సి.ఐ.ఏ.లో తమ మాతృదేశం అమెరికా పట్ల ప్రేమా, భక్తీ, నిబద్దతగల అధికారులూ ఉంటారు. వాళ్ళకి నకిలీ కణిక వ్యవస్థ ‘America is great’ అన్న ఇమేజీతో ఉబ్బేస్తుంది. అలాంటి వారు కొంత ఐడిలిస్టులు, లేక భావవాదులన్నమాట నకిలీ కణికుడి దృష్టిలో. వారికి కాస్త తైరు కొడితే, కొద్దిపాటి ప్రయోజనాలు చూపిస్తే చాలు. దేశద్రోహం చెయ్యమంటే ఒప్పుకోరు వీరు. ఇలాంటి వారికి ’ఇది స్ట్రాటజీలో ఒక భాగం. తాత్కాలికంగా మనకి నష్టం అన్పించినా, భవిష్యత్తులో మనకి చాలా గ్రిప్ ని తెచ్చిపెడుతుంది’ గట్రా తంత్రాలతో కవ్విన్స్ చేస్తారు. ఒక ప్రణాళిక, లేదా తంత్రం తాత్కాలికంగా advantage గా కన్పించి, కాలగమనంలో disadvantage అవ్వటం, లేదా తాత్కాలికంగా disadvantage గా అన్పించి కాలక్రమంలో advantage అవ్వటం మామూలే గనుక వాళ్ళు కన్విన్స్ అవుతారు. పాక్ లాలన విషయంలో సి.ఐ.ఏ.లోని అందరూ ఆమోదించకపోయినా, ఇలాంటి తంత్రాలతో ఆమోదించేటట్లు చేస్తారు. అప్పటికీ ఎవరైనా కన్విన్స్ కాకపోతే, మెల్లిగా ఆవ్యక్తి [సి.ఐ.ఏ.లోని అధికారి కానివ్వండి, రాజకీయ పార్టీల్లోని వ్యక్తి కానివ్వండి, ఎవరైనా సరే] ఒంటరి అవుతాడు. విభజించి పాలించే తంత్రంలో దీన్ని సాధించటం సులభమే. క్రమంగా వేధింపుకి సైతం గురవుతాడు. క్రమంగా అణిచివేయబడతాడు. అడ్రసు గల్లంతవుతాడు. అంత బలం తెలిసాక క్రమంగా వ్యతిరేకత కూడా తగ్గిపోతుంది. ఇది ఒక్క సి.ఐ.ఏ. విషయంలోనే కాదు, ఏదేశంలోనైనా, ఏ దేశ గూఢాచార వ్యవస్థ అయినా పరిస్థితులింతే!

[ఈ స్థితినే మరి ఒక ఉపమానంతో చెప్పాలంటే అమెరికా రక్షణ అధికారిక భవనం పెంటగాన్ కాబట్టి, అమెరికా పట్ల నిబద్దత గల సి.ఐ.ఏ. ఏజంట్లని నెం.5 ఏజంట్లు అనుకోవచ్చు. సందట్లో సడేమియా అన్నట్లుగా, “తమ దేశానికి చేటు జరిగితే తమకేమిటి? దేశభక్తి, తొక్కా అనుకుంటే మట్టిగొట్టుకుపోతాం. వాళ్ళిచ్చిన assignments నిర్వహిస్తే డబ్బు, కీర్తి, కెరియర్ అన్నీ ఇస్తారు. కాదంటే చావదన్నీ చంపుతారు. కాబట్టి దేశద్రోహమైనా సందేహపడక, సంకోచపడక చేసేయ్” అనుకునే స్వార్ధపరుల్ని నెం.10 ఏజంట్లు అనుకోవచ్చన్నమాట. అంటే నకిలీ కణికుడి ఏజంట్లన్న మాట. వీళ్ళమధ్య, ప్రపంచవ్యాప్తంగా, దేశాలకతీతంగా ఒక assignments circle, ఒక సంబంధాల గొలుసు ఉంటుంది. దీన్నే ‘అక్కడొకటి ఇక్కడొకటిగా పడి ఉన్న ఫూసలు అందరికీ తెలుసు. వాటిని గుచ్చేదారం ఒకటి అంతర్లీనంగా ఉందని తెలిసినప్పుడు కదా అక్కడో గొలుసుదాగుందని తెలిసేది’ అని వ్రాసాను తొలిటపాలలో. ఇదే వ్యాక్యాన్ని ఇలాగే వ్రాసాను 1992 లో పీవీ నరసింహారావు గారికి ఇచ్చిన రామోజీరావు రహస్య కార్యకలాపాల మీది ఫిర్యాదులో! అయితే ఈ నకిలీ కణిక ఏజంట్ల వర్గాన్ని నెం.10 తో ఎందుకు పోల్చానంటే బ్రిటీషు వారి వెనక చేరి నకిలీ కణికుడు తన వ్యవస్థను, తన సర్కిల్ ను నిర్మించుకున్నాడు కాబట్టి. అంతేగాక బ్రిటిషు ప్రధాని నివాసం 10 డౌన్ స్ట్రీట్ కాబట్టి, సౌలభ్యం కోసం దీనిని నెం.10 వర్గంగా నిర్వచించాను. అలాగే ఇక్కడ ఒక విషయం పరిశీలించండి. అమెరికాలో పైకి వచ్చిన చాలామందిలో, వారి మూలాలు బ్రిటన్ వి అయిఉంటాయి. మరో రకంగా చెప్పాలంటే మనదేశంలో పైకి వచ్చిన చాలామంది మూలాలు పాక్ లో ఉన్నట్లన్నమాట.

ఏది ఏమైనా ఈ నకిలీ కణిక-6 అల్లిన గూఢచార వలయం [ఇది అతడొక్కడే అల్లలేదు. అప్పటికి తరతరాలుగా, కొంత సమిష్టి కృషిగా ఈ పని నిర్వహించబడింది.] లో ఏ ఏజంటు అయినా [దేశాలకి అతీతంగా, పదవులకీ, కీలక స్థానాలకి అతీతంగా] వ్వక్తిగతంగా బలహీనుడే. తమ ఏజన్సీ, తమ కంటే చాలా బలమైనది అన్న ఒప్పుదల వారి నరనరాన ఉంటుంది. ఏజన్సీ చెల్లిస్తే తాము చెల్లుబాటు అవుతారు లేదా తెరమరుగైపోతారు. కాబట్టి ఏజన్సీకి దాసులై ఉంటారు. ఏ ఏజంటయినా పట్టుబడినా, అతడి ఉనికి ఆయా దేశాల పట్ల నిబద్దత గల వర్గానికి తెలిసిపోయినా, అలాంటి ఏజంటుని, ఆయా ఏజన్సీలు కూడా వదిలేసుకుంటాయి. కొండొకచో, అదే[ఆ ఏజన్సీయే] ఆయా ఏజంట్లని పడగొట్టి, ఆ శిధిలాల మీద మరో క్రొత్త ఏజంటుని నిలబెడుతుంది. అంటే సదరు ఏజంటుని విమర్శిస్తూ, ఖండిస్తూ, నానాయాగీ చేసీ మరో ’సచ్ఛీలుడు’ వెలుగులోకి వస్తాడు. జనం నిజమే గామోసు అనుకుంటారు. కొన్నేళ్ళు గడిచాక, ఈ ‘సచ్ఛీలుడి’ కంటే ఆ ’సచ్చినోడే’ పదిరెట్లు నయం అని తెలుస్తుంది. అప్పుడు అందరికీ అర్ధమౌతుంది, సదరు సచ్ఛీలుడు కూడా ముందట వాడి ఏజన్సీకి చెందిన ఏజంటే అని! కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. ఈ ఏజంటు బలపడిపోతాడు. ఇదే స్ట్రాటజీ ఇక్కడ.

కాబట్టే క్రమంగా వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది అనుకోవలసి వచ్చిందన్న మాట. అయితే ఇక్కడ పచ్చినిజం ఏమిటంటే – ఏ ఏజంటు పట్టుబడినా జరిగే ఈ సాధారణ స్ట్రాటజీ, రామోజీరావు విషయంలో తిరగబడటం![ ‘ఇప్పుడు రామోజీరావు కూడా మసకబారుతున్నాడు కదా’ అంటారేమో! కాని ఇతడు ఈమాత్రం మసకబారటానికి ఇప్పటికి 17 ఏళ్ళ సమయం పట్టడం గమనార్హం. అంతేగాక, ఇప్పటికైనా ఇతడి పరిస్థితి ఇలా ఎందుకు పరిణమించిదో, దాని వెనక గల స్ట్రాటజీని సవివరంగా తెలియజేస్తాను.] ఎన్.రామ్ లూ, గోయంకాలు, ఉనికి బహిర్గత మయ్యాక వారి ముందటి స్థితితో పోలిస్తే మసకబారి పోయారు, వారి కోసం వారి ఏజన్సీ, అది సి.ఐ.ఏ. కానివ్వండి, మొస్సాద్ కానివ్వండి, హీనపక్షం ఐ.ఎస్.ఐ. కానివ్వండి, వారికోసం ఏమాత్రం పాకులాడలేదు. అదే రామోజీరావు విషయంలో అయితే – సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.లు, రామోజీరావుని కాపాడుకోవటానికి ఒడ్డిపోరాడుతున్నాయి. అదే లంకలో రాజపక్సే Vs వేలుపిళ్ళై ప్రభాకరన్ ల వ్యవహారంలో మరింత ప్రస్ఫుటంగా కనబడింది.

స్ధూలంగా చెప్పాలంటే ప్రపంచమంతా ఇప్పుడు ఓ ప్రక్క నకిలీ కణిక వ్యవస్థ గానూ, మరోప్రక్క ఆయా దేశాల పట్ల నిబద్దత గల వ్యక్తులంతా కలిసి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొంతగా సమైక్యమై, తమ తమ దేశ ప్రయోజనాల కోసం, మానవత్వం కోసం, మనుగడ కోసం, పోరాడుతున్న వర్గంగానూ చీలిఉంది. నకిలీకణిక వ్యవస్థని సౌలభ్యంకోసం 10 వర్గం అనుకుంటే, దాని వ్యతిరేక వర్గం నెం.5 అనుకోవచ్చన్న మాట. అంటే స్థూలంగా ప్రపంచమంతా No.10 మరియు No.5 వర్గాలుగా చీలి ఉందన్న మాట.

ఇది టూకీగా చెప్పాను కాబట్టి, మీకు కొంత గందరగోళంగానూ, తార్కికంగా అవరోధాలున్నట్లుగానూ అన్పించవచ్చు. అందుచేత దీన్ని వివరంగా చెబుతాను.

నకిలీ కణిక-6, రెండుప్రపంచయుద్ధాల నేపధ్యంలో, నిగూఢంగా తాను నడిపిన స్ట్రాటజీలు విజయవంతం కావటంతో చాలా బలపడ్డాడు. అతడి నుండి నకిలీ కణిక-7 పగ్గాలు పుచ్చుకున్నాడు. ఈ నకిలీ కణిక-7 రామోజీరావేనా కాదా అంటే, అతడు కావచ్చు లేదా అతణ్ణి ప్రస్తుతం ప్రొజెక్ట్ చేస్తూ అసలు నకిలీ కణిక-7 ప్రచ్ఛన్నంగా ఉండి ఉండవచ్చు. అయితే రామోజీరావే నకిలీ కణిక-7 అనడానికి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి అవి చెప్పేముందు నకిలీ కణిక-6 దగ్గర నుండి మళ్ళీ వివరణ ప్రారంభిస్తాను.

నకిలీ కణిక-6, ఐరాస ముసుగులో ప్రపంచం మీద ఎంతగా అదృశ్య పట్టు సాధించాడో గత టపాలలో వ్రాసాను. అప్పటికే నకిలీ కణిక-6, అతడి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా పెంచటం, ముస్లింలని బలమైన వర్గంగా చెయ్యటంలో బాగానే కృతకృత్యులయ్యారు. మీరు గమనించి చూడండి. సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఒపెక్ దేశాలు గట్రా గట్రా…. ముస్లిం దేశాల పట్ల ఒక ఇమేజ్ పూర్వకంగా పత్రికలు వ్రాస్తాయి. టీవీలు చూపుతాయి. [ఖచ్చితంగా చెప్పాలంటే ఈ స్థితి 1992 కు పూర్వం మరింత ప్రస్ఫుటంగా ఉండేది] బ్రూనే సుల్తాన్ ఐశ్వర్యం గురించి ఎంత ప్రత్యేక కథనాలు నడిచేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. బ్రూనే సుల్తాన్ శరీరం ఎంత ప్రత్యేకమైనదో తెలియదుగానీ, సదరు సుల్తాన్ గారి టాయిలెట్ శుభ్రపరిచే టాయిలెట్ బ్రష్ కూడా బంగారంతో చెయ్యబడిందన్న వార్త ఊదరపెట్టేంతగా ప్రచారింపబడింది. ఇక సుల్తాన్ గారి సోదరుడికి 3.000 కార్లు, 360 మంది ప్రియురాళ్ళు[భార్యలు, ఉంపుడు గత్తెలతో కలిపి] ఉన్నారని, అదేదో ’అబ్బురం’ అనిపించేరీతిలో వార్తాకధనాలు చాలా వచ్చేవి. [భోగలాలసులకి, తెలిసీ తెలియని వయస్సులో ఉన్న ఆకతాయిలకి రోజుకొకరితో శృంగారం అన్న క్రేజుని, చెడుపట్ల మోజుని పుట్టించడం ఇక్కడ స్ట్రాటజీ.] 1992 తర్వాత సదరు సుల్తాన్ సోదరుడు, ఆర్ధికనష్టాల పాలయ్యి, కార్ల అమ్మకం దాకా దిగజారాడు. అంతలోనే గత సంవత్సరం అంటే 2008 లో ముడి చమురు ధరలు అమాంతం 140+ డాలర్లకు ఎగబాకినప్పుడు మళ్ళీ గుట్టుచప్పుడు కాకుండా కోలుకున్నాడు.

ఇక, ఏదేశమైనా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా పెరగటం, ముస్లింలకు గారాబం నడవటం మనకి బాగా తెలిసిందే! ఏకంగా కొన్నిదేశాలు, అవి బౌద్ధ దేశాలు కానివ్వండి, ఇతర మతాల దేశాలు కానివ్వండి, ముస్లిం దేశాలుగా పరిణామం చెందాయి. ప్రపంచంలో మిగిలిన దేశాలు సైతం ముడి చమురు నిల్వలు కలిగి ఉండగా, పెట్రోలియం ఉత్పత్తులును అమ్మగలిగి ఉండినా, కేవలం ఒపెక్ దేశాల అధిపత్యమే ప్రపంచాన్ని శాసించింది. ఇదీ నకిలీ కణికుల స్ట్రాటజీనే. బంగారం, వజ్రాల గనులు కలిగిన దక్షిణాఫ్రికా దేశం, తన విలువైన ఉత్పత్తులని, ముడి వస్తువులని, ఒపెక్ దేశాలు పెట్రోలు అమ్ముకున్నంత ’జబర్ధస్తీ’గా అమ్ముకోలేక పోయింది. అంతెందుకు? మనదేశంలో, మనరాష్ట్రంలో విలువైన వజ్రాలు, జాతి రాళ్ళు, గనులలోని ఇతర విలువైన ఖనిజాలు, చాలా మామూలుగా కొల్లగొట్టబడుతున్నాయి. తరలి పోతున్నాయి. రాష్ట్రానికి, దేశానికి మాత్రం దమ్మిడి ఆదాయం లేదు, రాదు. అచ్చంగా అలాగన్నమాట! అదే, ప్రపంచ ముడి చమురు మౌలిక ఉత్పత్తిలో 40% వాటా మాత్రమే కలిగి ఉన్న ఒపెక్ దేశాలు ప్రపంచానే శాసించాయి, శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, మీడియా, పెట్రోలు మైలేజ్ ఎక్కువ వచ్చే వాహన మోడళ్ళపై మోజు పడనివ్వదు. ఎంత మైలేజ్ వస్తేనేం, మోడల్ క్రేజ్ ముఖ్యం కదా! యువతలో ’ఫలానా మోడల్ పట్ల వెర్రెత్తిపోతుంది. దాని ముందు మైలేజ్ ఎక్కువ అన్న అంశమే పట్టించుకోవటం లేదు’, గట్రా ప్రచారాలతో హోరెత్తిస్తోంది. పెట్రోలు, డీజలుకు ప్రత్యామ్నాలు కనుగొనబడవు. అధవా ఎవరైనా ఔత్సాహికుడు అలాంటి ప్రత్యామ్నాయం కనుగొన్నా అది ప్రచారంలోకి రాదు. క్రమంగా కనుమరుగైపోతుంది. లేదా ఆ ఔత్సాహికుడు అనవసర గొడవల్లో చిక్కుకుని అల్లాడతాడు. మైలేజ్ ఎక్కువ వచ్చే వాహన మోడళ్ళు ప్రోత్సహించబడవు. అలాంటి వాహన తయారీ కోసం అన్వేషణ సైతం తక్కువే. సౌరశక్తి, వాయుశక్తి గట్రా ప్రకృతి వనరులు, సాంప్రదాయేతర వనరులు…. ఉహు! ఏవీ అభివృద్ధి కి నోచుకోవు. అవి చౌకంగా అందించబడే పద్దతుల మీద పరిశోధనలు ఎట్టిపరిస్థితులలో జరగవు.

ఇక పాకిస్తాన్, ప్రపంచంలోని అందరికీ చంకదిగని గారాబు బిడ్డ కావటం చూస్తునే ఉన్నాం. ఈ ముస్లిం గారాబానికి, పాక్ ప్రాబల్యానికి కారణం నకిలీ కణిక వ్యవస్థే! ముస్లింల మత ఛాందసం, తమకి బాగా ఉపయోగపడుతున్నది ఇందుకు ఒక కారణం. ముస్లిం యువకులకి మత మౌఢ్యం నూరిపోవటం, తద్వారా వాళ్ళని మానవ యంత్రాలుగా మలచి, ఏలాంటి పనినైనా సాధించటం, నేడు తాలిబన్ల రూపంలో చూస్తున్నాం. ముస్లింలకి బాల్యం నుండే ఈ రకపు మత మౌఢ్యాన్ని నూరిపోయటం చాలా సులభం. ముస్లిం పెద్దలకి మకార త్రయంలో కొన్నో, అన్నో, అందిస్తే ఆ ’పెద్దలు’ ఎంతటి కర్మకైనా పాల్పడతారన్నదీ వర్తమానం నిరూపించింది. ఇక పాక్ అంటే మాత్రం, నకిలీ కణికులకి మొదటి తరం నుండి నేటి 7వ తరం దాకా అందరికీ వల్లమాలిన అభిమానం, ప్రేమ, ఏకపదంగా చెప్పాలంటే పాకిస్తాన్ నకిలీ కణికులకి బహిః ప్రాణం.

కాబట్టే స్వాతంత్ర సమరం ముమ్మరంగా నడుస్తున్న సమయంలో పట్టుబట్టి పాకిస్తాన్ ని ఏర్పరుచుకోవటంలో, అంతకు ముందు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రయత్నం ఉంది. అతి జాగ్రత్తగా ఇండియాకి రెండు వైపులా రెండు పాకిస్తాన్ లని పెట్టారు. బ్రిటీషు రాజవంశమే ఇదంతా చేసి ఉండొచ్చు గాక. కానీ ఆ రాజవంశానికి తెలిసిందేమీ లేదు. దానిపరంగా ఆలోచిస్తే తనకి మళ్ళీ ఇండియాని కట్టబెట్టడానికి అనుకుంది. ఆ విధంగా బ్రిటీషు ప్రభుత్వాన్ని పైబొమ్మగా[over leaf reason] నకిలీ కణికుడు వాడుకున్నాడు. అదీ నకిలీ కణికుడి యొక్క గూఢచార ఆధిపత్యం!

ఇక ఈ రెండు పాకిస్తానులూ గాక, హైదరాబాదు నిజాం, ‘మధ్య పాకిస్తాన్’ అన్నాడు. ఈ విషయంలో సర్ధార్ పటేల్ కు భారతజాతి ఖచ్చితంగా ఋణపడి ఉంది. అప్పటికే లేడీ బాటన్ చేతిలో చిక్కో, లేక ఆ బ్లాక్ మెయిలింగ్ కి వెనుకంజవేసో, లేక ఇతరత్రా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ, నెహ్రూ కాశ్మీరు ఉదంతాన్ని ఐరాసకి నివేదించాడు. అది ఎంతగా కందిరీగల తుట్టె మాదిరి తయారయ్యిందో స్వాతంత్రానంతర భారత చరిత్ర నిరూపించింది. అప్పటికి ఐరాస పుట్టి రెండుమూడేళ్ళు కూడా పూర్తికాలేదు. దాని తాతవంటి నానాజాతి సమితి అప్పటికే ఘోరవైపల్యం చెందింది. మరే ఆశతో, నమ్మకంతో ఐరాసకి కాశ్మీరు సమస్య నివేదించినట్లు? అలాగే ఏ ఆశతో, ఏ నమ్మకంతో హైదరాబాద్ 7 వ నిజాం కూడా, హైదరాబాద్ సంస్థానపు విషయాన్ని ఐరాసకి నివేదించాడు? అతడు నివేదించీ నివేదించగానే గబుక్కున ఐరాస స్పందించింది ఎందుకు? ఇక మరిన్ని ఆటలకి తావివ్వకుండా, సర్ధార్ పటేల్, నెహ్రూ తో సైతం చెప్పకుండా పోలీసు చర్య చేపట్టాడు గనుకా, అందులో 48 గంటలు తిరక్కుండానే నిజాం కాలికి బుద్ది చెప్పి పాకిస్తాన్ కి పారిపోయాడు గనుకా, ఐరాసతో సహా అన్నిదేశాలూ నోరు మూసాయి గానీ లేకపోతే ఎంత యాగీ చేసి ఉండేవో?

నకిలీ కణికులకీ, ముస్లింలకీ ఏమిటి సంబంధం? నకిలీ కణికులకీ పాకిస్తాన్ కీ ఏమిటి సంబంధం? నకిలీ కణికులు పాక్ ని తమ స్థావరంగా [Den]గా వాడుకుంటున్నందునో, ఇతరత్రా మరో కారణం ఉందోగాని, పాక్ భూభాగం వారికి బహిఃప్రాణం. ఇక హైదరాబాద్ గడ్డ అయితే పంచప్రాణాలూ! USSR కుప్పకూలిపోయి, ముక్కలూ చెక్కలూ అయ్యాక, ఎక్కడ ఉన్న ఆయుధాలు[అణ్వస్త్రాలతో సహా] ఏమయిపోయాయో ఎవరికీ తెలియదు. పటిష్టమైన ప్రభుత్వమో, మరో వ్యవస్థో ఉంటే కదా ఏ లెక్కలైనా తేలేది, ఏ వివరమైనా బయటికొచ్చేది? అలాగే పాకిస్తాన్ లో కూడా!

ఆవిధంగా పాకిస్తాన్ భూభాగం, నకిలీ కణికుడికి ఏ కారణంగానైతే నేమి, బహిఃప్రాణమే. ఇక ముస్లింలకి మత మౌఢ్యం ఎక్కించటం సులభం గనుక, నకిలీ కణికుడికి ముస్లింలంటే అతిప్రేమ. కొంత జన్మతః ఇష్టమూ, ప్రాధన్యతా కూడా ఉన్నాయనుకొండి!

ఇక్కడ ముస్లింల మతమౌఢ్యం గురించి ఓ ఉదాహరణ చెబుతాను. ముస్లిం పిల్లల్ని, [చిన్ని కుర్రవాళ్ళని] గమనించండి. ఎక్కడైనా తొండ కన్పిస్తే రాళ్ళు విసిరి దాన్ని చంపేప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకూ చంపకుండా వదిలిపెట్టరు. జీవ హింస వద్దని వాళ్ళ పెద్దవాళ్ళెవరూ వాళ్ళని వారించరు. ఇతరులెవరైనా వారించినా ఆ పిల్లలు ఖాతరు చెయ్యరు. ఇంతకీ ముస్లిం పిల్లలు తొండలనెందుకు చంపప్రయత్నిస్తారయ్యా అంటే ఒకానొకప్పుడెప్పుడో, మహమ్మదు ప్రవక్త మనుమడు బావిలో దాగుంటే, తొండ తన మెడని పైకి క్రిందికి వూపుతూ శతృవులకు వారి జాడ చెప్పిందట. దాంతో శతృసైనికులు వాళ్ళని చంపేసారట. అందుచేత, ప్రతీకారంగా ముస్లిం పిల్లలు తొండలని చంపుతారు. అది, కనీసం తమ ప్రవక్త మనుమణ్ణి చంపిన శతృవుల వారసులని చంపడం కూడా కాదు. సమర్ధనీయం కాకపోయినా, కనీసం అది ప్రతీకారేచ్ఛ అనన్నా అనుకోవచ్చు. ఇది అలాంటిది కూడా కాదు. అమాయక ప్రాణి హింస! తొండ దాని శారీరక స్వభావ సిద్దంగా మెడపైకి క్రిందికీ వూపుతుంది. అదీగాక వందల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పబడే సంఘటన! నిజంగా జరిగిందో లేదో! ఇప్పటికీ పురుగులేరుకు తినే ఆ చిన్ని ప్రాణుల్ని చంపాలా? ఎక్కడో సౌదీ అరేబియాలోనో, ఆ చుట్టుప్రక్కలో జరిగిన గతం, అందులో ప్రచారం ఎంతో తెలియని గతం, కానీ ఆ ప్రకారం మాత్రం ముస్లిం పిల్లలు తొండల్ని రాళ్ళతో కొట్టిమరీ చంపుతారు, ముస్లిం పెద్దలూ వారించరు. అదీ వారి మౌఢ్యం! అసలయినా మనుష్యుల్లో సగభాగమైన సాటి మనిషి, ‘స్త్రీ’నే మనిషిగా గుర్తించని, గౌరవించని ముస్లింలు, ఇక ప్రాణుల్ని ఏపాటి గుర్తిస్తారూ, గౌరవిస్తారు? వారి మౌఢ్యం ఆపాటిది గనుకనే, తాలిబాన్లను తయారు చేయటం బిన్ లాడెన్ కైనా, అతడి వెనుక ఉన్న వారికైనా సాధ్యమైంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

Madam,

CIA never under Pentagon, and it has its own HQ building at Langley, Virginia

ఇది నేను నాలుగో సారి కామెంట్ రాయడానికి ట్రై చెయ్యడం, ఈ పోస్ట్ వచ్చిన దగ్గరనుండీ కామెంట్ రాయడానికి ప్రయత్నించడం, ఏదో ఎర్రర్ రావడం, మాళ్ళీ ట్రై చేద్దామని మూసెయ్యడం. చివరికి రాద్దామనుకున్న కామెంట్ మర్చిపోయాను. కానీ కామెంట్ రాయలేకపోయానన్న బాధ అట్లే ఉండిపోయి రాస్తున్నా. ఎవరికన్నా అతీంద్రియ శక్తులుంటే, నా కామెంట్ గుర్తొచ్చేట్టు చూడండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu