భగవద్గీత, ఉపనిషత్తులు ప్రజలని తమోగుణాన్ని దాటి, రజోగుణాన్ని, దాన్నీ దాటి సత్త్వగుణాన్ని చేరమని, ఇంకా సాధన చేసి త్రిగుణాలని కూడా దాటమని చెబితే... నకిలీ కణిక వ్యవస్థ దానికి విపర్యయంగా ప్రజలని తమోగుణం దగ్గరికి ఎందుకు తరుముకెళ్ళిందో, వెళ్తోందో గత టపాలలో వివరించాను.

తమోగుణపూరితులు దేనికీ ఎదురు తిరగరు. పిరికితనం, పిడివాదం కలిగి ఉంటారు. అసత్యాన్ని సత్యంగా, అధర్మాన్ని ధర్మంగా భ్రమిస్తారు. వెరసి తము విధించే బానిసత్వపు సంకెళ్ళని తెంచుకోలేరు. అదే రజోగుణంపూరితులైతే ఎదురుతిరిగి పోరాడతారు. అది తమకు ప్రమాదం. అందుకే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ తమోగుణాన్ని ప్రేరేపించే ఆహారం, అలవాట్లు, కళలూ, మందులూ, వాదనలూ మొదలైన వాటిని పెంచి పోషించింది.

రజోగుణంతోనే కాదు, సత్త్వగుణంతో కూడా గెలిచే వరకూ పోరాడవచ్చునని బాపూజీ నిరూపించాడు. అందుకే ఆయన మహాత్ముడు! అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు వంటి వారు రజోగుణంతో కూడిన పోరాట యోధులైతే, బాపూజీ, ఆయన అడుగుజాడల్లో నడిచిన స్వాతంత్ర సమరవీరులు సత్త్వగుణంతో కూడిన పోరాట యోధులు.

ఇక - స్వాతంత్రం పొందిన ఆరు దశాబ్దాల తర్వాత వెనుదిరిగి చూసుకుంటే ఏముంది? తామసంతో ప్రేరేపింపబడి, ప్రతి నెగిటివ్ అంశానికి పాజిటివ్ కాప్షన్ పెట్టుకుంటూ... ప్రతి అనుకూల అంశానికి ప్రతికూలంగా స్పందిస్తూ... ఎక్కడికి పయనిస్తోంది మానవజగత్తు?

ఆది మానవుడు అనాగరిక జీవనం లోనుండి నాగరికతలోకి ప్రయాణిస్తే, ఆధునిక మానవుడు తిరోగమనం చేస్తోన్నాడు. కాబట్టే ఆదిమానవుడు శరీర నగ్నతని ఆకులతోనో, జంతుచర్మలతోనో కప్పుకుని సభ్యతలోకి ప్రయాణిస్తే, ఆధునిక మానవుడు ఫ్యాషన్ పేరుతో దుస్తులు విసర్జించి నగ్నత ప్రదర్శిస్తూ అసభ్యతలోకి ప్రయాణిస్తున్నాడు. ఆదిమానవుడు సామూహిక జంతుజీవితం నుండి కుటుంబ వ్యవస్థలోకి, సంతాన భద్రతకీ వంశవృద్ధికీ దోహదపడే ప్రాకృతిక శృంగారం వైపుకి ప్రయాణిస్తే, ఆధునిక మానవుడు విచ్చల విడి శృంగారంలోకి, కుటుంబ విచ్చిత్తిలోకి, స్వలింగ సంపర్కాలకి చట్టబద్దత తెచ్చుకోవటం, లింగమార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోవటం వంటి అప్రాకృతిక వికృత చర్యల వైపుకి ప్రయాణిస్తున్నాడు. పైగా స్వలింగ సంపర్కం జంతువుల్లోనూ ఉందని వారించటం ఒకటి. పోయి పోయి జంతువులతోనా పోల్చుకోవాలి?

హద్దుల్లేని తామస గుణాన్ని ప్రజాబాహుళ్యంలోకి ప్రవేశ పెడితే పరిస్థితి ఇక్కడికే వస్తుంది. మిధ్యా భావవాదాన్ని, అసత్యపు పదార్ధవాదాన్ని ప్రచారించి ఈ స్థితికి మానవ జాతిని నడుపుకొచ్చారు. భావవాదం పేరిట ప్రచారించింది నూటికి 90% మిధ్యావాదమూ, అసత్యమే! అది పూర్తిగా భగవద్గీతకి, హిందూ సనాతన ధర్మానికి విపర్యయము. విచిత్రం ఏమిటంటే - పదార్ధవాదం పేరిట నకిలీ కణిక వ్యవస్థ ప్రజల్లో ప్రచారించింది కూడా నిజమైన పదార్ధవాదం కాదు. అందులోనూ అసత్య ప్రచారమే! నిత్యావసరాల ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేని ద్రవ్యోల్పణపు హెచ్చుతగ్గుల్లాంటివే అవన్నీ! ప్రజల నిజజీవితంలోని ఆర్ధిక స్థితిగతులతో సాపత్యమే లేని తలసరి ఆదాయపు లెక్కల వంటివి. ఇక ఆర్ధికాభివృద్ధి గురించి చెప్పాలంటే, అది తుమ్మితే ఊడే ముక్కులాంటిది. ఈ విషయాన్ని గురించిన విపులమైన చర్చ మరోసారి చేస్తాను.

ఈ టపాలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10వర్గమూ, ప్రజల్లో తామస గుణాన్ని ప్రవృద్దం చేసి... పొందిన , పొందుతున్న, పొందాలనుకుంటున్న ప్రయోజనాల గురించి పరిశీలిద్దాం. తామస గుణాన్ని ప్రకోపింపచేస్తే నకిలీ భావజాలాన్ని, మిధ్యా భావాలని, అసత్య ప్రచారాలని, వితండ, కుతర్కాలని ప్రజల్లో ప్రవేశపెట్టటం సులభం. అప్పుడెవరూ తమ మీద తిరగబడరు.

ఉదాహరణకి ప్రస్తుత పరిస్థితుల్నే తీసుకొండి. ఇంతగా ధరలు పెరిగాయి. ప్రభుత్వమే ప్రత్యక్షంగా సహకరించి... ఏకంగా నౌకశ్రయాల నుండే... బియ్యం చక్కెరల ఎగుమతి దిగుమతులను... అనుమతులిచ్చో, ఇవ్వకుండానో... అక్రమంగానో, సక్రమంగానో నడిపించి... ’ప్రజా దోపిడి’చేస్తోంది, చేయిస్తోంది. అక్రమంగా ఎగుమతి దిగుమతులు చేస్తోన్న వారిని, అక్రమంగా నిల్వచేసి నల్ల బజారు విక్రయాలు చేస్తోన్నవారిని, వాటాలు పుచ్చుకు మరీ రక్షిస్తోంది. అంటే భాగస్వామ్య పద్దతిలో నల్ల వ్యాపారం చేస్తోంది. ప్రజలు ఏం చేస్తోన్నారు? కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆక్రోశంతో చూస్తున్నారు. ఆవేశంతో చూస్తున్నారు. తర్వాత తలొంచుకు పోతున్నారు.

ఇంతగా రాజకీయాలు బహిర్గతం అవుతున్నాయి. పరస్పర ఆరోపణలతో[శిబూసోరన్ Vs కాంగ్రెస్ అధిష్టానం, ఈనాడు Vs సాక్షి, కేసీఆర్ Vsఆలె నరేంద్ర చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత] రాజకీయ నాయకుల అక్రమార్జనలు వందలు వేల కోట్లు బయటపడుతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో వేల లక్షల కోట్ల సంఖ్యల్లో డబ్బు నిల్వలు బహిర్గత మౌతున్నాయి. ప్రజలు ఏం చేస్తున్నారు? నిర్ఘాంతపడి నిట్టూరుస్తున్నారు.

కాంగ్రెస్ అధిష్టాన దేవత, ఇటలీ పెద్దమ్మ , భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని అర్ధమౌతునే ఉంది. కార్పోరేట్ అంబానీలకి అడ్డాగా దేశాన్ని గుత్తకిచ్చేసిందని తెలుసు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేయగలుగుతున్నారు?

బిజేపీ అధినేత అద్వానీ ’జై జిన్నా!’ అనటం తెలుసు. నాటకీయంగా పాక్ టెర్రరిస్టులని అందరు కలిసి కాపాడటం, కసబ్ లకి మటన్ కబాబ్ లు అందించటం తెలుసు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేయగలుగుతున్నారు?

తమ స్వంత ప్రయోజనాల కోసం కేసీఆర్ లూ, బాల్ ధాకరే లు ఉద్యమాల విధ్వంసాలు ఎత్తుకున్నారని తెలుసు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యగలుగుతున్నారు?

తమ నిరసనని, వ్యతిరేకతని వెలిబుచ్చడానికి రోడ్డెక్కితే రౌడీలు గుంపులో కలుస్తారు. ఇక భీభత్సమే! గళమెత్తినా, కలమెత్తినా మీడియా ఫోకస్ చేయదు. తనకు కావలసిన దాన్నే, కావలసిన విధంగా ఫోకస్ చేస్తుంది. ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేయగలుగుతున్నారు?

ఎందుకిలా జరుగుతోంది? ఇక ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? సుదీర్ఘ కాలంగా నకిలీ కణిక వ్యవస్థ వివిధ పద్దతుల ద్వారా ప్రజలలో అత్యధిక శాతం తమోగుణాన్ని అట్టడుగు దాకా, వేళ్ళునుకునేంతంగా దించింది. అక్కడి నుండే పునఃప్రస్థానం ప్రారంభమయ్యేదాకా ఇది తప్పదు. పోయిన దారిలోనే వెనక్కి రాక తప్పదు కదా?[పంచతంత్రంలోని నక్క మాదిరిగా!]

ప్రజలలో తమో గుణం స్థానే రజోగుణం రగిలే దాకా, సత్త్వగుణం వెలిగే దాకా ఇది తప్పదు. ఎందుకంటే - ఘర్షణ లేకుండా ఏ మార్పూ రాదు. అగ్నిలో పుఠం పెట్టి కాల్చనిదే బంగారానికి వన్నె రానట్లే, సాన బెట్టనిదే వజ్రానికి మెరుపు రానట్లే, సంఘర్షణ లేనిదే సమాజానికీ చైతన్యం రాదు. చైతన్యరాహిత్యంతో గాఢ సుషుప్తిలో ఉన్నట్లుగా... తామసంతో నశించి పోవాలి. లేదా జాగృత చైతన్యంతో, రగిలే రజోగుణంతో, పరిస్థితులని ఎదుర్కోవాలి. "Do or Die" అని బాపూజీ అన్నది ఇలాంటి పరిస్థితులలోనే! "చచ్చావా స్వర్గం లభిస్తుంది. గెలిచావా రాజ్యం లభిస్తుంది. కాబట్టి ధృఢచిత్తుడవై యుద్ధం చెయ్యి" అని శ్రీకృష్ణుడు అన్నదీ ఇలాంటి పరిస్థితులలోనే!

ఈ దిశలోనే నెం.5 వర్గపు పనితీరూ ఉన్నది. వివరంగా చెబుతాను.

మనకి 1947 లో స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలంతా ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో స్వేచ్ఛాభారతాన్ని స్వాగతించారు. ప్రజాస్వామ్యంలో తమ బ్రతుకులు శాంతి సౌభాగ్యాలలో అలరారుతాయని ఆశించారు.

గాంధీ మహాత్ముడు కలగన్నరోజులు...

నెహ్రు అమాత్యుడు నెలకొల్పురోజులు...

వచ్చేశాయని ఆడిపాడారు. ఆనకట్టలతో పంటలు ఇబ్బడిముబ్బడిగా పండుతాయి, రోడ్లు విద్యుత్తు వంటి సౌకర్యాలన్నీ తమ గడప తలుపు తట్టేందుకు సిద్దంగా ఉంటాయని ఉవ్విళ్ళూరారు. 1962లో చైనా దురాక్రమణతో తొలిసారిగా స్వాప్నిక జగత్తు బద్దలయ్యింది. వాస్తవం కళ్ళెదుట నిలబడింది. తర్వాత్తర్వాత, ప్రజలకంతగా తెలియకపోయినా, ప్రభుత్వంలోని నిజాయితీ, నిబద్దతా, దేశభక్తీ గల నాయకులకి స్వాతంత్రం రావటం అన్నది భ్రమేనని, స్వాతంత్ర పోరాటం అంతం కాలేదనీ అర్ధమయ్యింది. కుట్ర జరుగుతోందన్న అంచనా బలపడేటప్పటికే తామెంత ప్రమాదంలో ఉన్నారో, దేశమెంత ప్రమాద దిశలో ఉందో అర్దమయ్యింది.

అప్పటికే... చూసుకుంటే... ప్రభుత్వ శాఖలలో, అధికారులూ మంత్రులతో సహా అత్యధికులు అవినీతి పరులే! నిజాయితీ గలవారు struggle ఎదుర్కొంటున్నారు. సీబిఐ వంటి సంస్థలోనూ నిజాయితీ నిలువెత్తురూపాలు మాధవన్ లూ[మీడియా అలాగే ప్రచారించింది మరి!] రాజకీయాల్లో రంగు రంగుల ఊసవవెల్లులు! ఒక్క సీబిఐ, రాజకీయరంగాలే కాదు, ఎటు చూసినా ఏ రంగంలో చూసినా ఇదే కథ. మానవహక్కుల సంఘలూ, మీడియా సంస్థలూ, విద్యార్ది ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులూ అత్యధికులు నకిలీ కణిక వ్యవస్థకి అనుకూలురే!

మేడిపండు లాంటి ప్రజాస్వామ్యానికి కాపలా కాస్తూ నిజాయితీ పరులు. ఎవరి మీదా తమకి తగినంత పట్టులేదని అప్పటికి ప్రభుత్వంలో ఉన్న దేశభక్తులకి ఆలస్యంగా అర్ధమయ్యింది. ఆ స్థానంలో ఎవరుంటే వాళ్ళకి! లాల్ బహుదూర్ శాస్త్రీ అయినా, ఇందిరాగాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా, పీవీజీ అయినా! దేశద్రోహులైన మొరార్జీ దేశాయ్ లని, వీపీ సింగ్ లనీ, నేటి నాయకులనీ, నాయకురాండ్రలనీ నేను ఇక్కడ రిఫర్ ఛేయటం లేదు.

ఆ విధంగా... అప్పటికే... దేశప్రజలలో పైనుండి దిగువస్థాయి వరకూ అందరిలో అంతటా తామసం నిండి ఉంది. మిధ్యా మేధావిత్వంతో, కుహనా భావజాలంతో వితండవాదాలు చేస్తూ... ఈ మాలికలోని తొలి టపాలో చెప్పినట్లుగా... ఉమ్మడి కుటుంబంలో ఒకరిద్దరు ఒళ్ళిరగొట్టుకుని కుటుంబశ్రేయస్సు కోసం పని చేస్తుంటే, మిగిలిన వారు తీరి కూర్చొని తీర్పులూ సమీక్షలూ చేస్తున్నట్లుగానే ఉంది పరిస్థితి!

ఆచరించని సిద్దాంతాలు చెబుతూనూ, రాద్ధాంతాలు చేస్తూనూ విమర్శకులూ విశ్లేషకులూ! వాటినే పరమ సత్యాలుగా మీడియా బాకాలూదుతూ గావుకేకలు వేస్తోంది. తరచి చూస్తే ఈ స్థితి మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతా పరచుకొని ఉంది. ఇదంతా పరిశీలించాకే నెం.5 వర్గం తన పనితీరునీ, ప్రణాళికనీ రచించుకుంది.

లక్ష్యం నిర్దేశితమైనదే! ప్రజలలో రజోగుణాన్ని రగల్చటం, ధర్మ పునఃప్రతిష్ఠాపనే లక్ష్యం. అందులో ఎవరి అరిషడ్వర్గాలకీ, అహంకారాలకీ తావులేదు. ఎవరి స్వార్ధ ప్రయోజనాలకీ తావులేదు. అలాగే ఏ విషయం పట్లా లోభంకానీ, మోహం కానీ లేదు. కౌపీనం కూడా!

’నెం.5 వర్గానికి ధర్మ ప్రతిష్ఠాపనే కాని ప్రజల పట్ల ఏ concern లేదా?’ అంటే ఉంది. ’ఉందా?’ అంటే లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే నెం.5 వర్గానికి ప్రజల పట్ల concern కంటే ధర్మం పట్లే concern ఎక్కువ. దానిని ఆచరించే వారిపట్లే concern! అంతేకాదు, వారు నాస్తికులా, ఆస్థికులా అన్నది ఇక్కడ విషయం కాదు. మానవత్వం పట్ల నమ్మకం అన్న దానికే విలువ.

తామసులై , మానవత్వం పట్ల విలువలేని ప్రజల పట్ల నెం.5 వర్గానికి concern ఎందుకుండాలి? నెం.5 వర్గంలో ఎవరు పనిచేస్తున్నా , ఎందరు పనిచేస్తున్నా, ఏ దేశాల్లో పనిచేస్తున్నా, వారికీ ఇతరుల్ల్లాగే రెండు కాళ్ళు, రెండుచేతులు, ఓ నోరు, ఓ మెదడూ ఉన్నాయి. ఇతరులకి అంటే సామాన్య ప్రజలు కానివ్వండి, ధనికులు కానివ్వండి, రాజకీయాలతో ఏ సంబంధంలేని వారు కానివ్వండి. నెం.5 వర్గంలో పని చేసిన, చేస్తున్న వారికి ఇచ్చినట్లే, భగవంతుడు ఇతరులకీ దేహాన్నిచ్చాడు. మరెందుకు నెం.5 వర్గం ఇతరులని కాపాడాలి? ఏం? ఈ దేశం, ఈ ధరిత్రి, ఈ ప్రకృతి నెం.5 వర్గానివి మాత్రమేనా? ప్రజలకి ఏ బాధ్యతా లేదా?

అవినీతిలో పొర్లాడటం లేదా అవినీతిపై పోరాడటం...మరో మాటలో చెప్పాలంటే పరిస్థితులతో రాజీపడటం లేదా పరిస్థితులకు ఎదురు తిరగటం... అనే రెండు దారులలో... ఏ దారిలోనైనా ప్రయాణించటానికి ఇతరులకి ఎంత అవకాశం ఉందో, నెం.5 వర్గంలో పనిచేస్తున్న వారికీ అంతే అవకాశం ఉంది. కుటుంబ బంధాలూ, భావోద్వేగాలూ కూడా అందరికీ ఉన్నట్లే వారికీ ఉంటాయి. అయినా ధన మాన ప్రాణాలకి రిస్క్ తీసుకుని స్వచ్ఛందంగానే పనిచేస్తున్నారు. అందుకు నెలతిరిగే సరికి జీతభత్యాలు చెక్కులందటానికి వారెవ్వరూ ఏ ప్రభుత్వమూ నియమించుకున్నవారు కాదు. ఏ ప్రజల సొమ్మూ వారికి జీత భత్యాలుగా చెల్లింపబడటం లేదు. జీవికకి మరో ఉపాధి నిర్వహించుకుంటూ స్వచ్ఛందంగా పనిచేస్తున్న వారే! ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉండీ, స్వచ్ఛందంగా ఇందులో పనిచేస్తున్న ఏ కొద్ది మందినో మినహాయిస్తే, మిగిలిన వారంతా ఇంతే!

ఎవరైనా సరే... ’మనం మనుష్యులం. ఇది మనదేశం. మన భూమి. ఇది మన పని’ అనుకుని చేస్తున్నారు.

అలాంటిచోట ఎవరు ఎవరిని ఎందుకు కాపాడాలి? ఎలా కాపాడగలరు? ప్రపంచం మొత్తం మీదా 600 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా, అన్నిదేశాలలో కలిపి, చాలా మందే, నెం.5 వర్గంలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. కాబట్టే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం తాలూకూ నెట్ వర్క్ లోనుండే, నకిలీ కణిక అనువంశీయులకీ, నెం.10 వర్గానికి, అందులోని కీలక వ్యక్తులకీ, ఆత్మహత్యసదృశ్య Assignments నడుస్తున్నాయి. కాబట్టే నకిలీ కణిక వ్యవస్థ లోని మెగా ఏజంట్ల అసలు రూపాలు, కార్యకలాపాలు, అలాగే ప్రజాస్వామ్యం పేరిట వారు చేస్తున్న దోపిడీలు బహిర్గతమవ్వటం, ఆయా వ్యక్తులు తమ తమ సువర్ణముఖిలు అనుభవించటం జరుగుతోంది.

ఇలా ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్న వారి గురించీ ఇటీవల చాలా సినిమాలలో[పోకిరి, హోమం, ముఖబీర్ వగైరా] చూపించబడింది. దీన్ని గురించి ఎప్పుడైనా, ఎవరైనా చెప్పబోతే... "ఓస్! ఇది మేం ఫలానా సినిమాలో చూసిందే" అనేందుకే... అప్పటికే బహిర్గతమైనా లేదా బహిర్గతం కానున్న స్ట్రాటజీలను, సినిమాలలో నవలలో ప్రవేశపెడతారని గతటపాలలో వివరించాను.

ఇక, ప్రజలు దుర్భలులైనంత సేపూ, అవినీతితో రాజీపడుతునో లేక దానిలో పొర్లాడుతునో ఉన్నంతసేపూ, నెం.5 వర్గానికి వారిపై ఏ concern లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలు తామసంతో తూగుతున్నంత సేపూ వారిపై ఏ concern లేదు. ఎప్పుడైతే రజోగుణం పుణికి పుచ్చుకొని పోరాటానికి సిద్దపడతారో అప్పుడు concern ఉంది. అంతే! ఇది సాక్షాత్తూ శ్రీకృష్ణుడు చూపిన బాట. అర్జునుడు కురుక్షేత్రంలో చతికిల బడి, బంధు వ్యామోహంలో పడి, తామసానికి లోబడి, దుఃఖించినప్పుడు శ్రీకృష్ణుడు, అన్నీ చెప్పి తననే నిర్ణయించుకోమన్నాడు. ఎప్పుడైతే అర్జునుడు పోరాటానికి సిద్దపడ్డాడో అప్పుడు మాత్రమే నడిపించాడు.

అయితే, ఇందుకు మరో కారణం కూడా ఉంది. నెం.5 వర్గానికి ప్రజల పట్ల [ఏ బాధ్యత పట్టని వారి పట్ల] concern ఉంటే, అదే వారి బలహీనత అయి కూర్చుంటుంది. అప్పుడు అది పట్టుకునే నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు, కీలక దేశాలు, నెం.5 వర్గాన్ని ఆడుకుంటాయి.

’ప్రజలు, వారికి కలిగించే కడగండ్లు నెం.5 వర్గానికి పడతాయి’ అనుకుంటే, ఇక వారిని అక్కడే కట్టడి చేసేందుకు నకిలీ కణిక వ్యవస్థ మరిన్ని వరుసబాంబులు పేలుస్తుంది. మరిన్ని భీం రామ్ బాడల్ని కూలుస్తుంది. మరిన్ని పంటభూములు లాక్కుంటుంది.

ఇక్కడొక విషయం గమనించండి.

ఫ్యాక్షనిజం మీద తీసిన సినిమాలలో, హీరో, ఫ్యాక్షనిస్ట్ అయిన విలన్ కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. విలన్ హీరోని రప్పించటానికో, నొప్పించటానికో లేదా రెచ్చగొట్టటానికో, ఆ ఊళ్ళోని సామాన్యులని తెచ్చి , తన బంగళా ముందు తన రౌడీల చేత కట్టేసి కొట్టించటం లాంటివి చేస్తుంటాడు. అంతలో హీరో అమాంతం బైకుని/జీపుని విమానంలాగా గాల్లో దూకిస్తూ ఎంటర్ అయిపోతాడు. ఒక్కడే హాంఫట్ మని విలన్ ని, వాడి రౌడీలని[ఏజంట్లని] ఒంటిచేత్తో తన్ని తగలేస్తాడు. [అది సినిమా కాబట్టి సాధ్యమే]

హీరో వచ్చేవరకూ అల్లల్లాడిన ఆ సామాన్యులు [ఎక్కువగా ఎల్బీ శ్రీరాం ల లాంటి వాళ్ళు ఈ పాత్రలు వేస్తుంటారు.] హీరో రాకకోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. హీరో ఎంటర్ అవుతున్నప్పుడు ఆశగా చూస్తారు. మరింత బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తారు. హీరో విలన్లనీ రౌడీలని తంతున్నప్పుడు పగతో కూడిన ఆనందంతోనూ, హీరోనే తన్నులు తింటున్నప్పుడు ఆందోళనతో కూడిన భయంతోనూ చూస్తుంటారు. ఇన్ని హావాభావాలు చూపించే వీళ్ళు , చచ్చినా ఎదురు తిరిగి పోరాడాలనుకోరు. తమకూ హీరోకి లాగానే కాళ్ళు చేతులూ ఉన్నాయని అనుకోరు. ఆర్తానాదాలు, హాహాకారాలు మాత్రం శక్తి వంచన లేకుండా చేస్తారు. అది సినిమా! [గీత అయితే ఎవరి జీవితానికి వారే హీరో అని చెప్తుంది. అలాగే పోరాడమని చెప్తుంది.]

అదే నిజమైతే...? విలన్ ల దౌష్ట్యం కన్నా, ఇలాంటి వారి దౌర్భల్యమే అత్యంత ప్రమాదకరమైనది. కఠినంగా అన్పించినా ఇది నిజం! అన్యాయాన్నీ, అవినీతినీ, అధర్మాన్నీ ఎదిరించి పోరాడాలను కోకపోవటం లేదా వాటితో రాజీపడటం, మానసికంగా శారీరకంగా దుర్భలత్వమే! తామసం తట్టిలేపేది ఈ దుర్భలత్వాన్నే!

కాబట్టే నెం.5 వర్గంకి ప్రజల పట్ల concern ఉందంటే ఉంది, లేదంటే లేదు. అంతేకాదు, ’సమాజంలో, ప్రజల్లో మార్పు రావాలి ’ ఇది అందరూ అంగీకరించే మాట. సంఘర్షణ లేకుండా మార్పురాదు. ఏ దేశానికైనా ధృఢగాత్రులూ, స్థిరచిత్తులూ అయిన ప్రజలు కావాలి. పుట్టి గిట్టే పుట్టలోని చెదలు వంటి వారు ఉన్నా లేకపోయినా ఒకటే!

ఇది మేము స్వానుభవంతో నేర్చుకున్నాము. 1992 జూన్ లో పీవీజీకి complaint ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీని, కుటుంబ బంధాలని పోగొట్టుకుని, పెళ్ళిచేసుకుని శ్రీశైలంలో గుడిసెలో నివసించే రోజుల్లో, ఎవరు, ఎందుకు వేధిస్తున్నారో తెలియక, బ్రతికేందుకు ఏ దారీ కనబడక, ఆత్మహత్య చేసుకోవాలని లోయ అంచుల దాకా పోయి, కంఠనాళాలు పగిలే దాకా ఏడ్చి, చావలేక, కడుపులోని బిడ్డమీద తీపితో, మళ్ళీ బ్రతుకు పోరాటానికి సిద్దపడిన సందర్భాల సాక్షిగా నేర్చుకున్నాము. [దీని మీద ఇంకోసారి!]

జీవితంతో, పరిస్థితులతో పోరాడలేక ఆత్మహత్యలు చేసుకునే బలహీనులు కొందరు. తమకు తాము మేలు చేసుకోలేని, తమ కోసం కూడా తామూ పోరాడలేని దుర్భలురు మరికొందరు. అవినీతిలోనూ, అధర్మంలోనూ, ఇష్టంగా పోర్లాడుతునో లేక నిస్సహాయంగా రాజీ పడుతునో కొందరు. ఎవరు వీరిని ఉద్దరించాలి? తమపట్ల తమకు కూడా బాధ్యత లేని వారిపట్ల, వారి అలసత్వం పట్ల, ఎవరు బాధ్యత వహించాలి?

కాబట్టే నెం.5 వర్గం ఈ రకపు పని తీరుని ఎంచుకుంది. అందులో భాగంగానే నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్నీ, అందులోని కీలక వ్యక్తులనీ వారి కార్యకలాపాలతో సహా బహిర్గతం చేస్తోంది. వారి వారి సువర్ణముఖిలనీ అనుభవింపచేస్తోంది. ఈయుద్ధంలో దేశపు నడిగడ్డ మీద బాంబులు పడటం లేదు. నడి జీవితాల మీద బాంబులు పడుతున్నాయి. అధిక ధరలు, స్వార్ధ రాజకీయ నాయకుల ఉద్యమాలు, పెరుగుతున్న నేరాలు, అవినీతి అవకతవకలు... ఇలాంటి బాంబులే! ఇవి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ రచించుకున్న కుట్ర ప్రణాళిక లోనివే. సుదీర్ఘ కాలంగా వేస్తున్నవే! కాకపోతే హైజాకులతో, మీడియా ప్రచారంతో, చాపక్రింద నీరులా చల్లగా, మరెవ్వరినో బాధ్యులని చేస్తూ నిర్వహించుకుపోయేవారు. ఇంతగా బహిర్గతం కాకుండా జాగ్రత్తగా చేసుకునేవారు. ఇదంతా ఎలా జరుగుతుందో, ఈ విషయమై నెం.5 వర్గపు పనితీరు ఏమిటో వివరంగా చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

ఆదిలక్ష్మి గారూ,
ఇప్పుడే మీ టపాలు చాలా చదివాను....నిజంగా అమ్మ వళ్ళో పడుకోబెట్టుకుని కథలు చెప్తూ మధ్యలో ధర్మాన్ని,నీతిని,లోకాన్ని నేర్పుతున్నట్టుగా ఉంది....మీ టపాలు, గీతాధర్మంతో హిందూమతాన్ని,భారతీయ సనాతనధర్మాన్ని రక్షించడానికి మ్లేచ్ఛ్హులమీద,విషవృక్షాలమీద సంధించిన అర్జునుడి అమ్ములా,గీతాచార్యుని వాడంచుల సుదర్శనంలా ఉన్నాయ్...మీ అమ్మ కడుపుచల్లగా మీరు ఇలానే కలకాలం బ్లాగాస్త్రాలని సంధిస్తూ ఉండాలని "అమ్మ"ని కోరుకుంటూ...
కౌటిల్య.

కౌటిల్య గారు,

మీ అభిమానానికి ధన్యవాదాలు! ఇప్పుడే మీ బ్లాగు చూసాను. పోతన పద్యాలు వివరణలతో ఎంతో బాగుంది. పోతన భాగవతంలో సృష్టి ఆదిలో బ్రహ్మ దేవుడు తన ఆది తెలుసుకోవాలని తామర తూడులో ప్రయాణించి, తెలుసుకోలేక వెనుదిరిగి వచ్చి, పద్మాసనుడై "తన్నుగన్న వానిని తనలోనే గనెను" అన్న పాదం ఉన్న పద్యం నాకు పంపగలరా?

"అన్నింటికంటేఉత్తమమైన గుణం ఏది?” అన్న ప్రశ్నకు
ప్రవక్తముహమ్మద్ “ఆకలి గొన్నఅన్నార్తులకు, పేదవారికి అన్నంపెట్టడం,పరిచయంఉన్నవారికీ లేనివారికీకూడానమస్కారం (సలాము) చేయడం" - అని జవాబిచ్చారు.

ఆదిలక్ష్మి గారూ,
నా దగ్గర భాగవతం అన్ని భాగాలూ లేదు..మిగతా భాగాలు నాన్నగారి దగ్గర ఉన్నై..వారిప్పుడు ఇంట్లో లేరు..ఊరెళ్ళారు...రాగానే కనుక్కుని చెప్తాను,,కాని ద్వితీయస్కంధంలో మొదట,శుకమహర్షి బ్రహ్మ పుట్టుక,హరి వరాలివ్వటం చెప్తారు..కాని అక్కడ మీరు అడిగిన పద్యం లేదు...ఈ పద్యం చిన్నప్పుడెప్పుడో విన్నాను...సరిగ్గా గుర్తులేదు కూడా..

రహంతుల్లా గారు : మంచి విషయం చెప్పారు. నెనర్లు!

కౌటిల్య గారు : అడిగిన వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు. నా దగ్గర అన్ని స్కంధాలు ఉండేవండి. అప్పుడు చదివాను. అయితే ఆ పద్యం పూర్తిగా గుర్తులేదు. సూర్యాపేటలో ఇంటి సామాగ్రితో పాటు ఈ పుస్తక సంపదంతా పోగొట్టుకున్నాము. నెనర్లు!

నెం.౫ వర్గం మీద మీరు వ్రాయనున్న వ్యాసంకొఱకు ఎదురుచూస్తున్నానండీ.

There is no god protecting the Hindus and Muslims. It is they who are destroying each other to protect Him at Babri Masjid and Ramajanmabhoomi. ---B. Premanand

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu