క్రిందటి టపాలో ఉదహరించిన పాట ఒక్కటే కాదు, అలాంటిపాటలు, సినిమా కధా సన్నివేశాలు, అలాంటి కధలు, అదేవిధమైన వాదనలు, అలాంటి జోకులు సినిమాల్లో, వార్తల్లో, ఎక్కడ ఎలా వీలైతే, అక్కడ అలా ప్రచారించారు. ఈ ప్రచారం ఎంత వరకు కొనసాగిందంటే ప్రజలదృక్పదం (యాటిట్యుడ్) పాజిటివ్ నుండి నెగిటివ్ ధింకింగ్ కీ, మంచి నుండి చెడుకీ, సహనం నుండి ప్రతీకారంకీ, ప్రేమ, సహకారం, సహాయం లనుండి ద్వేషానికీ మారేవరకూ కొనసాగింది. ఇదీ గూఢచర్యపు స్లోపాయిజన్.

కానట్లయితే, ఒక సాల్మన్ రష్ది లేదా ఒక తస్లిమా నస్రీన్ ఇస్లాంకి వ్యతిరేకంగా వ్రాస్తె ఉవ్వెత్తున మీడియాలో గొడవ చెలరేగుతుంది. విరుద్దంగా వ్రాసిన రచయిత్రి లేదా రచయితలను చంపమని ఫత్వాలు విడుదల అవుతాయి. క్రైస్తవమో మరో మతం గురించో ఎవరు ఏ విమర్శచేయరు, చేసినా మీడియా ప్రచారించదు. మరి కేవలం హిందుమతం మాత్రమే అంత చేదు లేదా చులకన ఎలా అయ్యింది. ఎవ్వరైన ఎలాంటి జోక్ అయినా వేయగలిగేంత, ఎలాంటి భాషలో నైనా, హిందుమతానికి సంబందించిన ఏ విషయాన్నైనా, విమర్శించ గలిగేంత చులకన ఎలా అయ్యింది?

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే నకిలీ కణికుడి ఏజంట్లు, తమకు తాము మేధావులమనుకోంటూ మీడియా ఎక్కించే స్లోపాయిజన్ బుర్ర నిండా నింపుకొని, తెలిసో తెలియకో నకిలీ కనికుణ్ణీ,వాళ్ళ ఏజంట్లనీ అనుసరించే కొందరు భారతీయులూ ఏమని వాదిస్తారంటే – “హిందువులు పరాక్రమ వంతులు కారు. పౌరుష హీనులు. వారికి వారి మతం మీద గౌరవం లేదు. కాబట్టి తమ మతం, తమ ఇతిహాసాలు విమర్శించినప్పుడు వారు తమ నిరసననీ, వ్యతిరేకతనీ వ్యక్తీకరించడం లేదు. కావాలంటే చూడండి, హిందు మతాన్ని విమర్శిస్తోంది, జోకులేస్తుంది హిందువులే. ఇతర మతస్తులు కాదు.”

ఇక్కడ కుట్ర ఏమిటంటే ఉషశ్రీలూ, విశ్వనాధ లాంటి వారు హిందుమతం లోని గొప్పదనం చెబితే మీడియా ప్రచురించదు, ప్రచారించదు. అదే రంగనాయకమ్మలు, హేతువాద సంఘాలూ విమర్శిస్తే ప్రచురిస్తుంది, ప్రచారిస్తుంది. అంతే కాదు ఈ నకిలీ కణికుడి విభజించి ప్రచారించమన్న కుటిల నీతిలో - కొందర్ని లేదా కొన్నిమతాలవారిని రెచ్చగొట్టడం, కొందర్ని లేదా కొన్ని మతాల వారిని ఆత్మగ్లానికి గురి చేయడం, కొందరికి లేదా కొన్ని మతాలకి విపరీతమైన కవరేజి (సానియామీర్జాలకి లాగన్న మాట) ఇవ్వడం, కొందరికి లేదా కొన్ని మతాలవారిని నిర్లక్ష్యం చేయటం (నైనా సెహ్వాల్ ల లాగా అన్నమాట) ఇవన్నీ భాగాలన్నమాట.

సరే!

ఇక పై వాదనకు సమాధానం చెప్పేముందు, మీకు ఓ చిన్న ఉదాహరణ వివరిస్తాను.
పదిమంది కుటుంబ సభ్యులున్న కుటుంబం ఉందనుకోండి. అందులో ఇద్దరు నానమ్మ, తాతయ్య. మరో ఇద్దరు అమ్మా, నాన్న. మిగిలిన 6 గురు పిల్లలు. ఇంట్లో నలుగురు పెద్దలూ నీతి నిజాయితీలని, మానవతా విలువల్నీ, వ్యత్తి ధర్మాన్ని, మొత్తంగా చెప్పాలంటే భావవాదాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారనుకొండి. వారిని [మెటీరియలిస్టిక్ గా] పదార్ధవాదులుగా, డబ్బు మనుషులుగా[కమర్షియల్] మార్చేందుకు వారిపై ఓ కుట్ర రచించి అమలుచేయబడుతోంది అనుకోండి. ఓ ప్రణాళికా ప్రకారం ఆ కుటుంబపు ఆదాయ వనరులు తగ్గుతూ, ఖర్చులు పెరిగిపోయేలా పరిస్థితులు మారతాయి. కొంతకాలానికి బాల్యం కారణంగా వ్యక్తిత్వం ఏర్పడని పిల్లలు, అనుభవలేమి కారణంగా సరైన దృక్పధం ఏర్పడని పిల్లలు, తల్లితండ్రుల మీద, ఇంట్లోని పెద్దల మీద అసంతృప్తి చెందుతారు.

మౌలికంగా ’మానవుని కోర్కెలు అనంతం. వనరులు పరిమితం!’ ఇది అర్ధశాస్త్రంలోని తొలివాక్యం.

అలాంటప్పడు పిల్లలకి పెద్దల మీద అసంతృప్తి రావడం అన్నది అసహజం కాదు. ఈ లోపున సంపద తరిగి దారిద్ర్యానికీ, పస్తులకీ పరిస్థితి దారి తీసిందనుకొండి. ఖచ్చితంగా ఆకలి వాళ్ళని భావవాదాన్ని, మానవతా విలువల్ని వ్యతిరేకించేలా చేస్తుంది. [ముంబాయి ముట్టడిలో పట్టుబడ్డ ’కసబ్’ ఇందుకు తాజా ఉదాహరణ.]

దీనికి ఉత్ర్పేరకంగా ఇరుగుపొరుగూ వారు ఈ పిల్లలకి బుర్ర కడుగుడు [బ్రెయిన్ వాష్] చేశారనుకొండి, నల్లమేక - నలుగురు దొంగలు కథలో లాగా. “చూడండి. ఇతరులందరూ ఎంతో అభివృద్ధి చెందారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ భాగ్యవంతులైనారు. కేవలం మీరు మాత్రమే పేదరికంలో ఉన్నారు. [విభజించి - ప్రచారించే కణిక నీతిలో చాలా దేశాలు పేదలే] మీ కుటుంబ పెద్దలు ఐడియలిస్టులే [భావ వాదులే] కాదు, ఇడియట్స్ కూడా! రోజులు మారిపోయాయి. నీతి నిజాయితీ అంటే నడవదు. [ఈ వాదన విని చాలా మంది అవినీతి పరులైతే సమాజం ఎలా ఉందో ఇప్పడు మనకి ప్రత్యక్షానుభవం కదా!] నీతి నిజాయితీల గురించి మాట్లాడితే వినడానికి బాగుంటుంది. కానీ ఆచరించడానికి పనికి రావు. ఈ దృక్పధానికి పేదరికమే ఫలితంగా వస్తూంది. నిజం, ధర్మం, పురాణాలు, పాపం పుణ్యం, చరిత్రా, పాపభీతి తొక్కాతోలు అన్నీ ఉత్త చెత్తమాటలు. మీ పెద్దల్ని ఎదిరించు. నిర్లక్ష్యం చెయ్యి. వాళ్ళకి తాము విలువలున్న వ్యక్తులు, మంచివాళ్ళు అనిపించుకోవాలన్న ధ్యాస తప్ప మరొకటి లేదు. మీ సుఖ సంతోషాలూ, మీ భవిష్యత్తు వాళ్ళకి పట్టడం లేదు. ఒకరకంగా చూస్తే మీ పెద్దలు స్వార్ధపరులు. స్వార్ధం అన్నది పదార్ధం, డబ్బు పట్లే కాదు, [ఫీలింగ్స్] భావనలపరంగా కూడా ఉండవచ్చు. అంతేకాదు మీ తల్లితండ్రులు, తాతయ్యలూ అందరూ వృద్దులూ, అహంకారులూ. అందుకే మీ వాదనని పట్టించుకోవడం లేదు. ఇది అన్ని చోట్లా ఉన్నదే. తరాల అంతరం! వాళ్ళకి మిమ్మల్ని అర్ధం చేసుకోనేంత తెలివి లేదు. వాళ్ళకి సామర్ధ్యం లేదు. సరి కదా ఈ అభివృద్దిని అర్ధం చేసుకొనేంత సీన్ లేదు. కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దు. గౌరవించవద్దు.”

నలుగురు దొంగలు కాకపోతే 40 మంది లేకుంటే ఇంకా ఎక్కువమంది పదే పదే అదేప్రచారం, అదే విభజించి పాలించమనే కణిక నీతి అమలుచేస్తే ఏం జరుగుతుంది? సహజంగా ఆ కుటుంబంలోని కొందరు పిల్లలైనా ఇరుగుపొరుగు వారి మాటలకు ప్రభావితులౌతారు. కుట్రదారులకు మద్దతుదారులౌతారు. తమ కుటుంబం మీద తామే కుట్రల్ని అమలు చేస్తారు. ఫలితం - కుటుంబం కూలిపోతుంది.

అంతేగాక, చుట్టు ఉన్న ఇరుగూ పొరుగు డబ్బు గడిస్తూ, ధనంతో సుఖిస్తూ ఉన్నట్లు కనబడతారు గనుక ఈ పిల్లలకి వాళ్ళ పట్ల ఆకర్షణ పెరుతుతుంది. [సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారని ఎందుకంటున్నానంటే 1990లో USSR కూలిపోయేవరకూ అలాగే కన్పించింది. లెనిన్ గ్రాడ్ సెయింట్ పీటర్స్ బర్గ్ అయ్యాక, రష్యా బాలలు అక్కడ విదేశీ టూరిస్టులని బిచ్చమెత్తుకొంటున్నప్పడు తెలిసింది, మానసిక ఉన్నతి లేని అభివృద్ధి కాగితం పడవనీ, ఎప్పుడైనా మునిగిపోగలదని. అంతెందుకు ఇప్పడు సబ్ ప్రైమ్ తో అమెరికా నుండి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇది కనిపించడం లేదా? ఎంతో అభివృద్ధి చెంది, అందరికీ కార్లుండే అమెరికాలో ఉన్నట్లుండి ఉద్యోగం పోతే 5 లేదా 6 నెలల్లో, కుటుంబాలు రోడ్డున పడతాయంటే ఈ ఆర్ధిక అభివృద్ధి ఎంత ’తుమ్మితే ఊడే ముక్కు’లాంటిది?]

మళ్ళీ మన ఉదాహరణ దగ్గరి కొద్దాం. ఎలాగూ పిల్లలకి తమ పట్ల ఆకర్షణ పెరిగింది కనుక, చల్లగా పొరుగువారు ఈ కుటుంబాలలో మరిన్ని విభజనలు చేశారనుకొండి. ఆడమగా అనీ, పెద్దలూ పిన్నల తరమనీ, సంపాదనా పరులూ కానివారూ అని, - ఇలాగన్న మాట. అప్పడేమౌతుంది. కుటుంబంలోని వ్యక్తులు తమ వేలితో తమ కన్నే పొడుచుకుంటారు. ఇలా అందరూ గుడ్డివాళ్ళయితే వాళ్ళని ఎక్స్ ప్లాయింట్ చేయటం [దోచుకోవటం] తేలిక. ఇకదాని మానవవనరుల్ని, శక్తి సామర్ధ్యాలనీ తేలిగ్గా, చౌకగా, చక్కగా వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఇకవారి ఆస్తుల్ని దోచడం తేలిక. అప్పటికే పేదలైపోయారు కనుక దోచుకోవడానికేముంది బూడిద అనుకోకండి. మానసికంగా గుడ్డివాళ్ళయినా, ఇంకా వారికి ఇతర నైపుణ్యాలున్నాయి. అవి ఉపయోగించి, కుట్రదారులు తక్కువ ఖర్చుతో సంపదని సృష్టించుకోవచ్చు.

ఇదీ ఉదాహరణ.

వాస్తవానికి కుటుంబం సమాజానికి ప్రామాణికం వంటిది. కొన్ని కుటుంబాలు కలిసి ఓగ్రామం, ఓ కాలనీ. కొన్ని గ్రామాలు లేదా కాలనీలు కలిసి ఓ పట్టణం లేదా నగరం. కొన్ని నగరాలూ, గ్రామాలు కలిసి రాష్ట్రం. రాష్ట్రాలు కలిసి దేశం.

పైన నేను ఇచ్చిన ఉదాహరణలో కుటుంబం భారతదేశానికి, హిందూ సమాజానికి ప్రతీక. కుటుంబ సభ్యులు వివిధ వర్గాల ప్రజలకి ప్రతీకలు. ఇరుగుపొరుగులు నకిలీ కణికుడి అనుచరులకి ప్రతీకలు. కుటుంబసభ్యులపై ఇరుగుపొరుగు చేసిన బ్రెయిన్ వాష్ మీడియా, సాహిత్య, సినిమా రంగాలు చేస్తూన్నాయి. ఇదంతా 3 నుండి 4 దశాబ్దాల కాలంలో మరింత ఊపందుకొన్నాయి.

ఇదే మాదిరి కుట్ర వివిధ దేశాల మీదా జరుగుతుండవచ్చు. వ్యక్తుల పేర్లు, పైకారణాలు మారవచ్చు.

ఏ దేశమైనా కానివ్వండి, ఏ జాతిప్రజలు కానివ్వండి, ఎవ్వరు కుట్రదారులు కానివ్వండి, కుట్ర విధానం ఏదైనా కానివ్వండి, కుట్ర ఉద్దేశం మాత్రం ఒకటే - మనుష్యుల్ని సున్నితమైన భావోద్వేగాలకు దూరం చేసి, పగా ప్రతీకారం లాంటి అరిషడ్వర్గాలకి దగ్గర కేసి, కమర్షియల్ మైండెడ్ గా ఉండే రోబోల్ని చేయడం. అప్పడు ఈ నకిలీ కణికుడికి, అతడి అనుచరులకీ జనాల శక్తి, సామర్ధ్యాలు నైపుణ్యాలూ చౌకగా సంపద ఉత్పత్తి వనరులుగా దొరుకుతారు.

దశాబ్దాల, ఇంకా చెప్పాలంటే 2 శతాబ్దాల కుట్ర ఇందుకే. అందుకే చంద్రబాబు నాయుడు లాంటి కొందరు రాజకీయ నాయకులు పిల్లల పాఠాల నుండి చరిత్రని ఎత్తేయాలని[రద్దు చేయాలని] అన్నారు. ఎందుకంటే చరిత్ర చదివితే మనకి కుట్ర అర్ధం కావచ్చు, లేదా మన వారసత్వం, శక్తీ మనకి గుర్తు రావచ్చు లేదా మనకి మన పరిస్థితి పట్ల అవగాహన రావచ్చు. సమాజం నుండి చరిత్రని రూపు మాపెస్తే ఇక మనం గత చరిత్రనుండి పాఠాలు నేర్చుకోలేం, మన వర్తమాన సమస్యలకి గత చరిత్ర నుండి పరిష్కారాలు వెదుక్కోలేం, మన పూర్వుల, పెద్దల అనుభవాన్ని వినియోగించుకోలేం. అప్పుడు కుట్రని మరింతగా కొనసాగించడం ఎంత సులభం? కాకపోతే ఎందుకు పిల్లల పాఠ్యాంశాల నుండి చరిత్రని తొలగించడం లేదా సారం మొత్తం తీసి చరిత్రని మూడు ముక్కలలో చెప్పడం లేదా వక్రీకరించటం? మన అంతర్జాలం [ఇంటర్ నెట్] లో ఏదైనా సమస్య ఎదుర్కొనప్పడు FAQ చూస్తాం, మరెవ్వరికైనా గతంలో ఇలాంటి సమస్య వచ్చిందా, వస్తే ఎలా పరిష్కరించుకొన్నారని తెలుసుకొనే ప్రయత్నం చేస్తాం. అదే మానవ సమాజంలో చరిత్ర మాత్రం వద్దా?] భారతదేశం మీద జరుగుతున్న కుట్రలో భాగంగా, చరిత్రనే సమాజం నుండి రూపుమాపే ప్రయత్నమే ఇంతగా జరిగినప్పడు - ఇక భారతీయ ఇతిహాసాల్ని రూపుమాపేందుకు, నిర్లక్ష్యపరిచేందుకు, అవమానించేందుకు ఇంకెంత తీవ్ర ప్రయత్నం జరిగి ఉంటుందో ఊహించండి.[సజీవ ఉదాహరణ కావాలంటే 4,5 తరగతుల చరిత్ర పాఠ్యపుస్తకాలు చూడండి. స్వాతంత్ర సమరయోధులూ, సంఘ సంస్కర్తల జీవితచరిత్రలు ఎంత రసహీనంగా, అస్సలే మాత్రం పిల్లలకి స్ఫూర్తినివ్వకూడదన్నట్లు వ్రాయబడి ఉంటుందో! వారి జీవితాల్లోని ఏ స్ఫూర్తిదాయక సంఘటనా ఉండదు. కేవలం ఎక్కడ ఏసంవత్సరంలో పుట్టారు, ఏ సంవత్సరంలో బారిష్టరు చదివారు, ఏ సంవత్సరంలో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టారు, స్వాతంత్రానంతరం కూడా బ్రతికి ఉంటే ఏఏ సంవత్సరాలలో ఏఏ పదవులు నిర్వహించారు, ఏ సంవత్సరంలో మరణించారు - ఈ గణాంకాలే ఉంటాయి. అదే నాచిన్నప్పడు [అంటే ఇందిరా గాంధి హయాంలో అన్నమాట] పాఠ్యాంశాలు ఇలా ఉండేవి కావు.

ఓ పాత ఉదాహరణ చూడండి. నాచిన్నప్పడు 6 తరగతి పాఠం - ఓ చిన్న బాలుడికి పచ్చకామెర్ల జబ్బుసోకింది. ఆనాటి వైద్యుడు వాతలు పెట్టాలని సూచించాడు. కష్టమైనా పెద్దలు ఆమోదించారు. వైద్యుడు చిన్న ఇనపచువ్వని కాల్చాడు. ఆ బాలునికి 10 ఏళ్ళుంటాయి. నిమ్మ పండు రంగులో మిసమిసలాడుతున్న బాలుడి దేహంపైన ఇనపచువ్వతో వాత పెట్టాలంటే వైద్యుడి చెయ్యి వణుకుతోంది. కొద్దిసేపు ఇదంతా గమనించిన ఆ బాలుడు గభాలున వైద్యుడి చేతిలోని కాలుతున్న ఇనుప చువ్వని తన చేతుల్లోకి తీసుకొని తనకు తనే వాతలు పెట్టుకొన్నాడు. ఆ బాలుడి ధైర్య స్ధైర్యాలకి అందరూ నివ్వెరపోయారు.

పసితనం లోనే అంతటి తెగువని చూపిన ఆ బాలుడే సర్ధార్ వల్లభాయ్ పటేల్. సుమారు 550 సంస్థానాల్ని [నిజాంతో సహా] భారత్ లో విలీనం చేసిన ధైర్యశాలి. ఇలాంటి వెక్కడా ఈనాటి చరిత్రపాఠాల్లో ఉండవు. మేం 5వ తరగతిలో ఉండగా మా పంతులమ్మగారు చెప్పిన అల్లూరి సీతా రామరాజు పాఠం అయిపోయేటప్పటికి మా అందరి కళ్ళల్లో నీళ్ళు. ఇప్పుడలా ఎక్కడైనా ఊహించగలమా?]

ఈ రెండు దృష్టాంతాలతో మీరు చరిత్ర చదవటం యొక్క ప్రభావం ప్రజల మీద ఎంత ఉంటుందో, అలాంటప్పడు చరిత్ర రూపు మాపే ప్రయత్నం నకిలీ కణికుడు, అతడి ఏజంట్లు చేస్తారో చేయరో ఊహించండి. అలాంటప్పడు ఇక ఇతిహాసాల మీద మరింత తీవ్రప్రయత్నం చేస్తారో అర్ధం చేసుకోండి.

మరోసారి సత్యహరిశ్చంద్రుడి కథ దగ్గరకి వద్దాం.

ఓ 100 మంది సభ్యులున్న ఓ సమాజం ఉందనుకొండి. ఆ వందమందీ ఎప్పడు నిజమే చెప్పే రకం అనుకొండి. అప్పడా సమాజంలో సుఖశాంతులుంటాయి. వందమంది ఆ[అడ్వాంటేజ్] ప్రయోజనం పొందుతారు.

వందమందిలో 90 మంది ఎప్పడూ నిజం చెప్పేరకం, 10 మంది అబద్దాలు చెప్పే రకం ఉన్నారనుకొండి. అప్పుడా 10 మందీ ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే నిజం చెప్పే 90 మందీ, అబద్దాలాడే ఈ 10 మందినీ వాళ్ళూ తమలాగే నిజం చెప్పేవాళ్ళని నమ్ముతారు కాబట్టి.

అదే వందమందిలో 10 మాత్రమే నిజం చెప్పేరకం, 90 మంది అబద్దాలాడే వాళ్ళు ఉన్నారనుకొండి. అప్పడు 10 మంది నిజం చెప్పేవాళ్ళే డిస్ అడ్వాంటేజ్ [ఇబ్బందులు] పడతారు. ఎందుకంటే అబద్దాలాడే 90 మంది, నిజం చెప్పే ఈ 10 మందినీ నమ్మరు, వాళ్ళు తమలాగే అబద్దాలాడతారనుకొంటారు కాబట్టి. ఒకవేళ ఈ 10 మందీ నిజమే చెబుతారని గమనిస్తే ఎక్స్ ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి.

ఇక వందమందీ అబద్దాలాడే రకమే అనుకొండి. అప్పడు సమాజం భయోత్పత స్థితికి చేరుకుంటుంది. అక్కడ సుఖమూ, శాంతి ఉండవు. అప్పుడు అందరికీ ఒరిగేది డిస్ అడ్వాంటేజే[ఇబ్బందులే].

ఈ నాలుగు స్థితుల్లో ఇప్పడు మన సమాజం ఏ స్థితిలో ఉందో మీరే విశ్లేషించండి.

నిజానికి ఈ నాలుగు స్థితులూ మన పెద్దలు చెప్పిన నాలుగు యుగాలు[కృత,త్రేతా, ద్వాపర, కలి] వంటివి.

ప్రస్తుతపు సమాజ స్థితికి మరో ఉదాహరణ చెప్పాలంటే - కొంతమంది ఓ వృత్తాకారంలో నిలబడ్డారనుకొండి. ప్రతీ ఒక్కరు తమ కుడివైపు వారిని చెంపదెబ్బ కొడుతున్నారునుకొండి. తిరిగి వచ్చి ఆ దెబ్బ తమకీ తగులు తుంటుంది. ఆ కసితో మనం ప్రక్కవాణ్ణి మరింత గట్టిగా కొడతాం. వాడు ఆ ప్రక్కవాణ్ణి మరింత గట్టిగా ..... అలా అలా... చివరకి వారికి తగిలే దెబ్బల్లోనూ గాఢత పెరుగుతుంటుంది. అబద్దం, అవినీతి, మోసం చెంపదెబ్బలాంటివే. అప్పుడు ప్రతీవాడు బాధితుడే. [ఓ డాక్టరు పేషంట్లని పిండి సంపాదించిన సొమ్ముని మరో కార్పోరెట్ స్కూలుకో, కాలేజీకో సమర్పించుకొని తమపిల్లల్ని చదివించుకోవలసిందే. ఒకచోట దోచుకొని, మరోచోట దోచుకోబడి. కుడివైపు వాణ్ణి చెంపదెబ్బ కొట్టి, ఎడమవైపున ఉన్నవాడి చేతిలో మనం చెంపదెబ్బ తినటం లాంటిదే ఇది.] ప్రస్తుతం మనం ఇలాంటి సమాజంలోనే బ్రతుకుతున్నాం.

ఎవరిలా చేసారు మనల్ని?

ఎందుకీ స్థితి దాపురించింది?

నిజమే, ఇది నకిలీ కణికుడి కుట్ర. కాని మనం కూడా పరుగు పరుగున వచ్చి ఈ నరకం లో పడ్డాం కదా?

ఒక మోసం, ఒక దగా జరిగితే లేదా ఒక కుట్ర జరిగితే, అందులో మోసగించేవాడి తెలివికి లేదా కుటిలతకీ ఎంత పాత్ర ఉందో, మోసగింపబడిన వాడి తెలివితక్కువకీ లేదా నిర్లక్ష్యానికీ అంతే పాత్ర ఉంది.

కాబట్టే మనం, స్వయంగా మన భారతీయులం - తెలిసో తెలియకో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో - ఈ నకిలీ కణికుడికో, అతడి ఏజంట్లుకో సహాయం పడ్డాం, సహకరించాం. కనుకనే నకిలీ కణికుడు, అతడి వ్వవస్థా కలిసి మన బ్రతుకుల్నీ, మన సమాజాన్ని, మన యువతరాన్ని, మన భవిష్యత్తునీ ధ్వంసం చేయగలుగుతున్నారు.

ఈ నేపధ్యంలో మన ఇతిహాసాల, పురాణాలను అగౌర పరచడానికి, అనాదరణ పాలు చేయడానికి జరిగిన కుట్ర రూప స్వభావాల్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

నిజానికి, హిందూ మతం, హిందూ పురాణాలు, ఇతిహాసాలు భావ వాదత్మకమైనవి.[ఐడియాలిస్టిక్] బహుశః చాలా మతాలు కూడా ఐడియాలిస్టిక్ అయిఉండవచ్చు.

వాస్తవానికి హిందూ మతం ఒక మతం కాదు.

అది ఒక జీవన సరళి.

అది ఒక దృక్పధం.

అది ఒక ధర్మచింతన.

అది ఒక ప్రణాళికాబద్దమైన క్రమశిక్షణాయుతమైన కర్తవ్యాచరణ, పనితీరు[పండగలు, ఆచారాల పేరిట ఉన్నది ఆ క్రమశిక్షణే]

ఆ ప్రణాళికా బద్ధమైన, క్రమశిక్షణని బద్ధలు కొట్టడానికి, నీతిగా ఆలోచించడాన్ని అవినీతివైపు మళ్ళించడానికి, డబ్బుని గాక గుణాన్ని చూసే దృక్పధాన్ని మార్చడానికి, ఈ జీవన శైలిని నాశనం చేయడానికి - నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థా పనిచేస్తోన్నాయి.

నిజానికి రామాయణం, భారతం కేవలం భారతీయుల రెండు ఇతిహాసాలు కావు. అవి భారతీయులకి రెండు కళ్ళువంటివి. ఇక్కడ కేవలం ‘భారతీయులు’ అన్నపదాన్ని భారతీయ సంస్కృతి కి పర్యాయ పదంగా వాడుతున్నాను. ఎందుకంటే హిందూ సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి భారతీయుల్లో మతానికతీతంగా ఇంకిపోయింది. మతాల కతీతంగా భారతీయులందరూ విధిని, నుదుట వ్రాతని నమ్ముతారు. కాబట్టే నేను ’హిందూ’ అన్న పదానికి బదులుగా ‘భారతీయ’ అనివాడుతున్నాను. విధి అన్న సిద్ధాంతం భారతీయుల రక్తంలోనూ, జీన్స్ లోనూ ఉంది. వేయి సంవత్సరాల క్రితం భారత దేశంలో హిందువులు, బౌద్దులు, జైనులూ లాంటి భారతీయ హిందూ సోదర మతాలు తప్ప ఇస్లాం, క్రైస్తవం లేవు. ఈ నాటి ముస్లిం, క్రైస్తవుల ముందు తరాల వాళ్ళల్లోనూ ఉన్నవి భారతీయుల జీన్సే. కాబట్టే వారి దృక్పధమూ, వారసత్వమూ, సత్యం, ధర్మం, మంచి చెడుగూ పట్ల నమ్మకాలు భారతీయ తత్త్వన్ని దాటిపోవు. అలాంటి వారసత్వం కారణంగానే ఈ నాటికీ భారతీయులందరూ మతాల కతీతంగా శాంతిప్రియులూ, సహనపరులూ గానే ఉన్నారు. కాబట్టే ఈ నకిలీ కణికుడికి కూడా పాతబస్తీలాంటి ప్రాంతాలలో సైతం తక్కువమందే ఉగ్రవాదులు లభిస్తున్నారు. అందుకే పాకిస్తాన్ మీదా, ఆఫ్గానిస్తాన్ ల మీదా ఆధారపడుతున్నాడు. సింధూ దాటితే ఆఫ్గాన్ ఇసుక పర్రలే. అక్కడి వాళ్ళు అఖండ భారతం భాగస్తులైనా భౌతికంగానే, భావపరంగా కాదు. అందుకే ఆ రక్తానికి భారతీయుల రక్తానికీ శాంతి సహనాల్లో అంత తేడా! సామర్ధ్యాల్లో సైతం అంత తేడా!

కాబట్టే ప్రపంచ ముస్లింలలో భారతీయ ముస్లింలు వేరు. ప్రపంచముస్లింలతో పోలిస్తే భారతీయ ముస్లింలకు మరిన్ని మానవతా విలువలు, నీతి నిజాయితీలూ ఉన్నాయి. కాబట్టే భారతీయ ముస్లింలు అరబ్బు ముస్లింలా, షేక్ ల చేతిలో దగా పడుతున్నారు గానీ, భారతీయ ముస్లింలు ఇతర దేశాల ముస్లింలని దగా చేయడం లేదు. ఇక్కడి పేద ముస్లిం ఆడపిల్లల్ని అరబ్ షేక్ లు పెళ్ళి పేరుతో తీసుకుపోయి దగాచేయటం, దారుణంగా, హింసాత్మకంగా ఉపయోగించుకోవటం విన్నాం, చూశాం గానీ, భారతీయ ముస్లింలు ఇతరుల్ని అలా చేయటం వినలేదు, చూడలేదు. భారతీయ ముస్లిం పేద చిన్నారుల్ని అరబ్బుషేకులు కొనుక్కుపోయి ఒంటెల మూపురాలకు కట్టి పరుగులు తీయించి పైశాచిక అనందాన్ని అనుభవిస్తారని వార్తలు చదివాం గానీ భారతీయ ముస్లింల గురించి అలాంటి కౄరకృత్యాలు వినలేదు. భారతదేశంలో డబ్బులున్న ముస్లింలు సైతం ఇలాచేయటం వినలేదు.

ఇక్కడ నేను ‘భారతీయ ముస్లిం’ అంటున్నది సాధారణ ముస్లిం పౌరులని మాత్రమే.

MIM పార్టీ రాజకీయ నాయకులని కాదు.

ఇతరుల్ని చంపమని ఫత్వాలు విడుదల చేసే ముల్లాలని కాదు.

మత ఘర్షణలని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే ఇమాం బుఖారీలని కాదు.

పాక్, బంగ్లా, ఆఫ్గాన్ ఉగ్రవాదులు భారతదేశం మీద బాంబులేసేందుకు వస్తే వారికి అన్నవసతి సౌకర్యాలు సమకూర్చే
హైదరాబాద్ పాత బస్తీలోని కొందరు ముస్లింలని కాదు.

వీళ్ళంతా ఈ నకిలీ కణికుడి వ్యవస్థలో భాగాలు, అతడి ఏజంట్లు.

కుట్రలోని ఈ కోణాన్ని, భారతీయ మూలాలపై నకిలీ కణికుడి కుట్ర అన్న అంశంలో [హిందూ ఉగ్రవాదుల్లా ప్రవర్తించే బి.జె.పి., సంఘ్ పరివార్, ఆరెస్సెస్, శివసేన ల పాత్రతో సహా] వివరంగా చర్చిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

ఇంతకీ ఈ కుట్రలన్నీ ఎవరు చేస్తున్నారంటారూ?????

kutradaarulaku tappa amdarikee ardhamvutaayanu kumtunnaanu mee visleshanalu. konasaagimchamdi.dhanyavaadaalu

మంచి విశ్లేషణ.

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

అద్భుతం

నాకు చాలా కాలం గా ఒక డౌట్, రాజకీయ నాయకుల సభలలో ఎదుటి పక్షం వాళ్ళని , వాళ్ళు మనలని ఎంత నాశనం చేసారో ఆవేశం గా చెబితే జనం చప్పట్లు కొడాతాలు , కొట్ట క పోతే కొట్టిస్తారు, అదేమయిన సంతోషించదగిన విషయామా, ఇదే విషయాన్ని మీ బ్లోగ్ లో కూడా చూస్తున్నాను , మనం మోసపోతున్నామని, కుట్రలు జారుతున్నాయని నెత్తి నోరు కొట్టుకొంతుంటే , అధ్భుతంగా చెప్పారు అంటారెంటీ చాలామంది

శ్రీకాంత్

శ్రీకాంత్ రెడ్డి గారు,
మీ అభిప్రాయం మీరు చెప్పారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu