ఇక నకిలీ కణిక-4 కి ఎన్ని భావోద్రేకాలు కలిగినా [కసి, దుఃఖం, కోపం, ఆక్రోశం వంటివి] వాటితో నిమిత్తం లేకుండా పరిస్థితులు ముందుకెళ్ళిపోతున్నాయి. అప్పటికి నాలుగు తరాలుగా పెంచి పోషించుకొస్తున్న ఆకాంక్షలని, ఆశలని నకిలీ కణిక-4 వదులుకోలేదు. ఎటూ అవి తన తర్వాతి తరానికి, తన వారసుడికి నూరిపోస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో క్రియాశీల గూఢచర్యపు పగ్గాలు స్వీకరించిన నకిలీ కణిక-5, నకిలీ కణిక-4 మార్గదర్శకంలో మెల్లిగా బ్రిటీషు అధినాయకత్వానికి దగ్గర కావటానికి పావులు కదిపాడు. ఆపైన రాజవంశానికి దగ్గరకావటమే లక్ష్యం. అప్పటికే గూఢచర్య తంత్రాలైన, ‘తాము ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో వారికి తామే కష్టం కలిగించి, సానుభూతి, సహాయ సహాకారాలు, మద్దతు గట్రాలతో మానసికంగా దగ్గర కావటం, తమ మీద ఎదుటివాళ్ళు ఆధారపడేలా చేసుకోవటం’ వగైరా స్ట్రాటజీలపైన పూర్తి పట్టు ఉంది. ఇలాంటివే ఎన్నో స్ట్రాటజీలు! పదేపదే ఒకే ’విషయం’ వివిధ మార్గాలద్వారా తము లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తులకి చేరేటట్లు చేసి, ఎదుటి వాళ్ళు తమంతట తామే ఆ ‘విషయం’ పట్ల ఆకర్షితులయ్యేట్లు చేయటం ఇలాంటివే. [ధృతరాష్ట్ర దుర్యోధనులు పాండవులపై వారణావతం లక్కయిల్లు విషయంలో అమలు పరచిన స్ట్రాటజీ ఇదే] ఎటూ ఈ గూఢచర్య తంత్రాలపైన బ్రిటీషు వారికి, బ్రిటీషు రాజవంశానికి అసలే అవగాహనా లేదయ్యె. నకిలీ కణిక-5 కి, అప్పటికే బలంగా రూపుదిద్దుకున్న అతని బృందానికి, అతని గూఢచార వలయానికి, సామ్రాజ్య స్థాపన, నిర్వహణ, గురించిన ఙ్ఞానం, గూఢచర్య స్ట్రాటజీలతో ఎంతటి వ్యక్తి నైనా, ఎలా లొంగదీసుకోవాలి, నిగూఢంగా పనులు ఎలా చక్కబెట్టాలి అన్న ఙ్ఞానం కొట్టినపిండి.

ఇక యూరపు దేశాల్లో సాంస్కృతిక విప్లవం తర్వాత ఎగిసి పడిన [శాస్త్రసాంకేతిక] పారిశ్రామిక విప్లవం, దాని పర్యవసానాలు, ఒక కొత్త శాస్త్ర విషయం, పరికరం, కనుగొన్నాక సమాజం పైనా, ప్రజా జీవితంపైన ఆ శాస్త్రీయ ఆవిష్కరణ తాలూకూ ప్రభావ పరిణామాలు, భవిష్యత్తుకి ఎంతో ఉపయుక్తంగా నకిలీ కణికుడి వ్యవస్థకి తోచాయి. టెక్నాలజీతో భవిష్యత్తులో ఒక దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే ’గ్రిప్’ చేయవచ్చని నకిలీ కణిక-5 ముందుగా గుర్తించాడు. అప్పటికి భారతదేశాన్ని తమ ఏకచ్ఛత్రాది పత్యం క్రిందికి తేవాలని తరాలుగా చేసిన కృషి నిష్ఫలం కావటంతో నకిలీ కణిక-4 ఎంతగా కసితో రగిలిపోయాడో, అంతకు రెట్టింపుగా నకిలీ కణిక-5 మళ్ళీపని ప్రారంభించాడు. బ్రిటీషు రాజరిక వ్యవస్థలో అప్పటికే ఊడలమర్రిలా విస్తరించి ఉన్న లంచగొండి తనాన్ని, స్వార్ధాన్ని, అవినీతిని, చేసేవి చేస్తూనే, స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి ధర్మపన్నాలు చెప్పగల హిపోక్రసీని మరింతగా ఉపయోగించుకునే స్ట్రాటజీని రూపొంచాలంటే మరింతగా దాన్ని అధ్యయనం చేయాలన్న విషయం బోధ పడింది.

తమ గూఢచర్య ఙ్ఞానంతో, రాజవంశానికి, ‘రాజ్యవిస్తరణ’ వంటి ఉపయుక్తమైన కర్మల నిర్వహణ వెనుక తమ నిగూఢపాత్రని చూపించారు. దాంతో సహజంగానే ‘రాజ’ వంశ అంతరంగికుల్లో నకిలీ కణిక-5 యొక్క ఏజంట్లు చేరగలిగారు. ఎక్కడికక్కడ ఆర్ధిక లాభం, కెరియర్ గ్రాఫ్, పేరుప్రఖ్యాతులు వంటివి బహుమతులుగా ఇస్తూ నారదనీతిలో, విదుర, కూటనీతిలో చెప్పబడినట్లు ఆవలి వర్గంలోని వారిని తమ వైపు తిప్పుకోవటం, ఫలితాలు సాధించటమే గాక, ఆ ‘శ్రమ’ని స్ఫుటంగా రాజవంశానికి, కులీనులకి, బ్రిటీషు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకి [establish] గుర్తింపబడేటట్లు చేసుకున్నాడు.

తమ సామ్రాజ్యం అంతకంతకూ విస్తరిస్తూ, ఖంతాంతర సీమలను ఆక్రమిస్తూ, మెల్లిగా ప్రపంచమంతా నిండిపోతే ఎవరికైనా అది ఎంతో మక్కువ కలిగిస్తుంది కదా? ఫలితాలు అంత అద్భుతంగా సాధించి పెట్టిన అంతరంగిక అనుచరగణం మరింత ప్రియమైనది అవుతుంది కదా! ఇలా నకిలీ కణిక వ్యవస్థకి రాజాశ్రయం స్థానంలోకి బ్రిటీషు రాజవంశం వచ్చేసరికి, అంతకు ముందు వరకూ అదే స్థానంలో ఉన్న ఈస్టిండియా కంపెనీ ఎత్తి కుదెయ్యబడింది. అవసరం తీరిపోయాక అప్పటివరకూ నెత్తిన పెట్టుకున్న లేదా భుజాలపై మోసిన వ్యక్తుల్ని, సంస్థల్ని, ప్రభుత్వాలని, చివరికి దేశాలని సైతం ఎత్తికుదేయటం అన్న లక్షణం నకిలీ కణికులదే. [ఇప్పుడు సత్యంరామలింగరాజు దగ్గర నుండి చిరంజీవి దాకా ఎవరిదయినా ఇదే కథ]

ఈ నేపధ్యంలో బ్రిటీషు సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించి, ‘రవి అస్తమించిన బ్రిటిషు సామ్రాజ్యం’ అన్పించుకుంది. అప్పటికి నకిలీ కణిక-5 కి శాస్త్ర సాంకేతిక పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణలు, సమాజంపై వాటి బలమూ, శాస్త్రీయ ఆవిష్కరణలు ఆర్ధిక మూలాలుగా నిలబడటం పైన చక్కని అవగాహన కలిగింది. చాలా నిగూఢంగా, ప్రచ్ఛన్నంగా అమలు చేయటం మొదలుపెట్టాడు. భారతదేశపు నంతటినీ ఒక్కసారిగా తమ ఏలుబడిలోనిదిగా ప్రకటిస్తూ సామ్రాజ్యాధినేత కావాలన్నా తమ పూర్వీకుల కల 1857 ADలో ఎప్పుడైతే విఫలమయ్యిందో, అప్పడు రగిలిన కసికి, ఈసారి లక్ష్యం ఒకదేశానికి పరిమితం కాలేదు. యావత్ర్పపంచానికి సామ్రాట్టులు కావాలి. జగజ్జేత కావాలి. దాని సాధ్యాసాధ్యాలు బ్రిటీషు రాజవంశాన్ని తెరమీద ఉంచి, ప్రయోగించుకుని చూశారు. ఎందుకంటే ఎవరికీ తెలియని గూఢచార ఙ్ఞానం తమదగ్గర ఉంది. ఏ సంఘటనలకైనా అంతర్గత కారణం తమకి మాత్రమే తెలిసి ఉండగా, అందరూ మాత్రం, తము ప్రచారించిన పైకారణాన్ని నమ్మి, స్వంతీ కరించుకుని, విశ్లేషణలు, సమీక్షలూ, చర్చలూ చేసి సంతృప్తిపడటం చూసే కొద్దీ, తమ లక్ష్యం అంత కష్టతరమైనది కాదని అన్పించసాగింది.

ప్రపంచాన్ని శాసించాలంటే గూఢాచర్యఙ్ఞానం తప్పని సరి. అయితే దానితోపాటుగా ఆయుధ ఙ్ఞానం, శాస్త్రసాంకేతికత, రాజకీయఙ్ఞానం గట్రా గట్రాలు కూడా తగినంతగా కావాలి. అందుచేత నకిలీ కణిక-5 తన తదుపరి లక్ష్యంగా శాస్త్రసాంకేతిక రంగాన్ని ఎంచుకున్నాడు. ఇంకేముంది! నకిలీ కణిక గూఢచార వలయంలోకి కొందరు శాస్త్రవేత్తలు, కొందరు విద్యావేత్తలూ కూడా ప్రవేశపెట్టబడ్డారు. అసలే పాశ్చాత్యదేశాలలో విద్యారంగంలో అవినీతి పాలు ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు కాదు దాదాపు నూరేళ్ళ క్రితం గాంధీజీ బారిష్టరు చదువు నేపధ్యంలోనే ఎంతగా అర్ధరహితంగా [అవినీతి మయంగా] ఉండేదో బాపూజీ తన ఆత్మకథ ‘My Experiments with Truth’ లో ’బారిష్టరు చదువుకీ, ఈ ప్రొఫెసర్లతో విద్యార్ధుల సాన్నిహిత్యం కోసం నడిచే మందుపార్టీలకీ సంబంధం ఏమిటో నాకిప్పటికీ అర్ధం కాదు’ అంటూ చాలా సున్నితంగా, అయినా స్పష్టంగా వ్రాసారు.

ఇక అలాంటి రంగంలోకి నకిలీ కణిక వ్యవస్థ కాలుపెట్టటంతో – యూనివర్సీటీల్లో ఎన్ని రాజకీయాలు ప్రవేశించాయో చెప్పనలవి కాదు. ఇప్పటి మన యూనివర్సిటీల స్థితిని దాదాపు 125 ఏళ్ళ క్రితమే పాశ్చాత్య యూనివర్సీటీలు చేరిపోయాయి. ఒకరి పరిశోధనా ఫలితాలు మరొకరి పేరిట అచ్చవ్వటం, ప్రచారం అవ్వటం వంటి మేధోచౌర్యాలు ప్రారంభమై పెరిగిపోయాయి. తన పరిశోధనాత్మక వ్యాసాలని, ఆవిష్కరణలని చదివి అభిప్రాయం చెప్పాల్సిందిగా, చిన్నచితకా అంటే అప్పటికి అంతగా పేరు ప్రఖ్యాతులు లేని శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ లలో పేరుప్రఖ్యాతులతో వెలిగిపోతున్న శాస్తవేత్తలకి పంపటం, వారు వాటిని తమ పేరుమీదుగా ప్రచారించుకోవటం వంటి ఎన్నో సంఘటనలు తర్వాత వెలుగు చూశాయి, వివాదస్పదం అయ్యాయి. ఎవరైనా పేరు ప్రఖ్యాతులు పొంది సెలబ్రిటీలు ఎలా అవుతారో, ఇప్పటి మీడియాని చూస్తున్నా మనకి, ఈ మీడియాకి ముత్తాతలయిన నకిలీ కణిక పూర్వతరాలు, వారి వ్యవస్థ, వ్యక్తుల్ని ఎలా సెలబ్రిటీలుగా చేస్తుందో అర్ధమౌతుంది గదా!

ఇక ఇది ఎంత పరాకాష్టకు చేరుకుందంటే, ప్రొఫెసర్ల వెనుక, వారి ఆవిష్కరణల వెనుక ఘోష్టులు ఉండటం దాకా! అంటే సెలబ్రిటీలైన ప్రొఫెసర్లు అనామకులైన యువశాస్త్రవేత్తల్ని, ఔత్సహికుల్ని తమకు అసిస్టెంట్లుగా పెట్టుకుని వారి శ్రమని, ఆవిష్కరణలని తమవిగా ప్రచారించుకోవటం అన్నమాట. ఇప్పుడు సినిమారంగంలో చూస్తున్నామే అది! నటులకు డూప్ లు! ఈ ఒరవడి 1992 తర్వాత బాగా తగ్గింది గానీ అంతకు ముందు డూప్ ల ఫీట్లు ఎక్కువగా ఉండేవి. ఫలానా చిత్రంలో ఫలానా రిస్కు షాట్ డూప్ లేకుండా మా హీరోనే చేసాడని చెప్పుకోవటం ప్రచారంలో భాగమయ్యింది. 1992 తర్వాత, అప్పటి వరకూ కర్ణాకర్ణిగా ఉన్న డూప్ ల కథలు బాగా వెలుగులోకి, ప్రాచుర్యంలోకి వచ్చాయి. అలాగే పాలగుమ్మి పద్మరాజు, దాసరి నారాయణ రావుకి ఘోస్ట్ రచయితగా ఉండేవాడనీ, అందుచేత అతడి మరణం తర్వాత దాసరి నారాయణ రావు స్ర్కిప్టులు విజయవంతం కాక సినిమాలు బాక్సాఫీసు దగ్గర జయప్రదం కావటం లేదని, ఒక వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది. నిజనిజాలు భగవంతుడికీ, దాసరి నారాయణరావు వంటి వ్యక్తులకే తెలియాలి. ఇలా రచయితల దగ్గర నుండి, సంగీతకారుల దాకా ఎన్నో విషయాలు బయటికొచ్చాయి. అలాగే సదరు చిత్రసీమలో గాడ్ ఫాదర్ ల దయ ఉంటే కారునల్ల కాంతామణి, కనురెప్పలు కూడా అతికించుకుని, అందాల అభినేత్రిగా, ఆంధ్రుల ఆరాధ్యదేవతగా వెలిగిపోయింది. అంతకంటే అందగత్తెలూ, నైపుణ్యం, కళా సామర్ధ్యం గల వారెందరో ’ఎక్ స్ట్రా’ ల స్థాయిలోనే అణిగారిపోవటం విన్నాం. అలాంటి వారిలో ఎంతోమంది ‘మనలో లేనిదేమిటి? ఆ నటిలో ఉన్నదేమిటి? ఒక్క స్టెప్ సరిగా వేయటం రాదు. ఒక్క డైలాగ్ సరిగా చెప్పటం రాదు. వందటేకులు తింటుంది. కానీ ఏం చేస్తాం. ఆమె స్టార్ అలాగుంది’ అనుకోవటం గురించి ఎన్నోకథలు. ఒక్కోసారి ఈ గాడ్ ఫాదర్ ల పట్టు ఎంత గొప్పగా సాక్షీభూతం అవుతుందంటే, మాలాశ్రీ వంటి నాయకి బాగా లావుగా ఉన్నా ఆవిడ ధరించిన పాత్ర మీద సిలిండర్ అనో, తిండిపోతు అనో సెటైర్ ఉంటుంది గానీ హీరోయిన్ గా ఆవిడ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. ఇప్పటి బొద్దుగుమ్మ నమిత తమిళ చిత్రసీమలో వెలిగిపోతోందని, గుడి కడతామని అభిమానులు అంటే తానే నివారించానని, అందంగా, ఆరోగ్యంగా కనపడటం ఎలా అని అందరూ తనని సలహాలు అడుగుతుంటారని, తెలుగు చిత్ర వార్త విశేష సంచికలు వ్రాస్తుంటే కామోసను కుంటునో, ఛస్ కాదనుకుంటునో చదువుతుంటాం మనం. మన స్పందనతో ఏమాత్రం ప్రమేయం లేకుండానే సదరు నటీ నటులు సెలబ్రిటీలుగా వెలిగిపోతుంటారు. ’నాకింత టేస్తుందని నాకే తెలియదు’ అన్న ’అష్టా చెమ్మా’ సినిమా హీరో ఆనంద్ పాత్ర డైలాగ్ లాగా, మనకింత టేస్టుందని మనకే తెలియదు. ఖచ్చితంగా చెప్పాలంటే ‘దేశసుస్థిరిత’ పట్ల మనకింత నిబద్దత ఉందని, అందుకోసం కాంగ్రెస్ ని ఎన్నుకునేంత అభిమానం మనకి సోనియాగాంధీ మీద ఉందని, మనకే తెలియదు చూడండి, అలాగన్నమాట. ఇంకా చెప్పాలంటే గెలిచినా ఓడినా కొన్నినెలల క్రితం వరకూ సానియా మీర్జా మీడియాలో వెలిగిపోయింది చూడండి, అలాగన్నమాట.

ఎలాగైతే సినిమా రంగంలో, క్రీడారంగంలో, ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా వ్యక్తుల కెరియర్, గాడ్ ఫాదర్ ల అంటే నకిలీ కణిక వ్యవస్థ, చేతిలోకి మళ్ళిపోయిందో, అలాగే 1900 ADలో శాస్త్రసాంకేతిక రంగమూ తయారయ్యింది. ఎక్కడుంటారో, ఎవ్వరో తెలియని అఙ్ఞాత వ్యక్తుల ఆశీర్వాదం లభిస్తే గానీ రాణించని స్థితి శాస్త్రవేత్తలకి ఏర్పడింది. క్రమంగా ఆ స్థితి, క్రీడా, సినీ, రాజకీయ ఇత్యాది అన్ని రంగాలకి కాలక్రమంలో పాకింది. అప్పటికి వ్యాపార సంస్థలలో పరిశోధనా విభాగాలు కూడా ప్రవేశ పెట్టబడ్డాయి. అందులో శాస్త్రవేత్తలకు ఉపాధి అవకాశాలు, ధన సంపాదనా మార్గాలు ఏర్పడ్డాయి. 110 ఏళ్ళు తిరిగేటప్పటికి ఆ కార్పోరేట్ వాణిజ్య సంస్థల Research and Development విభాగాలు చేసే పరిశోధన, తమ వ్రాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అందుకోసం తమ ఉత్పత్తుల నాణ్యత ఎలా పెంచుకోవాలి, మొదలైన విషయాలని దాటి, ధనార్జనకి కొత్తమార్గాలని తమ శాస్త్రీయ ఆవిష్కరణలతో కనుక్కోనే స్థితికి వచ్చాయి. సబ్బు త్వరగా ఎలా అరిగిపోయేటట్లు చూడాలి, ప్రతి కస్టమర్ తన నెలబడ్జెట్ లో తప్పనిసరిగా తన ప్రొడక్ట్ కొనేటట్లు ఎలా చూడడం. ఉదా: మస్కిటో రిపల్లెట్స్, కాక్రోచ్ రిపల్లెట్స్, గట్రా గట్రా. అంతేగాక ఒక జబ్బుకి ఇవ్వబడే మందు, మరికొన్ని సైడ్ ఎఫెక్ట్ ని మెల్లిగా, ఎవరికీ అనుమానం రాకుండా, ఎక్కడా గగ్గోలు అవకుండా ఎలా పెంచాలి, తద్వారా కొత్తమందులు తయారు చేసి అమ్ముకోగలిగే అవకాశాలు ఎలా పుట్టించుకోవాలి అన్నదాకా పరిశోధనలు సాగాయి. అంతేకాదు కార్పోరేట్ పుడ్ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా శ్వాసకోస సంబంధిత వ్యాధులు, ఒబేసిటి సమస్యలు గట్రా గట్రా వస్తాయి. వాటికి కొత్త మందులు కనుక్కుంటారు. ఎక్కడా పుడ్ కంపెనీలకి, ఫార్మకంపెనీలకి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే కొత్తమందుల తయారీ, అమ్మకాలు, పెంచుకునేందుకు కొత్త జబ్బుల కనుగొనేంతగా ఇది అభివృద్ధి చెందింది. ఎటూ కొత్త జబ్బుల గురించి ప్రజల్నీ భయభ్రాంతుల్ని చేయటానికి, తాము సృష్టించిన వ్యాక్సిన్లని ప్రచారం చేసి తమకి ప్రాణ దాతల బిరుదులూ, సెలబ్రిటీ హోదాలూ ఇవ్వటానికి మీడియా ఉంది కదా! ఇక్కడ కూడా చూడండి. అదే స్ట్రాటజీ! కష్టం తామే కలిగించి, మళ్ళీ తామే దాన్నుండి రక్షించే ఆపద్భాంధవులుగా అవతరించటం.

ఇక ఈ రంగంలో ఇప్పడంటే, నూరేళ్ళ తర్వాత, మందులూ, రసాయనాలు [వ్యవసాయక ఎరువులూ, తెగుళ్ళ మందులూ గట్రా] ప్రధాన భూమిక పోషిస్తున్నాయి గానీ నూరేళ్ళ క్రితం ఆయుధాలదే హవా అంతా! తుపాకులు, శతఘ్నులూ, ట్యాంకర్లూ, క్రమంగా పరిణామం చెందుతూ అణ్వాయుధాల దాకా వచ్చాయి. పిదప రసాయనిక ఆయుధాలు, ఇప్పుడు జీవాయుధాలు. జీవాయుధాలంటే ఏముంది, అంటురోగాలు పుట్టించే క్రిమి లేదా సూక్ష్మ క్రిములని వదలటాలు. ఏ స్వైన్ ఫ్లూ, చికున్ గునియాలు, ఎలర్జీలు ఏ బ్యాక్టీరియాతో వస్తాయో, ఏ శాస్త్రవేత్త లేదా ఏ డాక్టర్ చెప్పగలడు?

ఇక ఈపద్దతి అంతటితో నకిలీ కణిక-5, తన ముందటి తరం ఎదుర్కొన్న అపజయం నుండి విజయపు బాటలోకి తన వ్యవస్థని తీసుకువచ్చాడు, మరింత బలోపేతం చేసాడు. అతడి అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, అతడి మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది, రంగంలోకి వచ్చిన అతడి వారసుడు నకిలీ కణిక-6 మరింత అప్రమత్తత, జాగరూకత పెంపొందించుకున్నాడు. అప్పటికీ ఈ నకిలీ కణికులకి, వారి అంతరింగిక బృందానికి ఒక విషయం స్పష్టపడింది. రాజవంశీయుల కంటే కూడా, వ్యాపార సంస్థల్ని బలోపేతం చేసి, తమ గుప్పిట్లో ఉంచుకోవటం తమకి శ్రేయస్కరం అని. దాంతో నకిలీ కణికులు వివిధ దేశాల్లో, వివిధ ప్రభుత్వ శాఖ పదవుల్లో, లేదా యూనివర్సిటిల్లో, వివిధ హోదాల్లో, వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉండి, తమకి సేవలందించిన, తమకి సహాయ సహకారాలందించిన తమ ఏజంట్లకు, వారు తమకి సేవలందిస్తున్నంత కాలమూ, తము వారికి ప్రతిఫలంగా అందించిన డబ్బు, కెరియర్ గ్రాఫ్ [పదోన్నతులు], పేరుప్రఖ్యాతులు, అవార్డుల రివార్డులకు అదనంగా మరొక జీవిత సాఫల్యతుల్య బహుమతి అందించటం మొదలు పెట్టారు. అదేమిటంటే కార్పోరేట్ కంపెనీల్లో సీఈవో పదవులూ, వాటాలు. పాక్ లో దాదాపు ప్రతి ఐ.ఎస్.ఐ. అధికారి, సైనికాధికారి, రిటైరయ్యాక ఒక పారిశ్రామిక వేత్త లేదా వాణిజ్యవేత్త అవతారం ఎత్తుతారు. సి.ఐ.ఏ. అధికారులకీ ఉద్యోగి విరమణానంతరం కార్పోరేట్ సంస్థల్లో కీలక వాటాలు, పదవులూ, ప్రత్యక్షంగానో, బినామీ పేర్లతోనో కట్టబెట్టినా ఎవరికి తెలుస్తుంది? మీడియా నిజాలు చెప్పదు కదా! అందునా అమెరికా మీడియా. ఇండియా మీడియాకి పెద్దన్న అదే. సినిమా నటీనటుల సినిమా కెరియర్ తర్వాత పొందే రాజకీయ కెరియర్, క్రీడాకారులు తమ రిటైర్ మెంట్ తర్వాత ప్రారంభించే అయిదు లేదా మూడు నక్షత్రాల హోటళ్ళు గట్రాలలో అధికశాతం ఇలాంటి ముసుగులోనివే.

సామాన్యుణ్ణి ఏవిధంగానైతే, ఏరంగంలోనూ పైకి రానివ్వడం లేదో ఇదీ అంతే. ఎక్కడైనా ఒక్కడు ఏసినిమా హాల్లోనో టిక్కెట్లిచ్చే గుమాస్తా వంటి వ్యక్తి రాజకీయాల్లో పైకి వచ్చి మంత్రో కాగలిగాడంటే అతడిలో ఉన్న ఏవో ‘క్యాలిటీ’లు నకిలీ కణికుడి అనువంశీకులకి నచ్చినందునే. ఆ విషయం రాజకీయ కెరియర్ లో సదరు వ్యక్తి ఎంత అక్రమార్జనకు పాల్పడ్డాడో చూస్తే తెలుస్తుంది కదా! అప్పుడు మనకి అర్ధమయ్యేది ఏమిటంటే అతడు ‘సామాన్యుడు’ కాదని.

ఈ వ్యవస్థ కంతటికీ ఒకో తరం పునాది వేసుకుంటూ వచ్చింది. నకిలీ కణిక-5 నుండి నకిలీ కణిక-6 పగ్గాలు పుచ్చుకున్నాక, పరిస్థితిని సమీక్షించుకుంటే బ్రిటీషు రాజవంశం పేరిట, తము ప్రచ్ఛన్నంగా ప్రపంచాన్నంతటిని ఒకే గొడుగు క్రిందికి తేగలిగామన్న భావన బలపడింది. ఇక ప్రయోగాలతో దాన్ని నిర్ధారించుకోవలానుకున్నాడు. ఎందుకంటే నకిలీ కణిక-4 హయంలోలాగా అంటే 1857 AD లో లాగా ప్రయత్నం విఫలం కాకూడదు. అందుచేత ఈసారి తాము attempt చేస్తే జగజ్జేతలు అనో, ప్రపంచాధినేతలనో, అన్పించుకోవాలి. అంతేగానీ విఫలం కాకూడదు. అందుకు మరింత సమయం పట్టినా, ఫర్వాలేదు. మరింత సహనంతో వేచి ఉండి మరీ, అదనులో ఫలితం దక్కించుకోవాలి. అందుచేత ఈసారి ఏ రిస్కూ ఉంచుకోదలుచుకోలేదు. అందుకే ప్రయోగాలు మొదలు పెట్టాడు. అందుకోసం మరికొన్ని స్ట్రాటజీలు సమాజంలోకి ప్రవేశపెట్టాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu