2006 లో, మేము గుంటూరులోని ఐబి కార్యాలయానికి వెళ్ళాము. రామోజీరావు మీద, 1992 లో మేమిచ్చిన ఫిర్యాదు, దానిపై వారి కార్యాలయ అధికారులు మా ఫ్యాక్టరీని సందర్శించడం, మేము 1995 లో ఐబి వారిని కలవటం గురించి వివరించి, మా మీద వ్యవస్థీకృత వేధింపుని గురించి ఫిర్యాదు ఇవ్వడానికి, కనీసం మా కేసు వివరాలు పైకి పంపమని విజ్ఞప్తి చేయడానికి వెళ్ళాము.

అక్కడి అధికారి, సాక్షాత్తూ రామోజీరావుకు వకాల్తా పుచ్చుకున్న న్యాయవాదిలా "ఎవరిని గురించి మీరు complaint చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు రామోజీరావు గురించి? He is a perfect business man you know!? ఇంత వరకూ ఒక్క Remark లేదు అతడిపైన" అన్నాడు.

వారం, పది రోజులు తిరిగే సరికి, ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి అవకతవకల గురించి నోరు విప్పాడు. ఆ విధంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, నెం.5 వర్గాల మధ్య సంభాషణ నడుస్తుంది. ఎలాగంటే - "రామోజీరావుని మీరు ఎలా claim చేయగలరు? on record అతడి మీద ఒక్క రిమార్కు లేదు. ’మచ్చలేని వ్యాపారవేత్త, మీడియా అధిపతి’గా అతడికి ఇమేజ్ ఉంది. ఎలా నిరూపించగలరు మమ్మల్ని?" - ఇదీ నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులు, సదరు ఐబి అధికారి ముఖతః విసిరిన సవాలు!

జవాబుగా "అయితే ఇది సరిపోతుందా?" అన్నట్లు, ఉండవల్లి నోట, రామోజీరావు మార్గదర్శిలో unclaimed డిపాజిట్లు ఉండటం దగ్గర నుండి అవకతవక వ్యవహారాలు బయటి కొచ్చాయి. ఏ చిట్ ఫండ్ వ్యాపారంలోనైనా, బ్యాంకులలోనైనా, తమది కాని డబ్బుని కూడా తమది అని ప్రకటించుకునే వారితో గొడవలుంటాయోమో గాని, ఈ డబ్బు మాది అని ఎవరూ ప్రకటించని వ్యవహారాలుంటాయా!? అంత వింతలతో పాటు మరెన్నో మార్గదర్శిలో బయటికొచ్చాయి. [ఇక ఆ ఒరవడిలో.... కంఫానీ నిధులు రామోజీరావు సంస్థల్లోకి మళ్ళటం తదితర వ్యవహారాలెన్నో బయటికొచ్చాయి, వస్తూనే ఉన్నాయి. రామోజీ ఫీల్మ్ సిటిలోని భూవివాదాలతో సహా!]

తమ అనుచరుడైన ఉండవల్లికి ఆ విధమైన అత్మహత్యాసదృశ్య అసైన్ మెంట్ ని తామో ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇచ్చుకోకపోతే ఏముంది? ’కన్నా?కాలా?’ స్ట్రాటజీలో భాగంగా మరింకో కష్టమేదో ముంచుకొస్తుంది. ’ఆ పొయ్యి కంటే ఈ పెనమే మేలు’ అనుకొని తమ అనుచరులకి అలాంటి ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు ఇచ్చుకోక తప్పదు.

అయితే, 2006 -07 లలో జరిగిన ఈ సంఘటనలలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, ’కన్నా?కాలా?’ స్ట్రాటజీని దాటి, సదరు అసైన్ మెంట్ కి తమవైన, తమకి నచ్చిన భాష్యం చెప్పుకున్నారు. అది - మార్గదర్శి వివాదాన్ని ఎత్తుకోవడం ద్వారా వై.యస్., ఉండవల్లి మాదృష్టిని ఆకర్శిస్తే... మేం అతణ్ణి అప్రోచ్ అయితే.... మాదగ్గర ఏయే రహస్యాలున్నాయో, వివరాలున్నాయో తెలుసుకోవచ్చు. నమ్మి మా అంతట మేం అప్రోచ్ అయితేనే ఎవరికైనా ఏమైనా చెబుతామన్నది వాళ్ళ అభిప్రాయం. అలా మాకుగా మేం ఉండవల్లిని, వై.యస్.ని నమ్మి అప్రోచ్ అయితే మొత్తం విని, తమకు కావలసిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకుని, ఆపైన సోనియాని కలుద్దాం పదమంటూ తీసికెళ్ళనూ వచ్చు!

అందునా ఉండవల్లి అరుణ్ కుమార్, సోనియాకి ఆంధ్రా వచ్చినప్పుడల్లా వ్యక్తిగత ఉపన్యాస అనువాదకుడిగా పనిచేసేంత సన్నిహిత అనుచరుడు! ఆ నమ్మిక కోసమే ఉండవల్లి, "వారం రోజుల్లో రామోజీరావుని దేశద్రోహిగా నిరూపిస్తాను" అన్నాడు. ఆ వారం ఇంతవరకు రాలేదు. రామోజీరావు ఆ విషయమై పరువునష్టం దావా కూడా వేయలేదు. అదీ ఇక్కడ విచిత్రం.

[సోనియా దగ్గరికి మమ్మల్ని చేరిస్తే వాళ్ళకేం ఒరుగుతుందన్న విషయం తర్వాత! అందుకోసం మాత్రం వీర పెనుగులాట అడుతూనే ఉంటారు. ఈనాడు సాక్షిగా... చాలా స్పష్టంగా! దీన్ని గురించి, మరికొన్ని సంఘటనలు వివరించిన తర్వాత చెబుతాను.]

ఇదొక్కటే కాదు, 2007 మార్చిలో, మాపై రామోజీరావు వేధింపు గురించి, ప్రధాని, సోనియా, రాష్ట్రపతులకి 2005 నుండి మేము పంపుతున్న ఫిర్యాదులకు స్పందనగా, శ్రీశైలం పోలీసు సీఐ, ఎస్.ఐ.లు విచారణ చేపట్టామని చెప్పుకున్నారు. మా కేసులో ఉటంకించిన వారి నుండి స్టేట్ మెంట్లు తీసుకున్నామంటూ, మా దగ్గర స్టేట్ మెంట్లు తీసుకున్నారు.

ఆ నేపధ్యంలో సీఐ ఎంతో గంభీరమైన ముఖంతో "మీరు అసలు క్రింది నుండి పైకి ఫిర్యాదులు పంపవలసింది. పై వారికి ఫిర్యాదులిచ్చినా మా దగ్గరకు రావలసిందే!" అన్నాడు. నేను "ఇప్పుడెందుకు ఇదంతా చేస్తున్నారు?" అని అడిగాను. సీఐ "అది కాదమ్మా! మీరు ఫిర్యాదు ఇచ్చి కొన్ని రోజులు/నెలలు గడిచాయి కదా! ఈ లోపున ఏమైనా జరగచ్చు. మీరు అభిప్రాయం మార్చుకొని ఉండవచ్చు! అందుచేత మరోసారి స్టేట్ మెంట్ వ్రాయించుకున్నాము" అన్నాడు.

నేను "అలాంటిదేం లేదండి! ఇప్పటికీ మేము మా ఫిర్యాదుకే కమిట్ అయి ఉన్నాము. వందసార్లయినా ఇదే చెబుతాము" అన్నాను. "సరే నమ్మా! మీ ఇష్టం!" అన్నాడతడు. నేను "ఒకే సరే! ఇప్పుడు స్టేట్ మెంట్లు తీసుకున్నారు. ఏం జరుగుతుంది?" అనడిగాను.

అతడు చాలా గంభీరంగా "ఏమైనా జరగవచ్చమ్మా. మేమిది పైకి పంపిస్తాము. రామోజీరావుని హైదరాబాదులో అరెస్టు చేస్తారో లేక అతణ్ణి అరెస్టు చెయ్యమని మాకే ఆర్డర్స్ ఇస్తారో!" అన్నాడు. ఆ క్షణం అది మాకు చాలా oddగా అన్పించింది. ఏది జరిగినా వెంటనే స్పందించక పోవడం అప్పటికే మాకు బాగానే అలవాటయ్యింది. దాంతో ఏమీ అనకుండా అతడికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాము. ఆ తర్వాత నాలుగురోజులకే, మా గది కేటాయింపుని రద్దుచేస్తూ మాకు నోటీసు ఇవ్వబడింది.

’రేపో ఎల్లుండో రామోజీరావుని అరెస్టు చేస్తారు’ అన్నట్లుగా ఆలోచనలు రేకెత్తించి, ఒకవేళ మేం గాని అందుకోసం ఆశగా ఎదురు చూస్తుంటే.... ఒక్కసారిగా అశనిపాతానికి గురిచెయ్యటం! ఎంతగా ఆశకి గురవుతామో అంతగా నిరాశకీ గురవ్వటం మానవ సహజం. ఆ అటుపోట్లకి, మానసిక తంత్రాలకి, బ్రేక్ అవ్వటం కూడా అంతే సహజం. ఈ విధమైన ’సైకలాజికల్ ప్లే’ మా మీద చాలా విషయాల్లో, చాలాసార్లు, పెద్దమోతాదులలో ప్రయోగింపబడింది. ఆ అనుభవాలకి కూడా రాటుదేలి పోయాము. గతటపాలలో చెప్పినట్లు ’గీత మా సాధన, ఇతిహాసాలు మా పరికరాలు.’ ఆ రీత్యా కూడా, అలాంటి అనుభవాలతో ఎంతో కొంత సమబుద్దిని సాధించాము.[స్థితప్రజ్ఞత అనేంత మాట ఉపయోగించటం సాహసమే అవుతుంది.]

ఈ కేసు విషయంలో... మేం ఎవరికి ఫిర్యాదు చేసినా.... మాకు రామోజీరావు నుండి, అతడి పత్రిక ద్వారా పరోక్షంగా, ఎవరికైతే ఫిర్యాదు చేశామో వారి ద్వారా ప్రత్యక్షంగా, మాకు విన్పించబడే దేమిటంటే - "ఇది కూడా మా పావే! ఇతడు/ఈమె నా వాళ్ళే! వీళ్ళకి ఫిర్యాదు చేస్తే వీళ్ళేదో నీకు సాయం చేస్తారనుకుంటున్నావా? ఏమీ లేదు. మాకు లొంగి పోవటం మినహా మీకు మరో దారి లేదు" అని!

ఎస్.పీ., కలెక్టర్ లు, ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, వై.యస్..... ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.... ఇలా ఎవరికి ఫిర్యాదు చేసినా.... జవాబు రాకపోగా, వేధింపు మరింత తీవ్రమై కొనసాగటంలో మాకు ఇవ్వబడిన హెచ్చరిక అదే!

అయినా ఆపకుండా మేం అడ్మినిస్ట్రేషన్ యుద్దం కొనసాగించుకుంటూ పోయాము. దాదాపు 100 ఫిర్యాదులు వ్రాసాము. ప్రతీచోట "ఇతడు/ఈమె కూడా నా వాళ్ళే. నీకు న్యాయం జరగదు" అంటూ మమ్మల్ని బ్రేక్ చేయాలనే రంధిలో, పంతంలో పడిన నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు సోనియాలు, మరోవైపు తాము నిరూపింపబడుతున్నామన్న విషయాన్ని విస్మరించారు.

ఈ విషయంలో.... సూర్యాపేటలో మా ఇంటి ఒనరైతే మమ్మల్ని బూతులు తిడుతూ ఓ రోజు "చావగొట్టి నట్టింట పాతేసినా అడిగే దిక్కులేదు. ఏం చూసుకుని ఇంత పొగరు?" అనేసింది కూడా! ఇదే మరో రకంగా... శ్రీశైలంలోని మా పూర్వవిద్యార్ధి ఒకరు "ఏముంది సార్! మీరు ఏ నక్సల్స్ అంటూ పోలీసులు తీసికెళ్ళి ఎన్ కౌంటర్ చేస్తే మాత్రం ఎవరేమంటారు?" అన్నాడు. మా ఇంటి ఓనరుకైతే మేం జవాబివ్వలేదు గాని, మా పూర్వవిద్యార్ధికి మాత్రం "అదే అయితే కొండంత అండ, గుడిలో మల్లయ్య స్వామి భ్రమరాంబ తల్లి ఉన్నారు, మేమున్నాము అనుకుంటాములే" అని నవ్వేసాము. మొదటి సందర్భంలో అప్పటికింకా మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయాన్ని గుర్తించనందున అంతకంటే పెద్దగా అలోచించలేదు.

ఈ పరిణామ క్రమంలోనే.... 2007 మార్చిలో శ్రీశైలం సీఐ నడిపిన ’ఎంక్వయిరీ - స్టేట్ మెంట్ల సంగ్రహణ’ నాటకం అనంతరం అదే పైకారణంగా చూపిస్తూ మా గది కేటాయింపు రద్దయినప్పుడు [ఆ వివరాలు మా కథలో వ్రాసాను.] మేం హైదరాబాద్ లో CBCID, IG కృష్ణరాజ్ ని కలిసామని గతటపాలలో కూడా వ్రాసాను. అప్పుడతడు "మీరు ఫిర్యాదులలో collective News వ్రాస్తున్నారు" అన్నాడు.

అంటే - ఆవిధంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం "ఇదంతా collective News అంటాను. ఎలా నిరూపించగలవు?" అని సవాలు విసిరింది. మాకు కాదు, నెం.5 వర్గానికి. ప్రత్యక్షంగా కాదు, CBCID, IG కృష్ణరాజ్ ద్వారా! అందునా సదరు కృష్ణరాజ్, వై.యస్. ద్వారా నియమితుడై మార్గదర్శి అవకతవకలపైన విచారణ జరుపుతున్నాడు. అప్పటికే పలుమార్లు టీవీ వార్తల్లో మార్గదర్శి దస్త్రాలు పట్టుకెళుతూ, కోర్టుకు వివరణలు ఇస్తూ విజువల్స్ ద్వారా కనబడతున్నాడు. పేపర్ల ఫోటోలలో ప్రచురితమౌతూ ఉన్నాడు.

దానికి జవాబుగా అన్నట్లు - మేం హైదరాబాద్ లో చేసిన ప్రయత్నాలు ఫలించక, [ఈనాడు పోటీ పత్రికలైన వార్త, ఆంధ్రజ్యోతిల నుండి సహాయం పొందలేక, ’వార్త’ ఉపసంపాదకుడి చేత బుర్ర కడుగుడు కూడా భరించి] వెనుదిరిగి శ్రీశైలం వచ్చేసాము. గది కేటాయింపు రద్దుచేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞాపన పత్రం వ్రాసుకుని[మార్చి 29న] దేవాలయ ఈవోని కలిసాము. అతడు నిరాకరించాడు. మరునాడు మా విద్యార్ధుల తల్లిదండ్రుల బృందంతో[మార్చి 31న] సహా వెళ్ళి ప్రయత్నించాము. గది రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అడిగాము. కనీసం గది ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరాము. చివరికి 5 వారాల సమయమిచ్చాడు.[మే 7 తేదీ వరకు]

సమయం తీసుకోగానే, ఏప్రియల్ 1 తేదినే వై.యస్.కి రామోజీరావు గురించి ప్రస్తావించకుండా, ఓ సాధారణ టీచర్లుగా మేము ఒక అభ్యర్ధన లేఖ పంపాము. మా గది రద్దు నిర్ణయాన్ని ఆపివేయించాలని, "దేవస్థానంలో ఒక కూలీ పాటి సర్వీసు చేయదా ఒక టీచర్ సర్వీసు" అని వ్రాసాము.

ప్రత్యామ్నాయ వసతి చూసుకునే ప్రయత్నాలు చేస్తుండగా.... ఏప్రియల్ 11, 2007 న శ్రీశైల దేవస్థానపు డిఫ్యూటీ ఈవో నుండి మాకు ఓ తాఖీదు అందింది. మా గది కేటాయింపు రద్దుని వెనక్కు తీసుకోవాల్సిందిగా మార్చి 29 న మేము ఈవోకు ఇచ్చిన విజ్ఞాపన పత్రం మీద, ఈవో regrat అని వ్రాసాడు కాబట్టి, మేం తక్షణం గది ఖాళీ చేయవలసిందనీ, లేనట్లయితే తాము తీసుకునే చట్టపరమైన న్యాయపరమైన చర్యలకు మేమే బాధ్యులమనీ అందులో సారాంశం.

అయితే మార్చి 31న, మేము మా విద్యార్ధుల తల్లిదండ్రులూ బృందంగా కలిసి వెళ్ళి విజ్ఞప్తి చేయగా, ఈవో మాకు మే 7 వ తేదీ వరకూ సమయం ఇచ్చిన విషయం ఆడిగితే... ఆ దస్త్రం తమకింకా చేరలేదనీ, తమకు ఫార్వార్డు చేయబడిన regretted letter మీదే తాము Further action తీసుకున్నామనీ Dy.E.O. చెప్పాడు.

"మాకు Favourable అయిన letter పదిరోజులు దాటినా తమకి చేరదు. అది చేరలేదు కాబట్టి, infavourable letter చేరింది కాబట్టి react అయ్యారట. అదే మాకు infavourable గా దేవస్థానపు కాంట్రాక్టు [కూలీలు] అటెండర్లు ఈవోకి పిటీషను పెడితే మాత్రం, రెండురోజుల్లో, వెనువెంటనే, react అయిపోయారు. దీన్ని వేధింపుగాక ఏమంటారు? రామోజీరావు గురించి వ్రాయకుండా ఏప్రియల్ 1 తేదీన మేము పంపిన అభ్యర్ధన లేఖకు సమాధానం లేదు. "ఫిర్యాదులో రామోజీరావు పేరు వ్రాయకపోతే రెడ్ టేపిజం అంటూ ఏ న్యాయం జరగదు. ఫిర్యాదులో రామోజీరావు పేరు వ్రాస్తే collecting News అంటారు. ఇది ఏరకమమైన వేధింపు?" అంటూ మరో ఫిర్యాదుని రాష్ట్రపతి కలాం గారికి, ప్రధానమంత్రికి, సోనియాకి స్పీడ్ పోస్టులో పంపాము.

మేం పంపిన ఫిర్యాదుకి రాష్ట్రపతి స్పందిస్తూ, తాము రాష్ట్ర సీఎంకి ఈ విషయాన్ని Direct చేస్తున్నామని మాకు లేఖ పంపారు. అది ప్రయాణం చేసి చేసి, మేము శ్రీశైలం వదలి వచ్చాక చేరింది. అయితే ప్రధానమంత్రి స్పందించలేదు. ఇక సోనియా తనకి ఫార్వార్డ్ చేసిందనీ, ఫిర్యాదులోని విషయాలు తన పరిశీలనలో ఉన్నాయనీ దిగ్విజయ్ సింగ్ నుండి మాకు లేఖ వచ్చింది.

ఈ లేఖ రిఫరెన్సుతో మేము 2007 మే17న ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ని కలిసాము. అతడు, ఆ రోజే అక్కడికి వచ్చి ఏపీ భవన్ లో విడిది చేసి ఉన్న అప్పటి సీఎం వై.యస్. కి, మా గురించి సిఫార్సు లేఖ వ్రాసి ఇచ్చాడు. దానిపైన "కేసు సంగతి తర్వాత ముందు గది విషయం చూద్దాం" అంటూ హామీ ఇచ్చిన వై.యస్.... ఆ తర్వాత డ్రామాలు, సంఘటనల గురించి ’పీవీజీ - రామోజీరావు - మా కథ’లో వివరంగా వ్రాసాను.

ఆ విధంగా... "collecting News వ్రాసారు అంటాము. మీరేం చెయ్యగలరు?" అంటూ CBCID, IG కృష్ణరాజ్ ముఖతః నకిలీ కణిక వ్వవస్థ, నెం.10 వర్గం అన్పించిన మాటకి, సవాలుకి, నెం.5 వర్గం చెప్పిన సమాధానమన్నమాట Dy.E.O. ఇచ్చిన తాఖీదు, దానిపై రాష్ట్రపతి, సోనియా తనకి పంపిదంటూ దిగ్విజయ్ సింగ్ స్పందన లేఖలు, తదుపరి సంఘటనలు! "చాలా! ఇంకా సాక్ష్యాధార పత్రాలు, దృష్టాంతాలు కావాలా?" అన్నదే నెం.5 వర్గం చెప్పిన జవాబు! ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఎందుకంటే రాష్ట్రపతి, దిగ్విజయ్ సింగ్ ల చేత స్పందన లేఖలు మేం వ్రాయించలేము కదా!

ఈ మొత్తం ప్రకరణంలో.... రాష్టపతిగా APJ కలాం, మా దస్త్రాన్ని, కేసుని, సీఎం కూడా స్పందించకపోవటంతో హోంశాఖకు పంపినట్లుగా మాకు లేఖ పంపారు. తదుపరి.... నవంబరు 2007లో మేం మరోసారి ఢిల్లీ వెళ్ళి, కేసు వివరాలని కవరింగ్ లేఖకు జోడించి, స్వయంగా హోంశాఖలో దాఖలు చేసి రసీదు పుచుకున్నాము.

2007, జూన్ 2 న రాష్ట్రపతిగా కలాం ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రతీకారమేమో అన్నట్లుగా.... APJ కలాం ఆవేదనా భరిత సంఘటనల అనంతరం పదవి దిగిపోయాడు. జూన్ - జూలై మాసాల్లో, రాష్ట్రపతిగా కలాంని కొనసాగిస్తారా లేదా అనే మీమాంస వచ్చింది. కలాం రెండో పర్యాయం రాష్ట్రపతిగా సాగేందుకు సుముఖత కూడా వ్యక్తం చేసారు. అనూహ్యంగా, APJ కలాం గురించి నిందాత్మక లేఖ వార్తలో కొచ్చింది. తనకు అది ఖేదం కలిగించిందనీ, ఆవేదన చెందాననీ పేర్కొన్న కలాం, తర్వాత మాజీ రాష్ట్రపతిగా ఆర్.పీ. భవనం వీడారు.

ముందటి టపాలో చెప్పినట్లుగా... ఎంతటి వాడైనా [సోనియా, రామోజీరావులైనా] పడవ ఎక్కాక సరంగు మాట వినాల్సిందే, సరంగు చెప్పిన చోట కూలబడాల్సిందే! ఆది ఆ సీటు ఆధిక్యత! అందుకే తదుపరి రాష్ట్రపతిగా, అప్పటి వరకూ పేరు పెద్దగా తెలియని ప్రతిభాదేవి సింగ్ షేకావత్ హఠాత్తుగా తెర మీదికి వచ్చింది. ఈ విషయాన్నే గునుస్తూ, తెలంగాణా కాకా, జి. వెంకట స్వామి చాలాసార్లు మొత్తు కున్నాడు కూడా! ఇక రాష్ట్రపతి భర్తా, మరిది, ఇతర సమీప బంధువులపై ఆర్ధిక నేరాల దగ్గరి నుండి హత్యా నేరాల దాకా, అభియోగాలు బయటికి రావడం భారతదేశం గతంలో చూడనిది.

ఈ విధంగా నెం.5 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవటం, మెదళ్ళతోనే గాక మాటలతోనూ యుద్దం చేసుకోవటం, మా కేసు విషయంలోనే కాదు, మా జీవితంలోని సంఘటనల విషయంలోనూ నడుస్తుంది. దేశ కాలమాన పరిస్థితులపైనా నడుస్తుంది.

ముందుగా మా జీవితంలో...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మీరు చెప్పినట్టే ఉండవల్లి అరుణ్ కుమార్ అస్సైన్ మెంట్ పూర్తయినట్టుంది .... అందుకే ఇప్పుడు ఏం మాట్లడటం లేదు
పాపం రాజశెఖర్ రెడ్డి పోయిన తరువాత అతనికి ఏమీ పనీపాటా లేకుండ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాడూ

అవును కలాం గారు చాలా బాధ పడి ఉంటారు ... ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన గొప్పతనం గురించి రాయని పత్రిక
లేదు ... కానీ ఇప్పుడు ఆయన గురించి పట్టించుకున్న పత్రికే లేదు ...

కలాం పదవిలో ఉన్నపుడు పత్రికలనిండా ఆయన గురించే మీడియా ఆకాశానికెత్తేసింది (మీడియా ఆకాశానికెత్తకపోయినా ఆయన గొప్పవాడె) ... ఇప్పుడు అదే కలాం ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు ...ముఖ్యంగా పత్రికలకి

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu