ఏదైనా ఒక కార్పోరేట్ కంపెనీ తాలూకూ ఉత్పత్తి, మార్కెట్లోకి ప్రవేశపెట్టబడినప్పుడు, సదరు కార్పోరేట్ కంపెనీల మధ్య ఉన్న నెట్ వర్క్ రీత్యా నడిచే, పరస్పర సహాయ సహకారాలని గమనిస్తే.... తెలుగులో మన పెద్దలు చెప్పిన ‘దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారన్న’ సామెత చక్కగా సరి పోలుతుంది.

ఇప్పటికే, కంటికి కనిపిస్తూ, దందాగిరి చేసే నేరస్తులూ, రియల్ ఎస్టేట్ మాఫియా గట్రలు, వాళ్ళల్లో వాళ్ళు ప్రదేశాలని పంచుకోవటం, ‘మీటింగు’లు పెట్టుకుని అగ్రిమెంట్లు సెటిల్ మెంట్లూ చేసుకోవటం, బెదిరించి భయపెట్టి చావగొట్టి ప్రజల నుండి పైసలు వసూలు చేసుకోవటం, చూస్తూనే ఉన్నాము. చివరికి ముష్టి ఎత్తుకునే బిచ్చగాళ్ళు కూడా, కాలనీలని పంచుకుంటారని విని ఉన్నాము. అసలు ముష్టి వాళ్ళని కూడా నియంత్రిస్తూ, వాళ్ళ దగ్గర మామూళ్ళు వసూలు చేసుకోవటం వంటి చర్యలకు పాల్పడే నేరవ్యవస్థ ఉందని కూడా వినబడుతుంది.

కార్పోరేట్ కంపెనీల తెరచాటున ఉంది కూడా అదే మాఫియా! మామూలు నేరగాళ్ళు కత్తులూ, తుపాకులూ పట్టుకు తిరిగితే... కార్పోరేట్ కంపెనీల అధినేతలూ, సీఈవో వంటి అధికారులూ, సూట్లేసుకు తిరుగుతారు.

పరిశీలించి చూస్తే.... వేల, లక్షల కోట్ల రూపాయల టర్నోవరు కలిగిన కార్పోరేట్ కంపెనీలు, ఒక నెట్ వర్క్ కలిగి ఉండటం ఎలా సాధ్యం? అందునా కొన్ని నియమాలని అనుసరించే నెట్ వర్క్, అత్యంత శక్తివంతమైన నెట్ వర్క్? ఎవరికి వారే అయితే, ఎప్పుడో ఒకప్పుడైనా, నియమాలని అతిక్రమించరా? వివాదాలు వెల్లువెత్తవా? ఒక బలమైన వ్యవస్థ లేదా వ్యక్తి దీన్నింతటినీ నియంత్రిస్తే [Control చేస్తే] తప్ప, ఇది సాధ్యం కాదు.

అలా నియంత్రించే వ్యవస్థనే ‘నకిలీ కణిక వ్యవస్థ’ అని పిలిచాను. వ్యక్తిని ‘నకిలీ కణిక అనువంశీయుడని’ చెప్పాను. ఈ కార్పోరేట్ దిగ్గజాలతో కూడిన వలయాన్నే ‘నెం.10 వర్గం’గా చెప్పాను.

ఇంత బలమైన గూఢచర్య వ్యవస్థ దీనివెనక లేకపోయినట్లయితే - ఒక కొత్త ఉత్పత్తి మార్కెట్టులోకి ప్రవేశించినప్పుడు, మిగిలిన పోటీ ఉత్పత్తిదారులు పోటీ ఇవ్వకుండా, తమ ఉత్పత్తుల అలభ్యతతో సహకరిస్తూ, తమ నెట్ వర్క్ నియమాలని తాము పాటిస్తుండ వచ్చుగాక, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?

ఈ పరిస్థితులనీ, దోపిడినీ ప్రభుత్వం ఎందుకు నియంత్రిచటం లేదు? అసలా ప్రయత్నమే ఎందుకు చేయటం లేదు? ఏ వస్తువు గురించైనా సరే డిమాండ్ - సప్లై స్థితిని పరిశీలిస్తూ, నియంత్రించాలి కదా?

ఒకప్పుడు ప్రభుత్వాలు, మార్కెట్టులో ఇలాంటి అసాధారణాలని గుర్తించేవి. ఛేదించేందుకు ప్రయత్నించేవి. అందుకే ఇందిరాగాంధీ నకిలీ కణికుల అనువంశీయులకి అంతగా బద్ద శత్రువయ్యింది. సాక్షాత్తూ రామోజీరావే, ఈ విషయం స్వయంగా వప్పుకుంటూ.... తాను [నాటి] కాంగ్రెస్ కి వ్యతిరేకినని, లిఖిత పూర్వకంగా చెప్పుకున్నాడు. కాకపోతే ‘ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలు, వారసుల్ని ప్రజల నెత్తిన రుద్దటాలు నచ్చక, పోరాడానన్న’ పైకారణాన్ని [over leaf reason] చూపెట్టాడు.

మరి ఇప్పుడు, ఈ ఇటలీ మహిళ గురించైతే.... అధిష్టానం ఆగ్రహంగా ఉందంటూ వ్రాస్తాడు... అది నియంతృత్వ పోకడ కాదు కాబోలు! ఇక ఆమె వారసుడు రాహుల్ గురించైతే ‘సొట్టబుగ్గల అందగాడనీ, అమ్మాయిల కలల రాకుమారుడనీ’ బూస్టప్ వ్రాస్తుంటాడు.

అంత పరిమాణంలో, రామోజీరావుకి, ఇందిరాగాంధీ పట్ల శతృత్వం ఎందుకంటే - పేదలని ధనికులు పీడించకుండా, వ్యాపార దోపిడి చేయకుండా ఉండేందుకు, నాడు ఆమె బ్యాంకుల్ని జాతీయం చేయటం ఒక కారణం. ఆనాడు ధనికుల ప్రధాన వ్యాపారం.... వడ్డీ వ్యాపారమే! ఇప్పుడూ అదే లెండి.

ఇక ఇందిరాగాంధీ హయాంలో.... బ్యాంకుల్ని జాతీయం చేసి పేదలకి ఋణ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తే,
ఈ ఇటలీ మహిళ హయాంలో.... బ్యాంకులే [ప్రభుత్వ, ప్రైవేట్] కాదు, సూక్ష్మ ఋణాలు ఇచ్చే సంస్థలు కూడా ‘రికవరీ అధికారుల’ పేరుతో గూండాలని నియమించుకుని మరీ, దందాగిరీ చెలాయిస్తున్నారు. దెబ్బతో పేదలు బ్యాంకులో ఋణాల మాట ఎప్పుడో మరిచిపోయారు. అదే బ్యాంకులు, కార్పోరేట్ కంపెనీల ఋణాలని, తిరిగిరాని ఖాతాల క్రింద రద్దు చేస్తున్నాయి.

ఈ విషయం ప్రక్కన బెడితే.... ప్రభుత్వం... కార్పోరేట్ కంపెనీలు [ఉత్పత్తి దారులు] కుమ్మకై, ప్రజలని దోచుకోకుండా, నల్ల బజారు విక్రయాలు నడవకుండా, డిమాండు - సప్లై పద్దతిని నియంత్రించాలి. ఆ పని ప్రస్తుత ప్రభుత్వం నూటికి నూరు శాతం చేయటం లేదు.

ఆహార నియంత్రణాధికారి [Food Controlar], Drug Controlar, Health Inspector, ఏ ఒక్కరూ, ప్రత్యక్ష కార్యరంగంలో పని చెయ్యటం లేదు. అధికారులూ, ఉద్యోగులూ, డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. జీత భత్యాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులూ అన్నీ నడుస్తాయి. పని మాత్రం జరగదు.

ఉదాహరణలు చూడండి....

సిమెంటు కంపెనీలు కుమ్మకై, కృత్రిమ కొరత సృష్టించి, ధర పెంచి, నల్ల బజారు అమ్మకాలు సైతం నిర్వహించినా, ప్రభుత్వం సినిమా చూస్తున్నట్లు చూసింది, చూస్తోంది. సిమెంట్ కంపెనీల వాళ్ళు చేసే మరో దోపిడి చెప్పమంటారా?

కుమ్మకై ధర బాగా పెంచుకుంటారు. దాంతో మధ్యతరగతి జనాలు.... స్వంత ఇంటి కలనీ, ఆకాంక్షనీ వదులుకొని గమ్మునున్నారనుకొండి. సిమెంటు అమ్మకాలు బాగా పడిపోతాయి. ఇక లాభం లేదనుకున్నప్పుడు, సిమెంటు కంపెనీ యజమానుల సిండికేట్, లోపాయకారిగా నిర్ణయాలు తీసుకుని ధర అమాంతం, ఆకర్షణీయంగా ఉండేటట్లుగా తగ్గిస్తాయి. అదే సమయంలో ఇసుకా, ఇనుము రేట్లు కూడా కొంచెం తగ్గుతాయి.

రూపాయి రూపాయి కూడబెట్టి, ఓ బెత్తెడు జాగా కొనుక్కుని, అద్దె ఇళ్ళ వెతలతో విసిగిపోయి, స్వంత ఇల్లు కట్టుకోవాలని గంపెడాశ పెట్టుకున్న సామాన్య ప్రజలు.... ఆశతోనూ, మళ్ళీ ధరలు పెరుగుతాయోమోనన్న ఆతృతతోనూ, లోన్లు తీసుకునీ, పొదుపు చేసి దాచుకున్న సొమ్ము బయటకు తీసి గృహనిర్మాణాలు చేపడతారు.

సిమెంట్ అమ్మకాలు ఊపందుకుంటాయి. దాంతో తమ అంచనాలకు తగినంతగా వ్యాపారం పెరిగాక, అప్పుడు కలిసికట్టుగా, అందరూ కలిసి సిమెంటు ధరలు పెంచేస్తారు. తదనుగుణంగా ఇసుకా, ఇనుమూ, పెయింట్లు అన్నిటి ధరలూ పెరుగుతాయి. ఆ విధమైన సంకేత భాష.... ఆయా ఉత్పత్తిదారుల, వ్యాపార వేత్తల మధ్య ఉంటుంది.

ఇక నిర్మాణపు పనులు చేపట్టిన సామాన్య ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది. సగంలో నిర్మాణం ఆపలేరు. ఆశ ఊరుకోదు. ఏదో తంటాలు పడి పూర్తి చేయమంటుంది. అంతేగాక, సగంలో నిర్మాణం వదిలేస్తే నష్టం వస్తుంది. అప్పటి వరకూ పెట్టిన ఖర్చు ఎటూ గాకుండా పోతుంది. సగంలో ఆగిన నిర్మాణం, త్వరగా శిధిలం అవుతుందన్న భయమూ ఉంటుంది.

ఇప్పుడు ఆపితే మళ్ళీ పునఃప్రారంభించలేమనీ, పూర్తి చెయ్యలేమనీ నిరాశ ఆవరిస్తుంది. అది వాస్తవం కూడాను! దాంతో మరింతగా అప్పులు చేసి, ఉన్న బంగారం తనఖా పెట్టి లేదా అమ్మి, నిర్మాణం పూర్తి చేస్తారు.

చాలాసార్లు ‘ఇంతవుతుందని మొదలు పెడితే రెట్టింపు ఖర్చయ్యింది. దాంతో పరిస్థితంతా తలక్రిందులయ్యింది. ఖర్చు అంచనాలకు మించిపోయింది’ అంటూ ఎంతోమంది నిట్టూర్చడం మనకి తెలిసిందే! చాలామందికి ఇదే స్వానుభవం కూడాను!

ఇది చాలా చాకచాక్యంగా జరుగుతున్న దోపిడి. పైకారణాలుగా "ఫలానా అందుకు సిమెంటు రేటు పెరిగింది. అంతర్జాతీయంగా ఫలానా సంఘటన జరగటంతో ఇలా అయ్యింది" అంటూ సొల్లు కబుర్లు మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రీ చెబుతారు.

ఇది ఒక్క సిమెంటు విషయంలోనే కాదు.... బియ్యం పప్పు మిల్లర్ల దగ్గరి నుండి, ఎన్నో వస్తువుల విషయంలో ఇలాంటి దోపిడీనే జరుగుతోంది.

ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకి.... కృత్రిమ కొరతల సృష్టి, కృత్రిమ డిమాండ్ సృష్టి, నల్ల బజారు అమ్మకాలు, వక్రమార్గాల ద్వారా పెంచుకునే అమ్మకాలు చెయ్యటం అంటే - ‘ప్రజలని చట్టబద్దంగా మోసం చెయ్యటం’ అని తెలియదా? వాటాలు పుచ్చుకుని, చట్టాలు చేసి మరీ, వ్యాపార దోపిడికి సహకరిస్తున్న ప్రభుత్వానికి.... స్వయంగా తామే వ్యాపారం చేస్తున్న ప్రభుత్వానికి.... తెలియదనుకుంటే, మనకి లోకజ్ఞానం తెలియదన్న మాటే!

మరి ఇదంతా మీడియాకి తెలియదా? మరైనా ప్రజలని కాపాడేందుకు గానీ, ప్రజల తరుపున పోరాడేందుకు గానీ, ప్రభుత్వాన్ని అధికారులని [చివరి దాకా] నిలదీసేందుకు గానీ, ఎందుకు ప్రయత్నించదు? ఒక రోజు వార్త వ్రాసేసి చేతులు దులుపు కుంటే సరిపోతుందా? అదేమంటే - సమస్యని ఎత్తి చూపటంలో తమ బాధ్యత తీరినట్లే నన్న కొత్త భాష్యాలు, మీడియా చెబుతోంది.

అలాగైతే... స్వాతంత్ర్య సమరం రోజుల్లో ఆనాటి పత్రికలు ‘స్వాతంత్ర్యం లేకపోవటంలోనే మనకిన్ని బాధలు!’ అంటూ సమస్యనెత్తి చూపి, ఊరికే ఉన్నాయా? ప్రజలకి అవగాహన కలిగించి, వారిలో పోరాట స్ఫూర్తి కలిగించి, స్వాతంత్ర సిద్ది జరిగే వరకూ, సమస్య పరిష్కరింపబడే వరకూ, ప్రజల కోసం పని చేసాయి కదా?

అవేవీ చేయవు గానీ, ఈనాటి మీడియా... ‘పత్రికాస్వేచ్ఛ, ప్రసార స్వేచ్ఛ’ అంటూ హక్కుల కోసం అరుస్తుంది. భాద్యతలు గుర్తుండవు గానీ, హక్కులు మాత్రం గుర్తుంటాయి. ఇంకా ఈ రెండేళ్ళ నుండి, మీడియా నవాబు రామోజీరావు, అంతగా అరవటం లేదు గానీ, గతంలో అయితే.... ‘బ్లాక్ బిల్లు, పత్రికాస్వేచ్ఛకు చిల్లు’ అంటూ గొంతు చించుకునే వాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

chala bavundi sir meeku telusa okka limestone mine kooda governmentdi eunduku ledu govt chetullo mining power ledu only rich chetullo vundi.India govt okka profitable mine run cheyyaledu waste. Even sand kooda private valle ammali.honest people meeru maro avtar kosam eduru choodali.Meeku manchi jaragali ani aasisthunna

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu