ఇక ఐరాస పనితీరులో అంతర్జాతీయ న్యాయస్థానం ఎంత బూటకమో అందరికీ తెలిసిందే. పెద్దన్నలు ఏది చేసినా ఒప్పు. చిన్న తమ్ముళ్ళు ఏది చేసినా అది తప్పు. ఉదాహరణకి లంక సైన్యం, LTTE మీద యుద్దం ప్రకటిస్తే, యుద్దం చేస్తే అది తప్పు. LTTE కి లెబనాన్ శిక్షణ ఇస్తే అదెవ్వరికీ తప్పనిపించలేదు. LTTE అమానుషహత్యలు చేస్తే, అది పెద్దన్నల అభీష్టం గనుకా, నకిలీ కణికుల అభీష్టం కనుకా, అదెవ్వరికీ తప్పనిపించలేదు. నిజానికి సింహళీయులు ఉత్తరభారతం నుండి లంకకు వలసపోయిన బౌద్ధులు. తమిళులు, బ్రిటిషు హయంలో దక్షిణ భారతదేశం నుండి లంకకు వలసపోయిన హిందువులు. భాషా సమస్య అక్కడ లేవనెత్తిబడింది. ఆపైన రాజకీయం చెయ్యబడింది. లంకలో తమిళుల్ని భాష కావాలా, ఉద్యోగం కావాలా అంటే భాష కావాలి అంటారన్నది, పదేపదే ప్రచారించిన అసత్యం. కాకపోతే, ఎంతోమంది తమిళులు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు నుండి వలస వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఖండాంతర సీమలకు, బ్రతుకుతెరువుకై వలసపోయిన తమిళులున్నారు. వారంతా అక్కడ తమ భాష కోసం ఉద్యమాలు చేస్తున్నారా? ఒకప్పటి నిజాం సంస్థానంలో, రాత్రికి రాత్రి ఉర్దూని అధికార భాష చేసి, ఒక్కరోజులో ఉర్దూరాని హిందువులంతా నాటి ప్రభుత్వోద్యోగాలకి అనర్హుల్ని చేయటంతో పాటు, దాదాపు నిరక్షరాస్యులుగా ముద్రవేయబడ్డారు. అప్పుడు పుట్టుకొస్తుంది భాషాభిమానం. నిజానికి ఆ అభిమానపు మూలాలు ఆర్దిక వనరుల్లో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో ఉన్నాయి. మాతృభాషలో పట్టభద్రులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగార్హులు, కాంట్రాక్టులకు అర్హులు, వ్యాపార పర్మిట్లకు, లైసన్సులకు అర్హులు అంటే, మరు నాటికల్లా తెలుగు బి.ఏ.లకు, ఎం.ఏ.లకి ఎక్కడ లేని డిమాండ్ పుట్టుకొస్తుంది. దెబ్బకి, ఎవరూ, ఏబ్లాగ్లోకాల్లోనో, అహర్నిశలూ కృషి చెయ్యకుండానే తెలుగు బ్రహ్మండంగా వృద్ధి చెందుతుంది. [బ్లాగ్లోకం అని ఎందుకన్నానంటే తెలుగు గురించి ఆమాత్రం ఆలోచిస్తున్నది, అభివృద్ధి అవ్వాలన్నా తపన ఉంది ఇక్కడే కాబట్టి. అంతే!] కాకపోతే ఇలాంటి ఉద్యమాలన్నిటికీ మూలకారణం మరుగుపరచబడి, క్రింది స్థాయి కార్యకర్తకి ప్రచారం మాత్రమే ఒంటబడుతుంది. దాంతో పైస్థాయిలో అధినాయకత్వం ఉద్యమాన్ని ఆర్ధిక సామాజిక రాజకీయ ప్రయోజనాలకు మారకం వేసుకుంటుండగా, క్రింది కార్యకర్త స్థాయి వ్యక్తులు మాత్రం గొంతుచించుకు అరుస్తూ, కిరసనాయిలుతో శరీరాల్ని తగలెట్టికుంటూ ఉంటారు. ఇక ఈ భాషా ఉద్యమాన్ని ప్రక్కన పెట్టి మళ్ళీ ఐరాస దగ్గరికి వద్దాం.

లంకలో అంతర్యుద్దం నేపధ్యంలో ఐరాస, బ్రిటన్, ఫ్రాన్సులు లంకని ‘యుద్దనేరం ఎదుర్కోవలసి వస్తుంది జాగ్రత్త సుమా!’ అని హెచ్చరించాయి, ఒత్తిడి చేశాయి. అదే ఇప్పుడు పాకిస్తాన్, నిన్నమొన్నటి వరకూ తాలిబాన్లతో షరియత్ చట్టం చేసుకుని, హఠాత్తుగా మార్చుకున్న స్ట్రాటజీలో, తాలిబాన్లతో యుద్దం చేస్తున్నానంటూ స్వాత్ లోయలో ప్రజల్ని ఖాళీ చేయిస్తుంటే, అంతర్యుద్దం పేరుతో ప్రజలు నానాబాధలకీ గురవుతుంటే కిమ్మనికూడా అనటం లేదు. ఎందుకంటే అది మరి పాకిస్తాను! ఇస్లామాబాద్ కి అసలే బలం ఎక్కువయ్యే! ఎందుకంటే అది నకిలీ కణిక వ్యవస్థకి బహిఃప్రాణం కదా? కావాలంటే మరో దృష్టాంతం చూడండి. సెప్టెంబరు 11, 2001, WTC పై ఆల్ ఖైదా, తాలిబాన్ల [పేరు ఏదయినా ఒకటే, చేసేది హింస] దాడి నేపధ్యంలో అమెరికా, ‘బిన్ లాడెన్ ఆఫ్గానిస్థాన్ లోని తోరోబోరా గుహల్లో దాగున్నాడంటూ’ రయ్యిన, ఆఘమేఘాల మీద యుద్దానికెళ్ళింది. కార్పెట్ బాంబింగ్ తో దుమ్మురేపి పారేసింది. ఆపైన ఇరాక్ మీదకీ, అలాగే ఒంటికాలిమీద వెళ్ళింది. అప్పుడు బ్రిటన్, ఫ్రాన్సులతో సహా అన్నీ ఆమోదించాయి. ఐరాస సరేసరి. సరే, మరి లాడెన్, తాలిబాన్లు అమెరికా WTC మీద దాడి చేశారు కదా! కారణం సబబే అన్నారు. నిజమే మరి. అదే తాలిబాన్లు పాకిస్తాన్ లో ఉన్నారని అందరికీ తెలుసు. లాడెన్ సైతం ఆ పాక్ లోనే ఉన్నాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మీదు మిక్కిలి పాకిస్తాన్, స్వాత్ లోయలో తాలిబాన్లతో హరియత్ చట్టానికి ఒప్పుకొని, బాహాటంగానే తాలిబాన్లతో తన మమేకాన్ని నిరూపించుకుంది. ఇప్పుడు కూడా యుద్దం అన్న మాటపైకి చెబుతూ, తాలిబాన్లూ, పాక్ సైన్యం కలిసి అక్కడి ప్రజలని [అప్పటికే సిక్కుల ఇళ్ళను తాలిబాన్లు ఆక్రమించి, జిజియా(పన్ను)వసూలు చేశారు. ఇప్పుడు సిక్కులు నిరాశ్రయులై వలసలు పోవలసి వస్తుంది.] ఆ ప్రాంతం నుండి వెళ్ళగొడుతోంది. మరే భవిష్యత్తు ప్రయోజనాల కోసమో చోటు ఖాళీ చేయిస్తోంది. అంతే! ఇంత జరుగుతున్నా, ఏదేశమూ, ఐరాస తో సహా, పాకిస్తాన్ ని ఒక్క హెచ్చరికా చెయ్యటం లేదు. సరికదా, అమెరికా అయితే, ముద్దుగా తిడుతూ, పాక్ కి ఆర్ధికసాయం అదీ కోట్ల డాలర్లలో, మునుపటి ప్రభుత్వం కంటే రెండింతలు ఎక్కువ, ఇస్తోంది. సాయం చేస్తూ తిడుతోంది. ఏమాటలు అంటేనేం? చేతల్లో మాత్రం, దండిగా డాలర్లు అందిస్తోంది. అదే నోటితో ఇంతకు క్రితం తము చేసిన ఆర్ధికసాయంతో ఐ.ఎస్.ఐ. తాలిబన్లకు మప్పబెట్టిందని అమెరికా ఆరోపించింది. ఐరాస తానే కాకుండా, ఇతర దేశాలను కూడా, పాకిస్తాన్ కు సాయం చెయ్యమని చెబుతోంది. బహుశ భవిష్యత్తులో మన ప్రధాని, మానవత దృష్టితో పాకిస్తాన్ కు సాయం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒకరెండురోజులు హడావుడి చేసి, తరువాత కిమ్మనకుండా ఉన్నా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

మునపటిలా ’ఇండియా అమెరికా కి వ్యతిరేకం. ఇండియాని కట్టడి చెయ్యటం కోసం పాకిస్తాన్ ని అమెరికా దువ్వుతోంది’ అనటానికి కూడా లేదు. ఎందుకంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగు బాహాటంగానే ‘బుష్ కి ముఖం ఎలా చూపెట్టుకోను?’ అంటూ, నిర్మోహామాటంగానూ, నిర్లజ్జగానూ అమెరికా పాదాలకు మోకరిల్లారు. అణు ఒప్పందంతో, రెండు దేశాల మధ్య స్నేహ సౌరభాలు విరజిమ్ముతున్నాయనీ, సహకార సంబంధాలు వెల్లివిరిసాయనీ ఉభయ దేశాధినేతలూ, ఒండొరులని హత్తుకుని మరీ ఐక్య ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా పాకిస్తాన్ ని అంత బుజ్జగించాల్సిన అవసరం, భుజానికెత్తుకుని పోషించాల్సిన అవసరం, అమెరికాకి ఎందుకున్నట్లు? మీదు మిక్కిలి తనకి అంతగా పడని చైనాని సైతం, పాక్ కి శిక్షణ, మిలటరి పరికరాలు అందజేయాలని అమెరికా ఎందుకు చైనా వెళ్ళల్లా అడగాల్సిన అవసరం వచ్చినట్లు? ఒక్క చైనాకే కాదు, అమెరికా పాక్ కి ఆర్ధిక సాయం చెయ్యమని సౌదీ కూడా వెళ్ళి లాబీయింగ్ చేస్తూంది. ఏమిటి పాక్ ప్రత్యేకత? పాక్ తానే తాలిబన్లని తెచ్చినెత్తిన పెట్టుకుంది. పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ.నే పాక్ లో దారిద్ర్యానికీ, తాలిబన్లు బలీయంగా అవ్వడానికి కారణం అని, పాక్ ప్రజాస్వామ్య ప్రభుత్వాధినేతలు జర్దారీలు, గిలానీలూ, మాజీలైన నవాజ్ షరీఫ్ లూ కూడా ఒప్పుకుంటున్నారు. అమెరికా దేశపు హిల్లరీ క్లింటన్ లూ అదే, పదేపదే నొక్కి వక్కాణిస్తూన్నారు. మరి మళ్ళీ అదే వంకతో – ‘టెర్రరిజం బాధలకి పాక్ లో దారిద్ర్యం పెరిగిపోయింది. కాబట్టి పాక్ కి ఆర్ధిక సాయం చేయండి’ అని దబాయింపుగా మరీ సలహాలు, సంకేతాలు ఎలా ఇస్తున్నారు? తీరా ఆర్ధికసాయంగా వచ్చిన సొమ్ముతో పాకిస్తాన్ ప్రజల దారిద్రమే పోగొడుతుందో, మరింతగా తాలిబన్లకు ’బలం’ ఇస్తోందో ఎవరూ అడగరు. ఎందుకంటే ఇస్లామాబాద్ కు అంతబలం మరి! ఎందుకంటే పాకిస్తాన్ నకిలీ కణికుల బహిఃప్రాణం మరి! ఈ మొత్తం నాటకాన్నీ, బూటకాన్నీ రమణీయంగా రక్తి కట్టిస్తుంది ఐరాస.

అదే ఇతర దేశాల పైకైతే? నకిలీ కణిక వ్యవస్థ ఆయా దేశాల ఆర్ధిక మూలాలు చితక్కొట్టి, అప్పులు చేసే స్థితికి లాక్కుబోతుంది. ఉదాహరణ ఈ దృష్టాంతాన్ని పరిశీలించండి. 1989 లో జనతాదళ్ ప్రభుత్వం, రైతులకు పదివేల రూపాయలు లోపు రుణాల మాఫీ చేస్తానంటూ, హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక కొంత చేసింది. ఫలితంగా తదుపరి వచ్చిన చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారం తనఖా పెట్టాల్సి వచ్చింది. తదనంతర కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా స్వేచ్ఛావిపణికి తలుపులు తెరవక తప్పనిస్థితి, అప్పులు చెయ్యకా తప్పని స్థితి. అదే ఇప్పుడు ప్రతీరాష్ట్రంలోనూ, ప్రతీ ఎన్నికల్లోనూ జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమం పేరిట, ’కార్బోరేట్ విద్య, వైద్యం అందిస్తాం [ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు ఉంటాయి. సిబ్బందికి జీతభత్యాలు చెల్లింపబడతాయి. పని మాత్రం చేయవు. అదెవ్వరికీ పట్టదు కూడా] అంటూ ప్రజాధనాన్ని అప్పనంగా కార్పోరేట్ సంస్థలకి ప్రభుత్వాలు పబ్లిగ్గా దోచిపెడుతున్నాయి. EVM ల Tampering తో వచ్చే ఎన్నికల ఫలితాలు చూపి, ఈ ఆకర్షక పధకాలు [108, ఆరోగ్యశ్రీ, వంటి పధకాల చూసీ, ‘అధికధరలూ, ఈతి బాధలూ, ప్రభుత్వప్రైవేటూ దోపిడి’ వంటి ఏ సమస్యలూ పట్టించుకోకుండా, ప్రజలు తమని ఎన్నుకున్నారని ప్రచారిస్తున్నారు. కేవలం దేశ సుస్థిరత, దేశభద్రత కోసం కాంగ్రెసుని, సోనియా గాంధీని నమ్మి ఓట్లేసారట. ఇలాంటి ప్రచారాలు ప్రజలతో నిమిత్తం లేకుండానే చేసి, ప్రజలతో నిమిత్తం లేకుండానే ఎన్నికల్లో గెలిచి, దేశాన్ని, రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అప్పుపేరుతో ప్రపంచబ్యాంకుకి తనఖా పెట్టేస్తున్నారు. ప్రపంచబ్యాంకు ఐరాసకి అనుబంధమే. ఇక చూస్కోండి! ప్రపంచబ్యాంకు గుప్పిట్లో ప్రభుత్వాలు. దాని మార్గదర్శకంలో పరిశీలనా పద్దతులు. వెరసి వారి ఏజంట్లకు లాభాలు, ప్రయోజనాలు, ప్రజలకు కడగండ్లు. ఇవన్నీ చూస్తూ సహిస్తున్న ప్రజల సహనానికి నిజంగా చేతులెత్తి మొక్కవలసిందే!

ఇక్కడ ప్రపంచ బ్యాంకు గురించి కొంత చెప్పాలి. బహుశ ఇవి మీకు తెలిసినవే కావచ్చు. ప్రపంచబ్యాంకు అప్పుల కోసం వచ్చే వాళ్ళకి అప్పు ఇవ్వటంతో ఊరుకోదు. అది తీర్చే పద్దతి కూడా అదే చెబుతుంది. ఆ పద్దతులు [రిపోర్టులు] ఆయా దేశాలను బలహీనపరిచేవిగానూ, నకిలీ కణిక వ్యవస్థకి, ముఖ్యంగా వ్యాపార కంపెనీలకు అనుకూలంగానూ ఉండేటట్లు ఉంటాయి. క్రమంగా ఆయా దేశాలు అనివార్యంగా ప్రపంచబ్యాంకు గుప్పిట్లోకి వెళ్తాయి. ఆయా దేశాలు దెబ్బతినడానికి, నకిలీ కణిక వ్యవస్థ ఆయా దేశాలలో, టెర్రరిజం, ప్రాంతీయ గొడవలు, రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేయించటం, గట్రాగట్రా పద్దతులతో దేశాన్ని బలహీనపరిచి, తద్వారా ఆయా దేశాలు అనివార్యంగా ప్రపంచబ్యాంకు ముందు మోకరిల్లవలసి వచ్చేటట్లు చూస్తాయి. ఎక్కడా ఈ టెర్రరిజానికి, ప్రపంచబ్యాంకుకు సంబంధం ఉండదు. ఇదే ఇక్కడ స్ట్రాటజీ.

ప్రపంచ బ్యాంకు పట్టుతో, దేశంలో పరోక్షంగా నడుస్తోంది ఐరాస పాలన లేదా అన్యదేశ పాలన. ప్రపంచబ్యాంకు గుప్పిట్లో దేశ, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజాప్రయోజనాలని తనఖా పెడుతున్నాయని, ఎర్రపార్టీల వాళ్ళు ప్రచారమైతే చేసి, ఇక వ్యూహాత్మక నిష్ర్కియాపరత్వం చూపిస్తారు. అదే స్ట్రాటజీ ఇక్కడ. వెరసి అందరికీ తెలుసు ప్రపంచబ్యాంకు అదుపాజ్ఞాలతో రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు నడుస్తున్నాయని! పైకి మళ్ళీ ’ఐరాస అంత వృధా సంస్థ ఇంకోటి లేదు. దాని పనితీరు అంతా చెత్త. పచ్చి బూటకం’ అన్న ప్రచారం నడుస్తోంది. నిజానికి ఈ ప్రచారం ఐరాసకీ, దాని వెనక నున్న నకిలీ కణిక వ్యవస్థ కీ రక్షణ కవచం వంటింది.

“ఇదంతా ఎలా నడుస్తుంది? ఇంపాజబుల్. అసాధ్యం, అసంభవం.” ఇలాంటి అభిప్రాయాలు కొందరు వ్యక్త పరుస్తుంటారు. అందులో కొందరిది అమాయకత్వం. [నిజంగా తెలియనితనం. ఇది నా దగ్గర ఒకప్పుడు ఉండేది గనుక చెబుతున్నాను. నిశిత పరిశీలన, తార్కిక వివేచనా నాకు నిజం చెప్పాయి. అదేఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను] మరికొందరిది ‘అతి మేధావిత్వం.’ ఈ మేధావులని నమ్మించవలసిన అవసరం గానీ, ఒప్పించవలసిన అవసరం గానీ నాకు లేదని మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశం నా ఒక్కదానిది కాదు, మా ఒక్కరిది కాదు, ఏ ఒక్కరిదీ కాదు. అలాగే ప్రపంచమైనా, దేశమైనా అందరిదీ. ఈ గూఢచర్యపు తంత్రాలతో జరుగుతున్న నష్టం ప్రతి సామాన్యుడి జీవితంలోనిది. సామాన్యుడు తనకి తెలియకుండానే, ఎవరి చేతిలోనో ఉపకరణమైపోతున్నాడు. తన శారీరక, మానసిక, కుటుంబ సౌఖ్యలని, సంతోషాలని కూడా త్వజించి, ఎవరి సంపదనో వేల కోట్లకు పెంచడానికి యంత్రమై పోతున్నాడు. ఇందులో రోజు కూలీ దగ్గర నుండి, కాస్త పెద్ద వ్యాపార సంస్థ నడిపే వారి వరకూ అందరూ పావులే. కేవలం నకిలీ కణికుడి ప్రధాన ఏజంట్లు, ఆయా రంగాల్లో మోనోపలీ వైపు దూసుకు పోతున్న దిగ్గజాలు మాత్రమే సంపద పెంచుకోగలగుతున్నాయి. అందులోనూ మళ్ళీ ఎవరి వాటా ఎంతో వారికే తెలియాలి. కాబట్టి అతిమేధావుల సిద్దాంతాలతో నాకు నిమిత్తం లేదు. నిరభ్యంతరంగా వారి సిద్దాంతాల మీద వారు రాద్దాంతాలు వారే వ్రాసుకోవచ్చు. ఎవరికైతే ‘ఈ దోపిడిలో మనమూ సమిధలం అవుతున్నాం. అంచేత ముందు ఇదేమిటో తెలుసుకుందాం. ఆపైన ఇది ఎంత వరకూ సత్యమో అన్వేషిద్దాం, వివేచిద్దాం, విశ్లేషించుకుందాం, అది నిజమే అయితే ఆ సత్యాన్నీ మరింతగా వెలికి తీద్దాం. ఆవిష్కరిద్దాం. అప్పుడు మన జీవితాన్ని మనం వెలిగించుకోగలుగుతాం’ అనుకుంటారో, వారికోసమే, నాకు తెలిసిన విషయాలు వ్రాస్తున్నాను. నమ్మని వారు నిరభ్యతరంగా ఈ విషయాలని పట్టించుకోకుండా నిశ్చింతగా ఉండవచ్చు.

‘ఇక నకిలీ కణిక వ్యవస్థ [కేవలం ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ప్రధాన నిర్వాహకులుగా గల వ్యవస్థ] ఎలా ప్రపంచాన్ని నడిపించగలదు? అదీ ప్రపంచ ప్రజానీకానికి తెలియతెలియకుండా?’ – ఈ సందేహల్ని నివృత్తి చెయ్యటానికి ప్రయత్నిస్తాను. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకప్పుడు మనీ సర్కులేషన్ స్కీములు బాగా నడిచేవి. ముందుగా ‘A’ అనేవ్యక్తి తాను ఓ ఇద్దరినీ చేర్పించాడను కొండి. అతడికి కమీషన్ వస్తుంది. ఈ ఇద్దరూ ఉదాహరణకి A-1, B-1 అనుకుందాం. వీరు ఇద్దరూ ఒక్కొక్కరూ మరో ఇద్దరిని చేర్పించాలి. వారికి A-2,A-3, B-2,B-3 అనుకుందాం. మళ్ళీ అదే వరుస. ఈ క్రమంలో ‘A’ కి తనక్రిందనున్న ఏజంట్లలో 5 గురో, మహా అయితే 10 మందో తెలిసి ఉంటారు. తన పైనున్న ఏజంట్లలో 5 గురో, మహా అయితే 10 మందో తెలిసి ఉంటారు.

ఈ మనీ సర్కులేషన్ స్కీము లోని ఏజంట్లు మాదిరే గూఢచార ఏజంట్లున్నారను కొండి. వారుపైకి ఏవృత్తుల్లోనైనా ఉండనీయండి. ప్రభుత్వ ఉన్నతోద్యోగుల నుండి సాధారణ ఉద్యోగుల వరకూ, రాజకీయ నాయకుల నుండి, కాలనీల్లోని చిన్నచితకా కార్యకర్తల వరకూ, వృత్తివ్యాపారుల లోనూ, వైద్యవిద్యారంగాల్లోనూ – ఇలా గన్నమాట. చివరికి అది వివిధ దేశాలలోని గూఢచార శాఖల్లోనూ విస్తరించి ఉంటుంది. ప్రతీ ఏజంటుకీ, తన పై వారు ఓ ఐదుగురు, తన క్రిందవారు ఓ ఐదుగురు తెలిసి ఉంటారు. పైనుండి తాను assignments అందుకుంటాడు. వాటి ప్రకారం, తన క్రింది వారికి తాను ఏవైనా assignments పంపవలసి ఉంటే పంపిస్తాడు. తన assignments ని తాను నిర్వహిస్తాడు. క్రింది వారు నిర్వహించారో లేదో పర్యవేక్షిస్తాడు. ఫలితంగా తన స్వప్రయోజనం పొందుతాడు. అది డబ్బు కావచ్చు, సెలబ్రిటీ హోదా వంటి కీర్తి ప్రతిష్ఠలు కావచ్చు, అవార్డులూ, గుర్తింపులూ కావచ్చు, కేరీర్ కావచ్చు. పదోన్నతులు కావచ్చు లేక ఉమ్మడిగా కావచ్చు. స్వప్రయోజనాలు మాత్రం బహుళం. అలాగే తన assignments ని సరిగా నిర్వహించలేకపోయాడనుకొండి, కొద్దిసార్లు మాత్రం ఉపేక్షించబడతాడు. ఇంకా అదే అసమర్ధత కొనసాగితే ఇక Fade out అయిపోతాడు. తెరమరుగైపోతాడు. కెరియర్లో తొక్కివేయబడతాడు. ఇక బ్యాలెన్సు తప్పి నోరుజారటమో, మురళిమనోహర్ జోషి, [భాజపా ఒకప్పటి అధ్యక్షుడు] లేక సుష్మాస్వరాజ్ లాగా అక్కసు నియంత్రించుకోలేక పోవడమో, జరిగిందనుకొండి, ఇక వారి పరిస్థితి ఇంతే సంగతులు. జులై 22, 2008 న పార్లమెంటులో యూ.పి.ఏ. విశ్వాసపరీక్షలో నెగ్గెందుకు నోట్లకు ఓట్లును కొన్నుకున్న ఆరోపణలు బయటికి వచ్చాక, బెంగుళూరులో మొదలుపెట్టి జైపూర్, అహమ్మదాబాద్, ఢిల్లీ వగైరా నగరాలలో వరసబాంబు పేలుళ్ళు జరిగాయి. ఆ నేపధ్యంలో సుష్మాస్వరాజ్, సోనియాగాంధీ మీద ’ఓటు కు నోటు వ్యవహారం బయటికి రావటంతో వరస బాంబుపేలుళ్ళు జరుగుతున్నాయి. విషయాన్ని ప్రక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి జరుగుతున్న ఈ సంఘటనల వెనుక యు.పి.ఏ. హస్తం ఉంది’ అన్నది. పాక్ తో కలిపి ఉమ్మడి హస్తమే ఉందో లేక కేవలం కాంగ్రెస్ హస్తం మాత్రమే ఉందో, ఆమె ఇదమిద్దంగా చెప్పలేదు. అయితే, ఆ తర్వాత భాజపా అగ్రనాయకత్వం ’అది సుష్మాస్వరాజ్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు’ అంటూ సదరు ప్రకటన తమ పార్టీకి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంది. కానీ, ఆ తర్వాత వాగ్ధాటి గల నేతగా పేరున్న సుష్మాస్వరాజ్ 2009 ఎన్నికల్లో సైతం రాణించలేదు. ఆమె ఉపన్యాసాలకు ఎక్కువ ప్రచారం లేదు, వాగ్భాణాలూ లేవు. అసలు భాజపా అంతర్గత కుమ్ముటాటల్లో పడి ఎన్నికల్లో పోటీనే ‘ఉండనా, ఊడనా’ అన్నట్లు చేసింది. మరి సుష్మాస్వరాజ్ ని కాంగ్రెస్ ఎలా అణగ తొక్కగలిగినట్లు? సుష్మాస్వరాజ్ లాంటి వారికి తెలిసి తమ [భాజపా] వెనుక అండదండగా ఇజ్రాయేల్ మోసాద్ లాంటి సంస్థలున్నాయన్న మాట ఉంది. సోనియా గాంధీ తమకి తెలిసి వాటికన్ ఏజంట్ లేదా సి.ఐ.ఏ. ఏజంట్ మాత్రమే. కాబట్టే సోనియాగాంధీని సమ ఉజ్జీగా భావించి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అందుకని తరువాత కాలంలో అణగ తొక్కివేయబడింది. కాకపోతే సుష్మాస్వరాజ్ వంటి వారికి కూడా తెలియని మర్మం ఒకటి ఉందిక్కడ.

పురుషులలో పుణ్యపురుషులు వేరయా అంటాడు వేమన. మామిడి పళ్ళల్లో నూజివీడు మామిడి పళ్ళు వేరయా అంటాడు రుచి అస్వాదించేవాడు. అలాగే ఏజంట్లలో కూడా నకిలీ కణికుడి అంతరంగిక ఏజంట్లు వేరయా అన్నదే ఈ మర్మం. అందుకే అద్వానీ లాంటి సీనియర నాయకులు సోనియాగాంధీని తీవ్రమైన ఆరోపణలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే సోనియాగాంధీ పట్టుకు [grip] కారణం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

Bahusha meeru gatum lo vilakari anukunta.meelo manchi vyakarana nirmana shaili undi,kaani okka vishlashana kuda kaneesam emicheppalanukuni raasaaro adi cheppakunda,mee sontha vishlashana(prati chota akrosham)laane undi,bayata jarugutunna mosalaki mee titles matram 99% chebutunnai kaani body text lo emi cheppalanukuntuntunnaro aithe maaku ardam kavadm ledu.Mee vishlashan monthanga patakudiki strong analysing kaakunda confuse avutundi,alage okka analyse kuda patrika spoorthiga ladu.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu