే మరీ పచ్చిగా అన్పించిందో లేక మరీ అతి అయితే పట్టుబడి పోతుందని భయంగా అన్పించిందో గానీ, కనీసం ఔరంగజేబుకి పరమత సహనం లేదనీ, హిందువుల పై జట్టుపన్ను విధించాడనీ పిల్లల చరిత్రపాఠాల్లో వ్రాసారు. అది మనం చదివి, బట్టిలేసి పరీక్షల్లో ప్రశ్నాజవాబులు వెలగబెట్టేం. హిందూ సామ్రాజ్యం స్థాపించిన శివాజీ లాంటి వ్యతిరేక శక్తి ఏదీ పని చేయలేదు కాబట్టి అక్బరుని ‘మహా గొప్ప ఉదారుడనీ, చదువుకోని పండితుడనీ’ ఆకాశాని కెత్తేసినట్లున్నారు.

ఏమైనా నా బ్లాగులో నేను ’రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర’ లో వివరిస్తున్న చరిత్ర – మనం పాఠశాల పాఠాల్లో చదువుకున్న చరిత్ర., సామాన్యుణ్ణి చేరిన చరిత్ర., ఏది చరిత్రగా నమ్మి మనం ఇప్పటి వరకూ చదివామో, పిల్లలకి బోధించామో ఆ చరిత్ర.! అంతకంటే లోతుగా వెళ్ళెందుకు సామాన్యులకి అవకాశం లేదు. లోతుగా చర్చించినా కూడా రుజువు చేస్తున్నది కుట్రనే కదా!

1994 , 1995 ల్లో ఈనాడు పత్రికలోనే చదివాను, సి.ఐ.ఏ. తన ఏజంట్లుగా, పైకి ఇతర వృత్తుల్లో అంటే టీచర్లుగానూ, డాక్టర్లుగానూ, రాజకీయనాయకుల గానూ, కళాకారుల గానూ, చరిత్రకారులు గానూ, మీడియాలోనూ, ప్రభుత్వ ఉద్యోగులగానూ, ఇలా రకరకాల వృత్తుల్లో [అప్పటి ఈనాడులో అయితే అన్ని వివరంగా వ్రాయబడ్డాయి.] ఉన్న వ్యక్తుల్ని ’అపాయింట్’ చేసుకొంటుందని. ఇప్పుడు మనం ఐ.ఎస్.ఐ. ఏజంట్లుగా, తీవ్రవాదులకి సిమ్ కార్డులూ, అద్దె ఇళ్ళు, వాహనాలూ, డబ్బూ సమకూర్చుతున్న వ్యక్తుల్ని, పైకి ఇతర వృత్తులు [ఇప్పుడు ఐ.టి. ఇంజనీర్లుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు] చేస్తున్న వారిని చూస్తూనే ఉన్నాం కదా!

అలాంటప్పుడు మనకి తప్పుడు చరిత్ర అందించబడటం పెద్దవిషయం కాదు. ఇది నిజం కాదు అన్న ప్రొఫెసర్లు చివరికి చరిత్రపాఠాలు వ్రాసే కమిటీ నుండి తొలగించబడతారు, లేదా అదే నిజం అనేవరకూ వత్తిడి చేయబడతారు. ఏమైతేనేం అబద్దాన్నే నిజం అనే వరకూ అన్నీ పరిస్థితుల్నీ అనుకూలించుకోవటమే కుట్రదారుల పనితీరు. ’దీన్ని ప్రభుత్వం ఎందుకు ఎదుర్కోలేదు?’ అంటే – ఇప్పటి ప్రభుత్వాలు ఎటూ కుట్రదారుల అనుచరులవే గనుక ఇప్పుడా ప్రసక్తే లేదు. ఒకప్పుడు అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి, ఆ తదుపరి కొన్ని దశాబ్దాల వరకూ ఉన్న ప్రభుత్వాల ఏం చేసాయి అంటే – ఆకోణంలో కుట్ర జరుగుతుందని ఎందుకు అనుమానిస్తాం? 1962 లో చైనా యుద్ధంలో ఓడిపోయే వరకూ భారతదేశమ్మీద కుట్ర అనుశృతంగా జరుగుతోందని ఎవ్వరూ అనుమానించలేదు. ఆ తర్వాత కూడా ’విదేశీ హస్తాన్ని’ గుర్తించినా ఎక్కడి నుండి పనిచేస్తుందో తెలియలేదు. అలాంటప్పుడు అన్నిటిలాగే ’మామూలుగా’, చరిత్ర వక్రీకరణ కూడా జరిగిపోయింది.

కాబట్టే అమాయకంగా మనం చిన్నప్పటి నుండి మొఘలుల గొప్పదనాన్ని దండోరా వేసిన పాఠాల నడుమ, హిందూ సంస్కృతినీ, చరిత్రని హీనపరిచే విషవృక్షాల నీడన, ప్రచారాన్ని నమ్మితీరాల్సిన అగత్యాల నడుమ పెరిగాం. ఇప్పటికీ మన చిన్నపాపలకి అదే చరిత్ర పాఠాలు చెబుతున్నాం. ఇన్నాళ్ళు నమ్మిన దాన్ని అబద్దం అంటే నిజాన్ని స్వాగతించే వారు కొందరు. ఒప్పుకోలేక వ్యతిరేకించే వారు మరెందరో. అందుకే ఇప్పుడు మన బ్లాగ్లోకంలో ’ఏది నిజం’ అంటూ వ్రాసినా, సుదీర్ఘ కుట్ర ఇదని వ్రాసినా కొంతమందికి జీర్ణం కావడం లేదు.

ఇప్పుడీ గతమంతా ఎందుకు? అంటున్నారు కొందరు. టైం మెషీన్ లో వెనక్కి వెళ్ళి సరిచేయలేం కదా? - అంటారు కొందరు. ఇదంతా తవ్వుకొని ఏం ప్రయోజనం? – అంటారు మరికొందరు. ప్రయోజనం అంటే ఇన్ స్టంట్ ఫలితామా, లేక ఏంలాభం రూపాయల్లో అనో నాకు తెలియదు!

ప్రతీపనికి రూపాయల్లో ప్రతిఫలం ఉండనక్కరలేదు.

ప్రతీ పనికి ప్రత్యక్ష తక్షణ ఫలితం ఉండక్కర్లేదు.

జరిగిన దేమిటో, ఎక్కడ ఎలా మోసపోయామో తెలుసుకోవలసిన అవసరం లేదను కొంటే, వారికి ఎవ్వరు ఏమీ చెప్పలేము. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో తెలుసుకొంటే - ఈ రోజు ఏం జరుగుతుందో అర్ధం చేసుకోగలుగుతాం, రేపు ఏం జరుగుగలదో ఊహించగలుగుతాం.

అప్పుడు కనీసం మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.

అందుకే చరిత్ర – నిజమైన చరిత్ర తెలుసుకోవటం మనకి అవసరం.

అందుకే అసలు చరిత్రనే ఎత్తిపారేయాలిని ప్రయత్నించారు కుట్రదారులు.

అందుకేనేమో చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నమూ కొంత చేయబోయి, కుదరక ప్రకటనలతోనే సరిపెట్టుకున్నాడు.

నిజానికి నా టపాలలో నేను చరిత్రని లోతుగా స్పృశించటం లేదు. ఎందుకంటే మనకి తెలిసిన చరిత్రలో నిజనిజాలు ఏపాటివో మనకే తెలీదు గనుక. సామాన్య పాఠశాల విద్యార్ధులుగా అందరం ఏం చదివామో, ఇప్పుడు ఏది చెప్పబడుతుందో, ఏ చరిత్ర, ప్రచారం సామాన్యులకి చేరిందో అందులో నుండే కుట్రకోణాల్ని విశ్లేషిస్తున్నాను. అక్బరు మంచివాడుగా చిత్రించబడిన చెడ్డవాడు కావటం, అతణ్ణి మంచివాడుగా మనం చదివి ఉండటం, నమ్మించబడటం కూడా కుట్రలో భాగాలే!

ఇక్కడ ఒక విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించదలుచుకున్నాను. చిన్నతనం నుండీ నమ్మి ఉన్నందునో, ఆ నమ్మకం తప్పని ఒప్పుకోవాలంటే నొప్పిగా ఉన్నందునో, లేక నిజం జీర్ణం కావడం కష్టమైనందునో, లేక జరిగిన ప్రచారమే హాయిగా నచ్చి ఉన్నందునో కానీ – కొందరికి అక్బరు చెడ్డవాడంటేనూ, అలెగ్జాండర్ అశోకుడి కంటే ఎలా గొప్పవాడంటేనూ కోపం వస్తోంది.

అలెగ్జాండరు కారణంగానే భారతదేశం ప్రపంచానికి తెలిసిందనే వాదనలూ చేస్తూన్నారు. బ్రిటీష్ వాళ్ళు పాలన మూలంగానే భారతదేశం అభివృద్ధి చెందిందనీ, చెందుతుందనీ, వాళ్ళు లేకపోతే ఇండియా సమైక్యంగా ఉండదనీ, చీలికలు పేలికలు అవుతుందనీ కాబట్టి స్వాతంత్రం అవసరం లేదనీ కొందరు స్వాతంత్ర సమరం రోజుల్లో వాదించారట. పై వాదన కూడా అలాంటిదే. బిల్ గేట్స్ కంటే బిన్ లాడెన్ కీ ఎక్కువ గుర్తింపు ఉందని ఓ సర్వే చెబుతుందనీ డైలీ టెలీగ్రాఫ్ పత్రిక వ్రాసిందనీ, ఈనాడు పత్రిక 30/10/2007 వ్రాసింది. మరిన్ని వివరాలకు Coups On World లోని Responsibility of Media గానీ, Fire Pot లో గానీ చూడగలరు. బిన్ లాడెన్ విధ్వంసకారి. అమెరికానే కాదుప్రపంచాన్ని ఇస్లాం మతంలోకి మారలనీ, అల్లాసామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నహింసోన్మాది. బిల్ గేట్స్ కంప్యూటర్ రంగాన్ని అభివృద్ది పరుస్తూ అనేక మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి, సమాచార వ్యవస్థని అభివృద్ది చేస్తూ నిర్మాణాత్మకమైన పనిచేసిన వ్యక్తి.

బిన్ లాడెన్ న్యూయార్క్ ల్లోని WTC ని కూలగొట్టిన విధ్వంసకర పనులు చేసినవాడు. నిర్మాణాత్మకమైన పనిచేసిన వాడికంటే విధ్వంసకారుడు గొప్పంటేనూ, ప్రజలకి మేలు చేసిన చక్రవర్తి[ఆశోకుడి కంటే] ప్రజల్నీ, రాజ్యాన్ని వదిలేసి ఇతర రాజ్యాల మీదకి దాడికి వచ్చిన వాణ్ణి, రాజుగా కంటే సైన్యాధిపతిగా చూసి మెచ్చాలంటేనూ ఏమనగలం? రేపెప్పడో బిన్ లాడెన్ ది గ్రేట్ అన్నా అనగలరు. “ఎంత సామర్ధ్యం, ఎంత వ్యూహరచనాపటిమ, ఎంత ఆర్గనైజింగ్ కెపాసిటి లేకపోతే 11/9 దాడుల్లాంటివి జరిపించగలడు? తరువాత దేశాల చరిత్రలే మారిపోయాయి” అంటే – దీనికి జవాబు ఏముంటుంది?

ఎందుకంటే ఒక విషయాన్ని ఆయా వ్యక్తులు దర్శించే తీరు వారి మనో దృక్పధాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి ఉంటుంది. కాబట్టే ఇందరు ఈ జగత్తుని ఇన్నిరకాలుగా దర్శించగలుగుతున్నారు. ఎటోచ్చీ నిజాన్ని దర్శించగలిగితే ఎంతోకొంత సార్ధకత పొందినట్లవుతుంది.

ఒక్కటి మాత్రం నిజం – జరిగిపోయిన చరిత్రనే కాదు, నడుస్తున్న చరిత్రని చూసినా – ముస్లింలకు ప్రపంచవ్యాప్తంగా గారాబం నడుస్తోన్న మాట వాస్తవం. దాన్నే మొన్న నవంబరు 26, 2008 న ముంబై మీద పాక్ తీవ్రవాదులు దాడికి తెగబడ్డా, ’ఇస్లామా బాద్ కి ఎంతో బలం’ ఉండబట్టీ, దానికి ప్రపంచవ్యాప్తంగా గారాబం నడవబట్టే, ఢిల్లీలోని యూ.పి.ఏ. ప్రభుత్వం గమ్మున కూర్చుంది. మనం మౌనంగా చూడాల్సి వస్తోంది. బిన్ లాడెన్ పాక్ లోనే ఆశ్రయం పొందాడని తెలిసినా అమెరికా సైతం చూస్తూ పాక్ ని బుజ్జగిస్తూనే ఉంది. ఇంతకంటే కుట్రకు నిరూపణలు అవసరమా?

ఈ కుట్రని ఎత్తి చూపడమే నా ప్రయత్నం. గడిచిన చరిత్రలో నుండే కాదు, వర్తమానం నుండి కూడా.

అందుకే చరిత్రని నేను లోతుగా స్పృశించడం లేదు. లోతుగా చర్చించేందుకు కూడా, మనకి తెలిసిన చరిత్ర, మనం చదివిన చరిత్ర నిజమనేందుకు అవకాశమూ లేదు. అంతేకాదు లోతుగా చర్చించినా కూడా కుట్ర జరిగిందన్న విషయం నిజమేకదా. అక్బరు చరిత్ర తరచి చూసినా అంతే, అలెగ్జాండరు చరిత్ర తరచి చూసినా అంతే. ఎక్కడో పాశ్చాత్యమీడియా అశోకా ది గ్రేట్ అనటం విషయం కాదు, ఇండియాలోని మీడియా అశోకుణ్ణి మామూలుగానూ, అలెగ్జాండర్ ని ది గ్రేట్ గానూ ప్రచారించడం – విషయమే కదా! అది కుట్రకాదా? ఏ చరిత్ర, ఏ ప్రచారం సామాన్యుడికి చేరిందో, అందులో నుండే నకిలీ కణికుడు, అతడి వంశీయుల తరతరాల కుట్రని చెప్పడానికి వ్రాస్తున్నాను. దాన్ని నిరూపించి మరీ వ్రాస్తున్నాను. పూర్తిగా అనువదించి ప్రచురించే వరకూ ఓపిక పట్టవలసిందిగా నా బ్లాగు మిత్రులని కోరుతున్నాను.

నా టపాలకు అవసరమైన చోట వివరణలూ, సవరణలూ ఇచ్చి ప్రోత్సహిస్తున్న నా బ్లాగ్ మిత్రులకి మనస్పూర్తిగా కృతఙ్ఞతలు చెబుతున్నాను. అలాగే విమర్శలు వ్రాసిన వారికి కూడా! అప్పడే కదా చర్చ అర్ధవంతమై, మనం మరింతగా నిజాన్ని వెలికి తీయగలిగే అవకాశం, అర్ధం చేసుకొనే అవకాశం కలుగుతాయి.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

అనైతికత, అమానుష ప్రవర్తన, స్త్రీలను లైంగికంగా, శ్రామికంగా దోచుకోవడానికి అర్ధ అంగ అధికార బలాలను ఉపయోగించటం, స్త్రీలని అవమానించటం, ముఖ్యంగా హిందువుల్ని హీన పరచటం – ఈ స్థితి జౌరంగ జేబు పరిపాలనా కాలంలో పరాకాష్ఠలో ఉండింది.

జౌరంగ జేబు ముత్తాత అక్బరు. ఈయనకి చదవటం వ్రాయటం రాదని అంటారు. Literacy, knowledge వేర్వేరు అనడానికి సజీవ తార్కాణమా అన్నట్లు అక్బరు అక్షరాస్యుడు కాకపోవచ్చు గాని నిశ్చయంగా మాత్రం ఙ్ఞానం కలవాడు. రాజకీయ అవసరమో, మానసిక పరిపక్వతో – కారణం ఏదైనా సరే అక్బరు హిందువులని ముస్లింలాగే గౌరవించాడు, ఆదరించాడు. అతడు సత్యం ఎక్కడున్నా స్వీకరించాడన్నదే చరిత్రకారులిచ్చిన సమాచారం. ఆయన ప్రతిపాదించిన మతం దీన్ – ఇ – ఇల్లాహి లోనూ ఇదే విషయ చర్చ ఉందనీ, అక్బరు హిందూ మంత్రులని ఆదరించాడని, [బీర్బల్ ఓ ఉదాహరణ, బీర్బల్ అసలు పేరు వీరబలుడు అని అంటారు], హిందూ స్త్రీని వివాహం చేసుకున్నాడని అంటారు. వీటిలో కొన్ని చారిత్రక అంశాల మీద ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. అలాంటివే మొన్న ’జోధా అక్బర్’ సినిమా నేపధ్యంలో బయటకొచ్చాయి.

ఏది ఏమైనా అక్బరు ఉత్తర భారతదేశాన్ని ఏలిన రాజుగా చరిత్రలోనే గాక ప్రజల హృదయాల్లోనూ ఉన్నాడన్నది అబాల గోపాలం చెప్పుకునే కథలే చెబుతున్నాయి. ఈ విజయాన్ని అక్బరు హృదయ వైశాల్యం సాధించింది. అదే జౌరంగజేబు పరమత సహనం లేని ఇరుకూ, కుపిత మనస్కడు కావటం చేత ఢిల్లీ నేలిన చివరి మొగలాయి అయినాడు. అతడి తర్వాత అతడి కుమారుడు రాజ్యాని కొచ్చినా, వారి సామ్రాజ్యము బలహీన పడింది; క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ, తదుపరి బ్రిటీషు ప్రభుత్వం యొక్క అధీనంలోకి వెళ్ళిపోయింది.

జౌరంగజేబు, అతడి మద్దతుదారులు హిందూవుల మీద చేసిన అకృత్యాలు నిజాం నవాబు, అతడి మద్దతుదారులైన రజాకర్లు తెలంగాణా ప్రజల మీద చేసిన అకృత్యాలకు ఏమాత్రమూ తీసిపోవు. ఇది మనకు ఛత్రపతి శివాజీ చరిత్ర ద్వారా మరింత స్పష్టంగా కనబడుతుంది.

మరాఠా పోరాట యోధుడు శివాజీ. భారతదేశంలో ఆనాటికి నాశనమైన సంస్కృతిని పునఃస్థాపించటానికి మహారాష్ట్రలో బలమైన సామ్రాజ్యస్థాపన చేశాడు. శివాజీ జీవితచరిత్ర నిజంగా ప్రతి ఒక్క భారతీయుడికీ స్ఫూర్తిన్ని ప్రసాదించగలిగి నట్టిది. ఒక్కసారి మళ్ళీ ఓపికా, తీరికా చేసికొని ఆయన జీవితాన్ని చదివితే అది మనలో ఎన్నో ఆలోచనల్ని రేకేత్తించి, మన రక్తాన్ని రగిలించగలదన్న విషయంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. శివాజీ తండ్రి ముస్లిం రాజుల కొలువులో పనిచేస్తున్నా, శివాజీ తల్లి జిజియా బాయి మాత్రం తన కుమారుణ్ణి భారత రామాయణాలు చెప్పి, హిందూ సంస్కృతి, హిందూ ధర్మాలని రంగరించి పోసి యోధుడిగా పెంచింది. ఆ విధంగా పిల్లలు పెంపకంలో తల్లి పాత్ర ఎంత ప్రభావశీలమో ఆ తల్లి మన కళ్ళముందు ఆవిష్కరించింది.

బాల్యంలోనే, తల్లి తన మేధస్సులో నాటిన మానవీయ విలువలు, కర్మానుష్ఠానం, ధర్మానుష్ఠానం అనే బీజాలు, శివాజీ తన జీవితాన్ని సమాజంలో భ్రష్టమైన నీతిని తిరిగి బ్రతికించడానికి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అంకితం చేసేలా పురికొల్పాయి. ఆ విత్తనాల ఫలితమే ఈ మహా వృక్షం.

ఇక్కడ కుట్రలో ఒక భాగాన్ని మీకు చెప్పాలి. చికాగో మతసభల ఉపన్యాసాలలో వివేకానందుడు అక్కడి వారిని ఉద్దేశించి చెబుతూ “భారతదేశంలో పొలం దున్నుకుంటున్న ఓ రైతు దగ్గరకెళ్ళి ‘నీ దేశప్రభుత్వం గురించి చెప్పూ’ అంటే ఏమీ చెప్పలేడు. కాని ‘నీ మతం గురించి చెప్పు’ అంటే అతడు మిమ్మల్ని చెట్టు నీడలో కూర్చోబెట్టి, చల్లనీ నీళ్ళిచ్చి, అనర్గళంగా చెబుతాడు. అది నా దేశపు గొప్పదనం” అన్నాడు. కానీ 100+ సంవత్సరాల తరువాత చూస్తే చదువు విషయంలో సాధించిన అభివృద్ది కంటే ‘తత్త్వచింతన, మతం’ విషయంలో సాధికారత పూర్తిగా పోగొట్టుకున్నాము. వితండవాదన, పబ్ సంస్కృతి, డేటింగ్ సంస్కృతి, ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిని అభివృద్ది మంత్రంగా పాటించేటట్లు కుట్రదారులు భారతీయుల్లో చాలామందిని నడిపారు.

మనం ముందే చెప్పుకున్నట్లుగా భారతదేశంలోకి ముస్లిం లు ప్రవేశించినప్పుడే రాజకీయాల్లో, ప్రవర్తనలో కుట్రాకుతంత్రాలనీ ప్రవేశపెట్టారు. భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఈ కుతంత్రాలతోనే స్థాపించారు. ఆ కాలానికి హిందూమతం, బౌద్ధమతం కూడా కొందరు పెద్దల, మరి కొందరు మూర్ఖుల అహంకారం, స్వార్ధాల కారణంగా బలహీన స్థితిలో ఉన్నాయి. దానితో ఇస్లాం మతం ‘పాలకుల మతం’ అయ్యేటప్పటికి చాలామంది ప్రజలు రాజుల్ని, రాజోద్యోగుల్ని సంప్రీతుల్ని చేసుకోవటం కోసం, వారి నుండి ప్రయోజనాలు పొందటం కోసం ’ఇస్లాం’ మతంలోకి మారారు. [అంటే ఎ.ఆర్. రహమాన్ లాగా, భజన్ లాల్ కుమారుడి లాగా అన్నమాట] అప్పటికే అవధులు దాటిన వర్ణాహంకారమూ, ’ఇస్లాం’లోని సమానత్వ ప్రచారము కూడా మత మార్పిడి పట్ల ప్రజల్ని ఆకర్శితుల్ని చేసింది.

’యధారాజా తధాప్రజ’ అని పెద్దలంటారు.

భగవద్గీతలోనూ

“యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః
స యత్ర్పమాణం కురుతే లోక స్త దనువర్తతే”


భావం – లోకంలో ఉత్తములైన వారు దేనిని అనుసరిస్తారో జనులందరు దానినే అనుసరిస్తారు. ఉత్తములైన వారు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో ప్రజలందరు దానినే అనుసరిస్తారు.

ఇలా మతం మారిన వారికీ, మారని వారికీ కూడా ముస్లిం రాజులే నాయకులు లేదా శ్రేష్ఠులు. కాబట్టి ఆయా ముస్లిం రాజుల్లోనూ, వారి బంధుగణంలోనూ ఉన్న అవధుల్లేని అధికారం, సుఖాభిలాష [సుఖం పట్ల వెంపర్లాట], అంటే బలహీనుడిపై అధికారం చలాయించటం, మద్యమాంసాది విలాసవంతమైన ఆహార విహారాలు, శృంగారం సమాజాన్ని ప్రభావితం చేసింది.[ ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తునే ఉన్నారు] మతం మారినప్పుడు నమ్మకాలు మారతాయి, సడలతాయి. కొన్ని వెసులుబాట్లు కూడా వస్తాయి. [ఒకరికి నలుగుర్ని వివాహం చేసుకోవటం చట్టబద్దత అయినట్లు, మూడక్షరాల మాటని మూడు సార్లంటే చాలు, భార్యకి ఉద్వాసన చెప్పగలిగినట్లూ, 16 ఏళ్ళు పెంచి పిల్లల్ని తండ్రికి అప్పగించాలంటే సరి, స్త్రీ తన చావు ఛస్తుంది, ఈ విధంగా స్త్రీని శారీరకంగా, మానసికంగా వాడుకోగలిగినట్లు] అంతేకాదు పాపపుణ్యాలు, రౌరవాది నరకాలు, వైతరణీ దండనలు, భాగవతాలు చెప్పే నరక శిక్షలూ, మనం చేసిన పాపం మన పిల్లల్ని తరతరాలని కట్టికుడుపుతుంది, చేసుకున్న పుణ్యం రేపు మన పిల్లలకి అక్కర కొస్తుంది, చేసికున్న మంచీ చెడులే వెంటవస్తాయి – ఇలాంటి నమ్మకాల మీద ఆధారపడిన కట్టడి సడలిపోయింది. ఏంచేసినా ఫర్వాలేదు, సాక్ష్యం ఉండకపోతే సరి, న్యాయస్థానం ఏం చేయలేదు – ఇలాంటి నమ్మకాలు సుఖాభిలాషని మరింత పెంచాయి.

కుట్రలో ఇక్కడ ఇంకొక కోణం చెప్తాను. స్వాతంత్రం తరువాత కూడా కుట్రదారులు నిదానంగా, వ్యవస్థీకృతంగా మంచి చేసేవారికి అన్యాయం జరిగేటట్లు చేస్తూ, చెడు చేసేవారికి అన్ని కలిసివచ్చేటట్లు చూస్తూ ప్రతీ ఒక్కరు “న్యాయం ఎక్కడ ఉంది, అంతా అన్యాయానికే నడుస్తున్న రోజులు” అనేటట్లు మొదలుపెట్టించి, చివరికి మనం కూడా మనకి అందుబాటులో అన్యాయం చేస్తేనే బ్రతకగలం అనే పరిస్థితి కల్పిస్తూ, దానికి ’లౌక్యం’ అనే పాజిటివ్ కాప్షన్ పెట్టారు. ఆ విధంగానే సమాజాన్ని ఈ స్థితికి దిగజార్చారు.

ఈ అవధుల్లేని సుఖాభిలాష, పనిచేసే తత్త్వాన్ని తగ్గించింది. స్త్రీలనీ, సంపదనీ తమ కంటే బలహీనుల నుండి బలంతోనూ అధికారంతోనూ గుంజుకునే మనస్తత్త్వం పెరిగింది. ఏం చేసినా రాజు, రాజోద్యోగుల దయ మన మీద ఉంటే చాలు. అందుకోసం మనం గుంజుకున్న సంపదలలో, స్త్రీల లోనూ కొంత రాజుకూ, రాజోద్యోగులకూ సమర్పించుకుంటే చాలు, భద్రత వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ముస్లిం రాజులకి గుడిగోపురాల కట్టేపని లేదు. దైవం పట్ల భయం భక్తీ కలిగించే ఏ కార్యక్రమాలు చేపట్టే పని లేదు, దాన ధర్మాలూ లేవు. ’తమ ప్రియురాళ్ళకీ తమకీ భవంతులూ, సమాధులూ కట్టించుకోవటంతో వాళ్ళు చాలా బిజీ. తాము చచ్చాకా కూడా తమ సమాధులు చిరస్థాయిగా మిగిలిపోవాలనుకొనే పదార్ధవాదులకీ, ’చచ్చాక ఎంతటి రాజు దేహమైనా పిడికెడు బూడిదే – మిగిలేది ఏదీ లేదు, చేసుకొన్న మంచితప్ప’ అనుకొనే భావవాదం అర్థం కావటం – అసంభవం కదా! [ఇక్కడనేను భారతీయ ముస్లింల్లోనూ, క్త్రెస్తవుల్లోనూ మరణానంతరం తమ బంధువుల పార్ధివ శరీరాన్ని ఖననం చేసే ఆచారాన్ని విమర్శించడం లేదు. మరణించిన మన వారికి మనం అర్పించే ఈ నివాళిని నేను గౌరవిస్తాను. అయితే 6x3 అడుగుల సమాధిపైన ఎంతో సొమ్ము[ప్రజల సొమ్ము] పెట్టి కట్టిన హూమాయూన్ టూంబులకీ, ప్రఖ్యాత తాజ్ మహళ్ళకీ [ఆగ్రా, జౌరంగబాద్ లోనివి] వెనుక ఉన్న పదార్ధవాద మూలాల్ని చూపటమే నా ఉద్దేశం.]

అలాంటి సమాజంలో సంపదకీ, స్త్రీలకి రక్షణ ఎక్కడ? ఒక్కసారి ఊహించండి – మనకి ఓ చిన్న కుమార్తె ఉందనుకొండి. ఇక ప్రశాంతంగా నిద్రపోవడం కరువే. ఇక ఆమె యుక్త వయస్సుకి వస్తే? ఓ రోజు ఓ బలమైన వాడో, వస్తాదు లాంటి వాడో వచ్చి అమాంతం మనల్నీ ఓ తోపు తోసి, అప్పటికీ అడ్డం వస్తే కత్తితోనో, బాకుతోనో పొడిచి మరీ, మన బిడ్డని లాక్కుపోతాడు. ఇక ఆ పిల్లని రాజుకో, రాజోద్యోగికో ఆమె శరీరాన్ని, సేవల్ని వాడుకొనేందుకు బహుమతిగా బహు శ్రద్దావినయాలతో సమర్పిస్తాడు. ప్రతిఫలంగా ఓ ఉద్యోగాన్ని లేదా మరో ప్రయోజనమో పొందుతాడు. తాను ఉద్యోగి అయితే తర్వాత ఎటూ తనకి బహుమతులు తెచ్చేందుకు మరికొందరు వస్తాదులు తయారౌతారు కదా! ఇలాంటి స్థితిలో ఓ సామాన్యుడు ఎలా తన జీవితాన్ని, ప్రాణాల్ని, తమ ఆడవారి గౌరవాన్ని కాపాడుకోగలడు? మనిషి మాన ప్రాణాలకి లేని రక్షణ సంపదకో, విలువైన లోహాలకో ఎలా ఉంటుంది? ఈ స్థితి నిజాం పాలనలో తెలంగాణా ప్రజల గుండెల్లో ఇంకా పచ్చిగా ఉన్న గాయమే. [కొంతమంది వాదించవచ్చు ‘అప్పడంటే ప్రజస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజస్వామ్యం పటిష్ఠస్థితిలో ఉంది, కాబట్టి అలాంటి సంఘటనలు జరగవు’ అని. కాని బీహార్ లోనో, యు.పి.లోనో ఈ పరిస్థితి ఇప్పటికే ఉంది. ఒక ఐ.ఏ.యస్. అధికారి భార్య మార్కెట్ కు వెళ్ళినప్పుడు అక్కడి మాఫియా డాన్ కమ్ రాజకీయ నాయకుడు ఆమె నచ్చి, ఆమెను బలవంతగా ఎత్తుకెళ్ళిపోయాడు. పాపం ఆ ఐ.ఏ.యస్. అధికారికి మాత్రం న్యాయం జరగలేదు. తరువాత ఏం జరిగింది మీడియా ప్రచారించలేదు. మరి ప్రజస్వామ్యంలో ఏంన్యాయం జరుగుతున్నట్లు? ]

ఇలాంటి స్థితిలో, పరిపాలనా ఉండదు, పాలనా యత్రాంగమూ ఉండదు. ముస్లిం రాజులు, రాజు బంధువులు, రాజోద్యోగులూ, వారి మద్ధతుదారులూ, మరికొందరు ధనబలవంతులూ, ఏదైనా చేయగలిగే వారు. ఏది చేయాలనుకొంటే అది. దైవ భయం లేనప్పుడు చట్టం తమ చుట్టం అనుకొన్నప్పుడు ఇది సంభవమే కదా! ఇక ప్రజాజీవితంలో భద్రతా లేదు, శాంతీ లేదు.
జౌరంగజేబు హయాంలో మహారాష్ట్రాతో పాటు చాలా ప్రదేశాల్లో ఉన్న స్థితి ఇదే. ఇలాంటి నేపధ్యంలోంచే శివాజీ మానవత్వాన్ని, విలువల్నీ నిలబెట్టటానికి తలెత్తాడు.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

ఇలా అప్పటికే భారతీయ సమాజంలో, ముఖ్యంగా హిందువుల్లో తక్కువ కులాలు గానూ, వర్గాలుగానూ ముద్రపడిన ప్రజల్లో పేరుకు పోయిన స్వంత మతం పట్ల నిరాసక్తతనీ, అసంతృప్తినీ మహమ్మదీయ రాజులు [బానిసవంశమైనా, ఖల్జీలైనా, లోడీలైనా, మొగలులైనా ........ ఏ వంశమైనా మహమ్మదీయులందరూ] బాగా ఉపయోగించుకున్నారు.


ఇస్లాం మతంలోనూ తెగలూ, వైరుధ్యాలూ ఉన్నా గూడా వాటికి ప్రచారం లేక పోయింది. ఇస్లాం లోని ’సమానత్వం’, అంటరాని తనం లాంటి దురాచారాలు లేనితనం, వారిని ఇస్లాం వైపు ఆకర్షించింది. [నిజానికి ‘గుణాన్ని బట్టిగాక జన్మని బట్టి వర్గీకరణ’ చాతుర్వర్ణ వ్యవస్థ అసలు అర్ధంకాదు. అది మధ్యలో చేరిన దురాచారం. పైగా దీన్ని భగవద్గీతకి అంటుగట్టడం కూడా చదివాను. ఈ విషయమైన విపులమైన చర్చ నా ఆంగ్ల బ్లాగు Coups On Worldలోని Application Of Bhagavad Geetha and Coup on its Application లో చేశాను.]

ఏమైతేనేం, క్రమంగా ఇస్లాం మతం భారతదేశంలో విస్తరించడం ప్రారంభించింది.

ఇక్కడో విషయం గమనించాలి – హిందూ మతం, క్రైస్తవం, ఇస్లాం ఏదైనా మతమే. ఏదైనా మంచే చెబుతుంది. చెప్పాలి. ఏ పేరుతో పిలిచినా దైవం ఒక్కడే కావాలి. ఎందుకంటే ఏ భాషలో చెప్పినా సత్యం సత్యమే కాబట్టి. హిందూ మతం మీద నకిలీ కణికుడు కుట్రని నేను మరోసారి చర్చిస్తాను.[ ఆంగ్లంలో అయితే Coups On World లోని Coup on Hindu Religion and Other Religions లో చూడగలరు.]

ఇక్కడ రాజకీయ రంగమ్మీద కుట్రని వివరించాలన్నదే నా ప్రయత్నం.

ఎప్పుడైతే ముస్లింలు భారత దేశమ్మీద దాడులు ప్రారంభించారో అప్పటి నుండే వాళ్ళు తమ మతాన్నే గాక, తమ కుట్ర కుతంత్రాల మనస్తత్త్వాన్ని కూడా భారతదేశంలోనికి తీసుకొచ్చారు. ప్రాచుర్యంలోకీ తెచ్చారు.


ఘోరీ మహమ్మదు లాంటి వారు దీనికి సజీవ తార్కాణాలు. ఇతడి దండయాత్రలు సమయానికి ఉత్తర భారతదేశాన్ని, ముఖ్యంగా పశ్చిమోత్తర భాగాన్ని రాజపుత్రరాజులు పరిపాలిస్తుండే వాళ్ళు.

వారిలో రాజా జయచంద్రుడు ఒకడు. ఇతడి కుమార్తె యువరాణి సంయుక్త. అందమైన అమ్మాయి. చౌహాన్ వంశీయుడు, ఢిల్లీ రాజధానిగా గల రాజ్యాపాలకుడూ అయిన పృధ్విరాజుని ప్రేమించింది. ఇది జయచంద్రుడికి ఇష్టం లేదు. జయచంద్రుడు తన కుమార్తెకు స్యయం వరం ప్రకటించాడు. అందర్నీ ఆహ్వానించాడు గానీ పొరుగు వాడైనా పృధ్వీరాజుని ఆహ్వానించలేదు, సరి కదా పృధ్వీరాజును పోలిన విగ్రహాన్ని ద్వారపాలకుడి రూపంలో పెట్టించాడు.

స్వయంవరం మంటపంలోకి ప్రవేశించే ప్రతీరాజు, యువరాజు ఆ విగ్రహాన్ని చూసి నవ్వసాగారు. అప్పటికే పృధ్వీరాజు మీద ఆసూయా, క్రోధం గల జయచంద్రుడదంతా చూసి ఆనందిస్తున్నాడు.

వరమాలతో స్వయంవర మండపంలోకి ప్రవేశించిన యువరాణి సంయుక్త చుట్టూ పరిశీలించింది, పరిస్థితి అర్ధమైంది. ఆమె సూటిగా ద్వారం వైపు నడిచింది. చేతి లోని వరమాల ద్వారపాలకుడు రూపంలో ఉన్న పృధ్వీరాజు విగ్రహం మెడలో వేసింది. ఈ సారి రాజులంతా జయచంద్రుణ్ణి చూసి నవ్వసాగారు.

ఇదంతా తన వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పృధ్వీరాజు ఆ సమయానికల్లా అక్కడికి చేరాడు. తనను వరించిన సంయుక్తని తీసికెళ్ళి పోయాడు. పర్వవసానంగా జరిగిన యుద్ధాల్లో జయచంద్రుడు చిత్తుగా ఓడిపోయాడు.

ఈ ‘ఫ్రస్టేషన్’లోనూ, క్షణికమైన భావోద్రేకాలతోనూ జయచంద్రుడు ఘోరీ మహమ్మదుకి పృధ్వీరాజును ఓడించేందుకు సాయం చేశాడు. బయటి నుండి వచ్చిన ఘోరీ మహమ్మద్ కు స్థానిక వాతావరణాన్ని, పరిస్థితుల్నీ, భౌగోళిక స్థితుల్నీ అర్ధం చేసుకొనేందుకు కావలసిన సమాచారాన్ని, విశ్లేషణనీ అందించాడు. పృధ్వీరాజుని జయించాక ఘోరీ మహమ్మదు జయచంద్రుడి రాజ్యాధికారాన్ని కూడా నాశనం చేశాడు. ఆ సందర్భంలో అతడి వాదన “జయచంద్రా! పృధ్వీరాజుని జయించేందుకు నువ్వు నాకు సహాయం చేశావు. ఇందుకు నేను నీకు కృతఙ్ఞతలు చెప్పాలి. కానీ నీ స్వంత కుమార్తెకీ, అల్లుడికీ హాని చేసేందుకు సిద్ధపడిన ప్రమాదకారివి నీవు. నిన్ను నమ్మకూడదు” అని.

నిజానికి ఈ శిక్ష జయచంద్రునికి తగినదే అగు గాక. కానీ ఘోరీ మహమ్మదు స్ట్రాటజీ మాత్రం అవినీతి పూరితం, అవకాశవాదం, మరియు కుతంత్రం. పృధ్వీరాజుని ఓడించక ముందు నుండే అతడికి జయచంద్రుడూ పృధ్వీరాజుల మధ్య బంధుత్వం తెలుసు కదా! మరి అప్పుడెందుకు నమ్మినట్లు?

ఇదీ ఆ మహమ్మదీయ రాజుల కుతంత్రపు రక్తం.

ఇక 13వ శతాబ్ధంలో మరొక మహ్మదీయుడు అల్లా ఉద్దీన్ ఖీల్జీ భారతదేశంలోని, రాజ పుత్ర రాజ్యం చిత్తోడ్ ఘడ్ మీదకి దండయాత్ర చేశాడు. అప్పటికి చిత్తోడ్ ఘడ్ రాజు రాణా రత్నసింహుడు. ఆయన భార్య రాణి పద్మిని. ఆమె అద్భుత సౌందర్యవతిగానూ, విదుషీమణిగానూ, పేరుగాంచింది. ఆమెను కాంక్షించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ ఘడ్ పై అనేక సార్లు దండయాత్ర చేశాడు. కానీ గెలవలేకపోయాడు.

చివరికి ఒక రాయబారి ద్వారా రాణా రత్నసింహుడికి ఒక వర్తమానం పంపించాడు. “రాణి పద్మిని సౌందర్యం గురించి నేను చాలా విని ఉన్నాను. ఆ ప్రఖ్యాతి లోని నిజం తెలుసుకోవాలని, ఒక్కసారి ఆమెను చూడాలని కోరుకున్నాను. ఒక్కసారి ఆమెని చూడగలిగితే, నేను యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళిపోతాను” అన్నది ఆ వర్తమాన సారాంశం.

రాజు రాణా రత్నసింహుడు, మంత్రులూ ఆలోచించారు. రాణి పద్మినితో చర్చించారు. చివరికి వారంతా “అల్లా ఉద్ధీన్ ఖిల్జీని మన రాజ్యానికి ఒక స్నేహితుడిగా భావించి విందుకు ఆహ్వానిద్దాం. మన సౌహార్ర్ధాన్ని, స్నేహాన్ని మనం చూపిద్దాం. ఏవిధంగా చూసినా యుద్ధం కంటే శాంతి గొప్పది కదా! రాణి పట్ల అతని దృష్టి నీచమైనది కాదని అతడి వర్తమానం చెబుతోంది. ప్రఖ్యాతి గాంచిన విషయం పట్ల గల కుతుహలమే నంటున్నాడు కాబట్టి రాణి ప్రతిబింబాన్ని అతడికి అద్దంలో చూపుదాం. మన రాణి గారికి సోదర తుల్యుడుగా అతణ్ణి గౌరవిద్దాం” అని తీర్మానించారు.

ఆ విధంగానే అతడికి కబురుపంపారు. అతడీ ఆహ్వానాన్ని అందుకుంటూ తనను తాను రాణీ పద్మినికి సోదర తుల్యుడిగానూ, రాజూకూ, చిత్తోడిఘడ్ ప్రజలకూ మిత్రుడిగానూ ప్రకటించుకున్నాడు. విందు రోజున రాజు రాణారత్నసింహుడు, మంత్రులూ, చిత్తోడ్ ఘడ్ ప్రజలూ అల్లా ఉద్దీన్ ఖీల్జీని విశిష్ట అతిధిగా గౌరవించారు. విందు తర్వాత రాణీ పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో అతిధికి చూపారు. ఆ సౌందర్యం చూచి అతడు అబ్బురపడ్డాడు. తన నైచ్యాన్ని పైకి ప్రదర్శించలేదు. తన అతిధి నటనను కొనసాగిస్తూ రాణా రత్నసింహుని ప్రతి విందుకు ఆహ్వానించాడు. రాజు ఇది అంగీకరించాడు.

తదుపరి రత్నసింహుడు కొద్దిపాటి పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి విందుకు వెళ్ళాడు. అతిధి మర్యాదని ఊహించారే గానీ కుట్ర అనుకోలేదు. ఎందుకంటే నమ్మకద్రోహం అంతగా భారతీయులకి తెలీదు. అతిధి మర్యాదులకు బదులుగా రత్నసింహుడు దగాని అందుకున్నాడు. రాజును బంధించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మినికి తనకు లొంగిపోవలసిందిగా కబురు పంపించాడు.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ రత్నసింహుణ్ణి ’అతిధి’ అంటూ ఆహ్వానించాడు. మానవీయ విలువల్ని నమ్మి, రాణా రత్నసింహుడు పరిమిత పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి వచ్చాడు. కాబట్టే అతడు రత్నసింహుని బంధించగలిగాడు. ఇది కుట్రే కదా! ఇదే పని అల్లా ఉద్దీన్ ఖిల్జీ అతిధిగా చిత్తోడ్ ఘడ్ కు వచ్చినప్పుడు [అప్పుడతనిదీ పరిమిత పరివారమే] రత్నసింహుడు చేసి ఉంటే? అతిధిని ఆదరించాలి, నమ్మించి మోసగించ కూడదు లాంటి నీతుల్ని తలచకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీని బంధించిన, చంపేసినా ఏం చేయగలిగి ఉండేవాడు? కేవలం మానవతా విలువల్నీ, సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లాంటి నీతి, ధర్మం పాటించారు గనుక భారతీయ రాజులు అలాంటి కుట్రలు చేయలేదు. నేటికీ పాకిస్తాన్ మన పట్ల అదే విధమైన మోసాలు చేస్తూనే ఉంది.

ఆ విధంగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ చేతిలో మోసానికి గురయ్యాక, రాణి పద్మిని, మంత్రులు కలిసి బాగా ఆలోచించి అల్లాఉద్దీన్ ఖిల్జీకి మరునాడు రాణి పద్మిని అతడికి లొంగిపోగలదని కబురు పంపారు.

మరునాడు పల్లకీల ’కాన్వాయ్’ అల్లాఉద్దీన్ ’కాంపైన్’ చేరింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆనందానికి అంతులేదు. ప్రఖ్యాతి గాంచిన అపురూప సౌందర్యవతి తన సొత్తు కాబోతోంది. తానామెను అందుకోబోతున్నాడు. ఆ పరవశంతో అతడు రాణీ గారి పల్లకీకి ఎదురు వెళ్ళి స్వాగతించాడు. అయితే అతడు స్వాగతించింది పరిచారికుల వేషంలో ఉన్న సైనికులకి. రాణి పద్మిని పల్లకీలో సైతం స్త్రీ వేషంలో ఉన్న యోధుడున్నాడు. ’మోసం’ అంటూ గావు కేకలు పెట్టిన అల్లాఉద్దీన్ ఖిల్జీ అనివార్యమైన యుద్దాన్ని ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడిన రాజ పుత్ర వీరులు రాణా రత్నసింహుని విడిపించుకొని పోయారు. దీనితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ క్రుద్ద్రుడయ్యాడు. సహజమే కదా! తాను ఎదుటి వాళ్ళను మోసగించగలిగినప్పుడు అది తన తెలివీ లేదా సామర్ధ్యం అనుకొని సంతోషాన్ని గర్వాన్ని పొందినప్పుడు, తాను ఇతరుల చేతిలో మోసపోతే అసహనానికి క్రోధానికి గురవుతారు కదా!

తర్వాతి ప్రయత్నంలో అల్లా ఉద్దీన్ ఖీల్జీ మరింత సైన్య సమీకరణ చేసుకొని మరీ, చిత్తోడ్ ఘడ్ మీదికి దండయాత్ర చేశాడు. కోటని వశపరుచు కొన్నాడు. రాణా రత్నసింహుణ్ణి, ఇతర యోధుల్ని చంపేసాడు. కానీ ఎంతో కాంక్షతో అంతఃపురాల్లోకి ప్రవేశించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి కనబడింది అందాల రాశులు కాదు, బూడిద రాశులు. రాణి పద్మినితో సహా రాణివాసపు స్త్రీలందరూ శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల మీదా కూడా నిరోధించటానికి, వారి రాకకు ముందే అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకొన్నారు. ఆవిధంగా నైతికత కాపాడు కోవటానికీ తమ జీవితాల్ని తృణప్రాయంగా, [ గరిక పోచల్ని వదిలినంత తేలికగా] వదిలివేశారు. అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు. అత్యాచారాల్లాంటి నైచ్యాన్ని భరించటం కంటే మరణం మేలన్నది వారి వివేచన. అలాంటి నైచ్యాన్ని నివారించటానికి వారు ఇతరుల్ని హత్య చేయాటానికైనా వెనుదీయరు, ఆత్మహత్య చేసుకోవాటానికైనా వెనుదీయరు. భారతీయ రక్తంలోనే అంతటి పౌరుషం నైతికత, సత్యం విషయంలో ఉంది. [ ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెంతగా విషప్రయోగాలు చేసినా, తిరిగి తిరిగి ఇది చిగురిస్తూనే ఉంటుంది.] ఇదే నైతికతని సీతాదేవి లంకలో రావణుని చెరలో చూపింది. అందుకే ఆమెని భారతీయులు సీతమ్మతల్లిగా కొలుస్తారు. అంతేగాని సీతాదేవి అందమైనది అయినందుకో, రాణి అయినందుకో కాదు.

ఇలాంటి భారత గడ్డపైకి ఎప్పుడైతే మహమ్మదీయులు, [ముస్లింలు] ప్రవేశించారో అప్పుడే తమతోపాటుగా రాజకీయల్లోనూ, మానవ సంబంధాల్లోనూ కుట్రలూ తెచ్చారు. ఇది చరిత్ర! ఎవ్వరూ, చివరికి మీడియా కూడా మార్చలేని చరిత్ర! మీడియా చరిత్రని రంగుమార్చి చెప్పగలదేమో, దాచి పెట్టగలదేమో గానీ చరిత్రని మాత్రం మార్చలేదు. [కాలం మానవాతీతమైనది గదా. జరిగిపోయిన కాలాన్ని గానీ, ఘటనల్ని గానీ మార్చడం ఎవరి తరం?]

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu