లేకపోతే… ఆర్ధికవేత్త, మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నట్లు – “అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితికి లేమన్ బ్రదర్స్ సంస్థ విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడటమే కారణమన్నారు. ఆర్ధికసంస్థలను ఆదుపులో ఉంచాల్సిన నియంత్రణ వ్యవస్థలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా మార్కెట్ వాస్తవ పరిస్థితిని సరైన అంచనా వేయకుండా రేటింగ్ ఏజన్సీలు ఇచ్ఛానుసారం రేటింగ్ లు ఇవ్వడంతో ఒక్కసారిగా బూమ్ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.”….[పైవార్త ఈనాడు, 24/06/09 నుండి యధాతధంగా గ్రహించడమైనది]

రేటింగ్ సంస్థలు ఇచ్చిన ర్యాంకింగ్ తో, లేమాన్ బ్రదర్స్ వంటి కంపెనీలు తమ లొసుగులు కప్పిపుచ్చుకుంటూ కొంతకాలం మనగలిగినాయి. దాంతో అవి కుప్పకూలాకా మొత్తంగా ప్రపంచమే ఆర్ధికమాంద్యంలోకి కూరుకుపోయింది. ఇది ఎలా సంభవం? ప్రపంచవ్యాప్తంగా వినియమ వస్తువులకు కలిగించిన కృత్రిమ డిమాండ్, అదేవిధంగా ఇల్లు, భూమి వంటి వాటికి సృష్టించిన కృత్రిమ ధరలు, వాటి పెరుగుదల, ‘వాస్తవాన్ని మరుగుపరుస్తూ, ప్రభావ పరుస్తూ కాగితాల మీద విపరీతంగా పెంచుకుపోయిన కంపెనీలు షేర్ల [వాటాల] ధరలూ’ ఆర్ధికమాంద్యానికి దారితీసాయన్న విశ్లేషణలు సైతం వింటున్నాం. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – కంపెనీల వాటాల ధరలని బట్టి బ్యాంకులలో వాటి క్రెడిబిలిటీ లిమిట్స్ ఉంటాయి. వాటా ధరలు పెరిగితే, కంపెనీల ఆస్థి విలువలు పెరిగినట్లు పరిగణించి, బ్యాంకులు, ఆయా కంపెనీలకి అప్పులు ఇస్తాయి. అందుకోసం కృత్రిమంగా, ’బుల్’ల సహాయసహకారాలతో, కంపెనీలు ‘తమ వాటాలని తామే అధికధరలకు కొనటం’ వంటి మోసాలకు పాల్పడుతుంటాయి. ఆ విధంగా షేర్ మార్కెట్లలో నడిచే కుంభకోణాల్లో 99.99% కంపెనీల ప్రమేయంతో నడిచేవే. అటువంటిది, ‘షేర్ మార్కెట్లలో ఫలానా కంపెనీ షేర్లు, ఫలానారోజు, అధికధర పలకడానికి, సెంటిమెంట్ లేదా పుకార్లు లేదా ఫలానా వార్త దోహదం చేసింది’ అన్న వార్తలు మనం వింటున్నాం, సంఘటనలు చూస్తున్నాం. అంటే అర్ధం ఏమిటి? పుకార్లనీ, వార్తల్ని, సెంట్ మెంట్ ని ప్రచారించగలిగింది ఎవరు, మీడియా గాక? అంటే షేర్ మార్కెట్లని నడుపుతోంది ఎవరు? మీడియానే కదా? అంటే నకిలీ కణిక వ్యవస్థలోని ప్రధాన రంగమే కదా ఇది కూడా?

‘లోభత్వానికి దాతృత్వమే పరిష్కారం’ అని పెద్దలంటారు. అంటే ఏ వస్తువు పట్లనైనా మనకి లోభత్వం అన్పిస్తే, వెంటనే దాన్ని దానం చేయాలట. అప్పుడు ఆ లోభగుణాన్ని మనం దాటగలుగుతామన్న మాట. ఇది అనుభవ సత్యం. అలాగే ప్రతీ అరిషడ్వర్గానికీ పరిష్కారాన్ని చెబుతారు మన పెద్దలు. ‘అసత్యవాదికి అవమానమే పరిష్కారం’ అంటారు. అంటే నిత్యం అబద్దాలాడే వాడిని అగౌరవించటం, హేళన చేయటం ద్వారా, లజ్జాపూరితుల్ని చేసి, వారిలో మార్పుతేవచ్చు అంటారు. అయితే ఈ వ్యూహం ఇప్పుడు ఫలించటం లేదులెండి. ఎందుకంటే వేశ్వాపుత్రుడు తొలితరం నకిలీ కణికుడైనందునా, దాసీ సంతతే నకిలీ కణికవంశంగా పరిణామం చెందినందునా, లజ్జారాహిత్యాన్నే[అంటే సిగ్గులేని తనాన్ని] ఓ గొప్ప అర్హతగా [క్యాలిఫీకేషన్ గా] ప్రచారం చేయటం ప్రస్తుత సమాజంలో ఉంది. పరిశీలించి చూడండి – మోసం చేస్తూ పట్టుబడినా, కుంభకోణంలో ఉన్న ప్రమేయం సాక్ష్యాధారాలతో సహా దొరికినా, ఏ రాజకీయ నాయకుడూ సిగ్గు పడటం లేదు. [లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుండి వందలూ, వేలల్లో ఉంది ఇలాంటి వారి సంఖ్య] మోసం చేస్తూ పట్టుబడిన వ్యాపారులూ సిగ్గుపడటం లేదు. ACB దాడుల్లో అక్రమార్జనలు వందలకోట్లు బయల్పడుతున్నా, చిన్నా చితక ఉద్యోగి దగ్గర నుండి ఉన్నతోద్యోగి వరకూ ఏ ప్రభుత్వ ఉద్యోగీ సిగ్గుపడటం లేదు. మీదుమిక్కిలి ’ఇన్ని వ్యవహారాలు నడుపుతున్నప్పుడు అప్పుడప్పుడు పట్టుబడతాం. అవన్నీ పట్టించుకోకూడదు. సిగ్గూ లజ్జా అంటే చిప్పెత్తు కోవాల్సిందే! పైకిరావాలంటే అవన్నీ ఆలోచించకోడదు’ అన్న ’సిద్దాంతం’ కూడా వింటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని సృష్టిస్తున్న, నడుపుతున్న, నకిలీ కణికవ్యవస్థకీ ’లజ్జారాహిత్యం’ అన్నది ఆది నుండీ ఉన్న లక్షణం గనుక!

ఈ సందర్భంలో మరోమాట కూడా చెప్పుకోవాలి. ‘అహంకారికి తృణీకారమే పరిష్కారం’ అంటారు పెద్దలు. అంటే అహంకారంతో విర్రవిగే వాడికి, ఏ తర్కం చెప్పినా, ఏ సత్యం చెప్పినా, చూపినా, ఏ జ్ఞానం చెప్పినా తలకెక్కదు. అసలే అహంకారం జ్ఞానం విలోమానుపాతంలో ఉంటాయయ్యె. అటువంటి వాడికి, అంటే అహంకారికి, ఏం చెప్పి ఒప్పించగలం? అంచేత అలాంటి వాళ్ళని పట్టించుకోకపోవటమే సరైన మందని పెద్దలంటారు.

అలాగే గూఢచారిని బహిర్గత పరచటమే పరిష్కారం. గూఢచారి అంటేనే గూఢంగా చరించే వాడు అని అర్ధం. రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించటం, నిగూఢంగా ప్రవర్తించటం గూఢచారి లక్షణాలు. కాబట్టి గూఢచారికి, గూఢచర్యానికి వాటిని బహిర్గతపరచటమే, expose చేయటమే సరైన మందు. కాబట్టే పీవీజీ ఇదే మార్గంగా ఎంచుకున్నారు. అదే నెం.5 వర్గం, ప్రపంచవ్యాప్తంగా, ఇన్ని సంవత్సరాలుగా అంటే 17 ఏళ్ళుగా చేస్తోంది.

ఇక్కడ గమనార్హం ఏమిటంటే నకిలీ కణిక-7 కి, అతడి నెం.10 వర్గానికి, తమ హయాం వచ్చేనాటికీ పటిష్ఠంగా నిర్మింపబడిన, full pledged గా assemble చేయబడిన డి.వి.డి. వంటి గూఢచార నెట్ వర్క్ ని ప్రయోగించటమే వచ్చు. రిమోట్ ఉపయోగించి ఆపరేట్ చేయడాన్నే గొప్ప గూఢచర్యంగా భావించి విర్రవీగడం వచ్చు. భూగోళాన్నంతా తన చిటికిన వేలిమీద తిప్పుతున్నానన్న పెర్వెర్షన్ తో, నకిలీ కణిక-7, ఓ విధమైన ఉన్మదానందాన్ని కూడా పొందేవాడు. అన్నట్లు ఇతడికి ఇలాంటి సైకోపాత్ లన్నా, సైకో ఉదంతాలన్న చాలా ఇష్టం కూడాను. ప్రపంచవ్యాప్తంగా, అన్ని భాషల్లో, వరుసహత్యలు చేసే సైకో పాత్ లని హీరోలుగా చూపే కథలతో ఎన్నో సినిమాలను ఈ నకిలీ కణిక వ్యవస్థ ప్రోత్సహించింది. తాము చిన్నతనంలో ఓ ఆడదాని చేతిలో లేదా కొందరు ఆడవాళ్ళ కారణంగా దగాపడ్డారట. దాంతో పెద్దయ్యాక వరుసగా ఆడవాళ్ళని హత్యలు చేస్తుంటారు. లేదా మగవాళ్ళని వరుసగా హత్యచేసే స్త్రీ హంతకులు హీరో/హీరోయిన్ గా సినిమాలు వచ్చేవి. అదేదో, తమ భావోద్రేకాలన్నిటినీ పారవేయటానికి సమాజం తమ చెత్తకుండీ[Dust Bin] అయినట్లు! తమకి అన్యాయం జరిగితే అమాయకుల మీదెందుకు ప్రతీకారం తీర్చుకోవటం? ఇలాంటి ఉన్మాద కథలూ, ఉదంతాలు నకిలీ కణిక-7 కీ, అతడి నెం.10 వర్గానికి చాలా ఇష్టం. ఇలాంటి ఈ నకిలీ కణిక-7 కి ఎదురుదెబ్బ తగిలితే ఏం చెయ్యాలో, అందుకు తగిన కొత్త గూఢచర్యాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలియదు.

అయితే పీవీజీ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్ని, పురాణ ఐతిహాసిక వేదాంతసారాన్ని, అర్ధం చేసుకున్న జ్ఞాని. గూఢచార జ్ఞానానికి మూలాలు తెలిసిన రాజనీతిజ్ఞుడు. కాబట్టి నెం.5 వర్గాన్ని, నకిలీ కణికుడి గూఢచార వలయాన్ని తుత్తునియలు చేయగల ప్రతి వలయాన్ని నిర్మించాడు. క్రమంగా నెం.10 వర్గంలో…. ఎవరు ఎవరో, ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారో, ఎవరికీ అర్ధం గాకుండా పోయింది. తమ వలయంలోకి ఎందరు ’officer under cover’ లాంటి ఏజంట్లు, వ్యక్తులు చేరారో తెలియదు. తాము అంతవరకూ గుప్తంగా దాచుకుని, ఉపయోగించుకుంటున్న సమాచార సాంకేతికత, ప్రపంచపునట్టింట ప్రతిష్ఠింపబడింది. ప్రతీ ముంగిట్లోకి, ఇంకా చెప్పాలంటే ప్రతీ అరచేతిలోకీ అందుబాటులోకి వచ్చేసింది.

ఇక్కడ ఓ పోలిక చెబుతాను. కొంతకాలం క్రితం మణిరత్నం[తిరుడా తిరుడా] ’దొంగా దొంగా’ అన్న సినిమా తీసాడు. అందులో రిజర్వ్ బ్యాంకు నుండి తీసుకు రాబడిన కొత్త కరెన్సీ నోట్లతో[డబ్బుతో] నిండిన కంటైనర్ దొంగతనానికి గురవుతుంది. దాన్ని గురించి శోధించడానికి వచ్చిన సి.బి.ఐ. ఉన్నతాధికారి[ఎస్.పి.బాల సుబ్రమణ్యం ఈ పాత్ర పోషించాడు], కంటైనర్ కనబడిందన్న సమాచారాన్ని అనుసరిస్తూ ఓ ఊరు చేరతాడు. అక్కడ అతడు ‘డబ్బుతో నిండిన కంటైనర్ ఆ ప్రాంతంలో ఎక్కడో ఉందని’ ప్రజలందరికీ తెలిసీపోయేలా, విషయాన్ని బహిరంగం చేస్తాడు. చేస్తూ “ఇక ఆ కంటైనర్ ఈ ఊరు దాటి పోలేదు. ప్రజలే కాపలా కాసి మరీ పట్టుకుంటారు” అంటాడు. ఇక్కడ నకిలీ కణిక-7 కు సంబంధించిన గూఢచార వలయం, అతడి నెం.10 వర్గం, అందులోని ఏజంట్ల విషయం ఇలాంటిదే!

ఈ విధంగా నకిలీ కణికుడి గూఢచార వలయాన్ని, వారి ఏజంట్ల కార్యకలాపాలని బహిరంగపరచడం, ఈ 17 ఏళ్ళుగా అనుశృతంగా నడుస్తోంది. ఇందులో మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆత్మహత్యా సదృశ్య కర్తవ్యాలు[suicidal Assignments]. గూఢచర్యంలో ఏ ఏజంట్ అయినా తనకి వచ్చిన Assignments తాను నిర్వహించకుండా, వ్యతిరేకించినా, తాత్సారం చేసినా, గునిసినా, మరింతగా అతడి పరిస్థితి క్షీణిస్తుంది. అంటే ఏదైనా Assignments తనకి అప్పటికి disadvantage గా అన్పించి, నిర్వహించడానికి తిరస్కరించడం లేదా తాత్సారం చేయటం లేదా నసగటం చేసాడనుకొండి. అతడి పరిస్థితి మరింతగా రోడ్డుకి ఈడ్వబడుతుంది. మరింతగా పెనం మీద నుండి పొయ్యిలోకి పడతాడన్న మాట. అందుచేతనే ఏ ఏజంట్ అయినా తనకి ఇవ్వబడిన Assignments అప్పటికి తనకి disadvantage గా అన్పించినా ’ఇప్పటికి disadvantage గా కన్పించినా పరిణామక్రమంలో advantage అవుతుంది’ అని సరిపెట్టుకుంటాడు. లేదా ’ఏంజరుగుతుందో, ఎలా జరిపించాలో బాస్ కి లేదా ఏజన్సీకి తెలుసు. చెప్పిన పని/assignment నిర్వహించటం. విధేయత చూపిస్తే ఏరోజునైనా ఫలితం ఉంటుంది’ అనుకుంటాడు. లేదా ’ఒకవేళ ఇప్పుడు ఏజన్సీ నన్ను డ్రాప్ చేయటానికే ఈ Assignment ఇచ్చింది అనుకున్నా, నేను చేయగలిగింది ఏముంది? కాదన్నా తొక్కేస్తారు. ఇప్పటి వరకూ ఇంత ’సీన్’ అన్నా ఇచ్చారు. ఇదే ఇవ్వకపోయి ఉంటే ఫలానా నాతోటి వాడిలాగే నేనూ పడుండేవాణ్ణి కదా! కాబట్టి ఇచ్చిన assignment నిర్వహించటమే సేఫ్. లేక పోతే క్రితంలో ఇరుక్కున్న లొసుగుల్నీ, చేసిన తప్పుల్నీ బయటపెట్టి నామారూపాల్లేకుండా చేస్తారు’ అనుకుంటాడు.

అందుచేత – నోరు మూసుకుని, ఒళ్ళుదగ్గర పెట్టుకుని ఇచ్చిన Assignment నిర్వహిస్తాడు. ఒకోసారి అది Assignment అన్న విషయం కూడా తెలుసుకోలేనంతగా అటువైపు డ్రైవ్ చెయ్యబడతాడు.

ఇక్కడ ఓ జోక్ చెబుతాను. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ’సింహాద్రి’ సినిమాలో, కేరళలోని ప్రకృతి చికిత్సా కేంద్రానికి హీరో జూ.ఎన్టీఆర్, అతడి అనుచరుడు కమేడియన్ బ్రహ్మానందం వెళతారు. అక్కడ మరో కమెడియన్ వేణుమాధవ్, అప్పటికే కాళ్ళు చచ్చుబడిపోయాయనే వంకతో చేరి, ఎంచక్కా జీడిపప్పు, పాలు వంటి రుచికరమైన బలవర్థకమైన ఆహారం ఆస్వాదిస్తూ, తైల మర్ధనలు చేయించుకుంటూ ఉంటాడు. హీరో కూడా దొంగరోగం చెప్పి అక్కడ చేరటం తెలుసుకున్న వేణుమాధవ్, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఆ సందర్భంలో అతడు బ్రహ్మానందాన్ని ’మళ్ళీ మాట్లాడా వంటే గొంతుమీద కాలేసి తొక్కుతాను. ఓహ్! నాకు కాళ్ళు పనిచేయవు కదా! అయితే ఓ పని చెయ్యరా! నీ గొంతు మీద నువ్వే కాలేసుకుని తొక్కుకో!” అంటాడు. ఆ డైలాగ్ ని అతడన్న తీరుకీ, అది విని బ్రహ్మానందం పెట్టిన ఎక్స్ ప్రెషన్ చూసీ, మనకి విరగ నవ్వొస్తుంది.

నిజజీవితంలో ఎవరికి వారు ‘తమ గొంతు మీద తామే కాలేసుకుని తొక్కుకోవటం’ సాధ్యం కాదు గానీ, గూఢచర్యంలో అది సాధ్యమే. వాటినే suicidal assignments గానూ, ఆత్మహత్యా సదృశ్య కర్తవ్యాలు గానూ వర్ణించాను. ఆ స్ట్రాటజీనే అద్వానీ పాకిస్తాన్ వెళ్ళి ‘జిన్నా జిందాబాద్’ అంటూ జిన్నా మీద గౌరవం ప్రకటించటంలోనూ, చాలా సార్లు, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాననటంలోనూ మనం చూస్తున్నాం. 2009 ఎన్నికల ముందు, పొత్తుల వ్యవహారంలో ప్రతిపక్షాల మధ్య, అధికార కాంగ్రెస్ వ్యవహారంలోనూ చూసాం. ఇంకా వీటి జాబితా చెప్పాలంటే అది సుదీర్ఘమైనది. అయినా పరిశీలించదగినది.

స్పష్టంగా చెప్పాలంటే ఈ జాబితా ఇప్పటివరకూ నేను మీకు వివరించిన నకిలీ కణికులూ, వారి వ్యవస్థ గురించిన ప్రతిపాదనలకి దృష్టాంతాల వంటిది. నకిలీ కణికుడి ఏజంట్లు, ఏ స్థాయిలో ఉన్నవారైనా కానివ్వండి, ప్రపంచస్థాయి నాయకుల దగ్గర నుండి, ఢిల్లీలో ప్రధాని పీఠంలో కూర్చొని ఉన్న వ్యక్తి దగ్గర నుండి, దిగువస్థాయి రాజకీయ నాయకుని వరకూ, బడా పారిశ్రామికవేత్త నుండి విదేశీ మాఫీయా లీడరు వరకూ, అందరికీ ఇవ్వబడుతున్న ఈ ఆత్మహత్య సదృశ్య అసైన్ మెంట్లు కారణంగానే కుట్రలో వారి ప్రమేయమూ, కుట్ర స్వరూపమూ స్పష్టంగా బహిర్గతమౌతున్నాయి. ఈ దృష్టాంతాల జాబితా[circumstantial] చెప్పేముందు మరి కొన్ని విషయాలు చెప్పాలి. ఈ స్ట్రాటజీలో ఉన్న భారతీయ తత్త్వ చింతన గురించి చెప్పాలి.

నకిలీ కణికుడు, అతడి వ్యవస్థ, అతడి ఏజంట్లు, ప్రస్తుతం ఈడుస్తున్న దినదిన గండం నూరేళ్ళు ఆయుష్షుని గానీ, జారిపోతున్న వారి పట్టుని [గ్రిప్] గానీ, బహిర్గతమౌతున్న వాళ్ళ స్ట్రాటజీని గానీ, ఆ ఏజంట్ల సర్కస్ ఫీట్లు వంటి విన్యాసాలు గానీ, వాళ్ళ [suicidal assignments] ఆత్మహత్య సదృశ్య స్వయంకృతాలు గానీ అర్ధం చేసుకోవాలంటే, ముందుగా భారతీయ తత్త్వ చింతనని గుర్తుకు తెచ్చుకోవలసి ఉంటుంది. ‘అనుభవమైతే గానీ తత్త్వం బోధ పడదంటారు’ పెద్దలు. అలాగే ‘తత్త్వం బోధపడితే గానీ సత్యం కళ్ళకు కనబడదు’. అందుకే గతటపాలో నకిలీ కణికుడు, అతడి వ్యవస్థా, ఆ ఏజంట్ల ప్రస్తుత పరిస్థితులు అర్ధం చేసుకోవాలంటే, దాని పూర్వాపరాలు ముందు తెలుసుకోవాలని వ్రాసాను. నిజానికి అవి పూర్వాపరాలు కాదు, పునాదులు.

అందుచేత ముందుగా ఆ పునాదుల గురించి చెబుతాను.

భారతీయులుగా మనం వేలసంవత్సరాల నుండి భగవద్గీతని నమ్ముతాం. భగవంతుడి శక్తిని, సత్యాన్ని నమ్ముతాం. కొన్ని నమ్మకాల పునాదుల మీద జీవన రమ్యహర్య్మాన్ని నిర్మించుకుంటాం. భారతీయుల రక్తంలో ఉంది ఈ నమ్మకాలతో కూడిన దృక్పధమే. అది చేటవంటిది. ప్రతిదానిలో చెడుని వదిలేసి మంచిని గ్రహించేటటువంటి బుద్ది. ఇలాంటి దృక్పధాన్ని, పురాణేతిహాసాలు, పండగలు, జీవన సరళి క్షణక్షణం సమాజానికి, వ్యక్తులకి నూరిపోసేవి. కాబట్టే ఆ రోజుల్లో సర్వసంగ పరిత్యాగులు ఏంచెప్పినా ప్రజలు నమ్మేవాళ్ళు. అలాగే యోగులూ సామాజిక హితవు చెప్పేవాళ్ళు. ’సంసారమే త్యజించిన వారికి స్వార్ధం ఉండదు కదా! అందునా యోగి! ఇతడు మన హితవు కోరి చెబుతాడు. సత్యమే చెబుతాడు. మనం తిరగని ప్రాంతాలు ఇతడు తిరిగాడు. కాబట్టి మనకంటే ఇతడికి ఎక్కువ తెలుసు’ – ఇదీ యోగులని విశ్వసించటంలో ప్రజల దృక్పధం. అయితే క్రమంగా ఆ స్థానాన్ని మీడియా ఆక్రమించాక, మంచి స్థానే చెడు ఎలా ఆక్రమించిందో, అదే నకిలీ కణికుడికి ఎలా మూలబలం అయ్యిందో తెలుసుకోవాలంటే – ఆ మీడియా మరుగుపరచిన భారతీయ తత్త్వ చింతనని, తాత్త్విక మూలాలని, నమ్మకాల పునాదులని ఒకసారి పునః పరిశీలించాలి, జప్తికి తెచ్చుకోవాలి.

’చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు’, ’చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ అంటారు పెద్దలు. అంటే మనమేం చేస్తే ఆ ఫలితమే పొందుతామని దాని అర్ధం. మంచికి మంచి, చెడుకి చెడూ! మనకున్న ప్రసిద్ధ పుణ్యకేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. ధూర్జటికవి పుణ్యమా అని శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యమూ అలా నిలిచి ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రం దగ్గర సువర్ణ ముఖి నది ప్రవహిస్తోంది. ఇప్పుడంటే నీళ్ళు లేక, ఇసుక పర్రలతో కన్పిస్తోంది గాని, ఒకప్పుడు నీటిగలగలలతో శ్రవణపేయంగా ఉండేది. ఆ నదికి, ఆ గుడికి సంబంధించిన [విశేషం] కథ ఇది –

సర్పం, ఏనుగుల భక్తి పోరాటంతో ప్రసిద్దమైన ఈ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు, వేలాదిగా శిల్పులూ, కూలీలు, ప్రజలు కూడా ఆ నిర్మాణ పనుల్లో పాలుపంచుకునేవారట. సూర్యాస్తమయ వేళ, పనులు ముగించి, నదిలో కాళ్ళు చేతులూ కడుగుకొని, దోసిలిలో నీళ్ళు తీస్తే, ఆ దోసిట్లో తాము ఆ రోజు పడిన శ్రమకు తగిన కూలీ, బంగారు నాణాల రూపేణా దొరికేదట. ఎవరెంత పనిచేస్తే అంతగా! ఎక్కువపని చేసిన వారికి ఎక్కువ నాణాలు, తక్కువ పనిచేసిన వారికి తక్కువ నాణాలు. అందుకే ఆ నదికి ’సువర్ణముఖి’ అన్న పేరు వచ్చిందట. పనిచెయ్యకుండా… చేసినట్లు నటిస్తే, లేదా మేస్త్రీ[పైఅధికారి]కి కాకా కొడితే పైఅధికారి డబ్బు ఇస్తాడేమో గానీ భగవంతుడివ్వడుగా![పైఅధికారి ఇచ్చింది కూడా వచ్చిన దారిలోనే పోవడం కద్దు. ఈ వైచిత్రి చూడగల కళ్ళుండాలి అంతే!] అంచేత ఈ పైరవీలన్నీ సువర్ణముఖి నది దగ్గర చెల్లేవి కాదన్నమాట.

ఈ కథ[విశేషం] చెబుతూ పెద్దలు “ఎవరు చూసినా చూడకపోయినా మనమేం చేస్తున్నామో భగవంతుడు చూస్తాడు. ఇవ్వాల్సిందే ఇస్తాడు. తస్మాత్ జాగ్రత్త!” అని చెప్పేవారు. కాబట్టే మనం చేసిన మంచి, తరతరాలు మన పిల్లాపాపల్ని కాపాడుతుంది. చేసుకున్న చెడు భావితరాలని కూడా కట్టికుడుపుతుంది. అందుకే పాపభీతి, దైవభక్తి, పుణ్యప్రీతి ఉండాలి అనుకునేవాళ్ళు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు – దీన్ని తమ జీవితాల్లోనూ, చుట్టూ అందరి జీవితాల్లోనూ పరిశీలించగలిగినా లేకపోయినా, ఇది సత్యం. సోదాహరణంగా కనబడినప్పుడయినా, దీన్ని నమ్మకతప్పదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నకిలీ కణికుల గూఢచార వలయాన్ని, వ్యవస్థనీ నిర్ధారించుకునేందుకు, దాని పనితీరు తెలుసుకునేందుకు, ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్న ఆ వ్యవస్థలో కీలక వ్యక్తి, వ్యక్తులను గుర్తించేందుకు, పీవీజీ, భారత నిఘా సంస్థలూ కలిసి చాలా ప్రయోగాలూ, నిర్ధారాణలే చేసుకున్నారు. మచ్చుకి ఒకటి – సోలంకి వ్యవహారం [మాధవ్ సింహ్ సోలంకి?] ఈతడు, విదేశీ పర్యటనలో భాగంగా, విమానాశ్రయంలో, జేబులో రహస్య సమాచారం గల కవరుతో పట్టుబడ్డాడు. అంటే సమాచారం చేరవేస్తూ కొరియర్ షిష్ నిర్వహించాడన్న మాట. పట్టుబడేసరికి, ’తానేమీ పెద్దగా ఆలోచించలేదనీ, విమానాశ్రయాంలో ఎవరో కుర్రాడు తెచ్చి ఇచ్చిన కవర్ ని యధాలాపంగా జేబులో పెట్టుకున్నాననీ’ బొంకాడు. అచ్చంగా ’తాటి చెట్టు ఎందుకెక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నాడట’ అన్న సామెత మాదిరిగానే!

మామూలుగా అయితే మంత్రుల్ని అంతగా తనిఖీ చెయ్యరు. ఇప్పుడైతే పరిస్థితులు ఎంత మారాయోగానీ అప్పట్లో అయితే మంత్రులకి ఆపాటి మినహాయింపులుండేవి. భాజాపా అధికారంలో ఉన్నరోజుల్లో అమెరికా పర్యటనకి వెళ్ళిన మంత్రుల్ని, అక్కడి అధికారులు నఖశిఖ పర్యంతం పరీక్షించారన్న దుమారం కూడా చెలరేగింది. ఆవిధంగా, అప్పట్లో మంత్రులని అంతగా తనిఖీ చేయకపోవటం కద్దు. ఆ స్థితిలో, ధైర్యంగా, సదరు మంత్రి సోలంకి సమాచారపు కవర్ ని జేబులో పెట్టుకుపోయి దొరికిపోయాడు. ఆ తర్వాత అతడి ఊసు రాజకీయాల్లో ఇక విన్పించలేదు. అలా దొరికి పోవటంలోనే దాగి ఉంది గూఢచార క్రీడ! ఫలానా సమయంలో, ఫలానా చోట, ఫలానా మంత్రిని తనిఖీ చేస్తే దొరికిపోతాడన్న ఖచ్చితమైన సమాచారం ఉంటే తప్ప ప్రయత్నం చెయ్యకూడని ఎత్తుగడ ఇది. ఎందుకంటే, తీరా తనిఖీ చేసాక సదరు మంత్రి దగ్గర తప్పు చేస్తున్నట్లుగా ఏ ఋజువూ దొరకలేదనుకోండి, సదరు మంత్రి, అతడి అనుచరగణాల్ని అడ్డుపెట్టుకుని అతడి వెనుకనున్న గూఢచార ఏజన్సీ, నానా గొడవ చేస్తారు. చాలా ఇబ్బందుల్ని సృష్టిస్తారు. అంటే వారిది పట్టు, గ్రిప్ అవుతుందన్న మాట. [ఇందిరాగాంధీ ఇలాగే తప్పుడు సమాచారంతో దాడులు, తనిఖీలు చేసి బాగా ఇబ్బందులు పడింది.] అదే – సదరు మంత్రి లేదా వ్యక్తి దొరికి పోయాడనుకొండి. అప్పుడు ఆ ఏజన్సీ పెద్దగా కిక్కురు మనదు. అంటే వీరిది పట్టు, గ్రిప్ అవుతాయన్న మాట.

ఇలాంటి సంఘటనలు ఎన్నో! కొన్ని వెలుగులోకి వచ్చాయి. కొన్ని తెరవెనుకే ఉండిపోయాయి. ఇలాంటి పరీక్షలన్నిటితో పీవీజీకి, ఐ.బి, ’రా’ వంటి గూఢచార సంస్థలకి, ‘సి.ఐ.ఏ. ముసుగుమాటున ఐ.ఎస్.ఐ.కి ఉన్నబలం, ప్రపంచవ్యాప్తంగా పరుచుకొని ఉన్న నకిలీ కణిక వ్యవస్థ’ స్పష్టంగా గోచరమయ్యింది. అప్పటికి ప్రపంచానికి ఇంకా పరిచయం చెయ్యని, ఆధునిక సమాచార జ్ఞానం, నకిలీ కణిక వ్యవస్థ ప్రధానబలం. నిజానికి శతాబ్ధాలుగా నకిలీ కణికుల స్ట్రాటజీ అదే! ఎప్పటికప్పుడు, అప్పటికి అభివృద్ధి చెందిన ఆధునిక టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకుని, దాని గురించి గోప్యంగా ఉంచుతారు. ఇతరత్రా ప్రచారాలతో తమకు కావలసిన వార్తలు ప్రచారం చేస్తారు.

1992 నాటికి చాలాదేశాలు సమాచార ఉపగ్రహల నుండి ఛానెల్స్ ను అద్దెకు తీసుకుని ఉపయోగించుకుంటుండగా, కొన్నిదేశాలకు స్వంత ఉపగ్రహాలుండేవి. అయితే అన్నిఉపగ్రహాల్లోనూ నకిలీ కణికుడి వ్యవస్థకు, సమాచార మార్పిడికి కావలసిన సర్వసదుపాయాలు ఉండేవి. వారికి గల ’సందట్లో సడేమియా’ వంటి మార్గం, డబ్బు, కెరియర్ ఇవ్వటం, ఫేవర్స్ చేయటం వంటి స్ట్రాటజీలతో నిర్మించుకున్న నెం.10 వర్గంతో ఈ వ్యవహారమంత నిర్మింపబడేది, నిర్వహింపబడేది. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతీదేశంలోనూ, ఆ దేశ ప్రభుత్వం నడుస్తోందనుకోవటం, ప్రజల్ని పాలిస్తోందనుకోవటం కేవలం భ్రమ మాత్రమే. సమాంతరంగా నకిలీ కణికుడి ప్రభుత్వమే నడుస్తోంది. అతడి ఏజంట్లే అభివృద్ధి చెందుతూ ఉన్నారు.

ఇదంతా పీవీజీకి, భారత నిఘా సంస్థలూ, ఎవరికైతే భారతదేశం పట్ల నిబద్దత ఉందో వారికి తెలియచెబితే అర్ధమయ్యేస్థితి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎవరికైతే తమ తమ దేశాల పట్ల నిబద్దత ఉందో, మానవీయ విలువలున్నాయో వారికీ తెలియచెబితే అర్ధమయ్యింది. ఎందుకంటే వారికీ ఎంతోకొంత గూఢచర్యం తెలుసుగనుక. అయితే నకిలీ కణికుడి ప్రచార వరదలో కొట్టుకుపోతున్న సామాన్య ప్రజలకి? చెబితే నమ్మగలరా? ఎదురు నకిలీ కణికుడి ఏజంట్లు ‘అదంతా నాటకమో, బూటకమో’ అని ప్రచారంతో హోరెత్తిస్తారు కదా? ఇందిరాగాంధీ ఆనాడు విదేశీ హస్తం అంటే కుళ్ళు జోకులేసినట్లుగానే! అంతేగాక నకిలీ కణిక వ్యవస్థ ప్రతీవిషయంలోనూ ఎన్నో ద్వంద్వాలని సృష్టించి ఉంచింది. తమ వాదనకి దృష్టాంతాలుగా, మద్దతుగా వాడుకునేందుకు అలాంటి ద్వంద్వాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇక్కడ మీకు ఓ ఉదాహరణ ఇస్తాను. 1992 కు ముందర ఎవరైనా ‘నేటి సినిమాలు జనాన్ని, యువతని నాశనం చేస్తున్నాయి. పగా, ప్రతీకారం తప్ప మరో కథాంశం లేదు. లేదా శ్రీవారి ముచ్చట్లు, పనికిమాలిన ప్రేమకథలు! అరిషడ్వర్గాలని రెచ్చకొట్టే విధంగానూ, తర్క రాహిత్యంతోనూ, అడ్మినిస్ట్రేషన్ గురించి అవాస్తవాలు ప్రజలకి చేరే విధంగానూ ఉన్నాయి’ అని అన్నారను కొండి. దానికి వెంటనే నకిలీ కణికుడి ఏజంట్లు, ఏజంట్లు వంటి వారు లేదా ఆ విషప్రచారం తలకెక్కించుకున్న వారు ఈ విధంగా వాదిస్తారు. “మీరంటున్నది తప్పు. శంకరాభరణం వంటి సినిమాలు రావటం లేదా?" అంటారు.

నిజానికి భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతిని చాటి చెబుతూ, వాటిని గౌరవించమని ప్రభోదించే అలాంటి సినిమాలు కొన్నే వస్తాయి. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు, పైన చెప్పిన పనికిమాలిన ప్రేమకథలు, పగా ప్రతీకారం వంటి చెత్త సినిమాల పరంపర తర్వాత ఎడారిలో ఒయాసిస్సులా, ఒకటీ అరా అలాంటి సినిమాలు వస్తాయి. వాటికి జనం నీరాజనం పడతారు. దాన్ని బట్టి నకిలీ కణిక వ్యవస్థ, ఇంకా ఈ జనాల్లో ఎంతగా తమ సంస్కృతీ, సాంప్రదాయాల పట్ల గౌరవం, ప్రేమా, ఇష్టం ఉన్నాయో, ఇంకా ఎంతగా వాటిని విధ్వంసం చేయవచ్చో లెక్కలు గట్టుకుంటుంది, నిర్ధారణ చేసుకుంటుంది. అందుచేతనే అటువంటి సినిమాలు పకడ్బందీ స్ర్కిప్టుతో, తార్కికతతో, ఉన్నత భావజాలంతో, స్పూర్తిదాయకంగా ఉంటాయి. రక్తి కట్టే కథనంతో తెరకెక్కుతాయి. అన్నివిధాలా నాణ్యత కలిగి ఉంటాయి. ఇక ఆ తర్వాత అదే తరహాకథతో మూసచిత్రాలు వరుసగా వస్తాయి. వీటిల్లో స్ఫూర్తి ఉండదు. ఏవిధమైన నాణ్యతా ఉండదు. దాంతో అవి పరాజయం పొందుతాయి. వెంటనే నకిలీ కణికుడి ఏజంట్లు, పత్రికలూ “చూశారా? కాలం మారిపోయింది. జనం ఆ పాత సంస్కృతినీ, సాంప్రదాయాల్ని పట్టించుకోవటం లేదు. ఎప్పుడో ఒకటీ అరా, అదీ కొత్తదనం కొద్దీ అటువంటి చిత్రాలు జయప్రదం అయ్యాయి. అంతే” అంటూ ప్రచారిస్తారు. అందరూ కూడా ‘కామమ్మ మొగుడంటే కామోసనుకుంటారు’. ఇందులో మరో విషయం ఏమిటంటే, చాలాసార్లు ఈ ఉత్తమ కళాఖండాలని సృష్టించే ’కళా తపస్వి’లు, ‘దర్శకరత్న’లూ ఘోస్ట్ రచయితలను ఉపయోగించుకోవటం కూడా కద్దు. దాంతో ప్రతిభగల అసలు వ్యక్తులు మరింత నైరాశ్యానికి గురవ్వటం, తద్వారా సమాజంలో మరిన్ని నెగిటివ్ భావనలు పెరగటం జరుగుతోంది. ఈ విషయంలో పాలకుల బాధ్యత గురించి నారదనీతి స్పష్టంగా వివరిస్తుంది. నారదనీతికి విపర్యయమే నకిలీ కణికుడి స్ట్రాటజీ మరి!

ఇక ఇంత ద్వంద్వమూ బహిర్గతంగా తెలియక, వాదనకు దిగినవారు అయోమయానికి గుర్వవటం ఖాయం. అందుకోసమే ఇలాంటి ద్వంద్వాలు సృష్టించబడుతుంటాయి.

ఈ నేపధ్యంలో 1992 లో పీవీజీ గాని, మరెవ్వరు గాని, భారతదేశంమీద కుట్ర జరుగుతుందని చెబితే వినేవాళ్ళు ఎందరు? నమ్మేవాళ్ళెందరు? అర్ధంచేసుకోగల వాళ్ళెందరు? స్పందించగలిగే వాళ్ళెందరు? అలాంటిచోట, ‘అసలు ప్రపంచవ్యాప్తంగా ’మానవత్వం’ మీదే కుట్ర జరుగుతోంది, కార్పోరేట్ వ్యాపార రంగం ముసుగులో మనుష్యులు ఇతరులకు ఆదాయ వనరులుగా మారిపోతున్నారు’ అంటే అర్ధంచేసుకోగల స్థాయి గురించి ఊహించటం కూడా కష్టమే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వర్గం నెం.10 కి వ్యతిరేకంగా పోరాడుతున్న, పోరాడదలిచిన వారంతా క్రమంగా సమిష్టి అయ్యారు. దాన్నే నెం.5 వర్గంగా సౌలభ్యం కోసం సరిపోల్చాను. నెం.5 లక్ష్యం నెం.10 ని బహిరంగపరచటమే. ఎందుకంటే, అప్పటికే నకిలీ కణిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదృక్పధాన్ని కలుషితం చేసింది, ప్రభావ పరచింది. గూఢచర్య బలం, గుప్తంగా ఉంచుకున్న ఆధునిక సాంకేతికత, నకిలీ కణిక వ్యవస్థ మూల బలాలు. దానికి తోడు వారికి డబ్బు, ఇతరవనరులూ, అప్పటికే పటిష్టంగా పనిచేస్తున్న ఒక నెట్ వర్కు ఉన్నాయి.

కాబట్టే వారి గూఢచర్య తంత్రాలనీ, సాంకేతిక రహస్యాలనీ బహిరంగ పరచటమే లక్ష్యమయ్యింది. ఎందుకంటే అదే సరైన పరిష్కారం, శాశ్వత పరిష్కారం కాబట్టి. ఎందుకంటే వారి వ్యవస్థ, నెట్ వర్కు పనితీరుని expose చేయటం, బహిరంగ పరచటమే ఏకైక పరిష్కారం కాబట్టి.

కాబట్టే గమనించి చూడండి –

1992 కు పూర్వం ప్రజలని ప్రభావపరచగల సినిమాలు పూర్తిగా తర్క రాహిత్యాన్ని ప్రజల్లో induce చేసేవి. మీడియా ఇంతగా expose అయ్యిందీ లేదు. మీడియా చెప్పిందే వేదం. ఇప్పటికీ అదే కొనసాగుతున్నా, పరిస్థితిలో మాత్రం చాలా మార్పు వచ్చింది. మీడియాని, ప్రభుత్వం [ఇప్పటి ప్రభుత్వం కాదులెండి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీజీల నాటి ప్రభుత్వాలు] ఏమాత్రం నియంత్రించబోయినా, మరుక్షణం, ‘పత్రికాస్వేచ్ఛని ప్రభుత్వం కాలరాస్తోందని’ మహా గగ్గోలు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడో? [అదే ఇప్పుడైతే… వై.యస్.ని చూసి ఈ మీడియా నవాబు రామోజీరావే వెనక్కితగ్గుతున్నాడు. ఎంతలో ఎంత మార్పు? ఈ మాత్రం పట్టు, పదునుని ఇందిరాగాంధీ చూపించలేకపోయింది, పాపం!] పత్రికలు పరమ నిజాలేవీ వ్రాయవనీ, తమకి ఇష్టమైనట్లు వ్రాస్తాయనీ, తమ స్వప్రయోజనాలకి అనుగుణంగా వ్రాస్తాయనీ, తము ‘నంది అంటే నంది అన్నట్లు, పంది అంటే పంది’ అనేటట్లూ ప్రచారిస్తాయనీ సామాన్య పాఠకుడికీ కూడా తెలిసిపోయింది. ఒకప్పుడు ఈ స్ట్రాటజీని ప్రజలేమాత్రం పసిగట్టలేకపోయారు గదా!

ఒక్కమాటలో చెప్పాలంటే 1992 కు ముందర మనదేశం మీద కుట్ర జరుగుతోంది అంటే అర్ధం చేసుకోగల వారు చాలా తక్కువమంది. అలాంటి చోట ఆ కుట్ర ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోగల అవకాశం ఎంత? ఇదేస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. పూర్తిగా మానవజాతి మీద, మానవీయ విలువల మీద, భావజాలం మీద, వాటిని ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని చెబితే వినేవారు, అర్ధంచేసుకునేవారు, నమ్మేవారు లేరు. అదే, ఇప్పుడు జరిగిన దృష్టాంతాలతో, జరుగుతున్న సంఘటనలతో, తదనుగుణంగా పరిణామం చెందిన టీవీ, సినిమా మాధ్యమాలతో ప్రజల అవగాహనా స్థాయి పెరిగింది.

గమనించి చూడండి. మనమంతా టీవీ సీరియళ్ళ మీద జోకులు వేస్తుంటాం. నిజంగానే అవి సమయాన్ని మింగేసే కార్యక్రమాలే. అయినా అందులోనూ ఓ గొప్పప్రయోజనం ఉంది. చాలా వరకూ, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ, టీవీ సీరియళ్ళలో కుటుంబాల్లో కుట్రలే కథాంశాలుగా ఉన్నాయి. ఇంట అడుగుపెట్టిన కోడలు అత్తింటిని ఇక్కట్ల పాలు చేయటానికో, నాశనం చేయటానికో కుట్రలు పన్నడం, పరస్పర వ్యాపార సంస్థలకు సంబంధించిన కుటుంబాల్లో, కంపెనీల్లో ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకోవడం – ఇవే కథాంశాలు. ఇలాగే సినిమారంగం కూడా! సినిమాల్లో ఎక్కువ భాగం, ఏ కథాంశంలోనైనా, మోసం, కుట్రల గురించి ప్రజల్లో అవగాహన పెరిగేటట్లు చూపిస్తున్నారు. ఆ విధంగా 1992 ముందు సినిమాల్లో కంటే, ఇప్పటి సినిమాలు మరింత పరిణతియైన మోసాలు, కుట్రలు చూపిస్తున్నాయి. ఆ విధంగా ప్రజలలో కుట్ర స్వరూపంపై అవగాహన కల్పిస్తున్నారు.

నిజం చెప్పాల్సి వస్తే, మామూలు ప్రజలు అప్పటికీ ఇప్పటికీ కూడా, కొంత అమాయకులే. పూర్తి అమాయకులనీ, పూర్తి నిజాయితీ పరులనీ, అసలేమాత్రం కల్లా కపటం తెలియనివారనీ, మోసం దగాలు చెయని వారనీ, కుట్ర కుతంత్రాలు తెలియని వారనీ అనను. కానీ, మనకి తెలిసిన మోసం, కుట్రల కంటే నకిలీ కణికుని వ్యవస్థ ప్రయోగించే మోసం, దగా మరింత తీవ్రమైనవి, సంక్లిష్టమైనవి, నిగూఢమైనవి మరియు పరిణతి చెందినట్టివి. వాటిని గుర్తించటం కష్టం. ‘అంతా మామూలుగా జరుగుతున్నాయని’ అనుకుంటాం. పైకారణాలుగా మీడియా చేసే ప్రచారంలో మునిగిపోతాం, నమ్మేస్తాం.

ఇక్కడ మీకు ఓ చిన్న కథ చెబుతాను. ఈ కథ మూలం, జీడిపప్పు గారు సమీకరించిన చందమామ కథల్లో చదివాను. కథ ప్రకటించేసాను కాబట్టి తస్కరించలేదని మనవి. ఇంతకీ కధేమిటంటే…

అనగా అనగా…..

రామాపురం అనే ఊరిలో రంగయ్య అనే సామాన్య రైతు ఉండేవాడు. ఇతడు కొంచెం అమాయకుడు. ఇతడికి ఓ పాడి ఆవు ఉండేది. కొన్నేళ్ళకి అది కాస్తా ఒట్టిపోయింది. రంగయ్య దాన్ని సంతలో అమ్మేసి మరో ఆవును కొనుక్కోవాలనుకున్నాడు. సంతకు తోలుకెళ్ళి ఆవును అమ్మజూపాడు. సంతలో ఓ కొనుగోలుదారుడు “ఏమయ్యా! నీ ఆవు పాలిస్తుందా?" అంటే “లేదు బాబయ్యా! ఒట్టిపోయింది” అని చెప్పాడు.

మరో కొనుగోలుదారుడు “ఏమన్న! నీ ఆవు గాట్లో చక్కగా మేస్తుందా, గడ్డంతా చిందర వందరగా తొక్కేస్తుందా?" అని అడిగితే “నా ఆవు గాట్లోనే పేడవేసేస్తుంది బాబయ్యా” అని చెప్పాడు.

మరొకడు “కొంపదీసి నీ ఆవుగాని పొడుస్తుందా?" అంటే

"అవును బాబయ్యా! ముందుకొస్తే కొమ్మువిసురుతుంది. వెనక్కొస్తే కాల్తో తంతుంది” అన్నాడు అమాయకంగా, అన్నీ నిజాలే చెబుతూ!

దాంతో అతడి ఆవుని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. క్రమంగా అతడి చుట్టూ గుంపు పల్చబడింది. చివరకు బిక్కుబిక్కుమంటూ రంగయ్య, ఆవు ప్రక్కనే నిలబడి దిక్కులు చూడసాగాడు. సాయంత్రమయ్యింది. పొద్దున్నుంచీ ఈ తతంగమంతా గమనిస్తున్న మాటకారి వాడొకడు రంగయ్యని సమీపించి “ఏమయ్యా! ఆవుని అమ్ముకోవాలంటే ఇలా కాదు. నేను అమ్మిపెడతాను. ప్రతిఫలంగా నాకు కొంత సొమ్ము ముట్టచెప్పాలి” అన్నాడు. రంగయ్య అందుకు ఒప్పుకున్నాడు.

వెంటనే మాటకారి వాడు ఆ ఆవుని సంతలో మరోచోటికి తీసుకుని వెళ్ళి, గొంతు సవరించుకుంటూ “రండి బాబయ్యా! రండి! ఆలస్యంచేస్తే మంచి అవకాశం పోతుంది. గంగిగోవు బాబూ! కుండేడు పాలిస్తుంది. చక్కగా గాట్లో మేస్తుంది. పసిబిడ్దలాంటి ఆవు. కుమ్మటమే ఎరగని మాతల్లి. అవసరం వచ్చి అమ్ముతున్నాను గానీ లేకుంటే అమ్మకపోదును. రండి బాబూ రండి” అంటూ కేకలు పెట్టాడు. దాంతో జనం బాగా మూగారు. మాటకారి వాడు పదేపదే ఇదే చెప్పసాగాడు. దాంతో కొనుగోలుదారులు పోటీ పడి బేరమాడటం మొదలెట్టారు.

ఇదంతా చూసిన రంగయ్య, "ఛస్! ఇంత మంచి ఆవుని నేనేందుకు అమ్ముతాను? అమ్మను గాక అమ్మను!” అంటూ తన ఆవుని, తన ఇంటికి తోలుకెళ్ళిపోయాడు.

మాటకారి వాడు మొదట నివ్వెరపోయాడు. తర్వాత తన చాతుర్యాన్ని చూసుకుని తానే మురిసిపోయాడు. బహుశః కాలక్రమంలో, ఇదెంతో లాభసాటిగా ఉండటంతో, తానే ఇక నుంచి సంతలో సరుకమ్మి పెట్టే వాణిజ్య ప్రకటనదారు అవతారం ఎత్తి ఉంటాడు. కాలక్రమంలో ఆ మాటకారి వాడి లాంటి వాళ్ళే మీడియాగా రూపాంతరం చెంది ఉంటారు.

ఈ కథలో అమాయకుడిలాంటివారం మనం, మాటకారి వంటిది మీడియా.

ఆ విధంగా మనల్ని, మనం కాదని, మనచేతే నమ్మించగలదు, మీడియా! మీడియా ముసుగువేసుకున్న నకిలీ కణిక వ్యవస్థ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
***********

షిల్లాంగ్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల[EVM] పనితీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు అర్ధరహితమని ప్రధాన ఎన్నికల కమీషనర్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. మనదేశంలో వినియోగించే EVMలు ప్రత్యేకమైనవని వాటిని ఎవరూ మాయ చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. “గతంలో అమెరికా, యూరోపియన్ దేశాల్లో వినియోగించిన EVM లు ఓ ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేసేవి. అయితే మన దేశంలో ఉపయోగించే యంత్రాలు అలాంటివి కావు. ఇక్కడ వినియోగిస్తున్న యంత్రాల్లో ప్రత్యేకమైన చిప్ నిర్మితమై ఉంటుంది. దీంతో యంత్రాలను బయట నుండి నియంత్రించే అవకాశం లేదు. వాటిని మాయ చేసే ప్రశ్నే లేదు” అని చావ్లా వివరించారు. మంగళవారం ఆయన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికార్లతో సమావేశమయ్యారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ “EVM లను రెండు ప్రభుత్వరంగ సంస్థలు తయారు చేశాయని, ప్రైవేట్ సంస్థలు కాదని” చెప్పారు. – ఈనాడు, జూన్ 24, 2009. పేజీ నెం. 5.

మొత్తానికి నవీన్ చావ్లా EVM లని manipulate చేయగల అవకాశం ఉందని [గతంలో అమెరికా, యూరోపియన్ దేశాల్లో] చెప్పాడు. కాకపోతే అలాంటి అవకాశం ఇండియాలో లేదంటాడు. ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ గాకముందే టాయ్ లెట్ లోనుండి అధికార పార్టీకి సమాచారం అందించాడనే ఫిర్యాదుని, అప్పటి ఇతడి పైఅధికారి గోపాలస్వామి రాష్ట్రాపతికి చేయాల్సివచ్చింది. అందరూ అలాంటి వారే కదా!

“వడ్డించేవాడు మనవాడయితే ఎంత మూలన కూర్చున్నా అన్నీ అందుతాయి” అని పెద్దలంటారు. కాబట్టి అవినీతి అధికారులు సహకరించాలే గానీ ఏ యంత్రాలలోనయినా, ఏ మతలబులయినా చేయవచ్చు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
***********

టపా చదివే ముందు ఈ పర్సనల్ ప్రోఫైల్ తిలకించండి! [ఈనాడు ఆదివారం సంచికలోనిది]



మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. దాదాపు దేశవ్యాప్తంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లు ప్రచారం చేసారు. ఎక్కువగా ప్రచార కార్యక్రమంలో సోనియా, రాహుల్ గాంధీలే పాల్గొన్నారు. EVM Tampering తో కాంగ్రెస్ గెలిచింది. సోనియాగాంధీని ఎదిరించిన ప్రత్యర్ధులందరూ మట్టికరిచారు. కొత్తప్రభుత్వం పునఃప్రతిష్ఠ జరిగింది. రాహుల్ గాంధీ భావిప్రధానిగా ప్రచారం జరిగినా, సోనియా, రాహుల్ గాంధీలు మన్మోహన్ సింగే మా నాయకుడని, తమ ప్రధాని అభ్యర్దని ప్రచారం చేసారు. గెలిచిన తరువాత తము చెప్పిన మాట ప్రకారం మన్మోహన్ సింగే ప్రధానిగా పీఠం అధిష్టించాడు. మంత్రివర్గంలో రాహుల్ గాంధీకి చోటుందని మన్మోహన్ సింగ్ చెప్పాడు. రాహుల్ గాంధీ మంత్రివర్గంలో చేరటంపై ఏమాటా చెప్పలేదు. మంత్రివర్గం నియామకం అయిన తర్వాత మాత్రం, రాహుల్ గాంధీ “మంత్రివర్గ నియామకంలో నాముద్ర ఉందని” చెప్పుకున్నాడు. ఇలా చెప్పటం ద్వారా తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నాను గానీ, మంత్రిపదవిరేసులో లేనని పరోక్షంగా చెప్పినట్లయింది.

ప్రధానమంత్రి రేసులో ఉన్నాను అన్న అభ్యర్ధులందరూ [అద్వానీ, లాలూ, మాయావతి, రాంవిలాస్ పాశ్వాన్, వామపక్షాలు, జయలలిత గట్రాలు] ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ కోపంతో “ప్రధాని పదవిరేసులో ఉన్నాననడం ఫ్యాషన్ అయిపోయింది” అంటూ ప్రత్యర్ధుల ప్రచారాన్ని తిప్పికొట్టింది. అయితే ప్రియాంక వాద్రా మాత్రం “తన అన్నకు భారత ప్రధాని కావలసిన లక్షణాలు ఉన్నాయని, అతడిలో మేధావి లక్షణాలున్నాయని” అన్నది. బహుశః ప్రధానమంత్రి పదవి తమ కుటుంబానికి మాత్రమే చెందిందన్న భావన సోనియాగాంధీ కుటుంబంలో నరనరాన ఉన్నట్లుంది.

ఇంతకీ భారత ప్రధానికి, మేధావికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? సిక్స్ ఫ్యాక్ బాడినా, బాక్సింగ్ మరియు తైక్వాండాలో ప్రావిణ్యమా? యమహా ఆర్-1, కావాసాకి నింజా… లాంటి బైకులు నడపటమా? రైఫిల్ షూటింగ్, గోల్ఫ్, గోకార్టింగ్ లలో ప్రవేశమా? రాక్ మ్యూజిక్, యు2, పింక్ ప్లోయిడ్, రాక్ బ్యాండ్స్ పాటలంటే ఇష్టపడటమా? ఏవి ప్రధాని లేదా మేధావికి ఉండవలసిన లక్షణాలు? రాజకీయ అర్ధశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదవట మంటే ఇష్టమట, వాటిపై తన అభిప్రాయాలను బ్లాగులలో వ్రాయడం మరో హాబీ అట. ఇది క్రొత్తగా ప్రచారంలోకి వచ్చింది. ‘పుస్తకాలు చదువడం, బ్లాగులో వ్రాయడం’ అన్న విషయం ఇంతక్రితం ఎప్పుడు వినలేదు. బహుశ ఈ మధ్యకాలంలో ప్రచారం చేసుకుంటూ ఉండి ఉంటారు. ఇంతక్రితం ఆఫ్ఘాన్ పర్యటనలో, సమావేశాలు నడుస్తున్నప్పుడు, ఈ మేధావి, కరినా కపూర్ తో SMS ఛాటింగ్, విడియో గేములతో కాలక్షేపం చేసాడు. రాజకీయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలంటే ఇష్టపడే మేధావికి, రాజకీయ సమావేశాల కంటే ఒక సినిమా నటికి SMS పంపటం ఎక్కువ ఆసక్తికరం ఎలా అయ్యిందో?

నాయకుడికి భావప్రసార శక్తి అతిముఖ్యమైనది. అలాంటి శక్తి ఈ మేధావి దగ్గర ఏ కోశానా కనపడదు. ఎందుకంటే, ఇతడు ప్రసంగించిన ఏ సభలోనూ ప్రజలు ఉర్రూతలూగిన సందర్భంగాని, ప్రజలు బ్రహ్మరధం పట్టింది గానీ లేదు. కాంగ్రెస్ యువజన నాయకులు మాత్రమే అతడిని పొగడుతుంటారు గానీ , సభకు వచ్చే ప్రజలందరూ వీళ్ళు ఇచ్చే డబ్బులకో, డబ్బుతో పాటు ఇచ్చే బిర్యానికో, సారాకోసమో వస్తున్నారు. అంతేగాని అభిమానంతో కాదు. క్రితం ఎన్నికలలో మా నంద్యాలలో రాహుల్ గాంధీ సభ జరిగినప్పుడు, డ్రమ్ముల్లో సారా ఉంచి తాగినోడికి తాగినంత సారా ఇచ్చారు. ఆడవాళ్ళకు డబ్బులిచ్చారు. అలాగయ్యీ సభలో జనాలు పలచగా ఉన్నారు. ఇదీ అతడి భావ ప్రసార శక్తి!

ఇంతక్రితం వరకు రాహుల్ గాంధీ పర్యటించిన నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్ధులే ఓడిపోతారని ప్రచారం ఉండేది. తదుపరి పరిణామంలో అతడిని తమ నియోజకవర్గాలలో పర్యటించమని అడగటానికి అభ్యర్ధులే భయపడేస్థితి వచ్చింది. అంటే ఇతడు ప్రజలను ఆకట్టుకోలేకపోయాడు.

నాయకత్వ లక్షణాలలో కావలసిన ఇంకొక లక్షణం దార్శినికత. ఇప్పటివరకూ అటువంటి లక్షణం రాహుల్ గాంధీలో కనపడలేదు. అణు ఒప్పందం నేపధ్యంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని గొప్పగా చెప్పాడు. ఇప్పుడు చూస్తే లక్షల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. మొన్ననే ఎగుమతిరంగంలో పదమూడులక్షల ఉద్యోగాలు ‘హాంఫట్’ కాబోతున్నాయని వార్తలు వచ్చాయి. జాతీయ గ్రామీణ ఉపాధి పధకంలో ఇచ్చేవి దినసరి కూలిపనులే! అంటే తుమ్మితే ఊడే ముక్కులాంటివే ఈ ఉద్యోగాలు, ఉపాధులు! ఉద్యోగాల మాటే తప్పితే, స్వయం ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు, చిన్నపరిశ్రమల గురించిన ఊసే ఇతడు ఏనాడూ ఎత్తలేదు. అది ఇతని దార్శనికత. దార్శనికత అనే పదం ఇతనిపట్ల చాలా పెద్దదనుకుంటా.

కనీసం నాయకుడిగా చైతన్యవంతంగా[Active] ఉంటాడా?... అంటే అదీ ఏంలేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటాడు. ఇక మూడిగా ఉంటే ఎవ్వరు పలకరించటానికి ధైర్యం ఉండదని, చెల్లెలు ప్రియాంక వాద్రా మాత్రమే పలకరిస్తుందని చెప్తారు.

ఆహారం విషయానికి వస్తే ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే రెస్టారెంట్లకి వెళ్తాడట. అది ఏఢిల్లీలో మాత్రమే పరిమితం కాదు, నియోజక వర్గాలలో పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో పేరున్న [క్రేజీ] రెస్టారెంట్ కు వెళ్ళటం కూడా ఒక కార్యక్రమమే. ఈ మోజులు కూడా దాటలేని వాడు ప్రధాని స్థాయికి అర్హుడా?

అంతేకాదు, ‘రాజకీయాలు, అర్ధశాస్త్రాలంటే ఎంతో ఇష్టం అన్నాడు కదా! మరి దాంట్లోనయినా ప్రతిభ చూపించాడా?’ అంటే… ఎప్పుడూ పార్టీలో విస్తృత చర్చలు జరిపిన దాఖాలాలు లేవు, యువజన కాంగ్రెస్ సభ్యులతో ఢిల్లీలో క్రికెట్ ఆడటం మీద ఉన్నంత శ్రద్ధా, ఉత్సాహం చర్చల మీద ఉండదు. వామపక్షాల ప్రోదల్భంతో పెట్టిన పధకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం. దానిని కాంగ్రెస్ తన పధకంగా ప్రచారించుకోవటమే గాక, ఆ పధకాన్ని రాహుల్ గాంధీ మానస పుత్రికగా అభివర్ణిస్తారు. ఇక్కడా ప్రక్కవాడి ఆలోచనను దోచుకోవటమే! అలాగయ్యీ ఆ పధకం సరిగ్గా అమలయ్యేటట్లు చూస్తారా అంటే అదీ అవినీతిమయమే.

నాయకులలో ఉండవలసిన మరో ముఖ్యలక్షణం ప్రజలమీద ప్రేమ! ఆ విషయంలో ఇతడిది ఎప్పుడూ వైఫల్యమే. ఎందుకంటే బాంబుదాడులు జరిగినప్పుడు హుటాహుటినా ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలకు ధైర్యం చెప్పటంగానీ, ఆ దాడులలో బంధువులను కోల్పోయిన వాళ్ళకు సానుభూతిని తెల్పటంగానీ ఎప్పుడూ చెయ్యలేదు.

‘ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో పేదల ఇళ్ళల్లో తిని, అక్కడే నిద్రపోయి వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, తాను గాంధీ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఎం.పి.గా ఉన్నానని, ఈరోజులలో సామాన్యుడు ఎవ్వరూ రాజకీయాలలో ఈ స్థితికి చేరుకునే పరిస్థితి లేదని’ ఉపన్యాసాలు ఇచ్చాడు. అణు విద్యుత్ విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు, విశ్వాసపరీక్ష సమయంలో విచారంగా ముఖం పెట్టి కళావతి గురించి, ఆవిడ పేదరికం గురించి ఉపన్యసించాడు. తర్వాత ఇతడి ఉపన్యాసానికి స్పందనగా అన్నట్లు సులభ్ సంస్థ ‘ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆమెని, ఆమె కుటుంబాన్ని అదుకోవటం కోసం పెద్దమొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తామని, ఆ డబ్బుపై వచ్చేవడ్డితో ఆమె పిల్లలను చదివించుకోవచ్చని’ ప్రకటించింది.

ఇప్పుడేం జరిగిందో ఆవిడ [కళావతి] మాటల్లోనే చూద్దాం!

“కళావతి కల భగ్నం

న్యూఢిల్లీ, జూన్‌ 11: ఆశలన్నీ ఆవిరి కావడంతో.. కళావతి నిస్పృహతో వెనుదిరిగింది. ఇక రాహుల్‌ను కలిసే ముచ్చటే లేదని పేర్కొంది. ఆమెకు 'మెరుగైన జీవితం' ప్రసాదిస్తామని రాహుల్‌ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. కళావతి దీనగాథను రాహుల్‌ గత ఏడాది పార్లమెంట్‌ సమావేశాల్లో వినిపించారు. రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదైన విదర్భలోని.. యావత్మాల్‌ జిల్లా జల్కా గ్రామవాసి అయిన కళావతి పేరు అప్పట్నుంచీ మారుమోగిపోయింది.

ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడంతో.. 9 మంది పిల్లలతో బతుకీడుస్తున్నదామె. ఆమె ఇంటికి స్వయంగా వెళ్లిన రాహుల్‌.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. ఏడాది గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో నేరుగా ఆయననే కలిస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందేమోననే ఆశతో ఇక్కడకు వచ్చింది. మళ్లీ ఆశాభంగమే. రాహుల్‌ ఢిల్లీలో లేకపోవడంతో కలవలేకపోయింది. కళ తప్పిన మొహంతో ఇంటి ముఖం పట్టింది.

'రాహుల్‌ గాంధీ చాలా పెద్ద వ్యక్తి. ఆయన మాకు ఎక్కడ సమయం కేటాయిస్తారు?' అని నిరాశగా చెప్పింది. తనకు కొత్త ఇల్లు మంజూరు చేస్తానని రాహుల్‌ హామీ ఇచ్చారని చెబుతోంది. స్థానిక నేతలు ఆమెకు నగదు ఇచ్చారు. ఇంటి సామగ్రి కొంత సమకూర్చారు కూడా. ప్రభుత్వమైతే ఏకంగా విద్యుత్‌ కనెక్షన్‌నే మంజూరు చేసింది. అయితే కళావతి నివసిస్తున్న ఇల్లు.. ఇప్పటికీ అక్రమ కట్టడమే! 'రాహుల్‌ నాకు ఇల్లు ఇస్తామన్నారు. అది జరగలేదు. ఇక నేను ఆయనను కలవను' అని కళావతి తెగేసి చెప్పింది.

Pasted from http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fwww.andhrajyothy.com%2Fmainshow.asp%3Fqry=%2F2009%2Fjun%2F11main4 “

అంటే ఇమేజ్ కోసం పార్లమెంట్ లో ఉపన్యాసం ఇచ్చాడు. అతడికి వాళ్ళ పేదరికమే పట్టి ఉంటే, follow up కూడా చేసి ఉండేవాడు. అదే చేసి ఉంటే కళావతి ఎందుకు ఢిల్లీ వస్తుంది?

ఇలా ఏవిధంగా చూసినా, నాయకుడిగా ఇతడిలో వైఫల్యమే కన్పిస్తూంది.

భారతదేశాన్ని పాలించటానికి భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు కనీసపాటి తెలియాలి. ఆ తెలిసినతనం రాహుల్ గాంధీలో ఏమాత్రం కన్పించదు. ఇండియాలో, ఏరాష్ట్రం వాళ్ళయినా, పరాయి రాష్ట్రంలో గాని, పరాయి దేశంలో గానీ ఉంటున్నప్పుడు, బయట ఆ రాష్ట్ర భాషా, లేదా ఆ దేశ భాష [వస్తే] మాట్లాడినా, ఇంటికి వచ్చిన తరువాత మాత్రం, తమ మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ ఈ గాంధీల కుటుంబం మాత్రం తమ ఇంట్లో ఇటాలియన్ భాషనే మాట్లాడతారట. అంటే వాళ్ళకు ఇటాలియన్ భాషే మాతృభాషగా అన్పిస్తున్నదన్న మాటే కదా! ఇక వాళ్ళు ఈదేశంతో మమైక్యం అవుతున్నదెక్కడ? భారతీయ సంగీతం అంటే ఇష్టం లేదు, భారతీయ దేవుళ్ళ పట్ల నమ్మకం లేదు. భారతీయత సంస్కృతి, సంప్రదాయల పట్ల నమ్మకం లేదు. కాని భారతదేశాన్ని మాత్రం పాలిస్తారట! భారతీయ పేదల ఇళ్ళల్లో తింటారు, అక్కడే నిద్రిస్తారు, వాళ్ళ గురించి సభలలో ఉపన్యాసాలిస్తారు గానీ, వాటి పరిష్కారాలు మాత్రం చెయ్యరు. మంత్రివర్గంలో యువకులకు ప్రాధాన్యం ఇచ్చామని, అదీ తను పట్టుబట్టి ఇప్పించానని గొప్పగా చెప్పుకున్నాడు ఈ రాహుల్ గాంధీ! ఎవరికి ఇప్పించాడు? డబ్బు, పలుకుబడి ఉన్న రాజకీయనాయకుల వారసులకు పదవులు ఇప్పించాడు గానీ, సామాన్యప్రజలలో నాయకులను గుర్తించారా? పదవులు ఇప్పించారా?

‘తాగితే తప్పులేదన్నాడు’ రాహుల్ గాంధీ. ఆ మాటలతో ఉత్తేజం పొందిన వై.యస్. రాజశేఖర్ రెడ్డి జనాలందరికి అందుబాటులో బారు-బీరు ఉంచాడు. జనాలు అనారోగ్యం పాలవుతున్నారన్న విమర్శ నుండి రక్షణగా, కార్పోరేట్ ఆసుపత్రులకు దోచి పెడుతూ ఆరోగ్యశ్రీ పధకం గురించి చెప్తాడు. నీరురాని గ్రామమయినా ఉందేమో గానీ, సారా లేని గ్రామం మాత్రంలేదు. అంతేకాదు అన్నిగ్రామాలలో మినరల్ వాటర్ మాత్రం దొరుకుతుంది, ఉచితంగా కాదులెండి డబ్బులిస్తేనే! సారా అందుబాటులో తెచ్చి, బాగా అలవాటు చేసారు కదా, ఇప్పుడు వాటి రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. ఇక్కడా దోపిడీయే!


కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహారిస్తూన్నారే గానీ, సామాన్య ప్రజలు తామే యజమానులు అయ్యే విధంగా ఏపాలసీలు తీసుకురావటం లేదే? స్వయం ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలని ప్రోత్సహించటం గాని, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను యువకులు స్థాపించేదిశగా ప్రోత్సహకాలు గానీ ఏవీ ఇవ్వటం లేదు. చివరికి డిగ్రీ చేసిన వాళ్ళు చిన్న ఇల్లు తీసుకుని స్వంతంగా ఒక చిన్నస్కూలు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. కిరణాషాపులను దెబ్బకొట్టే విధంగా సూపర్ మార్కెట్లు వచ్చాయి. రేపు అంబానీలు మంగలి షాపులు పెడతారట. వ్యవసాయంలోకి కార్పోరేట్ కంపెనీలు వస్తాయంటున్నారు. అప్పుడు కిలో బియ్యం 40/-Rs. నుండి 140/-Rs. వచ్చినా ఆశ్చర్యలేదు. అప్పుడు ఇండియా కాస్తా జింబాబ్వే అయిపోతుంది.

ఇలాంటి విషయాలు ఏవీ ఈ మేధావికి కన్పించటం లేదనుకుంటా? మరి మీడియా, కాంగ్రెస్, ఇతడి చెల్లెలు ప్రియంకా వాద్రాలకు అతడిలో మేధావి లక్షణాలు, భారత ప్రధాని లక్షణాలు ఎలా కన్పించాయబ్బా?

సోనియాకాంగ్రెస్ మాత్రం ఒక విషయంలో బాపుజీ మాటను గౌరవిస్తుంది. అది ఏమిటంటే “మొదట నిన్ను లెక్కచేయరు, తరువాత నవ్వుతారు, ఆ తరువాత నీపై పోరాడతారు, తరువాత నీదే విజయం”. ఈ సూత్రాన్ని వందశాతం ఆచరణలో పెడుతున్నారు. సెజ్ లు ఇచ్చిన కొత్తలో, బియ్యంరేట్లు పెరిగిన కొత్తలో, సారా అమ్మకాలు విపరీతంగా పెంచిన కొత్తలో, అవినీతి భయంకరంగా ఉందన్న రోజులలో, ఇలా అన్ని విషయాలలో మొదట ఇదీ అభివృద్ది మంత్రం, పట్టించుకోనవసరం లేదన్నారు. ప్రజలు ప్రశాంత పడ్డ తరువాత, ఆ చర్యల వేగం పెంచారు. ప్రజలు పోరాడటం మొదలుపెట్టిన తరువాత మౌనం వహించి, ప్రజలే ఓపిక నశించి పోరాటం ఆపేవరకూ చూస్తూ ఉంటున్నారు. క్రమంగా ప్రజలు అలవాటు పడుతున్నారు, అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా విజయం సోనియాకాంగ్రెస్ దే అయ్యింది. అలాగే రేపు రాహుల్ గాంధీని కూడా భావి భారత ప్రధానిగా అలవాటు చెయ్యొచ్చు అన్నదే సోనియాగాంధీ భావన! మొత్తానికి, బాపూజీ చెప్పిన సూక్తిని, సందర్భాన్ని ‘శీర్షాసనం’ వేయించిన సోనియాగాంధీకి దండేసి, దండం పెట్టాలి!!!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1992 జూన్ 5వ తేదిన నేను దాఖలు చేసిన రహస్యఫిర్యాదులో, రామోజీరావు చేస్తోన్న కుట్రల గురించి తార్కిక నిరూపణే తప్ప, మరేవిధమైన సాక్ష్యాధార పత్రాలు గాని, వీడియోలు, ఫోటోలు గానీ లేవు. అలాంటివాటిని ఓ సామాన్యుడెవరూ సేకరించలేరు కూడా! అదే ఉటంకిస్తూ మరీ వ్రాసాను. అయితే అదృష్టం కొద్దీ, అది మరెవ్వరి చేతిలో పడకుండా నేరుగా చేరింది. అది నేరుగా పీవీజీ కి చేరిందని ఎలా చెప్పగలనంటే, తర్వాత నా ఫ్యాక్టరీకి వచ్చిన ఐ.బి. అధికారులూ, ప్రధాని కార్యాలయంలోని ఖండేకర్ అనే OSD ఆ విషయమై నిర్ధారించారు గనుక.[దీన్ని గురించిన పూర్తి వివరాలు నా గత టపాలలో వ్రాసి ఉన్నాను.] అప్పటికి నాకు కన్పించిన కారణాలు అవే. అదే ఇప్పడయితే చాలా సంఘటనలు, సంఘటనాత్మకంగా చెప్పగలను. మున్ముందు టపాలలో అవి మీకు వివరంగా చెప్పగలను.

ఆ విధంగా రామోజీరావు గురించిన ఫిర్యాదు పీవీజీకి చేరడంతో, ’తాము ఇప్పటి వరకూ వెదుకుతున్న కీలక ఏజంటు రామోజీరావే ఎందుకు కాకూడదు?’ అన్నదృష్టితో పీవీజీ మొత్తం విషయాల్ని పరిశీలిస్తే…. ఒక్క క్షణం, ఒక్క ఆలోచన! తమ దృష్టినంతా ఇతర విషయాల పైకి, ఇతర ఏజంట్ల పైకి మళ్ళిస్తూ, తాను కేవలం ఓ మూలన ఒదిగిన స్థానిక పత్రికాధిపతి రూపంలో, చాపక్రింద నీరులా పనిచేస్తున్న కీలక ఏజంటు! అతణ్ణి నిశ్శబ్దంగా పరిశీలిస్తూ పోతే, పరమ అద్భుతంగా దర్శన మిచ్చిన ప్రపంచవ్యాప్త గూఢచార వలయం. ఒక పట్టాన నమ్మగలిగిన విషయం కాదది. ‘ప్రపంచాన్నంతా శాసిస్తోంది అమెరికా, దాని గూఢచార వ్యవస్థ సి.ఐ.ఏ.’ అన్న ముసుగు పైపైనే. లోలోతుల్లో పరిశీలిస్తే పట్టు, గ్రిప్ అంతా పాకిస్తాన్, ఐ.ఎస్.ఐ. లదే. ఇప్పడంటే, ఈ 17 ఏళ్ళుగా, ఏపార్టీ అధికారంలో ఉన్నా, అమెరికా శ్వేతసౌధం, అమెరికా అధ్యక్షుడూ పాకిస్తాన్ కి బాగా మప్పబెడతారనీ, ఇస్లామాబాద్ ని నెత్తికెత్తుకుని లాలిస్తారనీ బహిరంగపడింది గానీ… 1992 కు పూర్వం, పాకిస్తాన్ కి అంత సీన్ ఉందంటే ఎవరూ నమ్మగలిగే ప్రసక్తి కాదు. ఏవిధంగా అయితే ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి జాతీయ పత్రికల అధిపతులు, సంపాదకులతో పోలిస్తే, ఈనాడు వంటి ఓ స్థానిక ప్రాంతీయ భాషా పత్రిక అధిపతీ, సంపాదకీయుడూ అందరికంటే పెద్ద ఏజంట్ అంటే నమ్మశక్యం కాదో, అదే విధంగా, ప్రపంచవ్యాప్తంగా అమెరికా సి.ఐ.ఏ. తో, మాజీ USSR కేజీబీ తో పోలిస్తే, పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ.కి అందరికంటే ఎక్కువ గ్రిప్ ఉందనీ, దానికి హవా నడుస్తుందనీ అంటే నమ్మశక్యం కాదు. అలాగే, ఇప్పుడైతే, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం గారాబం నడవటం అన్నది చాలా నిశ్శబ్ధంగా జరిగిపోతుందనీ, ఏకంగా దేశాలకి దేశాలే ముస్లిం దేశాలుగా మారిపోతున్నాయనీ, చాలా దేశాల్లో ముస్లింలూ, ముస్లిం మూలాలున్న వారూ కీలక స్థానాల్లోకి ఎదుగుతున్నారనీ, ముడి చమురు ధరల్లో తాత్కాలిక ఒడిదుడుకులు కనబడినా, పెట్రో డిమాండ్, ‘నిలకడగా’ ముస్లిం దేశాలని బలోపేతం చేస్తోందనీ బహిరంగపడింది గానీ, అప్పట్లో ఎవరికీ ఆ గమనింపుగానీ, సందేహంగానీ రాకుండా నకిలీ కణిక వ్యవస్థ జాగ్రత్త పడింది.

అందునా పీవీజీకి హైదరాబాదు నిజాం నిరంకుశత్వమూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణాకు స్వేచ్ఛ రాకపోవటం, ఆ నేపధ్యంలో జరిగిన నాటకీయ, రాజకీయ పరిణామాలన్నీ తెలుసు. తెలుగు వాడిగా, ఈనాడు ప్రభావం ప్రజలమీద ఎంతో తెలుసు. ‘అప్పటివరకూ ఎవరో తెలియని కీలకవ్యక్తి ఇతడే అయితే?’... అన్న పరిశీలన, సంపూర్తిగా, అప్పటివరకూ ఉన్న గూఢచార స్థితుగతులన్నిటిని మార్చివేసింది.

అప్పటికి మన దేశానికి స్వంతంగా సమాచార ఉపగ్రహాలని ప్రయోగించుకోగల పూర్తి సామర్ధ్యాలు లేవు. రాజీవ్ గాంధీ హయాంలో శ్రీహరి కోట నుండి రాకేట్ ప్రయోగింపబడే కార్యక్రమానికి, ప్రధానిగా రాజీవ్ గాంధీ హాజరయ్యాడు. ఆనాటి ప్రయోగం విఫలమయ్యింది. ప్రధానిగా రాజీవ్ గాంధీ హాజరయినందున, శాస్త్రవేత్తల్లో ఆ హడావుడీ, అలజడి రేపిందనీ, అనవసరపు హంగూ ఆర్భాటాల వల్లే ప్రయోగం విఫలమయ్యిందనీ ‘ఈనాడు’ అప్పట్లో రోజుల తరబడి వ్రాసింది. సంపాదకీయాలతో సహా! అదే ‘ఈనాడు’ “ఇలా హంగూ ఆర్భాటం ఎందుకు చేస్తున్నారు?" అంటూ, రాజీవ్ గాంధీ, తాను ఎంపీగా ఉండగా రాష్ట్రపర్యటనకు వచ్చినప్పుడు, హడావుడీ చేస్తున్న నాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యనీ, ఇతరుల్ని చికాకుతో ప్రశ్నిస్తున్న ఫోటోలు, వివిధ శీర్షికలతో వార్తలూ, సంచలనాత్మకంగా ప్రచురించి, దాన్ని ఆంధ్రుల ఆత్మాభిమానానికి పునాదిగా ప్రోది చేసి, తదుపరి పరిణామ క్రమంలో ఎన్.టి.ఆర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదమే ఊపిరిగా చేసింది. సదరు సినిమా నటుడు ఎన్.టి.అర్. కీ, తెలుగుదేశం పార్టీని, ఆంధ్రుల ఆత్మగౌరవం ఎంతగా పట్టిందో ’నా చెప్పలు నిలబెట్టినా గెలుస్తాయ’న్న ఎన్.టి.ఆర్. వ్యాఖ్యాలూ, ఒక్క కలంపోటుతో మొత్తం రాష్ట్రమంత్రి వర్గాన్ని ఇంటికి పంపించటం వంటి చర్యలూ, చెప్పకనే చెప్పాయి. వీటి గురించి ఇంతకు క్రితం టపాలలో వివరించాను.

దానాదీనా, విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హాజరయ్యినందున హడావుడీ చేసేది స్థానికనాయకులూ, చేయించేది నకిలీ కణిక-7, అతడి ఏజంట్లే! మళ్ళీ దాన్ని విమర్శించేదివాళ్ళ అనుచర మీడియానే. వెరసి, ఆనాటి రాకెట్ ప్రయోగం విఫలమయ్యిందన్న విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అదొక్కటే కాదు. చాలా ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమవ్వటం అప్పటికి మనకి అలవాటే. మన స్వంత ఉపగ్రహాలూ తక్కువ. అధవా మనకు స్వంత ఉపగ్రహాలు ఉన్నా, ప్రయోగింపచేసిందీ ఫ్రెంచిగయానా నుండో, మరొక చోటినుండో!

భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ, 1992 తర్వాత, ఇప్పుడు, ఒకే రాకెట్ ప్రయోగంలో 10 ఉపగ్రహాలని ఆయా కక్ష్యలలో ప్రవేశపెట్టగలుగుతోంది గానీ, అప్పట్లో మన ప్రతిభ అడవిగాచిన వెన్నెల మాదిరి ఉండేది. అంచేత మనదేశం ఉపగ్రహాలను, కొన్ని ఉపగ్రహాల సేవలను, ఇతర దేశాల నుండి అద్దె చెల్లించి పొందుతుండేది. అందులోంచి ’సందట్లో సడేమియా’ సామెత మాదిరి, నకిలీ కణిక వ్యవస్థ, తమ గూఢచార కార్యకలాపాలను నడుపుకునేందుకు వీలుగా, ఉపగ్రహ సేవలలో మరికొన్ని రహస్య సేవలని పొందుతుండేది. అటువంటి విజ్ఞానం, సాంకేతికతల ఉనికి గురించి, సమాచారం గానీ, అవగాహన గాని లేనప్పుడు, ఎవ్వరం దాని గురించి ఏవిధమైన సందేహమూ కలిగి ఉండం కదా! ఒకసారి అనుమానం కలిగి సదరు వ్యక్తి[రామోజీరావు]మీద నిరంతర నిఘా ఏర్పాటు చేసుకున్నప్పుడు, అతడి తీరుతెన్నులు, కార్యకలాపాలు పీవీజీకి, ఐ.బి.కీ, ’రా’కీ క్రమంగా, స్పష్టంగా అవగాహనయ్యాయి. భారతదేశ శ్రేయస్సు కోసం అప్పటివరకూ ఎవరైతే పోరాడుతున్నారో, ఏ సంస్థలైతే పోరాడుతున్నాయో, అదేవిధంగా పోరాడుతున్న కేంద్రప్రభుత్వాలకి [తొలితరం నుండి, శాస్త్రీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ… పీవీజీ వరకూ] ఎవరైతే సహాయసహాకారాలు అందిస్తున్నారో, ఆయా వ్యక్తులూ, ఆయా సంస్థలూ, ఈ పనిని అత్యంత జాగ్రత్తగా, నెమ్మదిగా, నిలకడగా చేశారు.

అప్పటికే స్టాక్ మార్కెట్ కుంభకోణం దగ్గర నుండి, మండల్, మందిర్ గట్రాగట్రాల పరంపరలో అయోధ్యలోని మందిర్ కూల్చివేత పైకారణంగా [Over leaf reason], భారతదేశాన్ని కుప్పకూల్చి, ముక్కచెక్కలు చెయ్యాలన్న పధకం, రచనా స్థాయి దాటి ఆచరణ స్థాయిలో ఉంది. రామోజీరావు రహస్య, గూఢచార కార్యకలాపాలని అనుసరిస్తూ పోయిన పీవీజీకి, భారతనిఘా సంస్థలకి, నకిలీ కణికుల గూఢచార వలయం, వ్యవస్థ, శతాబ్దాల తరబడి వారి చరిత్ర, దేశ, ప్రపంచ చరిత్రల్ని అది లిఖిస్తూన్న తీరూ స్పష్టపడింది. అందుకు ఎన్నో నిరూపణలు కన్పించాయి. కాబట్టే, పీవీజీ, తన ‘అయోధ్య’ రచనలో ’బాబ్రి మసీదు’ వ్యవహారంలో, గెలిస్తే అది సమిష్టి విజయంగా, ఓడితే అది నా ఒక్కడి బాధ్యతగా నా తలకు చుట్టడానికి నా సహచరులంతా ఎప్పుడో సిద్దపడి ఉన్నారు’ అని స్పష్టంగా వ్రాసారు. [దీన్ని విజయవంతంగా నిర్వహించారని చెప్పవచ్చు. 17 ఏళ్ళుగా బాబ్రీ మసీదు కూల్చబడటం పీవీజీ నెత్తికే చుట్టబడింది. కూల్చిన భాజపా, ఆర్.ఎస్.ఎస్.గట్రాలెవరికి ఏ బాధ్యతా లేదు. కళ్యాణ్ సింగ్ కీ నిమిత్తం లేదు. ఆనాడు ఆ జిల్లా ఎస్.పి., నేడు కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి అయిన, మధుకర్ గుప్తాకి అంతకంటే నిమిత్తం లేదు. ఇదంతా ఎంత జయప్రదంగా నిర్వహింపబడిందంటే రెండు,మూడేళ్ళ క్రితం రాహుల్ గాంధీ “మా కుటుంబంలోని వారు అధికారంలో ఉండి ఉంటే, బాబ్రీ మసీదు కూలిఉండేది కాదు” అన్న ప్రకటన సాక్షిగా, బాబ్రీ కూలడానికి నైతికబాధ్యత వహిస్తూ AICC అధ్యక్షురాలిగా సోనియాగాంధీ చెప్పిన క్షమాపణల సాక్షిగా!] అంతేకాదు, ఇప్పుడు ఒకటై పోయిన మూలాయం సింగ్, కళ్యాణ్ సింగ్ లు అప్పుడు ఎంత నాటకీయంగా తమ తమ పాత్రల్ని రక్తి కట్టించారో కూడా పీవీజీ గ్రంధస్తం చేశారు. మూలాయం సింగ్ ముస్లింల ప్రత్యక్ష ప్రతినిధి స్థాయిలో, కళ్యాణ్ సింగ్ హిందువుల పరోక్ష ప్రతినిధి స్థాయిలో, ఎంత పాత్రోచితంగా ప్రవర్తించారో నాటి పత్రికల్లో వార్తలు చదివిన వారికి బాగా గుర్తుండి ఉంటుంది. సదరు కళ్యాణ్ సింగ్ నాటి భాజపా పార్టీ తరుపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రప్రభుత్వంతోనూ, చివరికి కోర్టులోనూ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలతో సహా, ఎంత నిర్భీతిగా ’రెడ్ టేపిజమ్’ ఆట ఆడుకున్నారో కూడా మీరు ’అయోధ్య’ లో చదవవచ్చు. నాటి పత్రికల్లో వచ్చిన వార్తలు గుర్తుండి ఉంటే, వాటితో సరిపోల్చి మరీ విశ్లేషించవచ్చు. ’ఎటూ మసీదు కూలాక, దేశం ముక్కచెక్కలూ అయ్యాక, ఎవరికెవరు బాధ్యులు’ అన్న నిర్భతినే కళ్యాణ్ సింగ్ చూపెట్టింది. గంటలూ, క్షణాలతో సహా, అప్పటి అడ్మినిస్ట్రేషన్ లేఖల్ని సైతం, పీవీజీ తన ‘అయోధ్య’ రచనలో పొందుపరిచారు. చివరికి కోర్టులో న్యాయాధిపతుల్ని ’రా’అధికారులు ’సంప్రదించాక’ హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. కేంద్రప్రభుత్వం కొంచెం ఊపిరి తీసుకోగలిగింది. అదే సమయంలో కోర్టులూ, న్యాయాధిపతులూ కూడా, ఎప్పుడో నకిలీ కణికుల చేతిలో కీలు బొమ్మలయ్యారన్న విషయాన్ని పీవీజీ, భారత నిఘాసంస్థలూ మరోసారి నిర్ధారించుకున్నాయి. నాటి జిల్లా ఎస్.పి.గా మధుకర్ గుప్తా, ఐ.పి.ఎస్. తన పాత్రతాను పోషించాడు. వలయం తమకి తెలిసినందున, అంటే, ‘ఒక ఏజంటుతో సంబంధమున్న ఇతర ఏజంట్లూ, ఎవరి నుండి ఎవరికి ఏవిధంగా సమాచార మార్పిడి జరుగుతోంది అన్న విషయాలు’ తెలిసినందునా, వాటికి నిర్ధారించుకునేందుకు పీవీజీ, భారత నిఘాసంస్థలూ మరికొన్ని ప్రయోగాలు చేసాయి. అప్పటికే తిరిగి చూసుకుంటే ప్రభుత్వంలో ఉన్నతాధికారుల రూపంలో గానీ, సహచర మంత్రుల రూపంలోగానీ, అధిక సంఖ్యలో నకిలీ కణికుడి ఏజంట్లే ఉన్నారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

మనందరికి తెలిసి, ‘సాలార్ జంగ్’ అనగానే అత్యంత అపురూపమైన, అందమైన, వస్తువులతో నిండిన సాలార్ జంగ్ మ్యూజియం గుర్తుకొస్తుంది. మీడియా కూడా సాలార్ జంగ్ గురించి, అతడి వస్తుసేకరణ అభిరుచి గురించి, సదరు మ్యూజియం గురించి, ఎంతో గొప్పగా వ్రాస్తుంది. మ్యూజియం గొప్పదే కావచ్చు, కానీ సాలార్ జంగ్ వెనుక, అతడి తండ్రి, తాతల వెనుక, మనం తెలుసుకోవలసిన చాలా నిజాలు ఉన్నాయి.

1857 లో తొలి స్వాతంత్ర సంగ్రామంగా మనం పరిగణించే సైనిక తిరుగుబాటు నేపధ్యంలో….

ఉత్తర భారతంలోని ఉద్యమకారులకు ప్రారంభంలోనే విజయం చేకూరడంతో హైదరాబాద్ రాష్ట్రంలోని ముస్లింలలో ఉత్సాహం పెల్లుబికింది. మసీదుల దగ్గర ఉద్రేకపూరితమైన ఉపన్యాసాలిచ్చారు. బ్రిటిషు వాళ్ళపై జీహాద్ [పవిత్రయుద్దం] ప్రకటించండని ప్రజలను రెచ్చగొట్టారు. సికింద్రాబాద్, బొల్లారంలోని కంపెనీ సైన్యాన్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఒక ఫకీర్ నగరమంతా తిరుగుతూ బ్రిటిషువాళ్ళపై తిరుగబడాలని ప్రజల్ని రెచ్చగొట్టాడు. ముస్లిం మౌల్వీలు హైదరాబాదు మక్కామసీదు వద్ద ఇచ్చిన మతోపన్యాసాలలో, బ్రిటిషువాళ్ళని ‘ఇస్లాం మత శత్రువులు’గా పేర్కొని, వారిని మనదేశం నుండి తరిమిగొట్టాలని ప్రబోధించారు.

ఔరంగబాదులో ఉన్న కంపెనీ సైన్యంలో, ఎంతోకాలంగా ఉన్న అసంతృప్తి, 1857, జూన్ నాటికి తీవ్రరూపం ధరించింది. ఉత్తరభారతంలో తిరుగుబాటును అణచడానికి తమను ఢిల్లీకి పంపుతారేమోనన్న భయం వారిలో ఏర్పడింది. ఆ అసంతృప్తిని గ్రహించిన బ్రిటిషు అధికారులు, 1857 జూన్ లో, కొందరు సిపాయిలను నిరాయుధులను చేసి జైలుకుపంపారు. ఈ చర్యపై మిగతా సిపాయిలలో బ్రిటీషు వ్యతిరేకత వ్యక్తమైంది. బ్రిటిషువారి సహాయార్ధం, హైదరాబాద్ ప్రధాని సాలార్ జంగ్-1, రెండు అశ్విక దళాలను ఢిల్లీకి పంపిస్తే, మార్గమధ్యంలో వీరు, ‘తాము ఈ యుద్దంలో పాల్గొనబోమనీ, తమ దేశీయులతో కలిసి బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడతామని’ నినాదాలు చేసి ప్రతిఘటించారు.

ఔరంగాబాదులో చీదాఖాన్ అనే మరో జమేదారు కూడా, బ్రిటీషు వారిపై ధ్వజమెత్తి, జాతీయభావాలు రేకెత్తించి, ప్రజల్లో తీవ్ర అలజడి సృష్టించాడు. అతడిని పట్టిచ్చినవారికి 3000 రూపాయలు బహుమతిగా ఇస్తామని బ్రిటీషువారు ప్రకటించారు.[ఆ రోజులలో అది చాలా పెద్దమొత్తమే] చీదాఖాన్ ఔరంగాబాదు వదలి, హైదరాబాదులో విప్లవం సృష్టించాలని బయలుదేరాడు. అతడిని నాంపల్లి రైల్వేస్టేషన్ లో, సాలార్ జంగ్-1 బంధించి 1857 జులై 17న బ్రిటీషు రెసిడెంట్ [ఉన్నతాధికారి]కు అప్పగించాడు. చీదాఖాన్ అరెస్ట్ వార్త నగరమంతా పాకిపోయి, ప్రజలలో అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోయింది. వెంటనే మక్కామసీదులో ఒక పెద్దబహిరంగసభ ఏర్పాటు చేసి, బ్రిటిషు వారి దమననీతికి వ్యతిరేకంగా ప్రసంగించారు. నిజాం వద్దకు రాయబారం పంపి చీదాఖాన్ ను విడిపించాలని ప్రయత్నించారు. సాలార్ జంగ్-1 ఈ ప్రయత్నాలను విఫలం చేశాడు.

మరోసందర్భంలో…. రౌహిల్లా వీరుడు సర్ధార్ తుర్రెబాజ్ ఖాన్ 500 మంది వీరులైన రౌహిల్లాలను తీసుకుని 1857 జులై 17 వతేదిన హైదరాబాదులోని రెసిడెన్సీపై దాడికి బయలుదేరాడు. రెసిడెన్సీకి దగ్గరలోనే ఉన్న జయగోపాలదాస్, డబ్బుసింగ్ ల ఇళ్ళపైకి రొహిల్లాలు తమ ఆయుధాలతో ఎక్కి, రెసిడెన్సీపై కాల్పులు జరిపారు. రోడ్లపైన ఉన్న జనం రొహిల్లాలకు మద్దతుపలికారు. ఈ ఉద్రిక్తతను గమనించిన అధికారులు రెసిడెన్సీ ద్వారాలన్నీ మూసివేశారు. రొహిల్లాలు రెసిడెన్సీపై తుపాకీ గుళ్ళవర్షం కురిపించారు. కొన్ని గేట్ల ద్వారాలను పగులగొట్టారు. అప్పుడు బ్రిటిషు రెసిడెంట్ గా ఉన్న క్యాహంస్, రెసిడెన్సీ లోపలి నుండి ఎదురుకాల్పులు జరిపించాడు. ఆరోజు రాత్రంతా ప్రత్యర్ధి వర్గాలపై కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దివాన్ అయిన సాలార్ జంగ్-1, బ్రిటీషు రెసిడెంట్ ను కాపాడటానికి తనకు నమ్మకమైన అరబ్బుల పటాలన్ని, రొహిల్లాల పైకి పంపించాడు. తుర్రెబాజ్ ఖాన్ తప్పించుకుని పారిపోయాడు. రొహిల్లాలు యుద్దానికి స్వస్తి చెప్పారు. ఈ సంఘటనలో 30మంది రొహిల్లా వీరులు చనిపోయారు. నిజాం సైనికులు తుర్రెబాజ్ ఖాన్ ను, అతని అనుచరుడైన మౌల్వీ అల్లాఉద్దీన్ ను, సాత్ కాల్వా అనే గ్రామంలో బంధించి హైదరాబాదుకు తీసుకువచ్చారు. తుర్రెబాజ్ ఖాన్ కు, మౌల్వీ అల్లావుద్దీన్ కు ద్వీపాంతరవాస శిక్ష విధించారు. తుర్రెబాజ్ ఖాన్ కారాగారం నుంచి తప్పించుకుని పారిపోతుండగా తుపాకీ గుళ్ళకు బలైపోయాడు. బహుశః ఇది బూటకపు ఎన్ కౌంటర్ కావచ్చు.

మరో సందర్భంలో సాలార్ జంగ్-1 ద్రోహం! షోలాపూర్ సంస్థానానికి రాజా వెంకటప్ప నాయక్ అధిపతి. ఇతడికి దేశభక్తి ఎక్కువ. అనేకమంది జమీందార్లను బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాటానికి పురికొల్పాడు. సిపాయిల తిరుగుబాటు సందర్భంగా, ఈయన తన రాయబారి అయిన సుంకేశ్వర్ ను పీష్వా నానాసాహెబ్ వద్దకు పంపి మంతనాలు సాగించి, ఖమర్ ఆలీ అనే జమేదార్ వద్ద సైన్యాన్ని సమీకరించి, అపారమైన మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నాడు. వీరులైన అరబ్బులను తన సైన్యంలో చేర్చుకున్నాడు.

వెంకటప్పనాయక్ సైన్య సమీకరణ నిరోధానికి ప్రయత్నించి బ్రిటీషువాళ్ళు విఫలమయ్యారు. ఆయన సైన్య సమీకరణకు భయపడి బ్రిటిషు వాళ్ళు 1858 ఫిబ్రవరి 7న షోలాపూర్ మీద తమ సైన్యంతో దాడిచేశారు. భీకరయుద్ధం జరిగింది. ఎందరో బ్రిటిషు సైనిక అధికారులు హతమయ్యారు. వెంకటప్పనాయక్ సైన్యం ఓడిపోవడంతో ఆయన తప్పించుకుని హైదరాబాదుకు వెళ్ళాడు. అతడిని సాలార్ జంగ్ బంధించి బ్రిటిషు వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళు నిర్బంధించారు. నిర్బంధంలో ఉండలేక ఆత్మహత్య[?] చేసుకున్నాడు.

పాలమూరు, అంటే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన, కులకర్ణి నర్సింగరావు బ్రిటిషువాళ్ళతో వీరోచితపోరాటం జరిపాడు. ప్రధమ సంగ్రామ కారకులలో ముఖ్యులైన నానాసాహెబ్ స్వయంగా కులకర్ణికి ఉత్తరం రాసి ’మీలో దేశభక్తి మెండుగా ఉందని, ప్రజలను జాగృత పరచి బ్రిటిషువాళ్ళపై రణభేరి మోగించాల్సిందిగా’ కోరాడు. దీంతో కులకర్ణి సైన్యాన్ని సమాయత్తపరచి, బ్రిటిషువాళ్ళపై యుద్దం ప్రకటించాడు. ఈ ఆకస్మిక దాడిని తట్టుకోలేక, బ్రిటిషువాళ్ళు పలాయనం చిత్తగించగా, ఆ ప్రాంతమంతా స్వాతంత్ర్యం సాధించినట్లు ప్రకటించాడు. కొన్నాళ్ళ తర్వాత బ్రిటిషు రెసిడెంట్, అధునాతన ఆయుధాలతో వచ్చి నర్సింగరావును బంధించి, వధించాడు.

హైదరాబాదు సంస్థానంలో ఇలాంటి పోరాటాలు చాలామంది వీరులు చేశారు. ముస్లింవీరులు, హిందూ వీరులు పోరాటాలు చేసి, సాలార్ జంగ్-1 ద్రోహాలతో దొరికిపోయారు. హైదరాబాదులో 1857లో జరిగిన పోరాటాలను అణచి వేయడంలో అప్పటి నిజాం మహబూబ్ ఆలీఖాన్, అతడి దివాను సాలార్ జంగ్ బ్రిటిషువారికి ఎంతో తోడ్పాటునిచ్చారు. నిజాం మహబూబ్ కు ’యారెవఫాదార్’ [Faithfull Ally] బిరుదు వచ్చింది. 1861లో విక్టోరియా రాణి, నిజాంకు ’స్టార్ ఆఫ్ ఇండియా’ అనేబిరుదును ప్రదానం చేసింది.

1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఫలితంగా, భారతదేశంలో కంపెనీ పాలన అంతమొంది, బ్రిటిషు రాణి పాలన మొదలయింది. 1858 నవంబరు 1న క్వీన్ విక్టోరియా అధికారాన్ని స్వీకరించింది.

అప్పటి వరకు బ్రిటిషు పాలనను హైదరాబాదు సంస్థానంలో వీరులు, సామాన్యజనం, [ముస్లింలైన సరే, హిందువులైన సరే] వ్యతిరేకించారు. అదే 70 నుండి 90 సంవత్సరాలు తిరిగేసరికి, నకిలీ కణికుడి స్ట్రాటజీ, వాస్తవ పరిస్థితులనుఎంతగా మార్చేసిందో, విభజించి పాలించే తంత్రంతో ఎంతగా హిందూ – ముస్లింల మధ్య అంతరాలు పెంచిందో, కాశిం రజ్వీ రజాకర్లు ఎలా ప్రారంభమయ్యారో మరోటపాలో వ్రాస్తాను.

సాలార్ జంగ్-1 మనుమడు సాలార్ జంగ్-3 [అబ్దుల్ ఖాసిం మీర్ యూసఫ్ ఆలీఖాన్] ప్రసిద్దుడు. అతడు సేకరించిన వస్తువులనే, మనం, ఇప్పుడు, హైదరాబాదు సాలార్ జంగ్ మ్యూజియంలో చూస్తున్నాం. సాలార్ జంగ్-3 35 ఏళ్ళపాటు ఎడతెరపి లేకుండా ప్రపంచనలుమూలల నుండి సేకరించిన పురాతన వస్తువుల్లో 43,000 కళాఖండాలు ఉన్నాయి. ఇంకా 47,000 పుస్తకాలు, 9,000 రాతప్రతులు ఉన్నాయి. సాలార్ జంగ్-1 ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకడు. ఇతడి మనుమడైన సాలార్ జంగ్-3 కూడా, 23 ఏళ్ళకే హైద్రాబాద్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. అయితే తరువాత కాలంలో ఆ పదవికి రాజీనామా చేసి వస్తుసేకరణకే వినియోగించాడు.

మొదట్లో వీటిని ఆలీఖాన్ తన ఇంట్లోనే ప్రదర్శనకు ఉంచాడు. మ్యూజియాన్ని కట్టాలని అనుకుంటున్నంతలోనే 1949 మార్చి 2న చనిపోయాడు. తరువాత 1951లో ఆయన సేకరించిన వస్తువులతో సాలార్ జంగ్ మ్యూజియాన్ని ప్రభుత్వం స్థాపించింది. అనంతరం 1968 లో కొత్తభవనాన్ని కట్టి అక్కడికి తరలించింది. ఇందుకోసం తెరవెనుక నకిలీ కణిక వ్యవస్థ పనిచేసింది. సాలార్ జంగ్ వంశీయులు తమకి చేసిన సేవలకి ప్రత్యుపకారమన్న మాట ఇది, అంటే కీర్తి, ఇమేజ్ ఇవ్వటం.

ఇక్కడ గమనిస్తే నకిలీ కణికుడి స్ట్రాటజీ చక్కగా కన్పిస్తుంది. సాలార్ జంగ్-1 బ్రిటిషువాళ్ళని వ్యతిరేకిస్తున్న వీరులందరిని పట్టించాడు. ప్రపంచంలోనే అత్యంతధనికుడైన నవాబుగా పేరుప్రఖ్యాతులు పొందాడు. అతడి కొడుకు సాలార్ జంగ్-2, నిజాం కుమారుడికి స్నేహితుడుగా చలామణిఅయ్యాడు. తరువాత అభిప్రాయ బేధాలతో పూనాకి పోయాడు. అల్పయుషుగానే చనిపోయాడు. తరువాత సాలార్ జంగ్-3. సాలార్ జంగ్-3 కూడా అభిప్రాయబేధాలతో నిజాం ప్రభుత్వం నుండి బయటకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన వస్తువులను సేకరిస్తూ గడిపాడు. అతడు చనిపోయిన తరువాత కూడా, ప్రభుత్వం, 1968లో చక్కగా అతడి పేరుమీద మ్యూజియం కట్టించి, అతడి కీర్తిప్రతిష్ఠలు ఇనుమడింపజేసింది. అదే నకిలీ కణికుడి ఇచ్ఛ మరోలా ఉంటే సాలార్ జంగ్-3 సేకరించిన పురాతన వస్తువులన్ని ప్రభుత్వనిరాదరణకు గురై, వేర్వేరు మ్యూజియంలకు తరలింపబడి ఉండేవి.

మనందరికి అతడు, అతడి తాత, తండ్రులు చేసిన దేశద్రోహం గురించి ఏమాత్రం తెలియకుండా, మీడియా, సాలార్ జంగ్ మ్యూజియం గురించి, సాలార్ జంగ్-3 సేకరించిన వస్తువుల గురించి మాత్రమే ప్రచారిస్తుంది.

ఇలాంటి స్ట్రాటజీనే చరిత్రలో చూస్తే, గ్యాలియర్ రాజులు సింధియాలు కన్పిస్తారు. వీళ్ళు కూడా ఝాన్సీలక్ష్మిబాయిని బ్రిటిషువాళ్ళకి పట్టించటానికి ప్రయత్నించారు. బ్రిటిషు వాళ్ళకి తొత్తుగా సింధియాలు పనిచేసారు. స్వాతంత్రం తరువాత, అదే సింధియాలు క్రమంగా కాంగ్రెస్, భాజపా పార్టీలలో కీలకస్థానాలలో ఉన్నారు. ఈరోజు ఎవ్వరికి వాళ్ళ దేశద్రోహ చరిత్ర కనిపించటం లేదు. అలాగే మన రాష్ట్రంలో విజయనగరం రాజులు కూడా అంతే!

సాలార్ జంగ్, సింధియాలు, గట్రాగట్రా వంశస్థుల ముందుతరాలు చేసిన దేశద్రోహాలను పరిగణనలోనికి తీసుకుందామా, లేక తరువాత తరాలు కట్టించిన మ్యూజియంలు, గుడులు, గోపురాలు, ఛారిటబుల్ ట్రస్టులు పరిగణనలోనికి తీసుకుని సంతోషిద్దామా?
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

LTTE ని పైకారణంగా నిలబెట్టి, రాజీవ్ గాంధీ హత్యని 1991 లో నకిలీ కణిక-7 నిర్వహించాడు. అంతకు ఒక సంవత్సరం ముందే ఎంతో గతవైభవం గల USSR ని కుప్పకూల్చాడు. గొప్ప సమర్ధత గల గూఢచార సంస్థగా పేరుప్రఖ్యాతులూ, చరిత్రాగల కె.జి.బి. ఏమీ చెయ్యలేకపోయింది పాపం! దేశం కుప్పకూలుతుందన్న విషయం కనిపెట్టలేకపోయింది కాబోలు! నిజానికి కె.జి.బి. చెయ్యగలిగింది మాత్రం ఏముంది? అది ఎటూ నకిలీ కణిక వ్యవస్థ ఇమేజ్ ఇస్తే వెలిగిపోయిన బొమ్మ మాత్రమేన య్యే! నిజానికి ఏదేశ చరిత్ర చూసినా, ఒకటే శృతి! 1920లో లెనిన్ భావ తీవ్రతతో స్ఫూర్తి పొంది, ఉవ్వెత్తున ఎగసిన విప్లవం, సామ్యవాదాన్ని వాస్తవరూపంలోకి మలచింది. జనచైతన్యానికి గల బలాన్ని నిరూపించింది. అదే కథ భారతదేశానిది కూడా! మహాత్మా గాంధీ భావతీవ్రతతో స్ఫూర్తిపొంది, కదం తొక్కిన ప్రజలు, పెల్లుబికిన జనచైతన్యం భారతదేశాన్ని బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి విముక్తం చేసింది. అయితే క్రమంగా రెండుదేశాలలోనూ, నిజాయితీ, నిబద్దత గల నాయకత్వాన్ని నాశనం చేసి, కనుమరుగు చేసి, ప్రజా దృక్పధాన్ని ’స్లోపాయిజన్’ వంటి తమ ప్రచార స్ట్రాటజీలతో నిర్వీర్యమూ, నిష్ప్రయోజనమూ చేసి, క్రమంగా చేవఛస్తూన్న, నీరుగారుతున్న జాతికి తమ ఏజంట్లని నేతలుగా చేస్తూ పరోక్షంగా ఆ దేశం తమ పాలనక్రిందకి వచ్చేటట్లు చేసుకోవడమే నకిలీ కణికుల స్ట్రాటజీ, పనితీరు. కాకపోతే ఈ ప్రక్రియ USSR లో చాలా త్వరగా జరిగిపోయింది. 1917లో ప్రారంభమైన విప్లవం 1920లో USSR గా ఆవిష్కరింపబడ్డాక, నాలుగేళ్ళలో లెనిన్ పరలోకగతుడైనాడు. తర్వాత స్టాలిన్ లూ,... బ్రెజ్నెవ్ లూ, కృశ్చేవ్ లూ… సంస్కరణల పేరిట పెరిస్త్రోయికా అన్న నినాదలతో గోర్పోచేవ్ లూ, ఎల్సిన్ లూ… వెరసి కుప్పకూలిన USSR, అది ఎందుకు కూలింది అన్న విశ్లేషణలు. ఇదంతా పరిశీలించాక, కె.జి.బి. నకిలీ కణికుల చేతిలోని బొమ్మ కాదనుకోగలమా?

అయితే ఈ ప్రక్రియ భారతదేశంలో అంత తేలిక కాలేదు. నకిలీ కణికులకి నాయకత్వాన్ని నాశనం చేసి కనుమరుగు చెయ్యటానికి లాల్ బహుదూర్ శాస్త్రి దగ్గర నుండి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల వరకూ ఎన్నో ప్రయాసతో కూడిన ప్రయత్నాలు చెయ్యవలసి వచ్చింది. అట్లయ్యీ చైనా యుద్దం తర్వాత భారత నాయకత్వం అప్రమత్తం అయ్యింది. కుట్ర గురించి పరిశీలన, కుట్రదారుల గురించి అన్వేషణా ప్రారంభించింది. ఆ పోరాటం ఇందిరాగాంధీ హయాంలో మరింత తీవ్రతని సంతరించుకుంది.

ఈ సంఘలనలన్నిటినీ నకిలీ కణికుల పరంగా చూస్తే…. 1990 లో USSR ని కుప్పకూల్చడంతో వారిలో ముఖ్యంగా నకిలీ కణిక-7 లో అతివిశ్వాసం పెరిగిపోయింది. ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్దానికి ఒక కారణంగా దశాబ్దాలపాటు చూపబడిన USSR! అమెరికాతో పోటాపోటిగా, ఒకోసారి ఓ అడుగు ముందు అంతరిక్ష ప్రయోగాల దగ్గర నుండి అత్యాధునిక ఆయుధాల నిర్మాణం వరకూ…. అత్యంత ప్రబల శక్తిగా వెలిగిపోయిన USSR! చాలా మామూలుగా, ఎంతో సహజంగా, నకిలీ కణికుడి ప్రపంచవ్యాప్త ఏజంట్లు ప్రచారించి చూపెట్టిన పైకారణాలని[overleaf reasons] అందరూ నమ్మేంత సహజంగా కుప్పకూలింది. అటువంటప్పుడు ’అమెరికాని సైతం ఎప్పుడు కావాలంటే అప్పుడు కుప్పకూల్చవచ్చు’ అనుకున్నాడు నకిలీకణిక-7. ఎందుకంటే సి.ఐ.ఏ. సైతం తన చేతిలోని బొమ్మే గనుక. తాను ఇమేజ్ ఇస్తే వెలుగుతున్న బొమ్మే గనుక. అందులో ఉన్న కీలక వ్యక్తుల్లో దాదాపు అందరూ తన ఏజంట్లే. తమ మాతృదేశం అమెరికా పట్ల నిబద్దత గలవారు తను సృష్టించిన ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. ఆత్మరక్షణ సైతం కష్టమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఖచ్చితంగా చెప్పాలంటే ’అమెరికా కంటే పాకిస్తాన్ కే బలమెక్కువ’ అనీ, ’సి.ఐ.ఏ. కంటే ఐ.ఎస్.ఐ. శక్తివంతమైన’దనీ ఇప్పుడందరికీ క్రమంగా కన్పిస్తోంది గానీ, అప్పటికి అంటే – 1991 -1992 ల్లో నకిలీ కణిక-7 కీ, అతడి ఆంతరంగికులైన కొందరికీ తప్ప ఎవరికీ తెలియదు గదా! ’కాబట్టి అమెరికాని ఎప్పుడు కావాలంటే అప్పుడు తను చాలా మామూలుగా కుప్పకూల్చగలడు’ - ఇదీ నకిలీ కణిక-7 కి గల ధృఢమైన అభిప్రాయము. అందుచేత అమెరికా కంటే ముందు తనకి ఎప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న భారతదేశాన్ని కుప్పకూలిస్తే, ఇక అమెరికాతో సహా ప్రపంచమొత్తం తన గుప్పిటలోకి తీసుకోవటం తన చేతిలోని పని! కాబట్టి తదుపరి లక్ష్యం భారతదేశమే! అందుకు తగిన పధకాన్ని, స్ట్రాటజీని చాలా స్పష్టంగా రచించుకున్నారు నకిలీ కణిక-7, అతడి అంతరంగిక ఏజంట్లు దీని గురించిన పూర్తివివరాలు గతటపాల్లో వ్రాసాను. ఆ ప్రకారమే 1991, మే లో రాజీవ్ గాంధీని హత్య చేసారు. పైకి LTTE నేత వేలుపిళ్ళై ప్రభాకరన్ కనపడ్డాడు. కానీ 18 ఏళ్ళ తర్వాత, నిన్నమొన్న, ప్రభాకరన్ మరణం, లంక సైన్యపు విజయం, ఆ నేపధ్యంలో రాజపక్సే చుట్టు చాలా దేశాల నేతలూ, రాయబారులూ జరిపిన లాబీయింగ్, మనమంతా కళ్ళప్పగించి చూసిందే! కెనడా సైతం కొలంబో చేరి లాబీయింగ్ చేయటం చూశాక, లెబనాన్ వంటి దేశాలు LTTE కి శిక్షణ నివ్వటం గురించి తెలిసాక, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి చాలా దేశాలు రాజపక్సేని ప్రభాకరన్ కోసం వత్తిడి చేయటం గమనించాక, ప్రభాకరన్ మరణానంతరం బయటికొస్తున్న అనుమానాల వార్తలు చదివాక…. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది కదా, వేలుపిళ్ళై ప్రభాకరన్ మరియు LTTE వ్యవహారం కేవలం లంకకీ, సింహళులూ Vs. తమిళుల సమస్యలకీ పరిమితమైనది కాదని, ప్రభాకరన్ కీ మరియు LTTE కీ, ప్రపంచవ్యాప్త గూఢచార వలయానికి సంబంధించినదనీ? ప్రపంచవ్యాప్త గూఢచార వలయమూ, వ్యవస్థా, నకిలీ కణికులది గాక మరెవ్వరిది? అయితే 1991 లో గానీ, 1992 లో గానీ ఈమాట చెబితే నమ్మేవాళ్ళెవరు? అసలు ఆమాట అనేందుకు అలాంటి ప్రపంచవ్యాప్త గూఢచార వలయాన్ని నడపగల వ్యవస్థ ఒకటి ఉందన్న అనుమానమే ఎవరికీ లేదయ్యె! అంతేగాక ప్రపంచవ్యాప్తంగా అన్నీ నడపగల నకిలీ కణిక వ్యవస్థ, పైకి సి.ఐ.ఏ. బొమ్మని నిలబెడుతుందయ్యె!

ఈ నేపధ్యంలో 1991 లో రాజీవ్ హత్యానంతరం, సోనియాగాంధీ స్వయంగా పార్టీ నాయకత్వానికి పీవీ నరసింహారావు పేరు ప్రతిపాదించింది.[నిజానికి సీనియారిటీ ప్రకారం పీవీనరసింహారావు కంటే ప్రణబ్ ముఖర్జీ ముందున్నాడు. కానీ ఒకసారి రాజీవ్ గాంధీని నిరసిస్తూ, పార్టీ నుండి బహిష్కరింపబడ్డాడు. తరువాత తిరిగి పార్టీలో చేరాడు. ఆ విధంగా పార్టీలో తన సీనియారిటీ పోగొట్టుకున్నాడు. పార్టీలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా నడిచి, సీనియారిటీ ప్రకారం పీవీజీ ప్రధానిగా గద్దెనెక్కారు.] 1991 జూన్ లో పీవీజీ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అక్కడి నుండి 1992 జూన్ లోపల ఎన్ని సమస్యలు అగ్ని గుండాల్లా ప్రజ్వరిల్లాయో గతటపాల్లో వివరంగా వ్రాసాను. దేశాన్ని కుప్పకూల్చడానికి అన్నివిధాలా ఏర్పాట్లు జరిగిపోయాయి. గతంలో పనిచేసిన వీపీసింగ్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కారణంగా, తర్వాత పనిచేసిన చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారం ప్రపంచవిపణిలో తనఖా పెట్టింది. తర్వాత వచ్చిన పీవీజీ ప్రభుత్వం, అనివార్యమై, సరళీకృత ఆర్ధిక విధానాలకి తెరతీయాల్సి వచ్చింది. ఇప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి ఆర్ధికమంత్రిగా అందులో కీలకపాత్రే పోషించాడు. అప్పటికే సంసిద్ధం చేయబడిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం ఒక్కసారిగా భగ్గుమంది. స్టాక్ మార్కెట్ కుంభకోణం, లారీల సమ్మె పేరుతో ఆర్ధికపరమైన దెబ్బ, మండల్ పేరుతో కులాల క్కుమ్ములాట, మందిర్ పేరుతో మారణహోమం, నక్సలిజం పేరుతో హింసోన్మాదం, పంజాబ్, కాశ్మీర్, నాగాలాండ్, బోడోలాండ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో టెర్రరిజం పేరుతో వేర్పాటు వాదం… ఎటు చూసినా సమస్యల సుడిగుండాలే!

అన్నిరకాలుగా పీవీజీ పై గురిపెట్టబడింది. ఇన్నేళ్ళుగా తన మేధస్సుతో, పరిశీలనతో, నిబద్దతతో దేశశ్రేయస్సు కోసం పాటుపడినందుకు, ఇందిరాగాంధీకి మద్దతుగా గూఢచార యుద్ధం కొనసాగించినందుకు నకిలీకణిక-7, పీవీజీ కి బాగా ’బుద్ధి’ చెప్పాలనుకున్నాడు. అందుకే దేశనాయకత్వాన్ని ఆయన భుజాన పెట్టి, ఆయన హయాంలో దేశాన్ని కుప్పకూల్చి, ముక్కలూ చెక్కలూ చేసి, ఆ దుష్కర్తీని ఆయన నెత్తిన పెట్టాలనుకున్నాడు.

సరిగ్గా ఇక్కడే నకిలీ కణిక-7 కీ, అతడి అనుంగు సోదరీతుల్యరాలైన సోనియాగాంధీ, ఇంకా నకిలీ కణిక-7 అంతరంగిక ఏజంట్ల విధి వక్రించింది. ఈమాట ఖచ్చితంగా, ఒకటికి పదిసార్లు, ఖరాఖండిగా చెబుతాను. ఎందుకంటే అప్పటికి నకిలీ కణిక గూఢచార వ్యవస్థతో అభిమన్యుడిలా పోరాడుతున్నాడు పీవీజీ. అప్పటికి ఆయనకి 72 ఏళ్ళ వయస్సు ఉన్నా, నకిలీ కణికుల వ్యవస్థకి 340 ఏళ్ళకుపైగా వయస్సున్నది. కాబట్టి నకిలీ కణిక వ్యవస్థతో పోలిస్తే భారతప్రధానిగా పీవీజీ, ఐ.బి., ’రా’ వంటి సంస్థలన్నీ కలిసినా వీరి స్థితి కురసేనతో పోలిస్తే అభిమన్యుడి వంటిదే! గూఢచార పద్మవ్యూహం లోంచి బయటపడే మార్గం కనపడని స్థితి అది.

ఈస్థితిలో పీవీజీ దృష్టికి రామోజీరావు రహస్యకార్యకలాపాల గురించి నేను ఫిర్యాదు చేసాను. అప్పటికి నా వయస్సు తక్కువ. జీవితపు అనుభవం తక్కువ. గూఢచర్యం అన్నపదానికి అర్ధం కూడా తెలియదు నాకు. రాజీవ్ గాంధీ హత్యకు పధకరచనలో రామోజీ రావు ప్రమేయముంది అన్న సమాచారం, నన్ను విభ్రాంతి పరచింది. పాతబస్తీ పసిపాప ముఖంపై మతఘర్షణలు చేసిన కత్తి గాయం నాలో కోపం, దుఃఖం రేపింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయన్న విషయం నాకు భయాన్ని, ఆందోళనని కలిగించింది. ఈనాడులో పనిచేసే నాస్నేహితురాలి నుండి నేను సేకరించిన ఈ మొత్తం సమాచారం నన్ను నిలవనీయలేదు. [దీని గురించి వివరమైన టపాలు మీరు చదివి ఉన్నారు] నా దగ్గర ఉన్న సమాచారంతో సోనియాగాంధీని కలుద్దామా అని కూడా అప్పట్లో ఆలోచించాను. ఎందుకంటే ‘స్వయంగా భర్తను పోగొట్టుకున్నది కాబట్టి ఆమెని ఖచ్చితంగా నమ్మవచ్చు’ అనుకున్నాను. అలా చేసి ఉన్నట్లయితే ఇప్పుడీ బ్లాగు వ్రాయటానికి నేను ఉండి ఉండేదాన్ని కాదు. చివరికి 1992 మే చివరిరోజుల్లో, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నరు కుముద్ బెన్ జోషిని కలిసి, ప్రధానమంత్రి పీవీజీ అపాయింట్ మెంట్ ఇప్పించమన్నప్పుడు, ఆవిడ ‘ఇలాంటివాటిల్లో తలదూరిస్తే నీ జీవితం miserable అయిపోతుంది’ అని హెచ్చరించినపుడు కూడా, మళ్ళీ ఓసారి సోనియాగాంధీని కలిసి రామోజీరావు గురించి, రాజీవ్ హత్యగురించిన సమాచారం గురించీ ఫిర్యాదు చేద్దామా అని ఆలోచించాను. అయితే ఢిల్లీలో సిటిబస్సు డ్రైవర్ ఉదంతం [దీని గురించి గతంలో వ్రాసాను] తో భగవద్గీత నాకు ప్రధానమంత్రిని కలవమనే చెబుతోంది అన్న నిర్దారణకు వచ్చాను. మరింకేమీ ఆలోచించకుండా, నాటి ప్రధాని పీవీజీ నివాసంలో నా రహస్యఫిర్యాదు దాఖలు చేసాను. అప్పటికి నాకు గూఢచర్యం అంటే అర్ధమే సరిగా తెలియదు. అలాంటిది ఆసలు గూఢచార వలయం ఒకటి ఉండగల అవకాశం గురించి ఏం ఊహించగలను? ఇదంతా గమనించినప్పుడు ఖచ్చితంగా ఇది భగవంతుడి లీలగానే కన్పిస్తుంది. భగవద్గీత చెప్పినట్లు ఎవరికర్మని వారు, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించటంగానే కన్సిస్తుంది. కాబట్టే నకిలీ కణిక-7, అతడి ఆంతరంగికుల విధి వక్రించిందని ఖచ్చితంగా చెబుతానని అన్నాను.

ఈ సందర్భంగా పధ్నాలుగు ఏళ్ళక్రితం పీవీజీ అన్నమాట – “ముందున్న రోజుల్లో మారణాయుధాలతో కాదు, మెదళ్ళతో యుద్దాలు జరుగుతాయి” అన్నవిషయం స్ఫురణకు తెచ్చుకోవచ్చు. పీవీజీ ఉద్గాటించిన ఈమాట గురించి ఈనాడు ఇటీవలే తన సంపాదకీయంలో మరోసారి ఉటంకించింది. ‘మెదళ్ళతో యుద్దం’ ఎలా ఉంటుందో మున్ముందు టపాల్లో చూద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

భారతీయుల భావ సంపద గొప్పది. వేల సంవత్సరాల నుండి భారతీయుల దృష్టిలో ధనం, సంపద, ఉపాధి అన్నవి కొన్ని పరిమితులకు లోబడి ఉన్న విషయాలు. ఆత్మోన్నతి అన్నభావన భారతీయుల దృష్టిలో అవధులు లేనట్టిది. ఆత్మ, పరమాత్మ స్థాయికి చేరాలని, మనిషి మహాత్ముడు కావాలని, నిరంతర అన్వేషణ జరిపిన జాతి ఇది.

కాబట్టే ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం సామ్రాజ్యాన్ని వదులుకున్న హరిశ్చంద్రుడు, కాటి కాపరికి తనను తాను విక్రయించుకున్న హరిశ్చంద్రుడు తరతరాలుగా భారతీయులకు ఆదర్శమూర్తి, స్ఫూర్తి ప్రదాత. ఇది భారతదేశ ఆధునిక చరిత్ర సైతం ఆవిష్కరించిన సత్యం. అలాగే తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టటం కోసం రాజ్యాన్ని, భోగభాగ్యాలని విడిచిపెట్టి అరణ్య వాసం ఆచరించిన శ్రీరాముడు భారతీయులకి దైవస్వరూపుడు.

అంతగా విలువలు కలిగినవి భారతీయుల మూలాలు. ఇవి కులాలకి, మతాలకి అతీతంగా ఈ కర్మభూమికి ఉన్న లక్షణం, ఈ భూమి మీద ఊపిరి పోసుకున్న రక్తానికి ఉన్న లక్షణం. ఈనాటికీ, ఎంతగా విషప్రచారం ఎల్లెడలా నిండిపోయినా, అన్ని దిక్కుల నుండీ భౌతిక వాదం హోరెత్తిస్తున్నా, భావవాదపు నీడను వదలిరాలేని తత్త్వం భారతీయులది. ఎంతగా మార్పు చెందిందని భావించినా, లోలోతుల్లో, ఇప్పటికీ, ఇంకా కొన ఊపిరి తోనైనా సరే సజీవంగానే ఉన్న నైజం ఇది.

కాబట్టే ’ఇచట బుట్టిన చిగురు కొమ్మైనా చేవఁ’ అన్నాడు విశ్వనాధ సత్యనారాయణ. ఎందరెన్ని విధాలా నరికి పోగులుపెట్టినా, తిరిగి చిగురించగల మహా వటవృక్షం భారతీయుల ఆలోచనా సరళి. ఎంతగా అబద్దాలతో, అసత్య ప్రచారాలతో నమ్మించినా, సత్యపు సెగ తగిలిన తర్వాత, సూర్యుడి కిరణాల తాకిడికి కరిగి మాయమయ్యే మంచుతెరల్లా, భారతీయుల్ని కప్పిన కృత్రిమ భావజాలపు ప్రచార హోరు నాశనమై తీరుతుంది. కాబట్టే అప్పటికి దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటీషు వ్యవస్థ, ఆ ముసుగు మాటున ఉన్న నకిలీ కణిక వ్యవస్థ, ‘ఆత్మన్యూనతా ప్రచారం, పాశ్చాత్యుల భౌతిక రసాయనిక శాస్త్ర సాంకేతిక విజయాలతో కూడిన ఆధిపత్యపు ప్రచారాల’తో భారతీయుల్ని హోరెత్తించినా, తిలక్ మహాశయుడి వంటి అతివాదులూ, మహత్మాగాంధీ వంటి మితవాదులూ కూడా, భగవద్గీత చేత బట్టి సత్యదర్శనం చేయించగానే, నిరాయుధులుగానే సత్యాహింసలతో స్వాతంత్రం సంపాదించుకున్నారు.

పోల్చి చూస్తే భారతీయుల ఆలోచనా సరళి, భావవాద మూలాలు ఊడలు దిగిన మర్రివృక్షం లాంటివి. ఒక ఊడ నరికితే, భారతీయులు మరో ఊడని ఊతగా పట్టుకుంటారు. అంతేగాని తమ స్వభావ సిద్దమైన భావాలని, విలువలని వదిలేసి దమ్మిడీల వెనుక తీసే పరుగులో ఆసాంతం పడిపోరు. కాబట్టే, ఇప్పటికీ, భారతీయేతరులతో పోలిస్తే, భారతీయుల పదార్ధవాదపు దృష్టి, దమ్మిడీల పరుగు తక్కువే. కాబట్టే భారతదేశంలో ‘ఇన్ని విడాకుల కేసులు పెరిగాయి, అన్ని వివాహాలు విచ్చిన్నం అయ్యాయి’ అంటూ మీడియా హోరెత్తిస్తున్నా, ఎంతమంది ’నీనాగుప్తా’లు పెళ్ళికాకుండా గర్భం దాల్చడాన్ని ఓ సెలబ్రిటి సింబల్ గా మార్చేసి, ’నాబిడ్డకు తండ్రెవరో అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ ఆమె భారతీయ సంప్రదాయాల పట్ల ధిక్కారం చూపిందంటూ, అప్పటి మీడియా అరచిగోల పెట్టినా, [1992 తర్వాత సదరు సినిమా, టీవీ నటి నీనాగుప్తా తన కుమార్తె తండ్రి క్రికెట్ ఆటగాడు వీవియన్ రిచర్డ్స్ అంటూ, తన ప్రణయోదంతాలన్నిటినీ పత్రికాముఖంగా, కుమార్తె అభిప్రాయాలతో సహా ప్రకటించిందిలెండి] అదే కారణాన్ని చూపెడుతూ ‘భారతీయుల్లో వివాహ వ్యవస్థ కూలిపోతున్నదా’ అంటూ సీరియల్ గా, సీరియస్ గా చర్చలూ, సమీక్షలూ గట్రాలతో సంచలనాలు సృష్టించప్రయత్నించినా, ఇప్పటికీ బిపాసా బసు, జాన్ అబ్రహంల్లాంటి జంటలతోనూ, స్వలింగ సంపర్కుల వివాహ వార్తలతోనూ అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నా…. ఇన్ని చేస్తున్నా కూడా ఇప్పటికీ భారతీయుల కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థా ఇంకా స్థిరంగానే నిలిచి ఉన్నాయంటే – భారతీయుల్లో ‘దమ్మిడీల కంటే, ప్రేమానుబంధాలు విలువైనవి’ అన్న విలువలే కారణం.

అంతేకాదు, జన్మతః, స్వభావరీత్యా భారతీయులు శాంతిప్రియులు. సహన శీలురు. కర్మభూమిలో జన్మించినందున, శ్రమించే తత్వమే వారసత్వంగా తెచ్చుకున్నవారు. ఈ విషయంలో విదేశీయులు భారతీయుల ముందు తీసికట్టని నేను అనటం లేదు. అయితే భారతీయులు ఎవరికీ ఎందులోనూ తీసిపోరని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. కష్టపడి పనిచేయటం తెలిసిన భారతీయులకి గల ఓర్పూ,సహనాలు, ఎంతగా ప్రభావపరచినా ఇంకా ఎంతో కొంతగానైనా విలువలు మిగిలే ఉన్న ఆలోచనా సరళి, నకిలీ కణికులకి భారతదేశం ఎప్పటికీ కొరకరాని కొయ్య అవ్వటానికి కారణాలయ్యాయి.[ఇప్పుడు భారతీయులల్లోని పొదుపరితనం, కష్టించి పనిచేసే గుణం కారణంగానే ఆస్ట్రేలియన్లు అసూయ చెంది భారతీయ విద్యార్ధులపైదాడులు చేస్తున్నారని ఓ వాదన విన్పిస్తోంది.]

ఈ నేపధ్యంలో మీరో విషయం గమనించవచ్చు. ఒక అసత్యాన్ని మీడియా ఎంతగా పదేపదే అదేప్రచారంతో హోరెత్తించినా, అప్పటికి ఆ అసత్యాన్ని అసత్యం అని నిరూపించడానికి తార్కాణాలు లేకపోయినా, అసలు ఆ అసత్యమే పరమసత్యం అనటానికి మరెన్ని సాక్ష్యాలు కన్పించినా, సదరు అసత్య ప్రచారం పట్ల భారతీయుల ప్రతిస్పందన కొంతమేరకే ఉంటుంది. అంతేకాదు…. అప్పటికి తార్కిక కారణాలు కనపడకపోయినా సరే, ’సత్యం’ పట్ల భారతీయులు అసంకల్పితంగానే అయినా ఆకర్షింపబడతారు. ఇది కూడా భారతీయుల రక్తంలోనూ, మూలాల్లోనూ తరతరాలుగా నిక్షిప్తమై ఉన్న లక్షణమే. కాబట్టే దశాబ్ధాల తరబడి సంఘ పరివార్, ఆర్.ఎస్.ఎస్., భాజపా గట్రాలు శతవిధాల హిందువులలో హిందూఉగ్రవాదం రేకెత్తించాలని ప్రయత్నించినా ఫలించలేదు. [దీనిమీద వివరమైన టపా మరోసారి.]

ఇదే అసలు ప్రమాద హేతువు నకిలీ కణికులకి! ఆ విషయమై వాళ్ళకి స్పష్టమైన అవగాహనే ఉంది. ఇదే లక్షణాలని, మూలాలని మరింత ధృఢంగా పుణికి పుచ్చుకున్న పీవీ నరసింహారావు, జీవితంలో ఢక్కామొక్కీలు తిన్న రీత్యా, ఒడిదుడుకులు ఎదుర్కున్నరీత్యా, భగవద్గీత చెప్పే స్థితప్రజ్ఞత సాధన చేసిన రాజకీయవేత్త; దార్శనికుడు.

వీటన్నిటిరీత్యా పీవీనరసింహారావు, తనకి తెలియకుండానే తను, నకిలీ కణికులకి గల ప్రధాన శతృవులలో ఒకడయ్యాడు. అప్పటికి నకిలీ కణికులకి ఇందిరాగాంధీ ప్రప్రధమ శతృవు. ఇంతకు ముందు టపాలలో వివరించిన స్ట్రాటజీల ప్రకారం నకిలీ కణిక-6, నకిలీ కణిక-7, ఇందిరాగాంధీని జయప్రదంగా ఒంటరిని చెయ్యగలిగారు. అయితే నిజం నిలకడమీద తెలుస్తుందన్న సామెత చందంగానే, పీవీనరసింహారావు లోని నిజాయితీ, నిబద్దత, దేశభక్తీ ఇందిరాగాంధీ, పీవీనరసింహారావుని నమ్మగలిగేలా చేశాయి. ఆయన, నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఆంతరంగిక బృందంలోని సభ్యుడైనాడు. వాళ్ళ లక్ష్యం వాళ్ళకి తెలుసు. భారతదేశం మీద కుట్రజరుగుతోందన్న విషయం వారికి నిర్ద్వంద్వంగా తెలుసు. నిఘాసంస్థల నిర్ధారణలతో సహా తెలుసు. అయితే సి.ఐ.ఏ., కె.జి.బి….. ఇలా ఎవరిని పరిశీలించినా, ఏ సంస్థని పరిశీలించినా పూర్తి ఆధారాలు దొరకవు. దొరికినా నిరూపించలేం. ఎందుకంటే బలం వైరివర్గానిదే! దేశం లోపల ఎవరు కీలక వ్యక్తో, ఎవరు ప్రధాన ఏజంటో తెలియదు. ది హిందూ, ఎన్.రామ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రామ్ నాధ్ గోయంకాల దగ్గర నుండి ఎందరో అనుమానితులు. ఎవరిని అనుమానించినా, ముందు అవుననడానికి ఎన్నో కారణాలు కన్పిస్తాయి. అధారాలూ కన్పిస్తాయి. మరి కొంతదూరం కొనసాగేసరికి ఔననడానికి ఎన్ని కారణాలు కన్పిస్తాయో, అందుకు విరుద్దంగా, కాదనడానికి అంతకు రెట్టింపు కారణాలు కన్పిస్తాయి. ఒక స్థానిక పత్రికాధిపతి రూపంలో, లేదా ఓ చిన్నపచ్చళ్ళ వ్యాపారి రూపంలో, లేదా ఓ చిన్న చిట్ ఫండ్ చిల్లరవ్యాపారి రూపంలో ప్రధాన ఏజంట్ సి.ఐ.ఏ. లేదా చైనా లేదా XYZ దేశపు గూఢచార సంస్థకి ఉంటాడన్న విషయం స్పురించలేదు.[ ఈమధ్యే రామోజీరావు చైనా ఏజంటని అతడి సోదరుడి కుమారుడు చెరుకూరి చంద్రమౌళి ఒక పుస్తకం వ్రాసి మరీ ఉటంకించాడట!] అధవా అనుమానించినా, అది పూర్తి రూపం పొందదు. అదీగాక సాక్షాత్తూ ఇందిరాగాంధీ ఇంటనే, కోడలి రూపంలో సోనియాగాంధీని ట్రాన్స్ ప్లాంట్ చేసిన నకిలీ కణిక-7, రామోజీరావులకి ఆ తర్వాతి పరిణామక్రమంలో గూఢచర్యంలో కలిగిన పట్టు, దేశం మీద చేయగలిగిన కుట్ర, ఎంతగా వేగం పెరిగాయో, గతటపాలలో వివరంగా వ్రాసాను.

అట్లయ్యి, ‘రామోజీరావే తాము ఇన్నేళ్ళగా వెదుకుతున్న అసలు ఏజంటు’ అన్న కోణం వైపు దృష్టి సారించగానే [నాదెండ్ల భాస్కర రావు Vs ఎన్.టి.ఆర్. ల ఉదంతం, రామోజీ, రామ్ లాల్ ల నాటకీయత నేపధ్యంలో జరిగిన పరిణామం ఇది] ఇందిరాగాంధీ హత్యగావింపబడింది. ఆవిడ హయంలో విదేశాంగ శాఖ వంటి కీలక శాఖలు నిర్వహించిన రాజకీయ ధురీణుడు పీవీ నరసింహారావు. పరిశీలిన, వివేచన, విశ్లేషణలు నిజమైన రాజకీయవేత్తకు సహజ లక్షణాలు. బాగా దగ్గర నుండి పరిశీలించటం రీత్యా, స్వానుభవంరీత్యా, పీవీనరసింహారావు కి కుట్ర గురించి ఎక్కువ అవగాహన ఉంది. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ హయాంలో కొన్నాళ్ళు క్రియశీలకపాత్ర, ఆఫీసు కార్యకలాపాలు, నిర్వర్తించిన సోనియాగాంధీ వ్యవహార సరళి ఈయనకి తెలుసు. అపార అనుభవం కలిగిన తనకు, అప్పుడే కొత్తగా సృష్టించబడిన మానవవనరుల శాఖ కట్టబెట్టిన నాడూ, విదేశాంగ శాఖనీ, మానవవనరుల అభివృద్ధి శాఖనీ సమంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడాయన. అయితే అనుశృత పరిశీలన మాత్రం ఆయన సొత్తు. తదుపరి రాజీవ్ గాంధీ హత్య వరకూ జరిగిన అన్ని సంఘటనలకూ ఆయన ప్రత్యక్ష పరిశీలకుడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

పీవీ నరసింహారావుగారు 1920 లో జన్మించారు. నేటి తెలంగాణా, నాటి నిజాం సంస్థానం అయిన భూభాగంలో పుట్టిపెరిగిన ఆయనకి, బ్రిటీష్ రాచరిక వ్యవస్థ, దాని పరిపాలనా తీరు తెలుసు. నిజాం నవాబుల క్రౌర్యం, స్వార్ధం, వారి పరిపాలనా తీరూ తెలుసు. ఎన్నో ఆశలతో, కలలు కన్న స్వరాజ్యం, అందులో ప్రజాస్వామ్యం ఏదో తవ్వితలకెత్తుతుందనుకుంటే, అది అమలులో అతి భయంకరంగా విఫలమవ్వటం తెలుసు. చిత్తశుద్దితో కృషిచేస్తున్న తమలాంటి వారికి ఎంతగా ఎదురుదెబ్బలు తగిలాయో తెలుసు. గురి చూసి బాణాలు కొట్టబడిన పక్షుల్లా, నాటి స్వాతంత్రసమరయోధులు, స్వాతంత్రానంతరం ఎలా గిలగిలలాడారో తెలుసు. తెలివి తేటలూ, జవసత్వాలూ గల నవయువకుడిగా నిజాం నవాబుని ఎదిరించిన పోరాట యోధుడాయన. పరిశీలన, తార్కిక ఆలోచనా, తాత్వికచింతనా గల పండితుడు, జిజ్ఞాసి. గనుకనే బహుభాషలని నేర్చాడు.
ఇక్కడ మీకు కొన్ని గీతా శ్లోకాలని ఉటంకించటం సందర్భోచితంగా ఉంటుంది.

భగవద్గీతలోని కర్మసన్యాస యోగంలోనివీ శ్లోకాలు.

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః

భావం: విద్యావినయాలు గల బ్రాహ్మణుని యందునూ, ఛండాలుడు, గోవు, ఏనుగుల యందునూ, శునకమూ, శునక మాంసము వండుకొని తినువాని యందునూ సమదృష్టిగల వాడే పండితుడు.

పండితుడంటే విశ్వవిద్యాలయాల నుండి ఎం.ఫిల్ లూ, డాక్టరేట్ లూ, గట్రా పట్టాలు పొందిన వాడు కాదు. లేదూ పెక్కు ఉద్గ్రంధాలు చదివిన వాడూ కాదు. మహా అయితే వారు విద్యావంతులు లేదా విద్యావేత్తలూ కావచ్చు. పండితుడంటే అన్నిటి యందు, అందరి యందు, సమబుద్ది కలవాడు.

భగవద్గీత ఎల్లప్పుడూ పాండిత్యం కంటే, కళా నైపుణ్యం, ఇతర నేర్పుల కంటే మంచిబుద్ది, స్థిరబుద్ది కలవాడే గొప్పవాడని చెబుతుంది. స్థిరబుద్దిని సాధించటమే బ్రహ్మవిద్య అంటుంది. సాధన ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది. అదెంత కష్టసాధ్యమో! అయిదు నిముషాల పాటు మనస్సుని నియంత్రించటం సైతం, ఎంతో ఓర్పూ సహనాలతో సాధించాల్సిందే. కాబట్టి పండితుడంటే సమదృష్టి, స్థిరబుద్ది కలవాడు.

అలాగే మరో శ్లోకం:

న ప్రహృష్యే త్ర్పియం ప్రాప్యనో ద్విజేత్ ప్రాప్య చాప్రియం
స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవి ద్ర్బహ్మణి స్థితః

భావం:
సుఖాలలో పొంగక, దుఃఖాలకు క్రుంగక, స్థిరబుద్ది కలవాడే బ్రహ్మవేత్త, బ్రాహ్మణూడూనని తెలుసుకో!

ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రాహ్మణుడంటే ఎవ్వరో తేల్చిచెప్పాడు. జన్మతః శాస్త్రి లేదా శర్మల కుటుంబంలో పుట్టినంత మాత్రాన, ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కాదు. అది భగవద్గీత చెప్పే కులవ్యవస్థ కాదు. కాలక్రమంలో రూపుమారి, స్వార్ధపరుల చేతిలో పూర్తిగా రంగుమారి, చివరికి నకిలీ కణికుల ప్రచారంలో సంపూర్తిగా రంగూ రుచీ వాసనా మారి, రాజకీయ క్రీడలో అత్యంత బలమైన ఆయుధంగా మారిన కులవ్యవస్థకీ – భగవద్గీత చెప్పే చాతుర్వర్ణవ్యవస్థకీ అసలు పోలికే లేదు. జన్మతః గాక, గుణాలరీత్యా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర వర్ణాలని భగవద్గీత ప్రవచిస్తుంది. ఇది ఒకవిధంగా గ్రేడ్ సిస్టం వంటిది. మన ’రాజ్యాంగం’ ప్రకారం ప్రతీ దరఖాస్తులో వ్రాయబడే కులం, MRO లు జారీ చేసే కులధృవీకరణ పత్రం, ఆధునికులు అరచి గోలపెట్టే కులగజ్జి, ఇవన్నీ నకిలీ కణికుడి విభజించి పాలించే తంత్రంలోని విభాగాలే! గుణశీలాల రీత్యా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మరింత స్పష్టంగా గుణత్రయ విభాగ యోగం, శ్రద్దాత్రయ విభాగయోగం, దైవాసుర సంపద్విభాగ యోగం, మోక్ష సన్యాస విభాగ యోగంలో భగవద్గీత పూర్తిగా, స్పష్టంగా వివరిస్తుంది. ఇవన్నీ పరిశీలించకుండా, కనీసం గీతలో ఏం వ్రాసి ఉందో కూడా చదవకుండా, చాలామంది ఆధునికులు నకిలీ కణికుల ఏజంట్ల వ్రాతలు చదివి, వారి ఏజంట్లు చిమ్మిన విషం తలకెక్కించుకుని ’కులం’ అన్న మహా కుట్రలో తమ వంతు పాత్ర తాము పోషిస్తూ ఉంటారు. ఇది వారికి తెలిసి చేసినా, తెలియక చేసినా, కుట్రలో తమ పాత్ర తాము నిర్వహించటం మాత్రం పచ్చినిజం!

ఇక మళ్ళీ భగవద్గీత దగ్గరికి వద్దాం. భగవద్గీతలో చెప్పబడిన నిర్వచనం ప్రకారం, అక్షరాలా పండితుడూ, బ్రాహ్మణుడూ పీవీ నరసింహారావు. 72 ఏళ్ళ వయస్సులో ఆయన తాత్వికుడిగా, దార్శనికుడిగా, మేధావిగా ఏ స్థాయికి చేరగలడో, ఆ స్థాయి తాలుకూ పునాదులు, వాసనలూ బాల్యం నుండీ ఆయనలో ఉన్నాయి. యవ్వనంలోనూ అదే దిశలో ప్రయాణించారు. ఈ లక్షణం గొప్పవారిలో సహజ సిద్దమైనది. అందుకేనేమో ’పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్న సామెత చెబుతారు మన పెద్దలు.

ప్రతీ మనిషికి ఉండే బలాలూ, బలహీనతలూ ఆయనకీ ఉన్నప్పటికీ, బలహీనతలు దాటుకుంటూ, బలాలు పెంచుకుంటూ ఆయన సాగించిన జీవన ప్రస్థానం నకిలీ కణిక-6 దృష్టికి రాకుండా పోలేదు. పీవీ సునిశిత దృష్టి, తార్కిక ఆలోచనా, పరిశీలనాపటిమ తమకి ప్రమాదహేతువని నకిలీ కణిక-6 కి పీవీ బాలుడిగా ఉండగానే అన్పించకపోయినా, ఆయన యువకుడిగా ఉండగా అనుమానం కలిగిఉండాలి. అందుకే తన వారసుడైన నకిలీ కణిక-7 కి ఈయన గురించిన ఒక జాగ్రత్త చెప్పబడింది. విశ్వనాధ సత్యనారాయణ, శ్రీశ్రీ… ఇలాంటి వ్యక్తులింకా చాలామందే ఉన్నారు. కాబట్టే ఇలాంటి వారికి జీవితంలో ఎదురుదెబ్బలు ఎక్కువ తగులుతుంటాయి.

అలాగే పీవీజీకి కూడా జీవితం చాలా పాఠాలే నేర్పింది. వాటన్నింటినీ, ఆయన తన వాస్తవ కాల్పనికతల సమ్మిశ్రిత రచన ఆయన తన ’లోపల మనిషి’ లో ఆవిష్కరించాడు.

యువకుడిగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన పీవీజీకీ, నకిలీ కణిక అనువంశీయులకి అంతర్లీనంగా, అనుశృతంగా, నిగూఢంగా ఒక వైరం ఉంది. ఆవిషయం పీవీజీకి తెలియదు. అయితే నకిలీ కణిక-6, నకిలీ కణిక-7లకి తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే నకిలీ కణికులకి పీవీపట్ల, ఆయన మేధావిత్వం పట్లా వైరభావం ఉంది. పీవీజీకి వారి ఉనికి సైతం తెలియనందునా అలాంటి వైరం గురించి ఊహ కూడా లేదు. ఎప్పటికప్పుడు తన జీవితంలోని ఎదురుదెబ్బలకి, సంఘర్షణలకి పైకి కనపడే కారణాలే ఆయనకైనా కనపడేవి. మనిషి మరింత పరిశీలన గలవాడు, వివేచనా, విశ్లేషణా తెలిసినవాడు గనుక, ఆ కారణాల వెనుక అంతర్గతంగా ఉండే మనుషుల అరిషడ్వర్గాలని, తాత్విక ధోరణితో అవగాహన చేసుకునేవాడు. నిజానికి, పీవీజీకి క్రమంగా తనకి కొందరు రాజకీయ శతృవులు ఏర్పడటం తెలుసు. ’అది ప్రతీ రాజకీయ నాయకుడికీ సహజమే గదా!’ అన్నధోరణి ఉన్నాగానీ, అనుభవానికి ఒక శృతీ, లయా తెలుస్తుంది. పైకి కనపడే ఈ సంఘటనల వెనుకా, పైకి కనబడే ఈ శతృవుల వెనుకా, ఏదో తెలీని సంబంధం! ఏదో శృతీ, లయా! అది అనుభవానికి, అనుభూతికి తెలుస్తుంది. చెబితే ఎవరూ నమ్మనిది. నిజానికి ఇది గూఢచర్యంలోని వైచిత్రి.

పీవీజీ పండితుడూ, బ్రాహ్మణుడు. జన్మతః కాదు, భగవద్గీత ఇచ్చిన నిర్వచన ప్రకారం బ్రాహ్మణుడు! మేధావి! భారత రామాయణ, భాగవతాది భారత ఇతిహాసాలే కాదు, ఎన్నో ఉద్గంధాలు చదివి, ఆకళింపు చేసుకున్న మేధావి, జ్ఞాని. కాబట్టే నిరంతర అన్వేషి అయ్యాడు. దేశంలో, సమాజంలో జరుగుతున్న పరిణామాలకి ఏదో కార్యకారణ సంబంధం ఉండితీరాలని అన్వేషించిన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఆస్థికుడు. భగవంతుణ్ణి నమ్మేవాడు. మనవేదాల్లో భగవంతుడి గురించి తీవ్ర అన్వేషణ ఉంటుంది. ‘యస్యజ్ఞాన దయాసింధో……అంటూ ఎవడైతే జ్ఞానానికి సముద్రం వంటి వాడో అట్టి వానికి నమస్కరిస్తున్నాను’ అనిచెప్పబడుతుంది.

భగవద్గీత విజ్ఞాన యోగంలో,

చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో ర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్దార్ధీ జ్ఞానీ చ భరతర్షభ

భావం: భరతశ్రేష్ఠ! [అంటే అర్జునా అనుకోవచ్చు. భారతీయులలో శ్రేష్ఠుడా! అనుకోవచ్చు. ఆవిధంగా గీత ప్రతీ భారతీయుడినీ సత్యం తెలుసుకోమంటుంది] ఆర్తుడు, జిజ్ఞాసీ, అర్థార్థీ, జ్ఞాని, అను ఈ నలుగురు పుణ్యాతులూ నన్ను సేవించుచున్నవారు అనిచెబుతుంది.

అర్ధము అనే పదానికి ఇక్కడ ధనమని భావించలేం. 1) సత్యమేదో తెలుసుకోవాలన్న ఆర్తిగలవాడు, 2) జిజ్ఞాసి, 3) ప్రపంచానికి, జీవితానికి అర్ధం తెలుసుకోవాలన్న కోరికా, 4) జ్ఞానం పట్ల తపన గలవాడైన జ్ఞాని – ఈ నలుగురు, భగవంతుణ్ణి సేవించుచున్నవారు అంటాడు శ్రీకృష్ణుడు. ఆవిధంగా పీవీజీ జిజ్ఞాసీ, జ్ఞాని. కాబట్టే నకిలీకణికుల ప్రచార బ్రహ్మస్త్రం “రోజులు మారిపోయాయి. ఈరోజుల్లో ఇదే అభివృద్ధీ మంత్రం. అందరూ ఇదే నమ్ముతున్నారు. నువ్వొక్కడివే ఉలిపికట్టేవి” అంటూ వ్యక్తుల మీద ప్రయోగించే స్ట్రాటజీ పీవీజీని ప్రభావితం చేయలేకపోయింది.

ఖచ్చితంగా చెప్పాలంటే నకిలీ కణిక-7కి డీవీడీ నిర్మించటం రాదు. కేవలం ప్రయోగించటమే వచ్చు. డీవీడీ తయారు చేయటం రాదు. రిమోట్ కంట్రోలుతో ఆపరేట్ చేయటం వచ్చు. కానీ పీవీజీ పురాణీతి హాసాలు, అందులోని గూఢచార్యం, దార్శినికత, పాజిటివ్ ఆలోచనా ధోరణి ఆకళింపు చేసుకున్న మేధావి. ఆయనే కాదు, ఇప్పటికీ ఎవరైనా భారత రామాయణాది ఇతిహాసాల నుండి, వేద వాజ్ఞ్మాయం నుండి గ్రహించగల సత్యం ఎంతో ఉన్నదన్న పాజిటివ్ ఆలోచనా ధోరణితో చదివితే, ఎంతైనా నేర్చుకోగల అపార జ్ఞానగనులవి.

ఇలాంటి జ్ఞానంతో, తనకు ఎదురైన సంఘటనలతో సంఘర్షిస్తూ, ఆయన తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, విలువలకి తిలోదకాలు ఇవ్వకుండా యోధుడిలా పోరాడుతున్నందునే… ఆయన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో ఎదుర్కొన్న నాటకీయ జైఆంధ్ర, జై తెలంగాణా ఉద్యమాలు, భూ సంస్కరణలు నిజాయితీగా అమలు జరపాలన్న పట్టుదల కారణంగా ఎదుర్కొన్న వత్తిళ్ళు… అప్పటికే కుట్ర ఉనికి తెలిసిన ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించాయి. కుట్రదారుల ఉనికి తెలియక పోయినా, దేశమ్మీద కుట్ర జరుగుతుందన్న విషయం ఆవిడకి స్పష్టంగా తెలుసు. చైనా యుద్దపు ఓటమి తర్వాత, ముందటి తరాల నుండి ఇందిరాగాంధీకి సంక్రమించిన ఆస్థి ఈ పోరాటమే.

రాష్ట్రముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన పీవీజీ కేంద్రానికి ఆహ్వానించబడ్డాడు. ఇది గమనించినప్పుడు ఖచ్చితంగా ’ఇదంతా భగవంతుని లీల సుమా’ అన్పిస్తుంది. ‘ఇందులో గూఢచర్యమూ, సదరు గూఢచారులూ[ఏజంట్లు], గూఢచార ఏజన్సీలు, నకిలీ కణికులూ వారి వ్యవస్థా కూడా అందులో పావులే సుమా!’ అన్పిస్తుంది.

ఇక ఇందిరాగాంధీ కేబినెట్ లోకి కేంద్రమంత్రిగా వెళ్ళిన తరువాత పీవీజీ అవగాహన మరింత పెరిగింది.

ఈనేపధ్యంలో అసలు నకిలీ కణికులకి, భారతదేశం ఎందుకు కొఱకురాని కొయ్య అయ్యిందో మీకు వివరించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఇక నకిలీ కణికుల అనువంశీయులకి ఔరంగజేబు అంటే కొంత ప్రీతి. బహుశః ‘తొలినాళ్ళల్లో తమ ప్రాభవం పెరిగేందుకు అతడు తమని ఆదరించటమే కారణం’ అన్న భావన కావచ్చు. అందుకే అతడి గురించి చాలా పాజిటివ్ ప్రచారం ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టారు. ఔరంగజేబుతో పోలిస్తే నకిలీ కణికులకి మరెవ్వరి మీద, అంత ప్రీతి ఉన్నట్లు కన్పించదు. బ్రిటన్, రష్యా, జపాన్, అమెరికా ఎవరి మీదా అంత ప్రీతి లేనట్లే కన్పిస్తుంది. పాక్ మాత్రం పంచప్రాణాలనుకోండి. అంటే తమకంటూ ఓ అడ్డా కావాలి గదా! ఇప్పటికైతే పాక్ నకిలీ కణికులకి బహిఃప్రాణమే! అలాగే ఈ నకిలీ కణికులకి హైదరాబాదు పంచప్రాణాలు గానీ, హైదరాబాద్ నిజాములు, ఔరంగజేబు అంత అభిమానపాత్రులు కారు. నిజాములన్నా, వారి సేనాని, ముఖ్యాధికారి అయిన ఖాసీం రజ్వీ అన్నా, రజాకార్లన్నా ప్రేమే! ఖాసీం రజ్వీ నుండి అధికార పగ్గాలు స్వీకరించిన MIM నేత [ఈ మధ్యే పోయినాడు లెండి] సలాఉద్దీన్ ఒవైసీ అంటే ఇంకా ప్రేమే. అయితే నిజాంల మీది అభిమానం, ఔరంగజేబు మీద ఉన్నంత కాదు. బహుశః నిజాములు తమని ఔరంగజేబు ఆదిరించినంతగా ఆదరించలేదేమో!

పాకిస్తాన్ తప్పితే ఇతర దేశాలు, అంటే బ్రిటన్, రష్యా, జపాన్, అమెరికాలను నకిలీ కణికులు ఉపయోగించుకున్నంత కాలం పైకి ఎత్తి తర్వాత ఎత్తికుదేసారు. బ్రిటన్ విషయంలో ఇది మరింత ప్రస్పుటం. ఎందుకోగాని నకిలీ కణికులకి బ్రిటన్ రాజవంశీయుల మీద కొంత కోపద్వేషాలు ఎక్కువే! బహుశః ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలోనూ, ఆ తర్వాత కంపెనీ వారి నుండి భారతదేశ పాలానా పగ్గాలు బ్రిటిషు రాచకుటుంబానికి కాక తమ చేతికి వస్తాయని అనుకున్నారు కాబోలు. అది కుదరక పోయింది. ఏమయినా బ్రిటన్ రాజవంశాన్ని అప్రదిష్ట పాలు చేయటంలో మాత్రం నకిలీ కణికులు అత్యుత్సాహం చూపారు. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన అందగత్తె, డయానా సుందరి, యువరాజు భార్య అవ్వడం, వారి ప్రణయపు గొడవలూ, సంసారపు వివాదాలూ అన్నీ, ప్రపంచమీడియాకు కాసులు పండించాయి. ఒక్క దెబ్బకి రెండుపిట్టలన్నట్లు బంకింగ్ హోం పాలెస్ ను దుర్గంధం పాలు చేసాయి. ఆ తీరుతెన్నులు, నాడు డయానా సుందరి భర్తకి విడాకులిచ్చి, మరో ప్రియుడితో షికారు వెళ్తూ మీడియా కంటబడి, మీడియా చేత వేటాడబడి, మరణించటంలోనూ ప్రతిఫలించాయి. నేడు ప్రిన్స్ ఛార్లెస్ పుత్రులు చిన్న ’యువరాజుల’ ప్రణయోదంతాల ప్రచారంలోనూ ప్రతిఫలిస్తున్నాయి.

రష్యా, USSR గా ఉన్నరోజుల్లో వారి జిమ్నాస్టిక్ ప్రతిభ దగ్గర నుండి అంతరిక్ష ప్రయోగాల వరకూ ఒకటే ప్రచారం, ఒకటే ఊదర! అంతర్జాతీయ ఆటల్లో ఉత్ర్పేరకాల[డోపింగ్] వాడకం గురించిన రహస్యం 1992 తర్వాతే బాగా వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు ప్రపంచ ప్రజలందరూ, నాటి USSR ఆటగాళ్ళని, కళ్ళింతచేసుకుని అబ్బురాన చూసిందే! ఇక జపాన్ సంగతి సరేసరి! ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో జపాన్ ని కొట్టేవారెవరూ లేరు. ఇప్పుడు? ఇప్పుడు రష్యా, జపాన్ ల సంగతి తెలిసిందే! ఏ దేశాల్నైనా ఎత్తి కుదేయటమే ఇక్కడి స్ట్రాటజీ!

‘ఎవరైనా ఈ స్ట్రాటజీని గుర్తిస్తున్నారు, తమ రచనల్లోనో, కళారూపాల్లోనొ ప్రకటిస్తున్నారు, ప్రజలకి దీన్ని తేటతెల్లం చేస్తారు’ అనుకుంటే చాలు – ఇక నకిలీ కణికు వ్యవస్థ తన ప్రతాపాన్ని ఆయా వ్యక్తుల మీద చూపిస్తుంది. వాళ్ళ గురించి రకరకాల కథలు ప్రచారం అవుతాయి. ఆ వ్యక్తుల చుట్టు నానా వివాదాలు సృష్టింపబడతాయి. ఎన్నో ఒత్తిళ్ళు పుడతాయి. మొత్తంగా వ్యక్తుల మీద వ్యవస్థ పనిచేస్తుంది. చివరికి ఆ ఒత్తిళ్ళు భరించలేక ఆయా వ్యక్తులు అనారోగ్యం పాలై [ఒకోసారి రోగం పుట్టించబడుతుంది కూడా] నాశనమౌతారు, లేదా వ్యసనపరులై నాశన మవుతారు. వ్యక్తిగతంగా ఓటమి పాలౌతారు. ఏ భాషలో, ఏ రాష్ట్రంలో , ఏ దేశంలో చూసినా, ఇందుకు ఎందరో ఉదాహరణలై కన్పిస్తారు.

నిజానికి నకిలీ కణిక-6, ఐరాస ముసుగులో, తమకు ముందు నుండీ ఉన్న గూఢచార వలయాన్ని, వ్యవస్థనీ, మరింత పటిష్ఠపరచి నకిలీ కణిక-7 చేతికి ఇచ్చాడు. కింగ్ మేకర్ గా ఉన్న తము, ఎప్పటికైనా ‘కింగ్’ కావాలి… ఇదీ లక్ష్యం. కింగ్ అంటే ఒకదేశానికి కాదు, ఏకంగా ప్రపంచానికి ‘జగజ్జేత’ అవ్వటమే లక్ష్యం. భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్య కశికుడు, నారద మహర్షి “హిరణ్య కశ్వపా! ఎటూ నీకునూ అష్టదిక్కులనూ పాలించటానికి దిక్పాలకులు కావాలి. వీరికి అనుభవం ఉన్నది. కావున వీరిని నీ ఆజ్ఞానబద్దులై మెలగవలసిందిగా ఆజ్ఞాపించి, ఆయా పదవులలో కొనసాగించవచ్చు గదా?" అంటాడు.

అలాగే ఈ నకిలీ కణికులకి, తమ ఆజ్ఞానుబద్దులై మెలగుతూ, ఆయాదేశాల్లో, ఐరాసలో కీలక స్థానాల్లో తమ ఏజంట్లు ఉండాలి. వ్యక్తుల దగ్గరి నుండి ఏజంట్ల వరకూ, ప్రజల దగ్గర నుండి గూఢచార ఏజన్సీల వరకూ… ‘విభజించు – పాలించు’ అన్న కణిక నీతే అమలు చేయబడుతుంది. అదీ ఎవరూ అర్ధం చేసుకోలేనంత నేర్పుగా! అందుకోసం కూడా, జనజీవితంలో ఒక అనవసరపు హడావుడీ, అనివార్య పరుగూ సృష్టింపబడుతోంది. తీరిక ఉంటే ఆలోచించే ఓపిక ఉంటుందేమో! అందుకే, తీరిక లేకుండా చేస్తే…? ఒత్తిళ్ళకే సగం ఛస్తారు. కాబట్టి జీవచ్ఛవాల్లా బ్రతుకు ఈడుస్తూ, నకిలీ కణికుల చేతిలో, వారి ఏజంట్ల చేతిలో, ఆదాయవనరుల్లా, ప్రాణం ఉన్న యంత్రాల్లా తయారవుతారు.

ఈవిధంగా నకిలీ కణిక-6 వరకూ, రమారమి ఆరుతరాలు వారు నిర్మించి, పటిష్ఠపరచి ఇచ్చిన గూఢచార వలయం నకిలీ కణిక-7 చేతికి వచ్చింది. వారి అంచనా, ప్రణాళికా ప్రకారం, ఇతడి హయాంలోనే తమ నిగూఢ ఉనికి బహిరంగ పరచుకుంటూ, ‘జగజ్జేత’గా అవతరించాలి. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు దశల వారీగా, తమ పధకం ప్రకారమే జరుగుతున్నాయి. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు చేతికి వచ్చినా, ఇండియా మాత్రం కొఱకు రాని కొయ్యగా ఉన్నది.

అందులో భాగంగానే నకిలీ కణిక వ్యవస్థలోని వారసుడు లేదా ప్రధాన ఏజంట్, స్థానిక పత్రికాధిపతి అవతారం ఎత్తడం జరిగింది. తమ గూఢచర్య వ్యవస్థ ఊపిరి పోసుకున్నదే కంచర్ల గోపన్న కాలం నుండీ కాబట్టి, తానీషా కల నాటకంలో తము సృష్టించిన దేవుడి పాత్రపేరు[రామోజీ] పెట్టుకోవటమూ జరిగింది. [సాధారణంగా ఒక ఏజంట్ ఉనికి బహిర్గతమైతే, సదరు ఏజన్సీ ఆ ఏజంట్ ని నిర్వీర్యం చేసేస్తుంది. రామోజీరావు విషయంలో నెం.10 వర్గం ఒడ్డిపోరాడుతోంది గాని, అతడిని ఒదులుకోవటం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇతడు నకిలీ కణికుల ప్రధాన ఏజంట్ కాదు, ఇతడే నకిలీ కణికుల అనువంశీయుడు అయి ఉండాలి.] పైకి స్థానిక పత్రికాధిపతే గాని, ఆయా రంగాల్లోని వ్యక్తులకీ, అందునా కీలక వ్యక్తులకి, తమ రంగంలో అతడే ‘గాడ్ ఫాదర్’ అని తెలుసు, లేదా అతడి ఏజంట్లే అతడి ప్రతినిధులుగా గాడ్ ఫాదర్ పాత్ర నిర్వహిస్తారని తెలుసు. దానాదీనా, అతడి అశీర్వాదం ఉంటే ఆయారంగాల్లో తమకి ’సీన్’ వస్తుంది, లేకుంటే ‘మటాష్’ అని తెలుసు. ఇందుకు రాజకీయ రంగం, సినిమారంగం, వాణిజ్యరంగం, విద్యారంగం… గట్రాగట్రాలలో ఏదీ అతీతం కాదు.

ఇక్కడ మీకు ఓ ఉదాహరణ ఇస్తాను. ఎవరికీ తెలియని, నిగూఢమైన, అత్యంత బలమైన గూఢచార వలయం, వ్యవస్థ, ‘డీవిడీ ప్లేయర్’ వంటిదనుకొండి. అది ఒక్కరోజులో నిర్మించింది [Assemble]చేసింది కాదు. దాదాపు 350 సంవత్సరాల పైబడ్డది. ఒక వ్యక్తి నిర్మిచిందీ కాదు. దాదాపు ఆరేడు లేదా ఏడెనిమిది తరాలు నిర్మించింది. ఇది ఎవ్వరూ తెలుసుకోకుండా, గుర్తించకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. హిందూ పురాణాలు, ఇతిహాసాలే కాదు, గూఢచర్య జ్ఞానం పుష్కలంగా ఉన్నఎన్నో సంస్కృత గ్రంధాలు నాశనం చెయ్యబడ్దాయి, ‘నిరాదరణకు గురవుతున్నాయన్న’ ప్రచారపు ముసుగులో అదృశ్యం చెయ్యబడ్డాయి. ఇక ప్రజల్లో తార్కిక జ్ఞాన వినాశనం తెలిసిందే! ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని, అత్యంత బలంగా, సమర్ధంగా, తయారు చేసిన నకిలీ కణికుల గూఢచార వలయమూ, వ్యవస్థా, ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోని గూఢచార సంస్థల్లో, రాజకీయ ఆర్ధిక వాణిజ్య వ్యవస్థల్లో, తమ ఏజంట్లని, చడీ చప్పుడు గాకుండా ఏర్పాటు చేసుకుంది. అచ్చంగా ’సందట్లో సడేమియా’ అన్న సామెత మాదిరే! పైకి చూడటానికి ఆయాదేశాల సంస్థలకి చెందిన వ్యక్తుల్లా కనిపించినా, అంతర్గతంగా వారు పనిచేసేది నకిలీ కణికుల కోసమే. ఆవిషయం వారికీ తెలియనంత పచ్చిస్వార్ధం వారిది – ‘ఎవడి కోసమైతేనేమిటి, తమ కార్యకలాపాల మూలంగా ఎవరికి లేదా ఏదేశానికి నష్టం, కష్టం కలిగితే నేమిటి, తమ ప్రయోజనాలు తమకి నెరవేరుతున్నాయి, తమకు భారీ ఆదాయం వస్తూంది. అంతే!’ అనుకునే పచ్చిస్వార్ధం వారిది.

ఇలాంటి ఈ ప్రచ్ఛన్న గూఢచార అంతర్లీన వలయం నకిలీ కణికులు తరతరాలుగా కష్టపడి నెలకొల్పినట్టిది. దీన్ని డీవీడీ ప్లేయర్ అనుకుందాం. నిర్మాణ దశపూర్తయ్యింది గనుక నకిలీ కణిక-7 చేతికి ఆ డీవీడీ ప్లేయర్ యొక్క రిమోట్ కంట్రోలు వచ్చింది.

ఉదాహరణకి మనకి డీవీడీ ప్లేయర్ ని [Assemble చెయ్యటం] నిర్మించటం రాదు. ఎక్కడ ఏ డయాడ్ అమర్చాలో, ఏ ట్రయోడ్ అమర్చాలో, పిసిబి ని ఎలా కనెక్ట్ చెయ్యాలో MCB కి ఎలా అనుసంధానించాలో…. ఏవీ తెలియదు. కానీ రిమోట్ కంట్రోలుతో డీవిడీని ఉపయోగించటం తెలుసు. ఏ బటన్ నొక్కితే Fast Farward అవుతుందో, ఏ బటన్ నొక్కితే ఇంకా వేగంగా Fast Farward అవుతుందో, అలాగే ఏ బటన్ నొక్కితే Backward అవుతుందో, ఏ బటన్లు నొక్కి వాల్యూమ్ పెంచాలో తగ్గించాలో తెలుసు. Pause చెయ్యడం తెలుసు. ఇంకా డీవిడీ మీద Remote Control తో రకరకాల విన్యాసాలు చెయ్యటం వచ్చు.

సరిగ్గా నకిలీ కణిక-7 పరిస్థితి ఇదే! ఇతడికి రిమోట్ తో అపరేట్ చెయ్యటం వచ్చు. మహా వస్తే డీవిడీ ని రిపేర్ చెయ్యటం కొద్దిగా వచ్చు. డీవిడీని Assemble చెయ్యటం మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే – తరతరాలుగా, ఆయా కాలమాన పరిస్థితులలో తగిన రీతులలో ప్రతిస్పందించి, తయారు చేసిన డీవిడీ అది, వ్యవస్థ అది. అందునా ప్రపంచవ్యాప్తంగా, సమాజంలో, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా చిక్కుముడులు, పీట ముడులు వేసి, ద్వంద్వపూరితంగా, మొత్తం సమాజాన్ని గందరగోళంగా తయారు చేసారు. ఒకవేళ ఎవరయినా దీనిని కనిపెట్టినా, పరిష్కారంగా ఏమీ చెయ్యలేని పరిస్థితిని కల్పించారు. అందునా విజయపు తీరానికి చేరుతున్నామనుకున్నప్పుడు కొంత అతిశయమూ, అతిశయించిన ఆత్మవిశ్వాసమూ, పర్యవసానంగా మరికొంత అహంకారమూ కలగటం సహజం. ఫలితంగా, కొంత ’ఫర్వాలేదులే’ అనుకునే నిర్లక్ష్యమూ లేదా సాచాటూ వస్తాయి. మరికొంత బద్దకము వస్తుంది.

అందునా నకిలీ కణిక-6 మరియు నకిలీ కణిక-7ల చేతిలో ఎన్నో దేశాలు పైకి ఎత్తబడ్డాయి, ప్రయోజనం నెరవేరాక, ఎత్తి కుదేయబడ్డాయి. అలాగే ఎన్నో ’ఇజాలు’ ఉవ్వెత్తున ఆదరింపబడ్డాయి, ఆపైన కుప్పకూలిపోయాయి. ఇజాలలో నిజాలు లేవని ప్రజలు తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకుంటాయి చెప్పండి? నిజమైన ఇజాలలో సిద్దాంతాలు ఉంటాయి. అందులో ఏలోపాలు ఉండవు. అయితే ఆ ఇజాల అమలుతీరులో మొత్తం నకిలీ కణికుల స్ట్రాటజీనే ఉంటుంది. ఇక సదరు ’ఇజమే’ విఫలం చెందక, కుప్పకూలకా ఏంచేస్తుంది? అదే ఇప్పుడు భారత్ లోని ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న స్థితి. 1992 వరకూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొన్న స్థితి. USSR లోని సామ్యవాదం 1990 కు ముందు ఎదుర్కొన్న స్థితి. నేడు అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం ఎదుర్కొంటున్న స్థితి ఇదే!

ఈ విధంగా ప్రపంచ సంఘటనలకి, ప్రపంచ ప్రజలందరూ తాము మీడియా ముసుగులో చూపిస్తున్న పైకారణాలని [over leaf reasons] ని నమ్ముతుండగా, అసలు కారణం, కార్యకారణ సంబంధం, తమకి మాత్రమే తెలిసి ఉండటం ఎంత గొప్ప, ఎంత మజా! దీనికి ఉదాహరణ చెప్పాలంటే నిన్నటి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు! మీడియా, కొన్నిసార్లు ముస్లింల ఓట్ల మూలంగా కాంగ్రెస్ గెలిచిందనీ, కొన్నిసార్లు 108,ఆరోగ్యశ్రీ సేవల వంటి పధకాల మూలంగా గెలిచిందనీ, [దేశమంతా ఈ పథకాలు అమలు చేయలేదన్నది ఇక్కడి గమనార్హం] కొన్నిసార్లు ప్రజలు ఇతర ప్రతిపక్షాలను వేటినీ నమ్మలేక, కేవలం కాంగ్రెస్స్, సోనియా గాంధీ మాత్రమే దేశాన్ని సుస్థిరంగా, భద్రంగా కాపాడగలరని భావించి ఓట్లేసి గెలిపించారనీ ప్రచారించింది. నిత్యావసరాల ధరలు ఆకాశానికెక్కడాన్ని ప్రజలు పట్టించుకోలేదంది. 1984 లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీ అల్లర్లకి బాధ్యుడన్న నిందనుండి, నేరం నుండి, విచారణ నుండి, జగదీష్ టైటర్లకి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చారని మండిపడ్డ సిక్కులు, కేంద్రహోంమంత్రి చిదంబరం మీదకి బూటు విసరడాన్ని కూడా విస్మరించి, కాంగ్రెస్ పట్ల ద్వేషాన్ని విస్మరించి మరీ పంజాబీలు, కాంగ్రెస్ ని పంజాబ్, ఢిల్లీ, హర్యానాలలో గెలిపించారని ప్రచారించింది. ఈ కారణాలని, ఇలాంటి కారణాలని, అందరూ పెద్దగా పట్టించుకోకుండానే ’అవును కామోసు’ అనుకుంటున్నారు. అసలు కారణం మాత్రం [EVM ల Tamparing దగ్గర నుండి, అందుకు దారితీసిన పరిస్థితుల దాకా] తనకి, తన అంతరంగికులకీ మాత్రమే తెలిసి ఉండటం నకిలీ కణిక-7 కి గర్వకారణమే కదా! అయితే ఈ గర్వకారణం ఇప్పుడు మహాబాధా కారణంగా పరిణమించినట్లుంది. అదే ఒకప్పుడైతే కేవలం గర్వకారణమే కాదు, తిరుగులేని ధీమాతో కూడుకున్నది. సరే! ఇదంతా 1992 తర్వాతి పరిస్థితి. అంతకు ముందరైతే నకిలీ కణిక-7 కి తిరుగులేదు. ఇప్పుడంటే ఇతడి వర్గం అంటే నెం.10 వర్గానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నెం.5 వర్గం ఉంది గానీ, అప్పట్లో నకిలీ కణిక వ్యవస్థ అన్నదే ఒకటి ఉందనీ గానీ, దాని తీరుతెన్నుల గురించి గానీ, పూర్తి అనుమానాలూ, అవగాహనా ఎక్కడివి? ఎవరికి వారు, తమ దేశం మీద ఫలానా ఫలానా శతృదేశాలు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయనే అనుకున్నారు. Divide and Rule Policy అని పిలవబడే కణిక నీతి ప్రభావం ఇది.

దీనిని అతిక్రమించి చూడగలిగిన వారిలో ప్రధముడు పీవీనరసింహారావు. ఆ తెలుగుమేధావి, ప్రపంచవ్యాప్తంగా, ఆయాదేశాలలో, తమదేశం పట్ల నిబద్దతా, నిజాయితీ, దేశభక్తీ గల వారికి, ఈ నకిలీ కణిక వ్యవస్థ గురించి తెలియజేసి, పరిశీలనలు, పరిశోధనలతో నిర్ధారణ చేసి, అందరిలో నుండి కొందరినైనా, కొంత వరకైనా, సమైక్య పరచిన, సంఘటిత పరచిన కారణంగానే, నకిలీ కణిక వర్గం[నెం.10]కి ఇంతగా ఎదురుదెబ్బలు తగలటం మొదలైంది. అలా సంఘటితమైన వ్యక్తులు, శక్తులూ నెం.5 వర్గమైంది. ఇప్పటికి 17 ఏళ్ళుగా పరిణతి చెంది, బలపడింది. మొదట్లో నెం.5 వర్గపు బలం ఎవరికీ బహిర్గతం కాలేదు. లోలోపల గూఢచర్యంలో మాత్రం తెలిసింది. అందుచేతే నకిలీ కణిక వ్యవస్థ లోని ఏజంట్ లేదా నకిలీ కణిక-7 అయిన రామోజీరావుకీ, అతడి సోదరీతుల్యమైన అంటే అంతగా అంతరంగిక ఏజంట్ అయిన సోనియా గాంధీకి పీవీజీ అంటే అంతకోపం! ఆయన మరణించాక సైతం, భౌతికకాయాన్ని అవమానించేంత కోపం! 2004 లో, క్రిస్మస్ మరు నాడు, అప్పటికి ముందు రోజు అంత్యక్రియలు జరపబడిన పీవీజీ భౌతిక కాయం సరిగా కాలలేదంటూ, ఆపాటి శ్రద్ధా భక్తులు కూడా ఎవరూ చూపలేదంటూ, ఈనాడు [మహాదానందంగా?] తొలిపేజీలో, పావుభాగానికి సరిపడా సైజులో శీర్షీక, మరోపావు భాగానికి సరిపడా ఆయన కంకాళంతో ఫోటో ప్రచురించి మరీ, అర్ధపేజీ వార్త వ్రాసింది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడే రామోజీరావు కళ్ళల్లో ’ఇక చూస్కో నా తడఖా’ అన్న భావం, క్రౌర్యం ఉన్నాయి. [ఆరోజు ఈనాడులో ప్రచురింపబడ్డ ఫోటోలో స్పష్టంగా చూడవచ్చు]. అయితే క్రిస్మస్ మరురోజు, ఈ వార్తా, ఫోటోలతో ఈనాడు పేపరు, ప్రజల చేతుల్లో కొచ్చేసరికే, తమిళనాడులోని కడలూరు దగ్గర సునామీ ఉధృతి వేలప్రాణాలని బలిగొంది. ఆ తాజా, సంచలన, విషాద పూరిత వార్త కారణంగా, ఎలక్ట్రానిక్ మీడియా వరదలో ప్రింట్ మీడియా కొట్టుకుపోయింది. అలాంటి బాధాకర స్థితిలో శవరాజకీయాలు చేస్తే మరింత స్పష్టంగా తాను Expose అవుతాడు గనుక, పాపం రామోజీరావు, ఇక తప్పనిసరై, మర్నాటికి తానూ సునామీ రాగం అందుకుని, తదనుగుణంగా వార్తలు వ్రాసాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ప్రజల్ని భయభ్రాంతుల్ని చెయ్యడం కోసం పుకార్లు పుట్టించటంలో కూడా మీడియా దిట్ట. ’ఓ స్త్రీ రేపురా!’ గట్రాలన్న మాట. మన రాష్ట్రంలో ఇలాంటివైతే, పరరాష్ట్రాల్లో, పరాయి దేశాల్లో ఇలాంటివే పేరు మార్పుతో, భాషమార్పుతో కోకొల్లలు. [ఉదా: ఆ మధ్య ఢిల్లీలో ఏదో వింత ఆకారం మేడ మీద నిద్రపోతున్న వాళ్ళమీద దాడి చేస్తున్నదని విపరీత ప్రచారం చేసారు. గాయపడ్డవాళ్ళు కూడా ఉన్నారు. దానిని పట్టుకున్నది లేదు నిరూపించిందీ లేదు. తరువాత ఆకస్మాత్తుగా ఆ వార్తలు ఆగిపోయాయి.] ‘ఎందుకయ్యా భయభ్రాంతుల్ని చెయ్యడం?’ అంటే… పిరికివాడు చచ్చినట్లు పడుంటాడు, ఎదురు తిరగడు. ధైర్యవంతుడు తిరగబడతాడు. అందుకే వీలయినంతగా ప్రజల్లో భయాందోళనల్ని ప్రేరేపించడం, నకిలీ కణిక వ్యవస్థలోని నేటి 7వ తరం అమలుచేస్తున్న స్ట్రాటజీ! సినిమాల్లో డబ్బున్నవాణ్ణి చూసి భయపడమని ఇంజెక్ట్ చేస్తుంటారు. చెడ్డవాడికి, డబ్బున్నవారికి, డబ్బున్న చెడ్డవాడికీ తెగ భయపడి చావమనే చెబుతారు. చివరికి ఎదిరించే హీరో సైతం, ఆ ‘డబ్బున్న చెడ్డవాణ్ణి’ ఎదిరించిన పాపానికి నానావెతలూ పడి, చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా సినిమా చివర్లో గెలుస్తాడు. ఇక రోగాల పేరుతో భయపెట్టడం అయితే అవధులు లేనట్టిది. ఫలానా జంతువు లేదా కీటకం అంటే జుగుప్స, భయం ఉంటే, అది ఫలానా ఫోబియో, నలుగురితో మాట్లాడాలంటే బెరుకుంటే ఫలానా సిండ్రోమ్…. ఇలా మనిషి యొక్క ప్రతీ భావనకీ ఏదో ఒక జబ్బు పేరు, XYZ mental disorder లేదా ABC సిండ్రోమ్ చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్ట్రాటజీలో మార్పులేదు. ’స్థానికం’ నుండి అంతర్జాతీయంగా, దేశాలకి, భాషలకి, అతీతంగా జరిగే, జరుగుతున్న అనేక స్ట్రాటజీలలో ఇదీ ఒకటి. భగవద్గీత ఇలాంటి లక్షణాలు మానవులలో సహజంగానే ఉంటాయి కాబట్టి, వాటినన్నింటిని దాటి పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలని చెబుతుంది. అంతేగాని ‘ఇవన్నీ రోగాలు’ అని ఎప్పుడూ చెప్పదు. ఒకసారి ఆలోచించి చూడండి. హాలీవుడ్ సినిమాలలో, పెద్ద ఇంటిలోకి హంతకులు వచ్చి నానా భీభత్సం చేసి, ఇంటి వారిని క్రూరంగా హింసించి, అఘాయిత్యాలు చేయటం లాంటివి చూపుతారు. అలాంటి సినిమాలు చూసిన పిల్లలు భయందోళనలు చెందరా? అవి రుగ్మతలుగా పరిణామం చెందవా? అలాగే ఇలాంటి సీన్లలో దయ్యాలని చూపి, భయాందోళనలు రేపటం! ఇవీ అంతే. రుగ్మతలనే కలగజేస్తాయి. ఈ జాడ్యం ఈమధ్య ఇండియాలో కూడా పెరుగుతుంది.

ఇలాంటిదే ప్రజల్లో తార్కిక జ్ఞానాన్ని నశింప చేయటం కూడా! ఇందుకు బాగా పనికి వచ్చేది సినిమా, టీవీ, గట్రా మీడియానే. అనగా అనగా ఒకరాజు, రాజుకు ఏడుగురు కొడుకులు…. ఏడుగురు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు… కథ, అమ్మ మనకి చెప్పే తొలికథ. తరతరాలుగా ఇది పిల్లల్ని, బాల్యం నుండీ చేప ఎండక పోవడానికి ఎన్ని కారణాలుండవచ్చు, ఎంతగా కార్యకారణ సంబంధం ఉంటుందో, చివరికి ‘నా బంగారు పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా మరి కుట్టనా’ అన్న చీమ చివరి డైలాగ్ తో పూర్తయ్యే కథ, పిల్లల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ మరీ బోధిస్తుంది. అదే సినిమాల్లో అయితే, హీరో అమాంతం వందమందిని కొట్టేస్తాడు. ఎన్ని ఇనపరాడ్లతో కొట్టినా, హీరోకి ఏంకాదు. అధవా డొక్కలోనో, గుండెల్లోనో కత్తో, బుల్లెటో గుచ్చుకున్నా కూడా, హీరో ఎర్రటి కళ్ళు, నెత్తుటి ఒళ్ళు వేసుకుని క్లైమాక్స్ దాకా ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. నేలమీద నుండి అమాంతం భవనాల రెండో అంతస్థుకో, నాలుగో అంతస్థులోకో గెంతేయగలడు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతం ఏమవుతుందోమరి? అంతేకాదు, హీరో ఒక్క రౌడీగాణ్ణి కొట్టాడంటే, వాడు పది గజాల దూరమో, వంద గజాల దూరమో గాలిలో గిరికీలు కొట్టుకుంటూ పోయిపడతాడు. ఏ భౌతిక సూత్రాల ఆధారంగా ఇదంతా జరుగుతుందో చచ్చినా అర్ధంకాదు. అదే అంటే – “అది జస్ట్ సినిమా! ఇక్కడ లాజిక్కులు అడగకూడదు. అది కేవలం వినోదం కోసం” అంటారు. [ఈ వాదన 1975 to 1990ల్లో చాలా ఎక్కువగా ఉండేది] మరి అదే హిందూ పురాణాల్లో, ఇతిహాసాల్లో భగవంతుడి మహిమలూ, లీలలూ ఇత్యాది విషయాల్లో మాత్రం యమ తర్కాలు, లాజిక్కులూ తీస్తారు. మతం, మత గ్రంధాలు, పురాణ ఇతిహాసాలు మనుష్యుల్లో మంచిచెడ్డలూ, పాప పుణ్యాల పట్ల, కొన్ని నమ్మకాల్ని, కట్టుబాట్లని నిర్మిస్తాయి. మరి వాటి విషయంలో “అవి పురాణాలు, ఇతిహాసాలు. నీతిని పెంచేందుకు, మంచిచెడ్డలు అర్ధం చేసుకునేందుకు చెప్పబడ్డాయి. వాటిల్లో లాజిక్కులు అడగకూడదు” అని అనుకోలేదేం? ముఖ్యంగా రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం లాంటి గ్రంధాలు విరజిమ్మిన విషాలలో ఇలాంటివి ప్రముఖమైనవి. రామాయణ విషవృక్షపు కుటిలత గురించి Coups On World లోని Coup on Indian Epics లో వివరంగా వ్రాసాను. నీతిని, మంచిని బోధించే ఇతీహాసాల విషయంలో తార్కిక లోపం ఉంది! చెడుని, విశృంఖలతనీ వ్యాపింపచేసే సినిమాల విషయంలో తర్కం అడక్కూడదు. ఎంత వితర్కం ఇది?

ఈ స్ట్రాటజీ రూపకర్తలు నకిలీ కణిక అనువంశీయులే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ పరిస్థితులైనా ప్రజల దృక్పధాన్ని అనుసరించే ఉంటాయి. రూసో, ఓల్టేర్ ల భావాలు ఫ్రెంచి వారిని ఉత్తేజపరిచినా, హెగెల్ ల భావాలు జర్మనీయుల్ని ప్రేరేపించినా, గాంధీజీ అహింసా వాదం భారతీయుల్ని ఉర్రూతలూగించినా, పర్యవసానం ఆయాదేశ చరిత్రల్లో కొత్త అధ్యాయాల్ని సృష్టింపబడటమే. ఇక్కడ ఆయుధాలూ, సాధన సంపత్తి విలువలేనివి. కేవలం మనుషుల భావాలు, దృక్పధమే తిరుగులేని ఆయుధం. దీన్ని బాగా అర్ధం చేసుకున్నారు గనుకనే నకిలీ కణికుల అనువంశీయులు Public Attitude [ప్రజల దృక్పదం] మీద ’పదే పదే అదే ప్రచారంతో’, తమ ముద్ర వేసారు. ఇప్పటికీ అదే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ప్రజల్లో భయందోళనలు నింపటం, పిరికితనం నూరిపోయటం, తార్కిక జ్ఞానాన్ని నాశనం చేయటం వంటి స్ట్రాటజీలు అందులోని భాగాలే. ఇక విభజించి ప్రచారించు అన్నది అన్నిట్లోనూ అంతర్లీనంగా ఉన్నదేనయ్యె!

ఇక్కడ మీకు ఒక తాజా ఉదాహరణ, దృష్టాంతం చెబుతాను. ఇటీవల ఆస్ట్రేలియాలోనూ, అమెరికా లోనూ భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రికెట్ వరుస విజయాల కారణంగా ఉత్పన్నమైన ఈర్ష్యాసూయలు ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు కారణం అని ఒక వాదన ఒకపత్రికలో వచ్చింది. భారతీయులు పొదుపరులు, శ్రమజీవులు. ఈ అసూయాద్వేషాలతో ఆస్ట్రేలియన్లు భారతీయులపై దాడికి దిగుతున్నారని మరో వాదన మరో పత్రికలో చదివాను. ఇవిగాక విదేశాల్లో నల్లవారు, మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారని, వారు మన మార్గానికి అడ్డం వచ్చి డబ్బు అడిగితే, మారు మాట్లాడకుండా వాలెట్ వాడి చేతికిచ్చేయాలని, అందుకోసం ప్రత్యేకంగా కొన్ని చిల్లర దమ్మిడీలు[డాలర్లు] పెట్టుకోవాలనీ, అంతేగాని చిల్లరడబ్బులు కోసం ఎదురు తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం పరమ తెలివి తక్కువతనం అనీ కొన్ని ‘తెలివైన’ వాదనలు, సిద్దాంతాలు వినబడుతున్నాయి. బహుశః ‘ఎదుర్కోవటం కంటే ప్రక్కకు తప్పుకుని పోవటం తెలివైన పని’ అన్న సిద్దాంతానికి ఇది ఉప సిద్దాంతం కావచ్చు.

నిజమే. ఏవ్యక్తీ సినిమా హీరోలాగా రౌడీలని ఎదురించలేడు. మరి అక్కడి ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు? అలాంటి వారిని ఎందుకు కంట్రోలు చేయటం లేదు? ఎదురు వచ్చినవాడు డబ్బే డిమాండ్ చేస్తే, సరే పోనీ అనుకుని డబ్బిచ్చి వదిలించుకోవచ్చు. ఈరోజు మాదక ద్రవ్యాలకు బానిసై, విచక్షణ కోల్పోయిన వాడు ఎదురొచ్చి ఆడిగితే వాలెట్ ఇవ్వటం తెలివైన[?] పని కావచ్చు. ఈ రోజుకి ఇది తెలివైన పనిగా మనల్ని ఒప్పించటమే నకిలీ కణిక వ్యవస్థ, వారి ప్రచారం, మనపై సాధించిన విజయం. రేపు ఇలాగే సుఖభోగాలకీ, విచ్చలవిడి శృంగారానికి బానిసై, విచక్షణ కోల్పోయిన వాడు, మీప్రక్కనున్న స్నేహితురాలినో, భార్యనో, లేక కుమార్తెనో ఇవ్వమని అడిగితే…? అప్పుడూ ప్రక్కకు తప్పుకుని పోగలరా? అప్పుడూ, అదే తెలివైన పని అనగలమా? ప్రజాదృక్పధంలో ’ఎదురుతిరగటం’ అనే లక్షణాన్ని నాశనం చెయ్యటానికి చేయబడుతున్న ప్రచారం ఇది, ప్రచారించబడుతున్న ’తెలివి’ సిద్దాంతం ఇది. ఇక్కడ ఇలాంటి పోలికగల స్ట్రాటజీ ఇంకొటి చెబుతాను.

ఇండియాలో మొదట రౌడీయిజాన్ని పరిచయం చేసేటప్పుడు ఇలాగే మొదలయ్యింది. రౌడీలు మొదట చిన్నచిన్నవ్యాపారుల మీదకే వెళ్ళేవాళ్ళు. సంఘంలో పెద్దవాళ్ళజోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆర్ధికంగా ఒకస్థాయికి వచ్చిన తరువాత, ఈ రౌడీలు రాజకీయ అండదండలు తీసుకుని ప్రతిపక్షపు వాళ్ళని చంపటం మొదలుపెట్టారు. ఆ తరువాత వాళ్ళే రాజకీయనాయకులుగా అవతారం ఎత్తారు. అలాంటి వాళ్ళే దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు. కోస్తా ప్రాంతాలలో ఇలా ఉంటే, ఇక రాయల సీమ గురించి చెప్పనవసరం లేదనుకుంటా. ఈ పరిణామక్రమంలో రెండాకులు ఎక్కువ చదివిన వాళ్ళు ముంబై మాఫియా. వాళ్ళు ఏకంగా ప్రక్క దేశపు గూఢచార సంస్థలతోటే సంబంధాలు పెట్టుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ప్రభుత్వ ఉద్యోగులను సైతం లెక్కచెయ్యని రకాలుగా అవతరించారు. ఒకడు ఏకంగా ఐ.ఏ.యస్. భార్యనే నచ్చిందని, కిడ్నాప్ చేసాడు. ఆ ఐ.ఏ.యస్. ఏమీ చెయ్యలేకపోయాడు. ఎక్కడయినా ఒకటే స్ట్రాటజీ! జనాన్ని భయపెట్టటం, దోచుకోవటం. ఎదురు తిరిగితే చంపటం! ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్న దేశాలలో, ప్రజాస్వామ్యబద్దంగా నడుస్తాయన్నమాట.

అన్నిరకాలుగా, అన్నిదేశాలలో ’దోపిడికి ఎదురుతిరగకు. సర్దుకుపో! అన్యాయానికి ఎదురుతిరగకు. సర్ధుకు పో!’ – ఇదే ఉద్బోధ. దాని ఫలితమే – ఏది జరిగినా, ప్రతీవారూ, తాము తప్ప మిగిలిన అందరూ ప్రతిస్పందించాలను కోవటం! తము మాత్రం ’ఎదురుతిరగరు, సర్ధుకుపోతారు’. ఈ స్థితి 1947 కు ముందు లేదు కాబట్టే, నాటి స్వాతంత్ర సమరయోధులకి కోట్లాది మంది భారతీయులు ప్రతిస్పందించారు. బాపుజీ వెనుక సత్యాగ్రహులై గర్జించారు. ఆయుధాలు లేకుండా, ఆర్ధిక బలం లేకుండా, అపూర్వమైన రీతిలో సాగిన సమరం అది. కేవలం ప్రజల దృక్పధం, ఐక్యతగా ప్రతిఫలించి, సాగించిన పోరు అది. అందుకే నకిలీ కణికుల అనువంశీయులు, తమ తదుపరి స్ట్రాటజీని ‘ప్రజాదృక్పధాన్ని[Public Attitude] ధ్వంసం చేయటం, తమకి అనుకూలంగా ప్రభావపరుచుకోవటం’ అన్న లక్ష్యంతో రచించుకున్నారు.

కాబట్టే, ఏ అవినీతి గురించిగానీ, కుంభకోణం గురించి గానీ ఫిర్యాదు చేసిన వారి బ్రతుకు బస్టాండు అవ్వటం, ఫిర్యాదుదారు వేధింపులకు గురవ్వటం జరుగుతోంది. ఈ విషయం నా ఒక్కదాని కేసులోనే కాదు, ఎవరు, ఏ విషయమై ఫిర్యాదు చేసినా, ఇలాగే ఉంటోంది. కాకపోతే కేసుని బట్టి వేధింపు పరిమాణం ఉంటుంది. అంతే! అందుకే ‘ఇది నా కథే కాదు, మీ కథ, మన కథ, సామాన్యుడి కథ’ అని వ్రాసాను, నా కేసు గురించి వివరించేటప్పుడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu