ఇప్పుడు ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తున్న మస్కిటో రిపెల్లెంట్ల వ్యాపారానికి, 30-35 సంవత్సరాల క్రితమే పునాదులు వేయబడ్డాయి. గత టపాలలో చెప్పిందే అయినా మరోసారి అది ప్రస్తావనార్హమే!

1975-80 లలో దేశంలో ఓ ప్రచారం హోరున ప్రాకింది. చైనీయులకి కప్పకాళ్ళతో చేసిన వంటకాలంటే ఎంతో ఇష్టమనీ, ఆరీత్యా మన దేశం నుండి చైనాకి కప్ప కాళ్ళు రహస్యంగా రవాణా అవుతున్నాయనీ! ఇలాంటి పుకార్లు పాకాయంటూ మీడియా, ఈ విషయానికి పరోక్ష ప్రచారం ఇచ్చింది. క్రమంగా ప్రత్యక్ష ప్రచారానికి దిగింది. [ఈ మధ్యకాలంలో ఆవేవో పాములు లక్షన్నర ధర పలికాయంటూ ఒక ప్రచారం వస్తోంది చూడండి, అలాగన్న మాట. ఆ ప్రచారపు ఆశతో జనాలు కనబడిన పాములనల్లా పట్టి చంపి అమ్మాలనుకుంటారు. వెరసి పాముల సంఖ్య తగ్గుతుంది.]

అడపాదడపా కప్పకాళ్ళలోడుతో ఉన్న లారీలు దేశంలో అక్కడా ఇక్కడా పట్టుబడ్డాయనే వార్తలు ప్రచురింపబడ్డాయి. కోల్ కతా[అప్పట్లో కలకత్తా]నుండి రోడ్డుమార్గం ద్వారా మియన్మార్ [అప్పట్లో బర్మా], బంగ్లా దేశ్ ల మీదుగా, చైనాకు కప్పకాళ్ళ దొంగరవాణా చేయబడుతున్నాయనే వార్తలు/పుకార్లు ప్రచారింపబడ్డాయి.

కమీషన్ పద్దతి తో కప్పకాళ్ళని కొనుగోలు చేసేందుకు ఏజంట్లు పల్లెలని అప్రోచ్ అవుతున్నారనీ, ఇదంతా చట్ట విరుద్దం గనకా, అడ్రసు గట్రాలు పైకి పొక్కకుండా పని చక్కబెట్టుకుంటున్నారనీ, కాబట్టి కమీషన్ ఏజంట్ల కోసం వెదకనవసరం లేకుండా వాళ్ళే గ్రామీణులని కలుసుకుంటున్నారనీ.... ఇలా రకరకాల ప్రచారాలు!

ఈ ప్రచారానికి హంగులద్దుతూ ‘ఎక్కడో ఎవరో’ ఇలాంటి వ్యాపారాలతో బాగా సంపాదించారనే వార్తలూ వినబడ్డాయి. నిజానికి దీని వెనక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల తాలూకూ గూఢచర్యమే! కాబట్టే అలాంటి అసత్య వార్తలకు మీడియా ఇతోధికంగా ప్రచారం ఇచ్చింది. వార్తాంశాల శీర్షికలు ఎలా ఉన్నా... లోపల మాత్రం ‘ఇదంతా నిజమే సుమా! కప్పకాళ్ళని సేకరిస్తే ఒక్క దెబ్బతో పెద్ద మొత్తంలో డబ్బు కళ్ళ చూడవచ్చేమో’ అనిపించేలా వ్రాయబడ్డాయి. దానికి తోడు, కప్పకాళ్ళ లోడుతో పట్టుబడ్డ లారీల వార్తలు ఫోటోలతో సహా వచ్చాయి.

ఎవరు ఎవరికి రవాణా చేస్తున్నారో వివరాలు తెలియలేదంటూ ముక్తాయించబడ్డాయి. వీటికి మరింత బలం చేకూర్చేందుకు, నాలుగైదు లారీలను అలాంటి లోడులతో నింపి, పట్టుబడించే సంఘటనలని నిర్వహించగల గూఢచర్య సామర్ధ్యం గురించి గానీ, స్ట్రాటజీల గురించి గానీ, సామాన్యులకి అవగాహన ఉండదు కదా! ఆనాటి ప్రభుత్వానికీ, నిఘా సంస్థలకీ ఆత్మరక్షణకే అధిక సమయం సరిపోయేది. గూఢచర్య పరంగా బలహీన స్థితే కాదు, అయోమయ స్థితి కూడాను. దాంతో మీడియా మద్దతుతో నిర్వహింపబడిన ఈ స్ట్రాటజీ వెనక గల కుట్ర, గుట్టు చప్పుడు గాకుండా నడిపింపబడింది.

ఆనాటికి మీడియాని కుట్రలో భాగస్వామ్యంగా ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు. ఊహించగలిగినా, నిరూపించలేని నిస్సహాయత కూడా ఉండేది. కాబట్టి యధేచ్ఛగానే, మీడియా ఈ కప్పకాళ్ళ ప్రచారాన్ని నిర్వహించింది. ఆనాటి పత్రికల ప్రచారాన్ని పరిశీలించినా, జ్ఞాపకం తెచ్చుకున్నా లేదా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నా ఈ విషయం మీకు మరింత స్పష్టపడగలదు.

ఇక, ఇంత పకడ్బందీగా ప్రచారాలు నడిచాక... కొంతమంది గ్రామీణులు దురాశతోనూ, వేరెవ్వరో తెగ డబ్బు సంపాదించారన్న భ్రమతోనూ, కాల్వల్లోనూ, మురుగు గుంటలలోనూ బ్రతికే కప్పల్ని వెదికి వేటాడి చంపారు. నగరాలు, పట్టణాల్లో కప్పల బెకబెక కర్ణకఠోరంగా ఉందన్న ఏహ్యత... ఒక దశలో అదో ట్రెండ్ గా మారింది. ఫలితంగా మురుగు నీటి గుంటల్లో రసాయనాలు కలిపి మరీ కప్పల్ని చంపారు.

పల్లెల్లో గ్రామీణుల కప్ప కాళ్ళ వ్యాపారం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు గానీ, ఈ ప్రచారల ఒరవడి అంతా చల్లారాక.... కొన్నేళ్ళు గడిచే సరికి కప్పల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వర్షం కురిసిన రాత్రుల్లో కప్పల సంగీతం మూగబోయింది. అది గమనించక ముందే, దోమల బెడద పెరిగిపోయింది. దోమలకు ప్రకృతి సహజ శతృవులైన కప్పలు అంతరించటంతో, మురికి నీటిపై దోమల లార్వాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

ఇంకేముంది? తిరిగి చూసేసరికి ఆల్ అవుట్, జెట్, టార్టాయిస్,కాస్పెర్.... గట్రా పేర్లతో మస్కిటో రిపెల్లెంట్లు మార్కెట్లో వెల్లువెత్తాయి.

పరిశీలించి చూస్తే... చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళి, ఆరుబయట మంచాలు వేసుకుని, చుక్కల్నీ చంద్రుణ్ణీ మబ్బుల సయ్యాటల్ని చూస్తూ, కబుర్లు చెప్పటం, అమ్మమ్మ తాతాయ్యల దగ్గర కథలు చెప్పించుకుంటూ నిద్రపోవటం.... ఇప్పుడు కష్ట సాధ్యం. అప్పుడు దోమల బెడద అంతగా ఉండేది కాదు. హాయిగా ఆరుబయట నిద్రపోయే వాళ్ళం. ఇప్పుడు? ఒక్క నిముషమైనా దోమల చేత ఇంజక్షన్లు పొడిపించుకోకుండా బయట గడపలేం!

ఇదేమాట మనం అంటే.... కుట్ర మద్దతుదారులూ, లేదా కుట్రదారుల చేత నియోగింపబడిన వాళ్ళు.... సుత్తి సిద్దాంతాలు చెబుతారు. "చెత్త పెరిగి దోమలు పెరిగాయనీ, దోమలకు రోగనిరోధక శక్తి పెరిగి పోతోందనీ, అందుకు సామాజిక శాస్త్రం ప్రకారం xyz కారణమనీ, లేదా xyz సిద్దాంతరీత్యా అంతేననీ!"

నిజానికి గత కాలంలోనూ మురికి గుంటలున్నాయి. పల్లెల్లో ఇళ్ళ ప్రక్కనే నైదిబ్బలూ, పశువుల పాకలూ కూడా ఉండేవి. అయినా ఇప్పటితో పోలిస్తే అప్పుడే దోమలు తక్కువ ఉండటమే ఇక్కడ వ్యాపార రహస్యం!

ఎందుకంటే - ఇప్పుడు కార్పోరేట్ వ్యాపారంలో గూఢచర్యం మిళితమైంది మరి! కాబట్టే... భవిష్యత్తులో అమలు జరపబోయే వ్యాపార వ్యూహాలకి పునాదుల వంటి కార్యాచరణ, దానికి మూడు నాలుగు దశాబ్దాల క్రితమే ఆచరణలోకి వస్తుంది. అంత ముందుగానే ప్రణాళికలు రచింపబడతాయి! ఇదే కార్పోరేటిజం!

నిజానికి ఈ కార్పోరేటిజం కి ఆద్యులు యూరోపియనులే! దానిలో యూరోపియనల నిర్ధయి కి, అమానుషత్వానికీ, గూఢచర్యాన్ని మిళితం చేసింది మాత్రం నకిలీ కణిక వ్యవస్థ! వివరంగా చెప్పాలంటే... ఒకప్పుడు యూరోపియనులు చేసే వ్యాపార దోపిడి పచ్చిగా ఉండేది. బహిరంగపడుతూ ఉండేది కూడా! నకిలీ కణిక వ్యవస్థ దానికి గూఢచర్యాన్ని జోడించాక, వ్యాపార దోపిడిలో ద్వంద్వాలు సృష్టించబడ్డాయి. దాంతో దోపిడికి పైకారణాలు [over leaf reasons] ఏర్పడ్డాయి.

దీనికి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

భారత దేశంలో ఈస్టిండియా కంపెనీతో సహా విదేశీ కంపెనీలు, వ్యాపారం కోసం భారత దేశం రావటం గురించి మనం చరిత్రలో చదువుకున్నాం. 1498లో వాస్కోడగామా అనే పోర్చుగీసు నావికుడు, కేరళలోని కళ్ళి కోటని చేరటంతో, భారత దేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టాడు. అతడి వెనకే ఇతరులూ వచ్చారు. అప్పట్లో కొందరు యూరోపియనులే, ఈ నావికుల మీద జోకులు వేసేవాళ్ళు. నావికులని, ఆయా దేశాల రాజులు ఆర్దిక సాయం చేసి, కొత్త దీవులనీ, దేశాలకి మార్గాలనీ కనిపెట్టెందుకు ప్రోత్సహిస్తున్నప్పుడు... సదరు నావికుల గురించి "సముద్రపు దొంగల గుంపులు దోపిడికి బయలు దేరాయి" అనే వాళ్ళు.

ఆ ‘ఎరా’లో యూరోపియనులు ఏ ప్రాంతానికి వెళ్ళినా[ఆస్ట్రేలియా, ఆఫ్రికా గట్రా] ఆయా దేశాలలో అంటురోగాలు, కొత్త జబ్బులు స్థానికులలో ప్రబలాయట. దాంతో స్థానికులలో అధికులు దుర్బలయ్యేవాళ్ళు. మరి కొందరు మరణించే వాళ్ళు. దాంతో పెద్దగా ప్రతిఘటన లేకుండానే, ఆ ప్రాంతాన్ని ఈ యూరప్ కంపెనీల వాళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక రకంగా చోటు ఖాళీ చేయించటం వంటిది. [ఆ పనిని ఇప్పుడు టెర్రరిజంతో చేస్తున్నారు. కాశ్మీరు, పాకిస్తాన్, ఆఫ్గాన్ లో లాగా!]

దానికి తోడు, అప్పట్లో ఆయా దేశాలలోని స్థానికుల దగ్గర ఆయుధాలు కత్తి డాలు, బాణాల వంటివే. యూరోపియన్ వ్యాపార దొంగల దగ్గర తుపాకులూ, మందుగుండూ ఉన్నాయి.

అప్పట్లో అయితే స్థానికులలో అంటురోగాలు ప్రబలటానికి కారణాలు, పాపం అప్పటి ప్రజలకి తెలియదు గానీ, ఆనాటి యూరోపియన్ కంపెనీల అమానుషత్వం తెలిసిన మనం ఆ కారణాలని ఊహించగలం కదా! ఆనాటి యూరోపియన్ కంపెనీల వారసులే నేటి కార్పోరేట్ కంపెనీలు! నిజానికి ఇప్పటికి అమెరికా వంటి దేశాలలో కార్పోరేట్ దిగ్గజాల మూలాలు ఇంగ్లండులో ఉన్నాయి. ఎన్నో కంపెనీల వేళ్ళు లండన్ లోనే కూరుకున్నాయి.

ఇంత నలుపు తమ క్రింద ఉంచుకుని, గురివింద గింజల వంటి ఈ యూరోపియన్ దేశాలు, ఇప్పుడు మానవ హక్కులంటూ గర్జించటం ఎంత హాస్యాస్పదం!?

సరే! ఇలా అంటు రోగాలు సృష్టించీ, ఆయుధాలు ప్రయోగించీ... వలస రాజ్యాలు స్థాపించారు. వాళ్ళు చేసిన వ్యాపార నిర్వాకం ఎంత మోసపూరితమంటే.... అప్పట్లో మన దేశంలో రైతులు, పొద్దునే చద్దన్నంలో పెరుగు వేసుకుని ఊరగాయో, ఉల్లిపాయో నంజుకుని తినేసి, పొలం బాట పట్టేవాళ్ళు. అంత కఠోరశ్రమకి పెరుగన్నం అయితేనే నిలదొక్కు కోగలరు మరి!

అలా పొలాలకి వెళ్ళే రైతులకి, కూడళ్ళలో నిలబడి, గ్రామీణులకి విచిత్రంగా కనిపించే వేష భాషలతో యూరోపియన్ వ్యాపారులు ‘టీ’ ఆఫర్ చేసే వారట. చాలా రోజులు రైతులు స్పందించకపోయినా, ప్రతీరోజూ చూస్తే ఓ కుతుహలం వస్తుంది కదా! పదే పదే అదే ప్రచారం అన్న స్ట్రాటజీ అది! దానికే నకిలీ కణిక వ్యవస్థ మరింత మెరుగులు దిద్దింది.

కుతూహలం కొద్దీ కొన్నాళ్ళకి, కొందరు రైతులు టీ రుచి చూడటానికి ముందుకు వచ్చారు. ఎటూ ఉచితమే కదా! నాలుగు రోజులు వరసగా తాగితే, యాంత్రికంగా మరోసారి తాగాలనిపించటం టీ కాఫీలకి సహజం. లేకుంటే తలనొప్పి రావటం కద్దు. అందునా దానికి కొంచెం నల్లమందును కూడా తగిలిస్తే... ఇక వినియోగదారుడు కాస్తా వ్యసనపరుడు కావటం ఖాయం. టీ, కాఫీ, చాక్ లెట్, శీతల పానీయాలని మార్కెట్టలో ప్రవేశపెట్టిన తొలినాళ్ళలో, నల్లమందు కలిపారని, ఆయా సమయల్లో వదంతులు[?] వినబడటం, ఒకోసారి నిర్దారణ కావటమూ కూడా జరిగాయి.

ఏమైతేనేం... మెల్లిగా జనాలు అలవాటు పడ్డాక, ఉచితాలు ఎత్తివేయబడి ‘వెల’ అడగటం ప్రారంభమౌతుంది. ఉచితంగ పంపిణీ చేయటం అన్నది కూడా పెట్టుబడిలో ఓ భాగంగా లెక్కలేసుకుని, తమ ఉత్పత్తిని విక్రయించటమే ఇక్కడ స్ట్రాటజీ!

ముందు ఉచితం.
క్రమంగా అలవాటు!
ఆపైన వ్యసనం!!
ఇదే కార్పోరేట్ సూత్రం!!!

ఒక చమత్కారాన్ని చెప్పి ఈ టపా ముగిస్తాను.

గుబ్బిలాల గుంపుని ఇంగ్లీషులో ‘కాలనీ’ అంటారట.
బ్రిటీష్ వాళ్ల వలస రాజ్యాలని కూడా కాలనీలనే అంటారు. ఔచిత్య ప్రయోగం అంటే ఇదేనేమో!

చిలుకల సముహన్ని ‘కంపెనీ’ అంటారట. ఒకప్పుడు వేశ్యా గృహన్ని ‘కంపెనీ’ అనేవాళ్ళు. ఇప్పుడూ అదే పేరు!
కార్పోరేట్ వ్యాపార సంస్థల్ని కూడా కంపెనీలనే అనటం చమత్కారమే!

కోతుల గుంపుని ‘ట్రూప్’ అంటారట.
నాట్య కళాకారుల గుంపుని డాన్స్ ట్రూప్ అనీ, నాటక బృందాన్ని డ్రామా ట్రూప్ అనే అనటం ఆ కళాకారులని గౌరవించటమా, వెక్కిరించటమా!
ఇంగ్లీషు వాళ్లకే తెలియాలి.

గుడ్లగూబల గుంపుని ‘పార్లమెంట్’ అంటారట.
ఇది మాత్రం బహుచక్కని పేరే!
ప్రజాస్వామ్యం సాక్షిగా... ఏ దేశంలోనైనా ప్రస్తుతం పార్లమెంటులలో ఉన్నది గుడ్ల గూబలే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

మీరు "హింసించే 23 వ రాజు పులకేసి" సినిమా చూడండి. నటుడు వడివేలు అందులో బ్రిటీషు వాల్లు మందు (లిక్కర్) ను భారతీయులకు అలవాటు చేసే సన్నివేశాలున్నాయి . అందుకు వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీ లు కూడా.
హాలీఉడ్ సినిమా WANTED ( ఏంజలీనాజోలి) చూడండి తన ఏజెంట్లకు అస్సైన్మెంట్లు ఎలా ఇస్తారో చూపించాడు . ఇక మన రాజధాని ( హైదరాబాద్ ) ఇరానీ చాయ్ కి ప్రసిద్ది . పొద్దుటినుండి సాయంత్రం దాకా అవి కిటకిటలాడుతూనే ఉంటాయి . అక్కడ అమ్మే టీ లో భంగు ( ఇదో మత్తుపదార్ధం ) కలుపుతారట. వాటిలో ప్రతివాడు రోజుకి 7 లేదా 8 కప్పుల టీ తాగడం సాధారణం.

My God..

Amma,okasari idi chudandi
http://mynampatim.blogspot.com/2010/06/blog-post_17.html

మొదటి అజ్ఞాత గారు: ఆ సినిమాలు చూశాక అప్పుడు నా అభిప్రాయం చెప్తానండి. ఇరానీ ఛాయ్ గురించి నేనూ విని ఉన్నానండి.

రామ నరసింహ గారు: :)

రెండవ అజ్ఞాత గారు: మంచి టపా చూపించారు. ఇంకా పీవీజీ మీదకు నెపం నెట్టలేదేమా అని అనుకుంటున్నాను. అంతలోనే ఆ లాహోర్ వాలా, మాజీ విదేశాంగ కార్యదర్శి చెప్పనే చెప్పాడు. నెనర్లు!:)

I am very fond of Irani Chay.

But..I never took more than 2 or 3 cups in a

day.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu