మున్నా సినిమా:
ఇది నెం.5 వర్గం, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, రామోజీరావులతో సంభాషించిన చిత్రం. అర్ధం చేసుకోగల వారికి, ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య విశేషాల గురించి అవగాహన కలిగించగల చిత్రం కూడా!

ఇందులో ఖాఖా పాత్ర నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకీ, రామోజీరావుకీ ప్రతీక! ఖాఖా పరమ స్వార్ధ పరుడు. మనుష్యుల్నీ, నమ్మకాల్నీ అమ్ముకునేవాడని మున్నా అంటాడు. మున్నా.... ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో, తమ మాతృదేశాల పట్ల భక్తీ, ప్రేమా, నిబద్దత గల వారికి ప్రతీక! మున్నాకి తల్లి మీద ప్రేమ, చెల్ల్లి మీద ప్రేమ. అలాగే వారికీ తల్లిలాంటి తమ దేశం పట్ల, సోదరుల వంటి తమ ప్రజల పట్ల ప్రేమ!

అలాంటి వారికే పీవీజీ, నకిలీ కణిక అనువంశీయుల నెట్ వర్క్ నీ, పనితీరునీ, స్వార్ధాన్ని expose చేసింది! తన చెల్లి చావుని కూడా ఉపయోగించుకున్న ఖాఖాని, తన తల్లిని వ్యభిచార గృహానికి అమ్మబోయిన ఖాఖాని.... నిస్సహాయంగా క్రోధంగా.... మున్నా చూసినట్లు వాళ్ళూ చూసారు. వాళ్ళే పీవీజీ చేత నెం.5 వర్గంగా సమీకరించబడ్డారు.

ఖాఖాని ఎదిరించిన వాళ్ళు, శ్రీనివాస రావుల్లాగా, ఆత్మల వంటినాటకాలు తెలియక బలైపోయారు. ఇక ఖాఖా రెండవభార్య, ఆమె కుమార్తె! వీళ్ళు ఖాఖాకి నిర్భంధంగా నిస్సహాయంగా లొంగి ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే మున్నా బలపడి కనబడ్డాడో, అప్పుడు అతడితో చేరిపోయారు. ఆ విధంగా నెం.5 వర్గం విస్తరించింది. ఖాఖా రెండవభార్య కొడుకు రాహుల్, ఖాఖా బుద్దులన్నిటినీ పుణికిపుచ్చుకున్నా, ఖాఖా అంత ముదరలేదు. నకిలీ కణిక వ్యవస్థలో, నకిలీ కణిక అనువంశీయులకి కీలక ఏజంట్లయిన నెం.10 వర్గానికి ఈ రాహుల్ పాత్ర ప్రతీక!

అందుకే, మున్నాచేతిలో.... ఖాఖాకి లాగే ఇతడికీ ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంటే వస్తుంది, చూడండి! హీరోయిన్ తో పెళ్ళి విషయంలో, మున్నా ప్రయోగించిన చెంచా వేణుమాధవ్ కారణంగా, రాహుల్ తనంతట తానే ’ఈ పెళ్ళి నాకు వద్దు’ అంటాడు. దానికి ముందు మున్నా చేతిలో చావుదెబ్బలు తింటాడు. మున్నా రాహుల్ ని సామాన్య విద్యార్ధి చేత కూడా తన్నిస్తాడు. సామాన్యుడిలో ఆ రోషం రగిల్చి మరీ తన్నిస్తాడు.

మున్నా, ఖాఖాకి అల్టీమేటమ్ ఇస్తాడు. "ఇక నుండి బ్రతకడానికి భయపడాలి నువ్వు. నువ్వు నమ్ముకున్న నీవాళ్ళు. నీ డబ్బూ, నీ రాజకీయం.... అన్నీ.... అన్నీ పోయాయి. చివరికి నీ గన్ను కూడా నీకు హాండిచ్చింది. ఇంతకంటే చావు సుఖం అనుకోవాల్సిందే నువ్వు" అన్న అల్టీమేటమ్! ఆత్మ హత్యా సదృశ్య అసైన్ మెంట్ల లాగే ఖాఖా కూడా, మున్నా ఇచ్చిన బుల్లెట్ తో కణత మీద కాల్చుకు చనిపోతాడు. నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, రామోజీరావుకీ, అతడి సోదరీ తుల్య సోనియాకీ ప్రస్తుతం ఎదురుగా ఉన్న స్థితి ఇదే! కాకపోతే పిస్తోలు తో భౌతిక మరణం కాదు. గూఢచర్యపరమైన ఆత్మహత్య!

ఖాఖా - ఆత్మల నాటకమే రామోజీరావు, వై.యస్. కలిసి ఆడిన నాటకం. కాకపోతే అందులో వై.యస్. మరింతగా గారెల వంట వంటి స్వంత గూఢచర్యం నడిపాడు. అర్ధాంతర మరణమూ పొందాడు. ఆ వివరాలు గత టపాలలో వై.యస్. మరణం వెనక అసలు కథలో వ్రాసాను.

మన రాష్ట్రంలో రాజ రామోజీలే కాదు, మన ప్రక్క వీధి నుండి ప్రపంచపు మూలదాకా ఇదే అమలు చేయబడుతుందన్నది చరిత్ర నిరూపించింది. శాస్త్రీజీ ప్రధానిగా ఉండగా జరిగిన ఇండో - పాక్ యుద్దం దీనికి చక్కని ఉదాహరణ. అప్పటికి ప్రపంచంలో....

పైకి అమెరికా రష్యాలు పరస్పర వ్యతిరేక శిబిరాలు. ప్రతీ విషయంలోనూ పోటీ పడుతూ ప్రచ్ఛన్న యుద్దం నడిపిస్తున్న రెండుధృవాలు. అలాంటిది.... ఇండో - పాక్ యుద్దంలో పాకిస్తాన్ కి బాసటగా అమెరికా నిలిచింది. అయినా రష్యా మనకి వత్తాసు పలకలేదు సరికదా, సరిగ్గా పాక్ ఓడిపోయి, ప్యాటర్సన్ యుద్దట్యాంకులు నవ్వులపాలైన తరుణంలో, మధ్యవర్తిత్వం చేస్తామంటూ పరుగెత్తుకు వచ్చింది. తమ వ్యతిరేక శిబిరమైన అమెరికా అనుయాయి పాక్ ని, తటస్థ అలీన వర్గపు భారత్ ఓడించినప్పుడు.... ఎంచక్కా ఆనందిస్తూ ’కాగల కార్యమూ గంధర్వులు తీర్చిరి’ అన్నట్లుండాలి కదా? మరెందుకు, ఎవరి కోసం సంధి రాయబారాలు నడిపి, చర్చలకు పిలిచింది? ఆ చర్చలకు వెళ్ళినప్పుడే శాస్త్రీజీ ’గుండెపోటు’[?] తో మరణించాడు. అదో పైకారణం, అంతే!

పైకి కొట్టుకునే అమెరికా రష్యాలు, కీలక సమయాల్లో మాత్రం అంతర్గత సహకారం ఎందుకు ఇచ్చుకున్నాయి? ఎందుకంటే - రెండు శిబిరాలనీ నడిపింది ఒకటే గూఢచార వ్యవస్థ గనక! సిఐఏ, కెజీబీల వెనక ఉన్నది నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గమే గనక!

ఈ విధంగా సినిమాల భాష నడిచింది. పరిశీలిస్తే.... ఇది సామాన్యులకు కూడా అర్ధమయ్యేంత సులువైన భాషే!

ఈ చిత్రంలో కొసమెరుపులాంటి ఓ సత్యం ఏమిటంటే - హోం మినిస్టర్ [చలపతిరావు]తో పోలీసు కమీషనర్ అన్నట్లు "ఖాఖా అంటే ప్రజలకి భయం. మున్నా అంటే ప్రజలకి ధైర్యం".

అవును! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అంటే ప్రజలు భయపడాలన్నదే రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం, సల్పిన కృషి!

నెం.5 వర్గపు లక్ష్యం ప్రజలలో ధైర్యమూ, రజమూ రగులుకోవాలన్నది!

కుడితే చావాలన్న చీమ, కుట్టగానే తాను ఛస్తున్నట్లుగా.... ప్రజలని భయపెట్టాలనుకున్న నకిలీ కణిక అనువంశీయులు, ఇప్పుడు పరిస్థితులకి భయపడుతున్నారు. పరిస్థితుల్ని సంభాళించుకునేందుకు నానా ఫీట్లు చేస్తున్నారు.

ఇక నెం.5 వర్గాన్ని చూసి ప్రజలు ధైర్యపడాల్సి ఉంది!

ఇప్పుడు మీకు నవ్వుకునేందుకు ఓ తమాషా చెబుతాను. మేము సినిమాల గురించి చెబుతామని మార్చి02 న ఓ వ్యాఖ్యకు జవాబుగా వ్రాసాము. అప్పటి నుండి ఈనాడు, రామోజీరావుల ఫీట్లు మొదలు. మార్చి17 న సినిమా గురించి మొదలు పెట్టాము. మార్చి 19 వ తేదీన ’సినిమాల ఊసెందుకు’ అంటూ సినిమాల గురించి వ్రాయవద్దని ఘోల్లుమన్నాడు. అదీ సినిమా పేజీలో!

మరొక ముఖ్యమైన విషయం చెప్పేందుకు మళ్ళీ ’మున్నా’ సినిమా దగ్గరికి వస్తాను.

ఆ సినిమాలో రాజకీయ నాయకుడు శ్రీనివాసరావు పాత్ర విశిష్టమైనది. ఇతడు పార్టీకీ, అధికారానికీ గాక, ప్రజల పట్ల నిబద్దుడు. నిజాయితీగా ప్రజల బాగు కోసం పోరాడిన వాడు.

ఖాఖాతో శ్రీనివాస రావు "ఇంటికి పిలిచి ఇడ్లీ పెట్టి మరీ బెదిరిస్తున్నావు. కానీ నన్ను చంపలేవు. నాకూ నీకూ పడదని అందరికీ తెలుసు. నన్ను చంపితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీ ఫ్యాక్టరీ మూయించనిదే నేను ఊరుకోను" అంటాడు. అంత వరకూ మాత్రమే కుట్రని, గూఢచర్యాన్ని ఊహించగలిగాడు. ఆత్మకూడా దుష్టుడే కాబట్టి అతడు ఇస్తానన్న మద్దతుని ఛీత్కరించాడు. అయితే ఆత్మ ఖాఖాకి అనుంగు బంటు అని ఊహించక, అతడు రమ్మన్న చోటికి పోయి అనూహ్యంగా ఖాఖా చేతిలో మరణిస్తాడు.

1992 ముందర, ఏ దేశానికి ఆ దేశంలో, ప్రపంచం మొత్తాన్ని నడుపుతోంది ఒకే ఒక గూఢచర్య వలయమనీ, మూడున్నర శతాబ్ధాలుగా దాన్ని నిర్వహిస్తోంది నకిలీ కణిక వంశమనీ తెలియక, ఎక్కడి కక్కడ, ఎప్పటి కప్పుడు, మరింకేవో పైకారణాలని చూస్తూ, విభజించి పాలించే తంత్రలతో సతమతమైన, ఓడిపోయిన, బలైపోయిన రాజకీయ నాయకులకు ఈ శ్రీనివాసరావు పాత్ర ప్రతీక!

ఉదాహరణకి మన దేశాన్ని తీసుకుంటే - శరీరం తునాతుకలై మానవబాంబు దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న రాజీవ్ గాంధీకి సమ్మోహనకరమైన చిరునవ్వు తప్ప, గూఢచర్యపు లోతెంతో తెలియదు. గూఢచర్యంలో అతడు పసిబిడ్డవంటి వాడే! తమ నట్టింట కొత్త కోడలిగా, తన నడిజీవితంలో ఇష్టసతిగా అడుగుపెట్టిన సోనియా.... ఎంత నటనా వైదుష్యమూ, గూఢచర్య చాతుర్యమూ కలిగి ఉందో ఊహకైనా తెలియని వాడు.

జీవిత పర్యంతమూ శతృవు ఎక్కడి నుండి కుట్రలు పన్నుతున్నాడో తెలియకపోయినా, ఒడ్డిపోరాడిన ఇందిరాగాంధీ అపర చండిక.

ఇందిరాగాంధీ.... 30 బుల్లెట్లు శరీరాన్ని తూట్లు పొడవగా అందులో 23 శరీరంలో నుండి అవతలికి దూసుకెళ్ళాయి. 7 లోపలే ఉండిఫోయాయి. రాజీవ్ గాంధీ, ముఖ్యంగా ఇందిరాగాంధీ లు శ్రీనివాస రావు పాత్రకీ ప్రతీకే! ఆమెకీ శ్రీనివాస రావులాగే నకిలీ కణిక గూఢచర్యం కొంతే తెలుసు. ఆ ఆన్వేషణలోనే జీవితాంతం పోరాడింది.

మున్నా చిత్రంలో శ్రీనివాసరావు ’ఖాఖా ఆత్మల వైరం’ అనే నాటకాన్ని గుర్తించలేక వాళ్ల చేతిలో బలయిపోతాడు. అక్కడ దొరికిన ఒక్క బుల్లెట్! దాంతో మున్నా ఖాఖాని కొన్ని గంటల పాటు పోలీసు లాకప్ లో కూర్చొబెడతాడు. అక్కడ ప్రారంభమైన మున్నా సవాల్.... ఖాఖా పతనం!

సినిమా చివరిలో మున్నా ఇచ్చిన ’ఒక్క బుల్లెట్’తోనే ఖాఖా, గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటాడు. అందులో ఉన్న వైచిత్రి ఏమిటంటే - మున్నా ఖాఖాకి ఇంకించేది - ’నాకు గా నేను నిన్ను చంపను. నిన్ను చంపటం నా టార్గెట్ కాదు. నిన్ను బ్రతక నివ్వకపోవటమే నా లక్ష్యం. ఇంతకంటే చావు సుఖం అన్పించాలి నీకు. అప్పటి వరకూ నీ ప్రతి పనికీ అడ్డం వస్తాను. నీ కళ్ళముందే నీ సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాను’ అని.

అదే నెం.5 వర్గం, నకిలీ కణిక వ్వవస్థ అనువంశీయులకీ, ముఖ్యంగా రామోజీరావుకీ ఇచ్చిన అల్టిమేటమ్! తొలి నుండీ తుది వరకూ ఇచ్చిన, ఇస్తున్న ఏకైక హెచ్చరిక! - "మాకుగా మేము నిన్ను చంపము. గూఢచర్యపరంగా నిన్ను పతనావస్థకు తీసుకుపోతాము. నీ కళ్ళముందే నీ సామ్రాజ్యాన్ని కూలుస్తాము. నీ చేతుల్తోనే నీ నెట్ వర్క్ ని తుత్తునియలు చేస్తాను. నిన్ను, నీ నిజస్వరూపాన్ని, నీ కీలక ఏజంట్ల లోగుట్టుల్నీ అన్నిటినీ బహిర్గతం చేస్తాము. చేసిన కర్మలని అనుభవింప చేస్తాము. [అంటే సువర్ణముఖి అన్నమాట.] ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లతో నీకు, ఇంతకంటే చావు సుఖం అన్పించాలి. తనివి తీరా ఆ సుఖాన్ని అనుభవించు. నీ అంతట నువ్వే, నీ చావుని నువ్వే నిర్ణయించుకో. లేదా ఈ బహిర్గతాలూ, సువర్ణముఖిలూ కొనసాగుతూనే ఉంటాయి" అన్నదే ఆ హెచ్చరిక.

ఇక మున్నా సినిమాకీ, రామోజీరావుకీ ఉన్న గాఢమైన పోలిక ఏమిటంటే - శ్రీనివాసరావు హత్యలో దొరికిన బుల్లెట్ తో మున్నా కేసు పెట్టాడు. చివరిలో ఖాఖా చచ్చేదీ, మున్నా ఇచ్చిన బుల్లెట్ తోనే!

1992 లో..... అంతకు సంవత్స్రరం క్రితం నిర్వహించిన రాజీవ్ గాంధీ హత్యలో రామోజీరావు ప్రమేయం గురించి నేను పీవీజీకి పిర్యాదు ఇచ్చాను. అప్పుడు ప్రారంభమైన అసలు కథ, యదార్ధ కథ ఇది! ఆ ఫిర్యాదు, మున్నా సినిమాలోని బుల్లెట్ కి ప్రతీక! రాజీవ్ హత్య కేసుతోనే అన్నీ ప్రకటింపబడాలి. నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గంలో కీలక వ్యక్తులైన రామోజీరావు, సోనియాల, స్వీయ ఆత్మహత్యా సదృశ్య గూఢచర్య మరణం దానితోనే!

"ఈ కేసు, ఇందులోని సత్యాలు అందరికీ తెలియాలంటే - అంటే డిక్లేర్ చేయాలంటే ఎవరో ఒకరు సాయం చేయాలి కదా? కాబట్టే నువ్వు మన్మోహన్ ని నమ్ము, సోనియాని నమ్ము, వై.యస్.ని నమ్ము" - అన్న ఊదర మాకు పెట్టేందుకు ’ఈ కేసుని ప్రకటించటం’ అనే ఆశనే పెట్ట చూపాడు రామోజీరావు. అదే అరుంధతిలో చెప్పబడింది. అప్పటికి మేము బ్లాగు తెరవలేదు గనక.... సోనియా, మన్మోహన్ ల గురించి మా అభిప్రాయం, అవగాహన ఎంతో రామోజీరావుకి తెలియదు మరి! ఇక నకిలీ కణిక అనువంశీయు గూఢచర్యం గురించి మాకేమిటి, పీవీజీకే తెలియదనుకున్నాడు.

’ఆ కేసు మరెవ్వరో కాదు. స్వయంగా మీరే ప్రకటించుకోక తప్పదు. అప్పటి దాకా బహిర్గతాలూ, సువర్ణముఖిలూ నీకూ, నీ సోదరతుల్య సోనియాకీ తప్పదన్నదే’ 2007 లోనే మున్నా సినిమా ద్వారా నెం.5 వర్గం, రామోజీరావుకి ఇచ్చిన హెచ్చరిక! ఇక సినిమాలకు సంబంధించిన మరో అంశాన్ని ప్రస్తావించి ఈ టపా ముగిస్తాను.

అరుంధతి సినిమాతో సహా, వేల సినిమాలలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ప్రజలకి ఇంకించింది ఏమిటంటే - చెడ్డవారికే బలమెక్కువ అని. చివరికి మరణించాక కూడా చెడ్డవాడి ఆత్మలకే శక్తిక్కెవ, మంచి వారి ఆత్మల కన్నా! అరుంధతిలోనే కాదు, అక్స్ లాంటి వేలాది సినిమాల్లోనూ చూపబడింది అదే!

చెడ్డవాడి ఆత్మలకే అంత శక్తి ఉంటే.... మంచివారికి, వారి ఆత్మలకి మరెంత శక్తి ఉండాలి? భగవంతుడు మంచికి తోడుంటాడే గాని చెడుకి కాదే?

దేశంకోసం పోరాడిన వారి ఆత్మలకీ, స్వాతంత్రంకోసం పోరాడిన మహాత్ములకీ, మానవత్వం కోసం పోరాడిన పుణ్యాత్ములకీ ఉండే ఆత్మబలం అంతులేనిది. అది సాక్షాత్తూ దైవబలమే! ఇందుకు నా జీవితం నుండే ఉదాహరణ ఇస్తాను.

1992, మే లో ఢిల్లీకి వెళ్ళాను. వెంట నా చిన్న తమ్ముడున్నాడు. పీవీజీకి రామోజీరావు గురించి, రాజీవ్ హత్యలో అతడి హస్తం గురించీ ఫిర్యాదు ఇవ్వాలన్నది నా టార్గెట్. అప్పటికే కడప వెళ్ళి వై.యస్.ని ఈ విషయంలో సాయం అడగటమూ, అతడు సాక్ష్యాలుంటే తెమ్మనటమూ అయిపోయింది. పీవీజీని కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు సాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, అప్పటి అఖిల భారత మహిళా కాంగ్రెస్ కన్వీనరూ అయిన కుముద్ బెన్ జోషి ని కలిసాను. మరోసారి ఇలాంటి విషయాలు తీసుకుని తన దగ్గరికి రావద్దని తెగేసి చెప్పేసిందామె.

ఆ రోజు కొంత నిరాశకీ, నిరుత్సాహానికీ గురయ్యాను. మరికొంత బెరుకూ పడ్డాను. గీత తెరిస్తే ’హతోవా ప్రాప్యతే స్వర్గం’ అనే శ్లోకమే కళ్ళముందు నిలిచింది. అయినా ఫిర్యాదు వ్రాసేందుకు ధైర్యం చాల లేదు. చాలా గుంజాటన పడ్డాను. చివరికి స్థైర్యం కూడగట్టుకునేందుకు, నన్ను నేను మోటివేట్ చేసుకునేందుకు ఇందిరాగాంధీ మోమోరియల్ [నెం.1 సఫ్థర్ జంగ్ రోడ్] కు వెళ్ళాను. సెక్యూరిటీ గార్డుల చేతిలో హత్యకు గురయ్యే ముందు, భువనేశ్వర్ లో ఆమె ఉపన్యాసంలోని మాటలు మంద్రస్థాయిలో విన్పిస్తున్నాయి. ఈ దేశపు మట్టికి మరింత బలం చేకూర్చేందుకు, ఆమె కార్చిన రక్తపు చుక్కలు అక్కడ ఘనీభవించిన స్పటికాలై ఉన్నాయి. బుల్లెట్ల వానకు రంధ్రాలు పడిన చీర కళ్ళముందు కదలాడింది.

అక్కడే చాలా సేపు గడిపాను. అదో రకమైన ధైర్యం, తెగువ నాలో ప్రవేశించాయి. [అప్పటి నా భావ సంచలనాన్ని ఇప్పుడు కాగితం మీద పెట్టడం కష్టమే! కొంత భాగం అప్పటి నా డైరీలో వ్రాసుకున్నాను.] మా నాన్న చెప్పిన "కాకిలా కలకాలం బ్రతకటం కంటే హంసలా అరఘడియ బ్రతికినా చాలు. ముందుకే వెళ్ళమ్మా!" అన్న మాట గుర్తుకొచ్చింది. ఎలా బ్రతికినా చచ్చే నాడు ఛస్తాం. దేశం కోసం చావటం కంటే గొప్పచావు ఏముందనిపించింది.

ఇందిరాగాంధీ చివరి ఊపిరి విడిచిన చోటు నాలో ఎక్కడలేని తెగింపునీ, ధైర్యాన్నీ నింపింది. అంతే! నేను బసచేసిన పహార్ గంజ్ లోని హోటల్ గదికి తిరిగివచ్చాను. రాత్రంతా కూర్చొని ఫిర్యాదు వ్రాసి, ఫెయిర్ చేసి కవరులో పెట్టి సీల్ చేసాను. నేరుగా పీవీజీ ఇల్లు చేరాను. ఆరోజు ఆలస్యం కావటంతో మర్నాడు ఫిర్యాదుని పీవీజీ కార్యదర్శికి అందచేసాను. ఇందిరాగాంధీ నేలకొరికింది 1984 లో. నేను రాజీవ్ గాంధీ హత్యలో రామోజీరావు ప్రమేయం గురించి ఫిర్యాదు ఇచ్చింది 1992 లో. దాదాపు 8 ఏళ్ళ తర్వాత!

కానీ ఆమె ఆత్మశక్తి నాకు బలాన్నిచ్చింది. ధైర్యాన్నిచ్చింది. మంచి వారి ఆత్మబలం అది! ఎంతో చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి, దేశపు మట్టికి బలాన్నిచ్చిన ఎందరో భగత్ సింగ్ ల ఆత్మ బలం నన్ను నడిపించింది.

అప్పటికి తెలిసింది రాజీవ్ గాంధీ హత్య గురించి మాత్రమే! నకిలీ కణిక అనువంశీయుల కుట్రలకి బలయ్యింది ఎందరో? ఒక ఇందిరాగాంధీ, ఒక మహాత్మగాంధీ.... అప్పటికి గుండెపోటు అనే పైకారణాన్ని నమ్మించినా కుట్రలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఒక శాస్త్రీజీ.... చైనా దురాక్రమణతో వెన్నుపోటుకూ, నమ్మకద్రోహానికీ గురయ్యామన్న యదార్ధం తెలుసుకొని, కలలు కరిగిన కృంగుబాటుతో మానసిక మరణానికి చేరువైన ఒక నెహ్రు - మత ఘర్షణల పేరిట, రిజర్వేషన్ రచ్చలతో ఎందరు ఎన్ని రకాలుగా ఉసురు కోల్పోయారో.... ఆ ఆత్మల బలమే ఈ రోజు నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా అద్వానీలని, ఆయువు పట్టులపై కొడుతోంది.

ఇది ఆగని యుద్దం.
ఓటమి లేని యుద్దం.
ఎందుకంటే గెలిచే వరకూ కొనసాగే యుద్దం కనుక!

మరణించినా మహాత్ముల భావప్రసార శక్తి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇప్పటికీ వివేకానందుడి ఉపన్యాసం చదివినా, బాపూజీ ఆత్మకథ చదివినా.... వారి నుండి మనకి భావపు శక్తి, స్ఫూర్తి ప్రసారం కావడం నిజం!

ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మేం నంబూరు పల్లెలో ఉండగా.... అప్పటికి మా పాపకి దాదాపు రెండు సంవత్సరాలుంటాయోమో! మాటలన్నా సరిగ్గా రావు. టివీలో రాజమకుటం సినిమాలోనే అనుకుంటా, శ్రీశ్రీ వ్రాయగా ఘంటసాల పాడిన

"మరో ప్రపంచం... మరో ప్రపంచం... మరో ప్రపంచం
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది.
పదండి ముందుకు పదండి తోసుకు" అనే పాట వచ్చింది.

మా గదిలో మంచంకి దగ్గరలో ఓ మూల టేబుల్ పైన టీవీపెట్టి ఉంది. మా పాప ముఖం వెలిగిపోతుండగా.... టీవీ వైపుకు మంచం మీదే ముందుకెళ్ళిపోతూ

’మరో ప్రపంచంపిలితింది. పదంది ముందుతూ పదంది తోసుతూ’
అంటూ పాడుతోంది. దాదాపు టీవీలోకి వెళ్ళిపోవాలన్నంత వ్యగ్రంగా! నేనయితే అదిరిపడ్డాను. ఎప్పుడో అప్పటికి నాలుగు దశాబ్దాల క్రితపు పాట.

శ్రీశ్రీ హృదయంలోని ఆర్తి, ఆశ.
ఘంటసాల కంఠంలోని తీవ్రత.
ఆ పాటకు కట్టిన రాగంలో లోంచి తొణికే రౌద్రరసం!

రెండేళ్ళు నిండని పసికూనని, భాష, భావాల గూర్చి ఏదీ తెలియని చిన్ని బుడ్డీని....ఏదో అవ్యక్త అనుబంధం కట్టిలాగినట్లు ఆకర్షతమవ్వటం... గీత చెప్పినట్లు ’జీవుడు వాసనలు మోసుకువస్తాడేమో!’ శతాబ్దాలు గడిచినా.... మహాత్ముల శక్తి వన్నెతగ్గనిదని కళ్ళెదుట చూశాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

మొన్న మొన్నటి వరకూ సరిగ్గా విశ్లేషించి, ఇప్పుడేమో రిలీజ్ అయిన ప్రతి సినిమా మీ గురించే, రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పు చూపించినా మీ గురించే అంటూ చెప్పాల్సి రావడం కూడా ఒక ఆత్మ హత్యా సదృశమైన అసైన్మెంటే అనిపిస్తోంది.

ఛ!నిజమా!భలే చెప్పారే!

అమ్మా,
చంద్రాయనం పేరిట అమెరికా రష్యాలు ప్రపంఛాన్ని ఎంతగ మోసంచేసామో, చేస్తునానమయో మరొసారి నిరుపిస్తూ మన సత్యనారయన శర్మా గారు కొన్ని టపాలు ఆయన బ్లాగ్ లో రాసారు. చంద్రుడి యత్ర విషయంలొ అమెరికా ప్రపంచాన్ని మోసం చేసి ఆడిస్థుందొ నిరుపిస్థు ఎన్నొ అదారాలు కూడ ఉన్నాయి వాటికి ఏ ప్రచారం ఉండదు, ఈనాడు అయితే వాటిని పిచ్చి వాళ్ళ చేష్టలుగా వ్రాసింది. బహుశ ఇది మీకూ మరింత సమాచారాన్ని అందిస్తుందని అనుకుంటున్నాను. కింద ఇచ్ఛిన లంకెలు చూడండి...

http://teluguyogi.blogspot.com/2010/02/blog-post_28.html
http://teluguyogi.blogspot.com/2010/02/blog-post_26.html
http://teluguyogi.blogspot.com/2010/02/blog-post_23.html

కొంత మంది దినిని తెలికగా కొట్టివెయవచ్చు, కాని ఇది నిజం. ఇంతే కాదు మరెన్నొ విషయాలలొ మనం నిరంతరం మోసం చేయబడుతున్నాము.
-రేణూ కుమార్

EVM ల పనితీరుపై వెనక్కి తగ్గిన ఎలక్షన్ కమిషనర్ , BSNL ప్రైవేటీకరణ కు శాం పిట్రోడా సిపార్సు నివేదిక తెలంగాణ సమస్య, అంధ్రాలో బలహీన ముఖ్యమంత్రి, పాత బస్తీలో అల్లర్లు తదితర వార్తల నేపద్యంలో :

నవీన్ చావ్లా: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి సహకరించాడు(అట)
శ్యాం పిట్రోడా: భారత దేశంలో శాంకేతిక విప్లవానికి ఆద్యుడు, రాజీవ్ గాంధీకి సన్నిహితుడు
పిట్రోడా సిఫారసులు:
30 శాతం వాటా అమ్మాలి.
3 లక్షల మంది ఉద్యోగుల్లో 1 లక్షమందిని స్వచ్చంద పదవీ విరమణ లాంటి పధకాలుపెట్టి రిటైర్ చేయించాలి
9 కోట్లా 30 లక్షల లైన్లతో జి.ఎస్.ఎం. మొబైల్ నెట్ వర్క్‌ని 35 వేల కోట్ల ఖర్చుతో విస్తరించాలనే ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలి. పరికరాల ఆర్డర్లని ఆపివేయాలి. నెట్‌ వర్క్‌ని ఔట్ సోర్సింగ్‌ చేసుకోవాలి.
సంస్తకున్న కాళీ భూముల్ని వాణిజ్య పరంగా వాడుకోవాలి. ఆపని చెయ్యటానికి ఒక రియల్ ఎస్టేట్ సంస్తని ఏర్పరచాలి- అదీ ప్రైవేట్ భాగస్వామ్యంతో
ఈ మధ్య దేశంలో జరిగే కొన్ని అవాంచనీయ సంఘటనలకు(పాకిస్తాన్ మంత్రి ఫోటో ప్రచురణ, మహారాజా ఎక్స్ప్రెస్ కి గీసిన రూట్ మేప్ లో ఢిల్లీ ని పాకిస్తాన్లో చిత్రించడం మొదలైనవి ) ఇంతవరకూ ఎవర్నీ బాధుల్ని చేయలేదు ... ఎందుకో తెలీదు
బహుశా వీటన్నింటి వెనుకా నకిలీ కణిక వ్యవస్త హస్తం ఉన్నట్లు అనుమానం . నకిలీ కనికుడికి ఇందిర ,రాజీవ్ లంటే పడదు, వాల్లను Unpopular చెయ్యాలి.ఇందుకు ఇందిర, రాజీవ్ లకు సన్నిహితులైతే వాళ్ళ వేలితో వాళ్ళ కన్నే పొడిచినట్టు అని భావించి ఉంటాడు. ఆ విధంగా ఇందిర ,రాజీవ్ లకు సాధ్యమైనంత వరకు అపఖ్యాతి తేవాలని నకిలీ కణికుడి ఉద్ధేశ్యం లా కనిపిస్తుంది ,ప్రస్తుతం ఇందిర, రాజీవ్ లు జీవించిలేరు. అయినా సరే ఆ అపఖ్యాతిని వాల్లకు మూటగట్టాలని భావిస్తున్నాడు. నిజానికి ఇప్పూడున్నది ఇందిరా కాంగ్రెస్ కాదు ... ఇటలీ కాంగ్రెస్ . మరి ఈటలీ కాంగ్రెస్ చేసిన తప్పుకి ఇందిరాకాంగ్రెస్ ఎలా బాధ్యత వహిస్తుంది . *** పేపర్ చదివితే ఈ విషయం స్పష్టమౌతుంది ... దేశంలో అత్యంత వెనుకబడిన వాల్లు ముస్లింలు, సహజీవనం తప్పుకాదు అని సుప్రీం కోర్టు వాఖ్య ...ఇత్యాదివన్ని అతని సృష్టే ... మొత్తానికి దేశంలో ఏదొ జరిగి పొతోంది ... అన్నింటికీ ఏదో లింకుంది .

అజ్ఞాత గారు : ఈ శ్యాం పిట్రోడా అసలు పేరు సత్యనారాయణ గంగారాం. అమెరికా వెళ్ళాక పేరు మార్చుకున్నాడు. ఒరిస్సా ఏజన్సీ ప్రాంతానికి చెందిన సాధారణ కార్పెంటర్ ఎనిమిది మంది సంతానంలో ఒకడు. ఇతడి జీవితంలో అనూహ్యవిజయాలు, అతడి మాటల్లో అయితే షాకులు ఉన్నాయి. అమెరికా భారత్ లలో ప్రముఖలతోనూ, ప్రధానులతోనూ ప్రత్యేక సమావేశాలు [ఇంటర్యూలు] గంటల పాటు పొందగలిగిన ప్రతిభా సామర్ధ్యాలు [?], లాబీయింగూ కలిగిన వాడు.

follow my blog
http://gunnuminnal.blogspot.com

రేణూ కుమార్ : ఆ లంకెలు చదివాక జవాబు వ్రాస్తాను. లంకెలిచ్చినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu