1985 ల తర్వాత, అప్పటికి టీవీ నటిగా వెలుగుతున్న నీనాగుప్తా వివాహం కాకుండా గర్బవతి అయ్యింది. అది ఆమె వ్యక్తిగత విషయంగా మిగల లేదు. మీడియాలో బహుళ ప్రచారం పొందింది. ఆమె ఖరాఖండిగా తన బిడ్డకు తండ్రెవరో చెప్పాల్సిన అవసరం లేదని, తల్లి కావాలనుకుంటే అందుకు వివాహం, భర్తా తప్పని సరేం కాదనీ ప్రకటనలిచ్చిందని మీడియా వ్రాసింది.

అంతే! ఆఫ్ట్రాల్ ఒక సినిమా నటి లేదా టీవీ నటి, వివాహాన్ని తృణీకరిస్తే.... అదేదో యావద్బారత జాతే తృణీకరించినట్లుగా.... భారతీయ స్త్రీలందరూ అంతగా బరితెగించినట్లుగా మీడియా హోరెత్తించింది. ఇంకేముంది? ఇండియాలో వివాహ వ్యవస్థ నేడో రేపో కుప్పకూలనుందన్నట్లు హడావుడి చేసింది. చర్చలూ, వ్యాసాలు....! [అప్పటికింకా ప్రైవేటు టీవీ ఛానెల్సు లేవు కాబట్టి నిరంతర వార్తాస్రవంతులూ, చర్చా గోష్టులూ నడవ లేదు. దాంతో అప్పటి జనాలు ఆ పాటి బ్రతికి పోయారన్న మాట.]

ఏయే రాష్ట్రాల్లో, ఏయే సంవత్సరాల్లో ఎన్ని విడాకుల కేసులు నడిచాయో, ఎందరు యువతీ యువకులు అవివాహితులుగా ఉండిపోతున్నారో లెక్కల డొక్కలు తీసింది. నిజానికి కెరీర్ గ్రాఫ్ బాగుంటుందంటే నగ్నంగా నటించే నటీ నటులున్న చోట, వివాహాన్ని తృణీకరించినట్లు ప్రకటనలిమ్మన్నా, ప్రవర్తించమన్నా సిద్దపడరా? ఇప్పుడు, వివాహం చేసుకోకుండా సహజీవనాలు చేస్తున్న బిపాసాబసులూ, జాన్ అబ్రహాంలు, కరీనా కపూర్ లు, సైఫ్ అలీ ఖాన్ ల వంటి వారే ఎప్పుడైనా ఎక్కడైనా....!

ఎం.రామయ్యా కాస్తా, ఎమ్.ఆర్. మయ్యాగా పేరు చెప్పుకుంటే, స్టాక్ మార్కెట్ తాలూకూ ఆర్ధిక నిపుణుడిగా మీడియాలో విపరీత ప్రచారం వచ్చింది. కెరీర్, మీడియాలో ఇమేజ్ ల కోసం, ఈ విధంగా హిందూ దేవుళ్ళని, మత విశ్వాసాలని, సంస్కృతీ సాంప్రదాయాలని అపహాస్యం చేసేందుకు ఎందరో సిద్దపడ్డారు, పడుతూనే ఉన్నారు. హిందూమత విద్వేష వ్యతిరేక ప్రచారం చేసే వారు, హిందువులకు పవిత్రమైన పేర్లు పెట్టుకోవటం వంటివి ఇందులో కొన్ని! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాలు నిర్వహించే కుట్రలో ఇది ఒక ప్రధాన అంశం.

అలాంటి నీనాగుప్తాలని చూపించి, మీడియా ఎంతగోల పెట్టిందంటే... నిజంగానే భారతదేశంలో పెళ్ళి, కుటుంబ వ్యవస్థల మీద నమ్మకం సడలి పోయిందేమోనని నాటి పెద్దతరం ఆందోళనతో, యువతరం ఆసక్తి, అయోమయాలతో పరికించారు. దశాబ్దాలు గడిచినా.... భారత్ లో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థా కూడా నిక్షేపంగానే ఉన్నాయి. మీదు మిక్కిలి, ప్రపంచదేశాలలో చాలామంది ఆ విషయమై భారత్ ను అభిమానిస్తున్నారన్న వార్తలు కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. నీనాగుప్తా వ్యవహారం వంటి వాటికి ఇది సమాధానమన్నమాట. విదేశీయులు మన సాంప్రదాయ పద్దతిలో వివాహాలను సంతోషంగా నిర్వహించుకోవటం ఇటీవల తరచుగా కన్పిస్తోన్న పరిణామం.

నిజం చెప్పాల్సి వస్తే.... కుటుంబ వ్వవస్థ, క్రమశిక్షణాయుత జీవితంతో ముడిపడినట్టిది. యువతీ యువకులు భార్యాభర్తలుగా ఒకరికొకరై, చిన్నారులకి తల్లిదండ్రులై, ప్రాణప్రదంగా భవిష్యత్తరాన్ని కాచి కాపాడి, పెంచి పెద్ద చేసే వివాహ వ్యవస్థ! కనిపెంచిన తల్లిదండ్రులకి, వృద్దాప్యంలో తామే తల్లిదండ్రులన్నంత గౌరవంగా, ప్రేమాదరణలతో చూసుకునే కుటుంబ వ్యవస్థ! తరం నుండి తరానికి.... అనుభవ జ్ఞానం, కుటుంబ గౌరవం, వంశమర్యాద, వారసత్వ దృక్పధం అనుశృతంగా అందించే కుటుంబ వ్యవస్థ!

అటువంటి కుటుంబ వ్యవస్థ, భారతీయ సమాజమనే మహా సౌధానికి పునాదిగా అలరారుతుండగా.... స్వలింగ సంపర్కులకి వివాహాలని చట్టబద్దం చేయించే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, దాన్ని విపరీతంగా ప్రచారించే మీడియా, శతవిధాలా, భారతదేశంలో వివాహ, కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతున్నాయన్న భ్రమ ప్రజల్లో కలిగించడానికి ఎడతెగని ప్రయత్నమూ, ప్రచారమూ చేశారు.

ఎంతగా అంటే... ఇటీవల స్వలింగ సంపర్కుడైన విదేశీ వ్యక్తి ఒకాయన హైదరాబాదు వచ్చి, గుర్తు తెలియని మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకుని, కృత్రిమ పద్దతిలో కుమార్తెని పొందాడు. ఆ ఫోటో ప్రచురిస్తూ మీడియా "కన్న కూతుర్ని మురిపెంగా చూసుకుంటున్న సదరు ప్రముఖుడంటూ" తెగ వ్రాసి పారేసింది. అసలు స్త్రీ పురుషులే ప్రకృతి సహజ పద్దతిలో తల్లిదండ్రులై, ఆ తర్వాత.... వివాదపడి విడిపోతున్నారు. పిల్లాపాపల గతి పట్టించుకోకుండా,.... స్వసుఖం కోసమో, అరిషడ్వర్గాల వరదలో పడో... విడాకులు తీసుకుని, పిల్లలు బ్రతుకులు నరకప్రాయం చేస్తున్నారు.

అలాంటిది, కృత్రిమ పద్దతిలో బిడ్డని పొందిన ఆ స్వలింగ సంపర్క మగరాయుడు, రేపు ఆ బిడ్డని తుంగలో తొక్కడని గ్యారంటీ ఏమిటో? అందునా తల్లి తాలూకూ పేగు బంధం కూడ లేదయ్యె! ఆ పసికందు ఫోటో చూసినప్పుడు "ప్రకృతి పట్ల మనిషి చేస్తున్న పదార్ధ కాలుష్యం కంటే ఈ మాతృప్రేమ, పితృ ప్రేమల కాలుష్యం, భావ కాలుష్యం మరింత భయంకరమైనది కదా" అన్పించింది.

తన ప్రమేయం ఏమీ లేకుండా.... అసహజపు సంచలనాలకు ఆకర్షితమైన వారి మోజుల కారణంగా.... ఈ లోకంలోకి వచ్చిన చిన్నారి, అమ్మఒడి అనురాగం తెలియకుండా! అమ్మ జోలపాట వినకుండా... ఎంత విపరీత ధోరణులో కదా ఇవి?

ఇంతగా.... ప్రకృతి సహజమైన పరిస్థితులనే కాదు, భావాలను కూడా కలుషితం చేస్తారు కాబట్టే, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాలని గురించి వాళ్ళు ధర్మగ్లాని చేస్తారని, కాబట్టి వాళ్ళు మనిషికి కాదు, మానవత్వానికే శతృవులు అని వ్రాసాము. మీడియా ప్రోత్సహించడం వల్లే, ప్రచారించినందు వల్లే, ఈ విపరీత ధోరణులు మరింతగా పేట్రేగి పోతున్నాయన్నది జగమెరిగిన సత్యం! ఒకప్పుడు పర్యావరణాన్ని పట్టించుకోని ఫలితం నేడు మనం అనుభవిస్తున్న ప్రకృతి భీభత్సాలు. వాటి గురించి సభలు పెట్టుకుని చర్చించుకున్నట్లు, భవిష్యత్తులో ఈ స్వలింగ సంపర్కుల కృత్రిమ సంతానాల గురించి, వాళ్ళ తాలూకూ భీభత్సాల గురించి తీరిగ్గా సభలు పెట్టుకుని చర్చించుకోవాలేమో మరి!

ఈ విషయాంతరం వదిలిపెట్టి మళ్ళీ నీనాగుప్తా విషయానికి వద్దాం.

సదరు నీనాగుప్తా, 1992 తర్వాత, ఇటీవలి సంవత్సరాలలో, తన కుమార్తెకు తండ్రి, క్రికెట్టు ఆటగాడు వీవీ రిచర్డ్స్ గా చెప్పడమే గాక, ఈనాడు ఆదివారం, వసుంధర సంచికలలో.... రిచర్డ్స్ కుమారుడు, నీనాగుప్తా కుమార్తెల సోదర సోదరీ బంధం గురించిన ఆర్టికల్ కూడా ప్రచురింపబడింది. అప్పుడంతగా వివాహవ్యవస్థపైన గోలపెట్టించిన మీడియా నవాబు చేతే, దాని విపర్యాయాన్ని వ్రాయించటమే ఇక్కడ స్ట్రాటజీ! ఇది మనకి తేలిగ్గా కన్పించవచ్చు గానీ, రామోజీ రావు వంటి వారి అహనికి అది శరాఘాతం వంటిది.

అంతేగాక, నీనాగుప్తా వ్యవహారం 1992 కు ముందరిది. నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గాల ఉనికి తెలియని రోజుల నాటిది. అంటే off record లో జరిగింది. అలాంటిదే on record లో జరిగిన సంఘటన టీవీ యాంకర్, సల్మాన్ రష్దీ ఒకప్పటి ఉంపుడుగత్తె పద్మాలక్ష్మి వ్యవహారం! అచ్చంగా నీనాగుప్తాకు భావ వారసురాలి వంటిది ఈ పద్మాలక్ష్మి. అదే తరహాలో తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్ప నిరాకరిస్తూ సంచలనాలకు కేంద్రం అయ్యింది.

నిజానికి, ఒకప్పుడు వివాహిత కాకుండా తల్లి కావడం, తండ్రెవరో తెలియని బిడ్డకు తల్లిగా ఉండటం పరమ లజ్జాపూరిత వ్యవహారమై ఉండేది. ఇప్పటికీ సామాన్య పౌరులలో ఆ పాటి నైతిక విలువలు ఉన్నాయి. కాబట్టే, అలాంటివి ఇప్పటికీ గ్రామాల్లో, కాలనీలలో అవమానకరమైన అంశాలుగా విమర్శలకు గురి అవుతూ ఉంటాయి. అయితే మీడియా ప్రచారం ఇచ్చి, వాటికి సంచలనాల చెమ్కీలు అద్దటంతో, సెలబ్రిటీ హోదాలు ఇవ్వటంతో, టీవీ సినిమా నటీనటులలో క్రీడాకారులలో ఎవరైతే కెరీర్ కోసం, దమ్మీడీల కోసం, లజ్జాహీన పనులకు కూడా ముందుకు వస్తారో అలాంటి వారు, ఇలాంటి సంచలన అనైతికతకి పాల్పడుతుంటారు. పైగా అది వారి వ్యక్తిగత విషయమని మరి కొందరు వత్తాసు వస్తారు. అలా వత్తాసు వచ్చే వారు కూడా, చాలా సందర్భాలలో నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం చేత ప్రయోగింపబడిన వారే అయి ఉంటారు.

ఇక పద్మాలక్ష్మి వ్యవహారంలో గమ్మత్తు ఏమిటంటే - ఈ సారి ఈ వ్యవహారాన్ని, ప్రపంచ వ్యాప్తంగా అందరి కన్ను పడేటట్లు, ఆమె బిడ్డకు తండ్రి డెల్ కంపెనీ అధినేత తమ్ముడనీ, మరొకరనీ ప్రచారం జరిగింది. ఈసారి ఈనాడు, ఈ వ్యవహారంలో, కన్నంలో తేలుకుట్టిన దొంగలాగా, ఎక్కడో సింగిల్ కాలమ్ న్యూస్ గా పద్మాలక్ష్మి వ్యవహారాన్ని తోసేసింది. అది మంచిదే! కాకపోతే ఇదే పనిని 1980 వ దశకంలో నీనాగుప్తా వ్యవహారంలో కూడా చేసి ఉంటే బాగుండేది. అసలు అలాంటి వ్యవహారాలని సింగిల్ కాలమ్ లోనో, ప్రధాన పేజీలోనో ప్రచారించకుండా, సదరు వ్యక్తులని లజ్జాపూరితుల్ని చేస్తే అసలిలాంటి అనైతికతే రాదు కదా!

స్త్రీ గౌరవాలతో, మానవీయ సంబంధాలతో ముడిపడిన ఇటువంటి సున్నితమైన విషయాలు భావోద్వేగాలకు సంబంధించినవి.

జీవితాన్ని పంచుకునేందుకు పురుషుడి చిటికెన వేలు పట్టుకుని, ఏడడుగులు నడిచి, వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన మహిళకు ప్రతీక సీత! రామాయణ కావ్యనాయిక సీత! భర్త సుఖాలే కాదు, కష్టాలు కూడా పంచుకునేందుకు, నగర జీవితాన్ని, భోగ భాగ్యాలని విడిచి పెట్టి, నార చీరలు కట్టి నట్టడవికి భర్తతో పాటు నడిచింది. బలిమితో రావణుడు తీసుకుపోయి లంకలో బంధించిన వేళ... తన అష్టయిశ్వర్యాలని ప్రదర్శించి తనకు లోబడమన్న వేళ, గడ్డి పరకగా రావణుణ్ణి తృణీకరించిన ధీర వనిత సీత! మరణానికి సైతం భయపడక, రావణుని సామ దాన బేధ దండోపాయాలకి చలించని సీత భారతీయ స్త్రీలకి పరమ పూజ్య దేవత!

తనకంటే బలమైన వాడుగా అందరూ చెబుతున్న రావణుడు, తన కంటే సిరిసంపదలు పేరు ప్రతిష్ఠలు కలిగిన రావణుడు, అప్పటికే చెప్పుకో దగిన విజయాల రికార్డులున్న రావణుడు! [కుబేరుణ్ణి గెలిచి పుష్పక విమానాన్ని సంపాదించిన వాడూ, త్రిలోక్యాధిపతి]... అలాంటి వాడు తన భార్యనెత్తుకు పోతే, తాను మరో బలహీనుడి భార్యను తెచ్చేసుకోకుండా, లేదా ’మరో పెళ్ళి చేసుకుంటే సరిలే!’ అనుకోకుండా.... తన భార్య, తనలో సగం అనుకొని, ఆమె కోసం అన్వేషించి, ప్రాణాలొడ్డి పోరాడిన వాడు రాముడు. తనకు శక్తి యుక్తులు లేవనో, సిరిసంపదలు చాలవనో చతికిలబడలేదు. వన చరులనే సహచరులుగా చేసుకొని, వారధి నిర్మించి, లంక చేరి, సమస్త రాక్షస జాతిని సమూలంగా అణచి వేసిన వాడు.... అలాంటి రాముడు భారతీయ పురుషులకు ఆదర్శమూర్తి.

ఎంత కాలం వరకూ ఈ గడ్డపై రామాయణం గౌరవింపబడుతుందో, అంతకాలం వరకూ ఇక్కడ ధర్మానికి, ప్రశాంత జీవనానికీ ప్రమాదం లేదని పెద్దల ఉవాచ. రామాయణ విషవృక్షం, ఇతర హిందూమత గ్రంధాలపై కుట్రపూరిత యత్నాలని, తదుపరి పరిణామాలని పరిశీలిస్తే, అది నిజమే అన్పిస్తుంది.

అలాంటి రామాయణం, ఎంతగా భారతదేశంలో ఆచరింపబడిందంటే.... ఆఫ్ఘన్ ఇసుక పర్రల నుండి ముస్లిం ముష్కరులు [గజని మహమ్మద్, ఘోరీ మహమ్మద్ ఏ పేరైనా ఒకటే] భారత దేశపు రాజ్యాల మీదపడినప్పుడు.... కోట శతృవు వంశమైందన్న వార్త విన్నంతనే తమ గౌరవాన్ని, శరీరాలని కూడా రక్షించుకునేందుకు అగ్ని ప్రవేశం చేసిన రాజపుత్ర స్త్రీలు ఈ దేశపు అపర సీతలు! ఇవి చరిత్రకి అందిన, ఆధారాలున్న నిజాలు!

ఔరంగజేబు హయాంలో ముస్లింసేనలు మరాఠా మహిళల మీద అఘాయిత్యాలు చేయటం, వారి మాన మర్యాదలని మంటగలపటం వంటివి చేసినందునే ఛత్రపతి శివాజీ అవిక్ర పరాక్రమంతో తలయెత్తాడు. [ఓటమితో ఒంటరిగా, శ్రీశైలంలో తపస్సు నాచరించినంతగా తపించాడనీ, అమ్మవారి అనుగ్రహంతో తిరిగి వెళ్ళి సామ్రాజ్య స్థాపన చేయగలిగాడనీ శ్రీశైల స్థల చరిత్రలో చెబుతారు. సామ్రాజ్యాధినేతగా శివాజీ నిర్మించిన గోపురం కూడా శ్రీశైల ఆలయానికి ఉంది.]

నిజాం నవాబుల కాలంలో కూడా స్త్రీల మాన ప్రాణాలకి రక్షణ లేకపోవటం, రజాకార్ల అఘాయిత్యాలు ఇప్పటికీ తడి ఆరని జ్ఞాపకాలే, మచ్చమానని గాయాలే!

ఇదంతా ఎందుకు చెప్పానంటే - స్త్రీ గౌరవం, శీల సంరక్షణ అన్నది భారతీయుల జీన్స్ లో ఉంటే.... స్త్రీని గౌరవించక పోవటం, ఒకరు నలుగురిని పెళ్ళి చేసుకోవచ్చు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తలాక్ ఇవ్వచ్చు అనుకునే మహిళా వివక్ష ముస్లిం జీన్స్ లో ఉంది. వెయ్యేళ్ళ క్రితం లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, ఎడారుల నుండి ముస్లిం రాజులుగా పిలవబడే ముష్కర మూకలు ఈ గడ్డ మీదికి రాక పూర్వం ఇక్కడ ముస్లింలు లేరు. కాబట్టి భారతీయ సామాన్య ముస్లింలు వేరు, భారతదేశంతో సహా ప్రపంచంలో ఎక్కడైనా.... ’రాజ్యాలేలాము, నవాబులం మేము, సుల్తానులం మేము, మొగలాయూలం మేము’ అనుకునే ముస్లింలు వేరు. వేశ్యాపుత్రుడితో ప్రారంభమైన నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులలో కూడా, ఇలాంటి భావాలే ఉన్నాయి. "రాజ్యాలేల వలసిన వాళ్ళం మేము" అనే భావనలు! కాకపోతే వాటితో పాటే లజ్జాహీనత కూడా ఉంది.

నకిలీ కణిక వ్యవస్థ, శతాబ్ధాలుగా నెలకొల్పుకుంటూ వచ్చిన నెం.10 వర్గంలో కూడా, ఇలాంటి ముస్లిం నవాబులు, సుల్తానుల వంశీయులవే కీలక స్థానాలు.

రెండవప్రపంచ యుద్దం చివరి ఘట్టంలో[1945 లో], రష్యన్ సేనలు జర్మనీలోని మహిళలని విచక్షణారహితంగా, 8 ఏళ్ళ పసిబిడ్డల దగ్గరి నుండి 90 ఏళ్ళ ముది ముగ్గుల దాకా [20 లక్షల మంది] పలుమార్లు [సగటున పన్నెండుసార్లు] సామూహిక మానభంగాలు చేశారనీ, రష్యన్ నియంత స్టాలిన్ ఆదేశానుసారమే ఇదంతా జరిగిందనీ, ఇటీవల ఆనాటి బాధితురాలు గాబ్రియెల్ ’ఆడపిల్లగా ఎందుకు పుట్టాను?’ అనే పుస్తకంలో తన భావాల్ని గుర్తు చేసుకుంటూ వ్రాసింది.

ఇటలీ నియంత ముస్సోలినీలకి, రష్యన్ నియంత స్టాలిన్ లకీ తేడా లేదు. అప్పట్లో బ్రిటీషు వెనుక దాగిన, నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్య వలయానికి చెందిన ఏజంట్లే ఇలాంటి వాళ్ళు. కాబట్టే, పత్రిక విలేఖర్లు కూడా పరిణామ క్రమంలో ముస్సోలినీలై, దేశాధినేతలు కాగలిగారు. స్త్రీ పట్ల చులకన, స్త్రీ గౌరవాన్ని మంటగలిపి తీరాలన్న కసీ, ప్రకోపాలతో కూడిన [పెర్వర్షన్] మానసిక వికారం వేశ్యాపుత్రులది. దీన్ని గురించి గతటపాలలో కూడా వివరించాను.

ఆ మనోవికారమే.... నిజాంలు రజాకార్లకి ఇచ్చిన ఆదేశాల దగ్గరి నుండి, స్టాలిన్ లు రష్యన్ సైనికులకి ఇచ్చిన ఆదేశాల దాకా కన్పిస్తుంది. ఇలాంటిదే ప్యాకింగ్ మారుస్తూ బ్యూటీ కాంటెస్ట్ ల పేరిట నడుస్తుంది. అదీ గల్లీ నుండి ఢిల్లీ.... అంతర్జాతీయాల దాకా!


దీన్నే ప్రయోగిస్తూ.... ఏ మరాఠా మహిళల గౌరవ మర్యాదల కోసం శివాజీ ఛత్రపతి అయినాడో... నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, ఆ మరాఠా గడ్డపై ముంబైని కేంద్రంగా చేసుకుంది. మరాఠా మహిళలూ, ఇతర భారతీయ స్త్రీలూ, బాలీవుడ్ నటీమణులై, టీవీ యాంకర్లై, గౌరవమర్యాదాలని ఎలా మంటగలుపుతారో చూపించడానికి, తద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి..... భారతదేశం పట్ల నిబద్దతా, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమా కలిగిన నాయకులని [ఇందిరాగాంధీ, పీవీజీల వంటి వారితో సహా] హ్యుమిలియేట్ చేయడానికి, బాలీవుడ్ సినిమా పరిశ్రమపైన నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గమూ తమ దృష్టిని కేంద్రీకరించింది.

పైముఖంగా, పాకిస్తాన్ ఏజంట్ గా పేరుబడిన దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ వంటి వారు బాలీవుడ్ ని శాసించారు. 1992 నాటికి సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ల త్రయం హిందీ చిత్ర జగత్తుని ఏలేస్తోంది. ఎంతగా వలువలూ, విలువలూ వదిలేస్తే అంతగా కెరీర్ ఉండటము, కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించటానికి, ముద్దులూ వగైరా శృంగారానికీ సిద్దం అంటూ తారామణులు ప్రకటనలు చేయటం! వాటిని హైలైట్ చేస్తూ నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, భారతీయత పట్ల నిబద్దత గలవారికీ [ముఖ్యంగా అధికారంలో ఉన్న అలాంటి వారికి] ఇచ్చిన సవాలు ఇది.

"ఓ... శీలం.... స్త్రీ గౌరవం... అంటూ తెగ గింజుకుంటున్నారుగా! చూడండి. ఎంత నిసిగ్గుగా ఉన్నారో మీ యువతులు!" అన్న సవాలు అది! భ్రష్ఠమైన తమ కూతుళ్ళు, కుమారులని చూసి నిస్సహాయంగా దుఃఖించే తల్లిదండ్రులని, చుట్టూ ఉన్న వాళ్ళు విమర్శిస్తే ఎంతగా హ్యుమిలేయేట్ అవుతారో, కృంగిపోతారో, అసహన పడతారో.... అలాంటి వెతకి గురి చెయ్యటం అది.

అందుకే.... కెరీర్ కోసం దావూద్ ఇబ్రహీం కు ఉంపుడుగత్తెగా వెళ్ళి కొడుకుని కన్నది హిందీనటి మందాకిని! ఈ విషయానికి అప్పట్లో మీడియా ప్రచారమే గాక, స్వాతిలాంటి పత్రికల్లో గాసిప్స్ పేరిట మౌఖిక ప్రచారమూ నడిచింది. మరో విచిత్రమేమిటంటే సదరు మందాకిని మొదటగా రాజ్ కపూర్ చేత ప్రమోట్ చెయ్యబడింది. ఇతడు దేశవిభజన నాడు పాకిస్తాన్ నుండి ఇటు వచ్చిన వాడు. ఇతడి సువర్ణముఖి గురించి సినిమా రంగంపై కుట్ర లేబుల్ లో వ్రాసాను.

దావూద్ ఇబ్రహీం కో, లేక అలాంటి వారికో, లేక ఆయుధ వ్యాపారి ఖషోగ్గి కో ఒక ఉంపుడుగత్తె ఉండేదనీ, ఆమె పేరు పమెల్లా బోర్డెస్ అనీ, మా చిన్నప్పుడు ఓ సారి హఠాత్తుగా సంచలన వార్తా ప్రచారం వచ్చింది. అర్ధనగ్న దృశ్యాలతో, పెద్ద పెద్ద కటౌట్లతో, అదే పేరుతో సినిమా వచ్చింది. అదే సమయంలో ఆ సినిమా, సదరు ఉంపుడుగత్తె నిజ జీవిత కథ అనే ప్రచారమూ, దాంతో పాటే ఆమె అసలు పేరు ప్రమిలా చౌదరి అనీ, ఆమె తెలుగు మనిషే ననే మరో ప్రచారమూ వచ్చింది. అప్పట్లో మా నాన్న, ఇతరులూ మాట్లాడుకుంటూ కోపంతో రొప్పటం, రోత పడటము నాకు గుర్తుంది.

సామాన్య పౌరులకే అలా అన్పించినప్పుడు, దేశ నేతలకు [నిబద్దత ఉంటేనే లెండి] అందునా దేశమ్మీద విదేశీ కుట్ర జరుగుతోందని తెలిసీ, ఎదుర్కొంటు కూడా నిరూపించలేక, కనీసం దేశ ప్రజలకి నచ్చ చెప్పలేక పోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి, ఇదెలా ఉండి ఉంటుందో ఊహించవచ్చుకదూ!

అమ్మ...అక్క.... స్నేహితురాలు... భార్య.. అన్నీ అయిన మహిళ! పురుషుడి జీవితంలో సగం, అతడి జీవితానికి కేంద్రం.

ఎంతో సున్నితమైన ఇలాంటి భావోద్వేగాలకు సంబంధించి నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గానికీ మధ్య.... సినిమాల ద్వారా, సంఘటనల ద్వారా నడిచిన భాష, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్నాయి.

ఒకప్పుడు, అంటే 1992 కు ముందర, కొన్ని సినిమాలు ఉండేవి. పాడిపంటలు, అమెరికా అమ్మాయి లాంటివి. ఎంతగా పాశ్చాత్య ఫ్యాషన్ల మోజులో పడి కొట్టుకుపోయినా.... శారీరక సంబంధం, శృంగార అనుభవం దగ్గరి కొచ్చేసరికి, భారతీయ అమ్మాయి వెనక్కి తగ్గుతుందనే కథాంశంతో ఆ కథలు నడిచేవి. పాడిపంటలు లాంటి సినిమాలతో పాటు, ప్రజారాజ్యం వంటి రైతు సమస్యలకు సంబంధించిన సినిమాలు, మండలాధీశుడు వంటి రాజకీయ సినిమాలకు సహకరించినందుకూ, నిర్మించినందుకూ, నటించినందుకూ, సినీనటుడు కృష్ణ మీద రామోజీరావుకు కోపం ఉండటమూ, దాన్ని మరేదో పైకారణాలతో వెళ్ళగక్కటమూ కూడా జరిగింది. నాకు తెలిసి చాలా సంవత్సరాల పాటు[1992 ముందు వరకూ] సితార సినీ పత్రికలో కృష్ణ ఫోటోలు వేయకుండా రామోజీరావు బహిష్కరించాడు. 1992 తర్వాత కృష్ణ ఫోటోలు వేస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఇప్పుడయినా ఈనాడు ’పోకిరి’ మహేష్ కు, జూనియర్ ఎన్టీఆర్ కిచ్చినంతగా, ఇమేజ్ ఇవ్వదు గాక ఇవ్వదు.

తదనంతర కాలంలో - జీవితాల్లో పరుగు మరింత వేగవంతమై, కార్పోరేట్ రంగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య అధికమై, బాస్ నుండి పదోన్నతి సిఫార్సులూ, సెలవులూ, పనివేళల్లో సౌకర్యాల వంటి వాటి కోసం అలవోకగా అధిక శాతం మహిళా ఉద్యోగులు బాస్ లతో ఏకాంతంగా గడుపుతున్నారని, శారీరక సంబంధాలకు ’నో’ చెప్పడం లేదని, ఫలానా ఫలానా సర్వేలు చెబుతున్నాయంటూ.... నకిలీ కణిక వ్వవస్థా, నెం.10 వర్గంలోని మీడియా.... వ్యాసాలూ, వార్తాంశాలూ ప్రచురించింది, ప్రచారిస్తోంది. నిజానికి కార్పోరేట్ రంగంలోనే కాదు గల్లీ దాకా పాకింది ఈ జాఢ్యం! ఉన్నదానికి మీడియా ప్రచారం మరింత ఆజ్యం!

ఈ విషయమై నెం.5 వర్గం....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

అజ్ఞాత గారు : ఆ వివరాలన్ని గత టపాలలో చాలా సందర్భాలలో వివరించానండి. పీవీజీ - రామోజీరావు - మా కథలో కూడా వివరించానండి. నెనర్లు!

ఆదిలక్ష్మి గారూ, పుంఖానుపుంఖాలుగా వస్తున్న మీ అనుభవాల సారాంశానికి నా జోహార్లు. మీరు నిజంగా "born tough" ఇండస్ట్రియలిస్టు స్థాయి నుండి చాల దెబ్బలు తిని కూడా ధైర్యంగా మీరు నమ్మిన దాని గురించి పరితపిస్తున్న మీ అనుభవాలు చదువుతుంటే ఔరా అనిపిస్తోంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు మేము చెయ్యగలిగేది ఏమైనా ఉన్నదా?

ఆ మాట అన్నారు అదే పదివేలు! మీ అభిమానానికి కృతజ్ఞతలండి!

బీహార్ లో ఆవులకు, ఎద్దులకు కూడా రెండు నెలల క్రితం బ్యూటి కాంటేస్ట్ నిర్వహించారు, అవి కూడా బాగా ముస్తాబయి రాంపు మీద ఇటు అటూ తోక ఊపుకుంటూ తిరిగాయి :) గెలిచిన వాటికి సన్మానం చేశారు.

అయ్యా అజ్ఞాత గారు : నేను మనుష్యుల గురించి చెప్పానండి. మీరు పశువుల గురించి వ్రాసారు. అయితే మీరు కుక్కల అందాల పోటీలని మర్చిపోయారు సుమా!

మరో మాట! చెప్పిన దాంట్లో ప్రధాన విషయాన్ని వదిలేసి ఇంకేవో మాట్లాడటం, విషయాన్ని ప్రక్కదారి పట్టించటమే. ఆ పని ఇప్పటి వరకూ మీడియా చేస్తుండగా చూసాం. మీరిప్పుడు ఈ బ్లాగులో చేస్తున్నారు.

>> ఏ మతస్థులైనా పరమత చిహ్నాలు ధరించటానికి ఇష్టపడరు. అది ఆయా వ్యక్తులకి తమ మతం పట్లా, మత విశ్వాసాల పట్లా ఉన్న నిజాయితీ, నిబద్దతలని బట్టి ఉంటుంది. అయితే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని కొందరు కీలక ఏజంట్లకు దమ్మీడీల పట్ల,అధికారం పట్ల ప్రేమ తప్పితే మత విశ్వాసాలు కూడా వాళ్ళకు పట్టవు. అందుచేత హిందువుగా నటిస్తూ, హిందూ మత చిహ్నాలు ధరిస్తూ ముస్లింలూ ఉండగలరు. ముస్లిం మత చిహ్నాలు ధరిస్తూ హిందువులూ, ముస్లిమేతరులు కూడా ముస్లింల లాగా కొనసాగగలరు.
---------------------------------------------
http://www.andhrabhoomi.net/state/sdf-251

హిందువులను బలవంతంగా, ప్రలోభాలు పెట్టి ఇతర మతాల్లోకి మారుస్తున్నారని, రామోజీరావు రహమాన్‌గా, సత్యనారాయణ సత్యపాల్‌గా మారుతున్నారని తొగాడియా పేర్కొన్నారు.

అజ్ఞాత గారు : మాకు ఈనాడు వస్తుంది. నెట్ లో ఆంధ్రజ్యోతి, సాక్షి చూస్తాము. మీరు లింకు పంపక పోతే ఆంధ్రభూమిలోని ఆ వార్త మిస్సయ్యే వాళ్ళమండి. ఇలాంటి వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించవు కదా! నెనర్లు!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu