కార్పోరేట్ వ్యాపార సంస్థల్ని అనుచర వర్గంగా, సిఐఏ ఐఎస్ ఐ వంటి ఆయా దేశాల నిఘా సంస్థల్ని సహచర వర్గంగా.... కలిగి ఉన్న, తరతరాలుగా గూఢచర్యం నెఱుపుతున్న నకిలీ కణిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగిస్తున్నది, ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బుగా మారుస్తున్న దోపిడినే!

ఈ గూఢచర్యాన్నే.... పాలనా యంత్రాంగంలో రెడ్ టేపిజం అనీ, పాలక వర్గంలో రాజకీయమనీ, అధికార వర్గంలో అవినీతి అనీ, వ్యాపార వర్గాల్లో కార్పోరేటిజమ్ అనీ, మాఫియా అనీ, మతోన్మాదమనీ, రకరకాల నేపధ్యాలలో రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. అన్నిటిలో ఉన్నవి అవే పది స్ట్రాటజీలు! నకిలీ కణిక అనువంశీయులకు తెలిసింది అంతే!

అయితే.... ఈ గూఢచర్యంతో మిళితమైన వ్యాపారం, కార్ఫోరేటిజం లతో ‘పేదలు మరింత పేదవాళ్ళవ్వటం, ధనికులు మరింత ధనికులవ్వటం’ అన్నది మాత్రం అనులోమాను పాతంలో పెరుగుతూ పోతోంది. కూలీ, తోపుడు బళ్ళమీద చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళల్లో, చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే - ఇంటి యజమాని తాగుడు వ్యసనపూరితుడైతే ఇక ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశమే ఉండదు. తల్లీ పిల్లల రెక్కల కష్టం, బ్రతుకు గడవటానికే సరిపోతుంది. అలాంటి కుటుంబాల నుండి పిల్లలు చదువుకొని పైకి రావటం, ఆర్దిక స్థాయి పెరగటం అంటే - అసాధ్యం కాదు గానీ, కష్ట సాధ్యం!

ఇక ఇంటి యజమాని వ్యసనపరుడు కాకపోయినా కూడా.... వయస్సు, శరీర ధృఢత్వం ఉన్నన్ని సంవత్సరాలూ బాగా కష్టపడతాడు. అయితే వరసగా పనిచేస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతుంటాడు. ఒకసారి అనారోగ్యం బారినపడ్డారా, ఇక ఆ కుటుంబపు స్థితి తలక్రిందులై పోతుంది.

నంబూరు పల్లెలో ఉన్నప్పుడూ, హైదరాబాద్ నానల్ నగర్ లో ఉన్నప్పుడూ కూడా .... ఇలా, సంవత్సరాల పాటు ఒంటి చేత్తో కుటుంబాన్ని పోషించే ప్రయత్నంలో కూలీ పనులతో కాయకష్టం చేస్తూ, దానికి తగినంతగా ఆహారపు అండలేక, ఎముకలు గుల్లయి పోగా, అనారోగ్యం పాలైన వాళ్ళని చూశాను.

ఇవేవీ అవగాహన లేని ఆ కుటుంబాల వాళ్ళు, "మా ఇంటాయనకి ఆరోగ్యం బావున్నప్పుడు మాకు ఏ లోటూ ఉండేది కాదక్కా! ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాగుండక, పనికిపోవట్లా! ఎక్కళ్ళేని డబ్బు ఆసుపత్రులకే చాలట్లా" అని వాపోయిన మహిళల్నీ, వాళ్ళ జీవన స్థితిగతుల్నీ దగ్గరి నుండి పరిశీలించాను.

కుటుంబం పట్ల బాధ్యత తోనూ, కుటుంబ సభ్యుల మీద ప్రేమతోనూ, వాళ్ల అభివృద్ది కోసం అహర్నిశలూ కష్టపడుతూ, దానికి తగినంత పోషణ లేక కృశించిన పేద గృహస్థులని స్వయంగా చూశాను. ఆర్దికంగా కొంత పైస్థాయికి ఎదిగిన మధ్యతరగతి వాళ్లు కూడా, ఆ స్థితికి చేరటానికి.... కుటుంబ జీవితాన్ని, కనీస విశ్రాంతి వినోదాలని త్యాగం చేయటం పరిశీలించాను. అందరిదీ ఇదే స్థితి అనను గానీ, ఎక్కువమందిది ఇదే స్థితి అని చెప్పగలను.

ఇక ప్రభుత్వమే ఈ కుట్రలో భాగస్వామియై ప్రజలని దోపిడికి గురి చేస్తోందనటానికి గతంలోనూ, ఇప్పుడూ దృష్టాంతాలు కొకొల్లలుగా ఉన్నాయి.

ఒక ఉదాహరణ చూడండి. 1980 వ దశకంలో... అప్పట్లో ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హఠాత్తుగా అతడికి ఓ రోజు తెల్లవారు ఝామున [అతడి మాటల్లో బ్రహ్మ ముహుర్తం!] ఓ బ్రహ్మండమైన ‘ఐడియా’ వచ్చింది. దాంతో అతడు రాష్ట్రంలోని ద్విచక్ర వాహన దారులంతా శిరస్త్రాణం [హెల్మెట్] ధరించాలంటూ ఆర్డరు వేసేసాడు. ఆ బ్రహ్మముహుర్తంలో అతడికి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి గురించి తట్టిందట, ప్రజల క్షేమ శ్రేయస్సుల మీద శ్రద్దతో సదరు జీవో వేసేసాడు.

ప్రజల మీద అతడికున్న శ్రద్దా సక్తుల సంగతేమో గానీ, ఇక్కడ బహు గమ్మతైన విషయం ఒకటుంది. అతడికి ఒకానొక బ్రహ్మముహుర్తంలో ఇలాంటి ఆలోచన వస్తుందన్న విషయం, కేవలం స్టడ్స్ హెల్మెట్ తయారీ కంపెనీ మాత్రమే పసిగట్టగలిగింది!? దాంతో ఎన్టీఆర్ నిర్ణయం తర్వాత, మార్కెట్ లో వెల్లువెత్తిన డిమాండ్ ని, స్టడ్స్ కంపెనీ మాత్రమే అందిపుచ్చుకోగలిగింది. అందునా హెల్మెట్ ధారణకి నిర్దిష్ట గడువు నిర్ణయించి, ఆ తేదీ దాటితే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానా విధిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో హెల్మెట్లకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది. బ్లాకులో అమ్మకాలు కూడా జరిగాయి.

ఇతర కంపెనీలు ఈ పరిణామానికి సిద్దపడి లేక పోవటంతో, పెద్దగా మార్కెట్ ని దక్కించుకోలేకపోయాయి. హడావుడిగా సరుకు దించినా, స్టడ్స్ కి ఇచ్చిన పోటీ తక్కువే! ఎన్టీఆర్ అనే రాజకీయ నటుడికి ‘సీన్’ ఇచ్చిన దర్శకుడు రామోజీరావుతో, స్టడ్స్ కంపెనీ లాలూచీ పడితే చాలు. బ్రహ్మముహుర్తంలో ‘ఐడియాలు’ వస్తాయి, వ్యాపారాలు నడుస్తాయి.

ఇప్పుడున్న ఈ పాటి అవగాహన కూడా ఆరోజు ప్రజలకి లేదు. మీడియాని బాగా నమ్మేవాళ్ళు. ఇంతగా మీడియా నిజరూపం అప్పుడు బహిర్గత పడలేదు. దాంతో ఎవరూ అనుమానించలేదు గానీ, ఒక్క కలం పోటుతో, భారీ మొత్తంతో స్టడ్స్ కంపెనీ నుండి ఎన్టీఆర్ కీ, నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, ధన ప్రవాహం నడిచింది.

ఇక్కడ ఓ విషయం ప్రస్తావిస్తాను. ఎన్టీఆర్ పుట్టుకతో నటుడు. రాజకీయుడు కాదు. కాబట్టే అప్పుడప్పుడూ.... ఈ రాజకీయ దర్శకుడూ, నకిలీ కణిక అనువంశీయ గూఢచార వ్యవస్థలో కీలక వ్యక్తీ అయిన, రామోజీరావు పట్ల అవిధేయత కూడా చూపేవాడు. అలాంటప్పుడు.... రామోజీరావు, ఎన్టీఆర్ ని నాలుగు పీకి కూర్చోబెట్టేవాడు. కాకపోతే అవి భౌతిక దెబ్బలు గాక, స్ట్రాటజీ పరమైన దెబ్బలై ఉండేవి.

అలాంటిదే - ఓ సారి ఎన్టీఆర్ కు చెందిన రామకృష్ణా స్టూడియోలో మెటడోర్ వ్యానులో బస్తాల్లో డబ్బు కట్టలు దొరికటం! అప్పట్లో ఓ రోజు ఉదయాన్నే ఈనాడు తెరిస్తే... పేపర్లో పెద్దచ్చరాల్లో ప్రచురింపబడిన వార్త ఇది! ‘శివాజీ’ సినిమాలోనూ, ‘బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లోనూ చూసినట్లు ఏ ట్రిక్కులు ప్లే చేసారో గానీ, భారీ మొత్తంలో డబ్బు బయటపడి, ఫోటోలతో సహా పేపరుకెక్కింది. అచ్చం ఇప్పుడు హరిబాబు & చంద్రబాబుల ఏడుకోట్ల మాదిరిగానే, అప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ డబ్బు తనది కాదన్నాడు.

‘పైకి నవ్వుతూ నాది కాదని, ఇంటికెళ్ళి ఏడ్చుకుని ఉంటాడని’ అప్పట్లో జోకులు కూడా పేలాయి. అసలుకే ఎన్టీఆర్, ఒకో కొడుకుకీ కనీసం 200 కోట్ల ఆస్థి కట్టబెట్టాలని కంకణం కట్టుకున్నాడని అప్పట్లో ఓ ప్రచారం ఉండేది.

స్టడ్స్ కంపెనీలతో లాలూచీలు అది నిజమేనని చెప్పకనే చెప్పాయి. అలాంటి అవినితేదీ లేనట్లయితే...కేవలం ముఖ్యమంత్రిగా వాహన చోదకుల క్షేమమే లక్ష్యమై ఉంటే - శిరస్రాణధారణకు రెండువారాల గడువులుండవు. [మరో వారం పొడిగించారు లెండి.] రెండో మూడో నెలలు గడువిచ్చినట్లయితే స్టడ్స్ కి మాత్రమే వ్యాపారం పండేది కాదు. అంతేగాక ఆరునెలలు తిరగక ముందే, సదరు జీవో అమలు అటకెక్కి పోయేది కాదు. కాబట్టి ఎన్టీఆర్ ప్రభుత్వ శ్రద్ద, శిరస్త్రాణాలు కొనిపించటం మీద మాత్రమే అన్నది, ఆ విధంగా నిరూపించబడింది.

ఇక ఈ విషయం వదిలేసి మళ్ళీ కార్పోరేట్ వ్యాపార దోపిడి దగ్గరికి తిరిగి వద్దాం. అయోడైడ్ సాల్ట్! అయోడిన్ లోపం వలన ధైరాయిడ్ సమస్యలు వస్తాయి కాబట్టి, ఉప్పులో అయోడిన్ కలిపి అమ్మాలని, అన్ అయోడైడ్ ఉప్పు అమ్మరాదని ప్రభుత్వం ‘రూల్’ పాస్ చేసింది. అప్పుటి వరకూ ఉప్పు పండించే రైతుల వ్యాపారవకాశాలు స్వేచ్ఛగా ఉండేవి. ఉప్పు అమ్ముకుని సాధారణ కుటుంబాలేన్నో బ్రతికేవి. దెబ్బతో ఉప్పు రైతుల మార్కెట్ అవకాశాలు కేవలం కార్ఫోరేట్ కంపెనీలకి పరిమితమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఉప్పు పొలాలు కార్పోరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయోమో! బండి మీద పోసుకుని ఉప్పమ్మ వచ్చే వారి ఉపాధి అవకాశాలు పోయాయి.

కార్ఫోరేట్ కంపెనీలు అన్నపూర్ణా[బిర్లా కుటుంబాలు], టాటా, కెప్టెన్ కుక్, ప్రియ గట్రాలు మార్కెట్లోకి వచ్చాయి. దైనందిన ఆహారంలో ఉప్పు తప్పనిసరి గనక, వ్యాపారం భారీ మొత్తంతో ఉంటుంది. చౌకధరల దుకాణాలలో ఇదే అయోడైడ్ ఉప్పు కిలో నాలుగైదు రూపాయలకు అమ్మేవారు. ఇప్పుడు అదీ అమ్మటం లేదు.

ఒకప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం, ఉప్పు మీద పన్ను వేసినందుకు, బాపూ నాయకత్వంలో ప్రజలు గర్జించారు. ప్రభుత్వాన్ని గడగడలాడించారు. పిడికెడు ఉప్పు స్వాతంత్రాన్ని తెచ్చిపెడుతుందంటే నవ్విన బ్రిటీష్ వాళ్ళు, దండి సత్యాగ్రహానికి కదలిన దండుని చూసి దడుచుకున్నారు.

దండి యాత్ర స్వాతంత్ర సమర చరిత్రలోనే అపూర్వమైనది, స్ఫూర్తిదాయకమైనది. అలాంటి భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం కంటే హేయంగా ఉన్నాయి. ఆనాటి భారతీయులతో పోలిస్తే ఈనాటి భారతీయులు, దోపిడిని మామూలుగా ఒప్పుకునేంత తామసంతో ఉన్నారు. దానికి తోడు, కార్ఫోరేట్ కంపెనీలు, తమ వాణిజ్య ప్రకటనలతో ప్రజలకు ఎన్ని మాయా మోహాలు, మోజులు కల్పిస్తాయంటే - సదరు కార్ఫోరేట్ ఉప్పులు తింటే పిల్లలకి జ్ఞాపకశక్తి అమాంతం పెరిగిపోతుందనీ, ఠక్కున ఐఏఎస్ అధికారులై పోతారనీ అన్నంతగా!

దీనికి కొసమెరుపు ఏమిటంటే - రెండేళ్ళ క్రితం అమెరికా లో, నిపుణుల బృందం - అయోడిన్ ఉప్పు వాడకానికీ, గతంలో చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలకీ సంబంధం లేదని తేల్చారు. పైగా తమ వ్యాపారం కోసం శాస్త్రవేత్తలనీ, ప్రభుత్వాలనీ కూడా, ఈ రకమైన ఆరోగ్య నివేదికలు ఇవ్వాల్సిందిగా, ప్రకటించాల్సిందిగా కార్ఫోరేట్ కంపెనీలు ప్రభావపరచాయని ముక్తాయించారు. ఆ జాబితాలో అయోడైడ్ ఉప్పుతో పాటు మరికొన్ని అంశాలూ ఉన్నాయి.

ఇదీ.... కార్ఫోరేటిజం నిర్వహించే వ్యవస్థీకృత దోపిడి! ఏది సత్యమో ప్రజలకి అర్ధం కానివ్వని దోపిడి! పిల్లల్ని కాపాడాల్సిన తల్లిదండ్రులే పసివాళ్ళని దోపిడి చేస్తే, వాళ్ళకి దిక్కెవరూ ఉండరు, దైవం తప్ప! అలాగే ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వాళ్ళని దగా చేస్తే, ప్రజలకీ దిక్కుండదు. మద్యపు వ్యాపారంలో తలమునకలుగా మునిగి, ఆదాయం కోసం ఏదారైనా తొక్కే ప్రభుత్వాన్ని చూశాక.... ఇది మన మేలు కోరే ప్రభుత్వం అనే భరోసాని కోల్పోయాక.... అది చెప్పే నివేదికలని, ఇచ్చే ప్రకటనలని, జారీ చేసే ఆదేశాలని, ఏమని నమ్మగలం?

కార్ఫోరేట్ కంపెనీలతో కుమ్మక్కై, భూగర్భ సంపదని దోచి పెడుతున్న ప్రభుత్వాధినేతలు, అదే కార్పోరేట్ కంపెనీలతో కుమ్మక్కై ఎలాంటి చట్టాలనైనా చేస్తారు. అదే ఇప్పుడు చూస్తున్నాం!

ఇక ప్రభుత్వ సహకారం సంగతి ప్రక్కన బెడితే....కార్పోరేట్ వ్యాపారంలోని మరికొన్ని కోణాలని చూద్దాం!

తమ వ్యాపారం కోసం కార్పోరేట్ కంపెనీలు ప్రజలలో ఎన్ని మోజులు పుట్టిస్తాయో, వాటిని మీడియా ఎంత ఇతోధికంగా [పెయిడ్ ఆర్టికల్స్ సాక్షిగా] ప్రచారిస్తుందో ఇప్పుడు మనందరం చూస్తున్నదే!

ఆరునెలల వయస్సులో పిల్లలకి అన్నప్రాశన చెయ్యటం మన సాంప్రదాయం. అప్పటి నుండీ పిల్లలకి ఘనాహారం ఇస్తుంటాము. ఒకప్పుడు గుజ్జన గుళ్ళు పేరుతో [ఈ పేరుతో చిన్నారుల ఆట కూడా ఉందని విన్నాను.] బియ్యమూ, కందిపప్పు, పొట్టు తీసిన పెసర పప్పు వేరువేరుగా దోరగా వేయించి, సన్నని రవ్వ చేసి, జీలకర్రా ఉప్పు కలిపి ఉడికించి, నెయ్యితో కలిపి మెత్తగా చేసి, పిల్లలకి తినిపిస్తారు. ఒకోసారి జీలకర్రా ఉప్పు బదులుగా, పాలూ చక్కెరా కలిపి తినిపిస్తారు. మొదట్లో తిరస్కరించినా, పిల్లలు తర్వాత ఇష్టంగా తింటారు. క్రమంగా గుజ్జన గుళ్ళులో, వేయించిన లేక ఉడికించిన కూరగాయ ముక్కల్ని [వంకాయ, బీరకాయ టమాటో గట్రాలు] కలుపుతూ, సంవత్సరం తిరిగే సరికల్లా పిల్లలకి అన్నీ అలవాటు చేస్తారు.

ఇలా ఘనాహారానికి అలవాటు పడిన పిల్లలు, పెద్దయ్యాక కూరలు తినటానికి మారాం చెయ్యరు. ఇది మా పాపతో నాకు స్వానుభవం. మా ఇంట్లో నా చిన్నప్పటి నుండీ, మా చిన్నమ్మల పిల్లలతో చూసిన అనుభవం కూడా!

ఇక ఈ గుజ్జన గుళ్ళు స్థానే, కార్పోరేట్ కంపెనీలు ఫారెక్సులూ, సెరిలాక్ లూ ప్రవేశపెట్టాయి. ముద్దులు మూటగట్టే బొద్దుపాపాయిల నవ్వులతో, ఆకర్షణీయమైన వారి వాణిజ్య ప్రకటనలు ఏ తల్లిదండ్రులనైనా ఊరిస్తాయి. అయితే, ఆయా ఘనాహారాలతో, తర్వాత సంవత్సరాల్లో, పిల్లలు ఊబకాయం [ఓబేసిటి]తో బాధపడటం, చాలామందిలో సంభవిస్తొందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ నిజాలు, ప్రచార హోరులో సామాన్య ప్రజలకు వినబడను కూడా వినబడవు. అంతంత మాత్రపు అదాయం కలవాళ్ళు కూడా, ఫారెక్సుల వెంటపడటం నేను పరిశీలించిన అంశమే!

ఓ ఉదాహరణ చెబుతాను. శ్రీశైలంలో మా క్రింది అంతస్థులో ఓ సెక్యూరిటి గార్డు కుటుంబం ఉండేది. తర్వాత రోజుల్లో వాళ్ళు మమ్మల్ని వేధించినా, తొలిరోజుల్లో సంబంధాలు బాగానే ఉండేవి. ఓ రోజు గుడికి వెళ్ళి వస్తుండగా, వాళ్ళ అబ్బాయి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఆరేడు నెలలుంటాయి.

"అయ్యో! చిన్నబాబు ఎందుకలా ఏడుస్తున్నాడు?" అంటూ సానుభూతిగా అడిగాము.

"షల్లాక్ అయిపోయింది సార్! షాపులో అడిగితే లేదన్నాడు. ఇప్పుడు సరుకులోడ్ వస్తే ఇస్తానన్నాడు. తేడానికి పోతున్నా" అన్నాడు.

మాకేమీ అర్ధం కాలేదు. షల్లాక్ అంటే - రెక్సిన్ ను అతకడానికి వండ్రగి వాళ్లు ఉపయోగించే ఓ రకమైన జిగురు! వివరాలడిగితే తెలిసిందేమిటంటే పిల్లవాడు ‘సెరి లాక్’ కోసం ఏడుస్తున్నాడు.

ఉత్పత్తి పేరు పలకటమే రానివాడికి, ప్రయోజనాలేం తెలుస్తాయి? కానీ టీవీలో, అందమైన పిల్లల, చురుకైన నవ్వుల, వాణిజ్య ప్రకటన మాత్రం ఆకర్శిస్తుంది. అది వాడితే తమ పిల్లలూ.... అంత అందంగా, చురుగ్గా పెరుగుతారని ఆశ! అదీ నట్టింట టీవీ పుట్టించే మోజుల ప్రభావం!

అలాంటిదే ప్రామ్, వాకర్ వంటి వస్తువుల వాడకం కూడా! వాకర్ లతో పిల్లలకి పసితనంలోనే, మెదడులో నమోదు కావాల్సిన, గురుత్వాకర్షక అనుభవాలు దూరం కావటం గురించి, గతటపాలలో వ్రాసాను. ఇక ప్రామ్! సినిమాలలో, టీవీలలో చూస్తే... ప్రామ్ లో కూర్చొని దిక్కులు చూసే పాపాయి ఎంతో ముద్దుగా ఉంటుంది. ఇంకా చిన్నపసిగుడ్డయితే... గుప్పిళ్ళు మూసుకుని, చేతులకి గ్లోవ్స్, కాళ్ళకి సాక్స్ వేసుకుని ప్రామ్ లో నిద్రించే చిన్నారి, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తల్లిదండ్రులు కబుర్లు చెప్పుకుంటూ ప్రామ్ తీసుకు వెళ్ళటం చూస్తే చాలా బాగుంటుంది. మోజు పడి కొనుక్కోవాలనిపిస్తుంది.

అయితే, తల్లి చేతుల్లో, తల్లి గుండెలకు దగ్గరగా ఎత్తుకోబడ్డ బిడ్డలో భద్రతా భావం ఉంటుంది. అలాంటి వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ధైర్యగుణం చూపుతారు. అదే ప్రామ్ లో షికార్లు తిరిగిన పిల్లల్లో ఈ లక్షణం తక్కువ. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకునే విషయం.

ఈ విధంగా కార్పోరేట్ కంపెనీలు, మీడియా మద్దతు [పెయిడ్ న్యూస్ లాంటి ఆర్టికల్స్]తో సృష్టిస్తున్న మోజుల సుడిగాలితో ‘వ్యాపారం’ చేస్తున్నారు అనుకుంటాము. కానీ అది పైకారణం[over leaf reason] మాత్రమే!

వ్యాపారం మాటున.. తల్లిగర్భంలో పిండంగా రూపుదిద్దుకునే టప్పుడు మందుల రూపంలో,
శిశువుగా తల్లి పొత్తిళ్లల్లోకి చేరేటప్పటికి బేబీ ప్రాడక్ట్ రూపంలో,
అడుగులేసే నాటికి వస్తువులతో,
‘అ ఆ’ లు నేర్చేనాటికి కార్పోరేట్ చదువులతో,
మనిషి మనుగడలోని ప్రతిదశలో తామసాన్ని పెంచిపోషించి, సత్వరజోగుణాల్ని నాశనం చేసే ప్రక్రియ నడుస్తోంది.
ఇది గూఢచర్యం.
ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వ్యవస్థ కార్పోరేటిజం ముసుగు మాటున నిర్వహిస్తున్న గూఢచర్యం.

కాబట్టే... సామాజిక శాస్త్రవేత్తలు గానీ, మానసిక విశ్లేషకులు గానీ, మనో విజ్ఞానవేత్తలు గానీ, ప్రభుత్వాలు గానీ, సర్వే సంస్థలు గానీ... ఏవీ ఈ విషయాన్ని ఫోకస్ చేయవు.

ఎందుకంటె - సత్త్వ గుణం ఆలోచన రేపుతుంది.
రజోగుణం తిరుగుబాటు చేయిస్తుంది.
అదే తమోగుణమైతే... చెప్పుచేతల్లో చెప్పినట్లు పడుండేటట్లు చేస్తుంది.
అందుకే నకిలీ కణిక వ్యవస్థ అన్ని రంగాల ద్వారా నిర్వహిస్తున్న ఈ కుట్రలో ప్రపంచవ్యాప్తంగా సామాన్యప్రజల మీద గురిపెట్టింది ‘తమో గుణ పూరితుల్ని చేయటమే!’

అప్పుడే ఇబ్బడిముబ్బడిగా శ్రామిక చీమలు దొరుకుతాయి మరి!

గమనించి చూడండి. ఆనాడు బ్రిటీష్ వాళ్ళు, మన దేశం నుండి ముడి సరుకు చౌకగా తీసుకుని [అదీ బలవంతాన], సామాన్య కార్మికుల చేత బండచాకిరి చేయించుకుని ఉత్పత్తిగా మార్చి, తిరిగి ఆ సరుకుని సామాన్య వినియోగదారులకి తము చెప్పిన అధిక ధరకు అమ్మేవాళ్ళు.

అదే ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న వ్యాపారమైనా! ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే కార్పోరేటిజం!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/jun/21/navya/21navya1&more=2010/jun/21/navya/navyamain&date=6/21/2010

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu