వాస్తవానికి రూజ్ వెల్ట్ 1944 లో నాల్గవ సారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనాడు. 1945 ఏప్రియల్ లో అతడు మరణించడంతో, ఉపాధ్యక్షుడు హారీ ట్రూమన్ అధ్యక్షుడైనాడు. 1945 ఆగస్టులో, జపాన్ పైన అణుబాంబు ప్రయోగించాలన్న నిర్ణయం తీసుకున్నాడు. అణుబాంబు ప్రయోగంతో రెండవ ప్రపంచయుద్దం ముగిసింది. జర్మనీ ఓటమి పాలైంది. అప్పటి వరకూ ప్రపంచాన్ని గడగడలాడించిన లేక గడగడలాడించాడని ప్రచారించిన అడాల్ఫ్ హిట్లర్, భార్య ఇవాబ్రౌన్ తో సహా తన బంకరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హిట్లర్ కూ, అతడి భార్యకూ డూప్ లు ఉండేవారని, ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారంతో, హిట్లర్ దంపతుల డూప్ ల శవాలు అసలువిగా చలామణి చేసి, హిట్లర్, అతడి భార్య ప్రాణాలతో తప్పించుకు పోయారనీ తర్వాత వదంతులు ప్రచారమయ్యాయి. ఈ సంచలనాత్మక వార్తలతో కొన్నిరోజులపాటు వార్తా సంస్థలూ, పత్రికలూ ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని చేసుకున్నాయి. పత్రిక ప్రతుల అమ్మకం పెరగడంతో పాటు వాణిజ్యప్రకటనలు అదనపు ఆదాయం కదా? ఆపైన ఇర్వింగ్ వాలెస్ ‘The Seventh Secrete’ వంటి నవలలూ, సినిమాలు… మరింత ఆదాయం, మరింత సంచలనం! నిజంగా హిట్లర్ దంపతులే మరణించారో లేక వారి నకళ్ళే [డూప్ లే] మరణించారో, సత్యాసత్యాలు భగవానుని కెఱుక; లేదా నకిలీ కణిక వ్యవస్థకి ఎఱుక. ఈరోజు ఈ స్ట్రాటజీ నమ్మశక్యంగానే ఉందిగానీ, ఆరోజుల్లో ఇదీ ప్రజలకి నమ్మలేని నిజమే కదా!

ఈ నేపధ్యంలో గుర్తుచేసుకోదగిన మరొక సంఘటన – పాక్ ఒకప్పటి అధ్యక్షుడు జియాఉల్ హక్ విమాన ప్రమాదం లో మరణించటం. ప్రమాదసంఘటనలో జియా ఉల్ హక్ కు సంబంధించిన కట్టుడుపళ్ళ సెట్ తప్ప మరే ఆధారమూ, కాలిబూడిదైన ఆ విమాన శకలాలలో దొరకలేదు. అతడితో పాటు అతడి వెంట ఉన్న ఇతరుల శరీరాలు కూడా దగ్ధమైపోయాయి. అయితే అది ఎంత సులభంగా, కృత్రిమంగా సృష్టించవచ్చో ఇప్పుడు పరిణతి పెరిగిన సినిమాల ద్వారా చాలామందికి తెలిసినదే. అప్పటి వరకూ ఎన్నో ఒత్తిళ్ళతో తమ assignments నిర్వహిస్తూ, తమకు కీలక ఏజంటుగా ఉపయోగపడినందుకు నకిలీ కణిక వ్యవస్థ ఇచ్చే incentive [అదనపు ప్రయోజనం] అన్నమాట. వాళ్ళకు సంబంధించిన చరిత్ర సమాప్తం. కీలక రహస్యాలు ఏవీ బయటకు రావు. చరిత్రప్రకారం, చట్టం ప్రకారం [on record] జియా ఉల్ హక్ చనిపోయాడు. లేదా హిట్లర్ చనిపోయాడు. అయితే off record, ఎక్కడో అనామకంగా, అయితే ఐశ్వర్యవంతుడిగా, ఏ ఒత్తిళ్ళు, ఏ సమస్యలూ లేకుండ హాయిగా ప్రశాంతంగా బ్రతికేస్తాడు. ఎటూ గుర్తింపు, సెలబ్రిటీ హోదా, ప్రముఖ పదవులతో కూడిన జీవితం అనుభవించి ఉంటారు కాబట్టి, అందులోని advantages మీద మోజు తగ్గి, disadvantages పట్ల విసుగెత్తి ఉంటారు కాబట్టి, ఈ గుంపులో గోవింద బ్రతుకు హాయిగా ఉంటుంది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండే ప్రాంతాలకూ వెళ్తారు. లేదా గుర్తుపట్టలేనట్లుగా రూపం మార్చుకోవటమూ, ఈ రోజుల్లో ఆధునిక వైద్యచికిత్సా విధానం అందుబాటు లోకి తెచ్చిందయ్యే. ఇక సమస్య ఏముంది? ఇక్కడో చిన్న విషయం. ఈ జియా ఉల్ హాక్ ఇండియా సందర్శనకు వచ్చినప్పుడే, హఠాత్తుగా క్రికెట్ మైదానంలోకి దూసుకొచ్చిన వండర్ బాయే గా అజారుద్దీన్ అనబడే ముస్లిం ఆటగాడు మెరిసిపోయాడు. ఎందుకు ముస్లిం ఆటగాడని నొక్కి చెప్పానంటే, మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం బయల్పడినప్పుడు, తను ముస్లిం కావటం వల్లే తనని ఇరికించారన్న వాదనని అజారుద్దీన్ లేవనెత్తాడు. అలాంటి వివక్షే ఉంటే అసలు అతణ్ణి ముందుగా ఆటగాడిగా ఎలా వెలగనిచ్చారని, రంగంలోకి దూకుడుగా, అకస్మాత్తుగా, ఎలా దూసుకురాగలిగాడని ఎదురు వాదనకి మౌనం పాటించాడు. సదరు అజారుద్దీన్ మీద ఈనాడు రామోజీరావుకు ఎంత ప్రేమాభిమానాలో, ఎక్కడో యూపీలో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, అల్పాహారం స్వీకరించినా, నిల్చున్నా, తుమ్మినా, దగ్గినా, ఫోటో సహితంగా వార్తలు ప్రచురించి మరీ నిరూపించుకున్నాడు. ఈనాడు రామోజీరావుకి గల ఈ ప్రత్యేక లక్షణానికి కారణాన్ని తర్వాత సవివరంగా వ్రాస్తాను. [ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జ్ఞానంలో కూడా హైదరాబాద్ కే స్థానం ఉండటం యాదృచ్ఛికమా?] ఇప్పటికైతే హిట్లర్ దగ్గరికి తిరిగివద్దాం.

జర్మన్ దేశాధినేత హిట్లర్, ఇటలీ నియంత ముస్సోలినీలని రెండవ ప్రపంచయుద్ద కారకులుగా చెబుతారు. మొదటి ప్రపంచయుద్దానంతరం, జర్మనీపై యుద్ద నేరం మోపి ఆర్ధికంగా అపరాధరుసుం అతిగా వసూలు చేశారన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకొని, జర్మన్ లకి జాత్యంహకారన్ని మరింతగా నూరిపోసి, ఆయుధబలాన్ని విపరీతంగా పెంచుకుంటూ, పొరుగుదేశాల్లో అభద్రతని రేపి, హిట్లర్ రెండవ ప్రపంచయుద్ద కారకుడయ్యాడనీ చెబుతారు. 1933 లో జర్మనీ దేశాధినేత[ఛాన్సెలర్] అయిన హిట్లర్, 1945లో ఆత్మహత్యచేసుకున్నాడన్న ఘటన వరకూ అధికారంలో ఉన్నది దాదాపు 11 సంవత్సరాలపైన కొన్ని నెలలు మాత్రమే. ఈ స్వల్పవ్యవధిలోనే [ప్రపంచ చరిత్రలో ఒక దశాబ్ధం అంటే స్వల్ప వ్యవధే], ఒకే ఒకవ్యక్తి, ఒక దేశాన్నే కాదు, ప్రపంచాన్నే ఒక మలుపు తిప్పాడు. ఒక చరిత్ర సృష్టించాడు. అది మంచిగానా, చెడుగానా అన్నది అనవసరం.[ఎలాపైకి వస్తే నేం? పైకిరావడం ముఖ్యం అనే నకిలీ కణిక నైజమే, ఇక్కడ ఉన్నది కూడా] ఈ ప్రయోగం నకిలీ కణిక-6 కి ఎంతగానో తృప్తి నిచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని మరింత మరింతగా పెంచింది.

మరో వైపు బ్రిటిషు రాజవంశపు ఆర్ధిక మూలలని చితక్కొట్టేయటం సాధ్యమైంది. అప్పటికే భారతదేశంలో స్వాతంత్రసమరం పరాకాష్ఠకు చేరుకుంది. ఎంతగా అతివాదులు, మిత వాదులంటూ స్వాతంత్ర సమర యోధుల మధ్య విభేదాలు సృష్టించినా, బ్రిటీషు పాలనే మంచిది అంటూ ఎంతగా పదార్ధ వాద దృష్టిగల సామాన్య ప్రజలని ట్యూన్ చేసినా, స్వాతంత్ర సమరానికి తాత్కాలిక అవరోధాలు కలిగించగలిగారే గానీ, బ్రిటీషు వారుగానీ, వారి వెనుక నున్న నకిలీ కణిక వ్యవస్థగానీ, భారత స్వాతంత్ర సమరాన్ని పూర్తిగా నీరుగార్చలేక పోయారు. దీనికి కారణాలు ఎన్నున్నా, ప్రధాన కారణం మాత్రం ఒకటే – ఏ విషయంలోనైనా నకిలీ కణిక వ్యవస్థ ద్వంద్వాలు సృష్టిస్తుంది. వాటిని ప్రచారిస్తు గందరగోళాలు, వివాదాలు సృష్టిస్తుంది. ఆపైన తాత్సారమే ప్రధానంగా స్ట్రాటజీ నడిపిస్తుంది. దాంతో ఉద్యమాలని నీరుగార్చడం చాలా సులభం. అయితే భారత స్వాతంత్ర సమరం, అప్పటికి ప్రపంచం ఎరగనంత సరికొత్తది. సత్యాహింసలే ఆయుధాలుగా కలిగిన యుద్దం అది. ప్రాణాలు హరించే ఆయుధాలు ప్రయోగించే బ్రిటీషు రాజరికాన్ని, సత్యాగ్రహమనే ఆయుధంతో ఎదుర్కోవడం అది. బ్రిటీషు పోలీసులు, సైనికులు సత్యాగ్రహుల మీద, స్వాతంత్ర సమర యోధుల మీద హింసకు పాల్పడినా, వారు నిరాయుధలుగా, వందేమాతరం మంత్రజపంతో, అహింసతో ఎదుర్కొన్న అపూర్వ యుద్దం అది.

కొందరు అనవచ్చు ఈ అహింస అనే యుద్దం వలననే స్వాతంత్రం అలస్యమయింది అని. కాని హింసతో అయితే కుత్సిత బ్రిటీషు వాళ్ళు ఆయుధాలు ఉపయోగిస్తూ, మనమూ అయుధాలు ఉపయోగిస్తున్నాం అంటూ ద్వంద్వం ఉపయోగించి మరింత అలస్యం చేసి ఉండేవాళ్ళు. అదే అహింస అనే అయుధంతో అయితే, బ్రిటీషు వాళ్ళ ప్రవర్తనే బహిరంగమైంది. అందుకే అహింసయుతమైన పోరాటం అపూర్వమైనది అనవచ్చు. దాంతో నకిలీ కణికవ్యవస్థకీ, బ్రిటీషు రాజరిక వ్యవస్థకీ, ఏ ద్వంద్వం సృష్టించాలన్నా సాధ్యం కాలేదు. ‘ముందుగా భారతీయ విప్లవకారులే లేదా స్వాతంత్ర సమరయోధులే, బ్రిటీషు పోలీసుల్ని, సైనికుల్ని కొట్టారు లేదా వారిపై రాళ్ళు రువ్వారు, దానితో సైనికులూ, పోలీసులూ కాల్పులు జరిపారు’ వంటి వార్తలు ప్రచారించలేకపోయారు. జలియన్ వాలాబాగ్ ల వంటి సంఘటనలూ, జనరల్ డయ్యర్ లూ, అప్పటికి పచ్చిగా ప్రపంచానికి వెల్లడయ్యారు. దాంతో గాంధీ తత్త్వం ప్రజల్లోకి చేరకుండా ఉండేందుకు నానా ఎత్తుగడలూ పన్నారు. అయినా ఆనాటి భారతీయులు బాపూ చెప్పిన సత్యాన్ని అందుకోగలిగారు. కాబట్టే గళం కలిపారు. కదం తొక్కారు. అందుకే నకిలీ కణిక వ్యవస్థ ఈసారి [మరో 60 ఏళ్ళ తర్వాత] భారతీయులలోని ఆ దృక్పధాన్ని, సత్యాన్ని గ్రహించగల, స్పందించగల దృక్పధాన్ని నాశనం చేయటం అన్న ఎత్తుగడ పన్నింది. పర్యవసానమే నేటి మన దుస్థితి.

కాబట్టే ఈరోజు భారతీయులలో చాలామందికి ‘మాతృదేశం’ పట్టటం లేదు. స్వంత మతం, స్వంత ధర్మం, సంస్కృతి ఏదీ పట్టడం లేదు. తన ఉద్యోగం మీదకి, తన వృత్తి, వ్యాపార ఆర్ధిక మూలాల మీదకి, చిన్న ఒత్తిడి వచ్చిందంటే చాలు, అంతవరకూ చెప్పిన ధర్మపన్నాలు కూడా మరచిపోయి, పైసలు వెంట పరుగులు పెట్టక తప్పని స్థితికి, అత్యధిక సంఖ్యలో జనాలు జారిపోయారు. అంతే కాదు అవినీతి అన్నది దేశానికి ఎంత చెరుపు చేస్తుందో తెలిసినా ‘ఇవాళ్ళ, రేపు ఇది మామూలే’ అన్న ప్రవర్తన నరనరానా జీర్ణించుకున్నారు. ఇది ఇప్పటి స్థితి. 1947లో అయితే ఈ దుస్థితి లేదు. ఆరోజు పిల్లా పెద్దా తేడా లేకుండా, ధనికాపేద తారతామ్యం లేకుండా, ప్రజలంతా లక్షల కోట్లై, ఏరులన్నీ కలిసి మహా సాగరమైనట్లు అహింసా మార్గాన, గాంధీజీ వెనుక, దేశ నాయకుల వెనుకా, కదిలి వచ్చారు. [అదే ఇప్పుడైతే ఎదురుగా కనబడే శత్రువు ఎవరు లేరు. నకిలీ కణిక వ్యవస్థ ఈసారి మంచివాళ్ళనందరిని ప్రణాళికాబద్దంగా రాజకీయాల నుండి పారద్రోలి, తము ఎంపిక చేసుకున్న వాళ్ళని నాయకులగా చలామణీ చేస్తూ మనపై ఇప్పుడు రుద్దు తున్నారు. ప్రతీ ఒక్కరికి తెలుసు రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుంటున్నారని. అదే కదా బ్రిటీషు వాళ్ళు కూడా చేసింది? అప్పడు తప్పగా కనిపించినది, ఇప్పుడు ఎందుకు తప్పుగా కనిపించటం లేదు? ఎందుకంటే నాయకులుగా ఎవరు ఈ తప్పులను ఎత్తి చూపితే వాళ్ళ మీద ఒకవ్యవస్థ వ్యవస్థీకృతంగా వేధించటం చేస్తున్నారు. అందుకే ప్రజలని ఎవ్వరు సంఘటితం చేయలేకపోతున్నారు. అదే స్వాతంత్రం తరువాత నకిలీ కణిక వ్యవస్థ సాధించిన విజయం.]

దాంతో బ్రిటీషు రాజవంశానికి, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు. అప్పటికే ఆర్ధికంగా దెబ్బతిని ఉన్న బ్రిటన్ ఇక నిబ్బరించుకోలేక పోయింది. క్రమంగా ప్రపంచమంతటి నుండి, దాని సామ్రాజ్యం [విత్ డ్రా] వెనక్కి తీసుకోబడింది. దక్షిణాఫ్రికా, మరికొన్ని ప్రాంతాలలో తప్ప, అధిక భాగం సామ్రాజ్యం కోల్పోయి, బ్రిటన్ పాత్ర తమ చిరుప్రాంతానికి, ఇంగ్లాండుకి, పరిమితం అయ్యింది. ఏవిధంగా అయితే భారతదేశంపై పట్టు సాధించాక, ప్రపంచాన్నంతా జయించి, ‘రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం’ అన్పించుకుందో, అదేవిధంగా, భారతదేశంపై పట్టు కోల్పోయాక, బ్రిటన్ రాజవంశం ఇంగ్లాండుకే పరిమితం అయ్యింది. ఇక భారతదేశ రాజకీయ రంగంపై నకిలీ కణిక హస్తం గురించి 1893 సెప్టెంబరు 11న చికాగో లో జరిగిన సర్వమత మహాసభలో, స్వామీ వివేకానంద, భారతీయుల సనాతన ధర్మం గురించి, హిందూ సంస్కృతి గురించి ఎలుగెత్తి చాటాక, సి.ఐ.ఏ., నకిలీ కణిక వ్యవస్థ, భారత్ విషయమై చేతులు కలిపిన వైనం గురించి, భారతరాజకీయ రంగంపై నకిలీ కణికుని సుదీర్ఘ కుట్ర అన్న వరస టపాలలో వివరించాను.

ఈవిధంగా నకిలీ కణిక-6, బ్రిటీషు రాజవంశానికి కూసాలు దింపి కూర్చోబెట్టగలిగాడు. దాంతో తన గూఢచార కౌశలం మీద తనకి నమ్మకం పెరిగిపోయింది. మరికొన్ని ప్రయోగాలు సైతం నిర్వహించుకున్నాడు. మొదటి ప్రపంచయుద్దం తర్వాత నానాజాతి సమితి [The league of Nations] ఏర్పాటయ్యింది. అయితే దాని పనితీరు కుంటి గుర్రం నడక తీరే! నానాజాతి సమితిని ప్రతిపాదించినది, నాటి అమెరికా ప్రెసిడెంటు, డెమొక్రాట్ పార్టీకి చెందిన ఉడ్రో విల్సన్. మొదటి ప్రపంచ యుద్దానంతరం, మొదటి సంవత్సరాల్లో అంటే 1918 తర్వాతి స్వల్ప వ్యవధిలో అమెరికా మార్కెట్లు బలపడ్డాయి. ఆర్ధికంగా ఎన్నో సుఫలాలని అమెరికన్ లు ఆనందించారు. 1929 తర్వాత ఆర్ధిక మంద్యంలో అమెరికా కూరుకుపోయింది. ఈ ఆర్ధిక నేపధ్యంలోనూ, అమెరికా లోని ద్విపార్టీ రాజకీయ విధానాలలోనూ, ఎన్నో నాటకీయ సంఘటనలు సంభవించాయి. దానాదీనా అమెరికా తానే ప్రతిపాదించిన నానాజాతి సమితి [The league of Nations] లో తానే సభ్యత్వం తీసుకోలేదు. అలాగే మిగిలిన దేశాలలో చాలాదేశాలు, బలమైన దేశాలు నానా జాతి సమితిని లెక్కచేయలేదు. చాలా సహజంగా నానాజాతి సమితి విఫలమయ్యింది. జర్మన్ లకీ, ముఖ్యంగా హిట్లర్ కీ ఉన్న యూదు జాతీయుల మీది ద్వేష భావం, ఇతర కారణాలతో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమయ్యింది. 1945 ఆగస్టులో జపాన్ పై అణుబాంబుతో చల్లారింది. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి [United Nations organization] ఆవిర్భవించింది.

నిజానికి నానాజాతి సమితికి, ఐక్యరాజ్యసమితికి నామభేదమే గానీ, స్వరూప స్వభావాల్లో పెద్దగా భేదం లేదు. అయితే చిత్రంగా ఐరాస సఫలీకృతమైంది. మొదట 50 దేశాల నుండి వచ్చిన అహుతులతో, 50 సభ్యదేశాలతో ప్రారంభమైన ఐరాస, క్రమంగా ప్రపంచరాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే దశకు ఈ 60 ఏళ్ళల్లో చేరుకుంది. నానాజాతి సమితికీ, ఐరాస కీ వ్యత్యాసం ఒక్కటే. దాన్ని ప్రపంచదేశాలలో శక్తివంతమైన దేశాలూ, ఎక్కువదేశాలూ లెక్కచెయ్యలేదు. ఐరాస ని లెక్కచేసాయి. అంతే! యుద్ద వినాశనం గురించిన వాస్తవ జ్ఞానం, హిరోషిమా నాగసాకి లపైన అణుబాంబు ప్రయోగంతో గ్రహింపుకు రావటం, పైకారణంగా[Over leaf reason] చూపబడుతోంది. నానాజాతి సమితి వైఫల్యమూ, ఐరాస సాఫల్యము కూడా నకిలీ కణిక వ్యవస్థ చేత నియంత్రించ బడ్డాయి. నానాజాతి సమితితో చేసుకున్న ప్రయోగ ఫలితలన్నిటినీ క్రోడీకరించుకుని, విశ్లేషించుకుని, మరింత మెరుగ్గా ఐరాసని ఉపయోగించుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు నకిలీకణిక-6.

కాబట్టే ఐరాస, తన మానవ హక్కుల విభాగంతో, ఒకదశలో, ప్రపంచవ్యాప్తంగా, ఆయాదేశాలలో ప్రభుత్వాలని సమాంతరంగా నియంత్రించిందనీ, నియంత్రించ ప్రయత్నించిందనీ అంటారు. ఫలానా దేశంలో మానవహక్కులు మంటగలుస్తున్నాయనీ, ఆయా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనీ, మానవహక్కుల సంఘం, అమ్నెస్టీ అనటం అలస్యం, ప్రపంచ మీడియా ఆ విషయమై కోడై కూస్తుంది. అలజడి ఎక్కువయ్యాక, సహజంగానే ఆయాదేశాల ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది కదా! తమకు అనుకూలమైన దేశాలలో ఎంత హింస జరిగినా కిమ్మినదు. ఉదాహరణకు పాకిస్తాన్ లో, మధ్యమధ్యలో అడపాదడపా ప్రజాస్వామ్యం [అదీ పేరుకే ప్రజాస్వామ్యం] తప్ప, మిగిలిన కాలమంతా నడిచింది సైనికపాలనే. భారత్ నుండి వలస వెళ్ళిన హిందువులనే కాదు, ముస్లింలని సైతం చిన్నచూపు చూస్తారు అక్కడ. అసలు హిందువుల జనసంఖ్య అయితే గణనీయంగా పడిపోయింది. అందులో మత మార్పిడి ఎంతో, ప్రాణాలు గల్లంతు ఎంతో లెక్కలు ఎవరికీ తెలియదు. అలాంటి పాకిస్తాన్ లో ఏ మానవహక్కుల ఉల్లంఘనా సదరు సంఘానికీ, అమ్నెస్టీ కీ కనబడదు. అదే భారత్ లో అయితే BSF జవానుల్లోనూ, పోలీసుల్లోనూ మానవహక్కుల ధిక్కారం లెక్కకు మిక్కిలి కన్పిస్తుంది. అలాగే మావోయిస్టులో, LTTE సభ్యులో ప్రజల్ని ఊచకోత కోస్తే, లేదా పోలీసుల్ని చంపితే మానవహక్కుల సంఘం కిమ్మనదు. అదే పోలీసులు మావోయిస్టుల్ని చంపితే, సైన్యం LTTE సభ్యుల్ని చంపితే గోలగోల చేస్తుంది. మానవహక్కుల సంఘం దేశాలకి అతీతం కదా? దానికి పార్టీలతో, ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా, పోలీసులైనా, నేరగాళ్ళైనా, ఉగ్రవాదులైనా, అందరూ మానవులు గానే కనబడాలి కదా? వాస్తవం అలా ఉండదు.

అలాగే యూనిసెఫ్ గట్రా ఇతర సంస్థలు. వాళ్ళ సర్వేలతో ఫలానా దేశం పేదదేశమనో, ఫలానా ర్యాంకులో ఉందనో లెక్కలు గట్టి ముద్ర [Stamp] వేసేస్తుంది. దీన్నిబట్టి ఆయా దేశాల మీద నిబంధనలు, ఒడంబడికలూ ఉంటాయి. తాము ఎవరికైతే ఆర్ధిక సాయం ఎక్కువగా చెయ్యాలనుకుంటారో, సదరు దేశంలో పిల్లలు ఎక్కువశాతం పోషకాహార లోపంతో బాధ పడుతున్నారంటే చాలు. డబ్బు రవాణాకి రహదారులు తెరుచుకున్నట్లే. తీరా డబ్బు దేశాలు దాటి, చేరాల్సిన చోటు చేరాక, అది ఏవిధంగా ఖర్చు అవుతుందో ఎవరు చూడొచ్చారు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి తర్వాత అంతటి హాస్యాస్పదమైనది మాన్వ హక్కుల సంఘమ్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళ లెక్కల్లో తీవ్రవాదులు,క్రిమినల్స్ మాత్రమే మనుషులు. శ్రీలక్ష్మి చనిపోయినప్పుడు కనపడని మానవహక్కుల వాళ్ళు, మనోహర్ దొరికినప్పుడు మాత్రం రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వచ్చేసారు. దీన్ని బట్టే అర్ధం అవుతుంది కదా వాళ్ళు ఎవరి హక్కులని పరిరక్షిస్తారో

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu