Showing posts with label భారతీయత మీద ఆర్దిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర. Show all posts
Showing posts with label భారతీయత మీద ఆర్దిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర. Show all posts

అభివృద్ధి పేరుతో, విస్తరిస్తున్న నగర సంస్కృతితో, వ్యవసాయాన్ని మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, ప్రకృతి కడుపులో చిచ్చు పెడితే… అది సర్వనాశనానికే దారి తీస్తుంది.

దాని పేరు కాలుష్యం కావచ్చు, కార్చిచ్చు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, సునామీలు వరదలూ భూకంపాలూ కూడా కావచ్చు. కాబట్టే దేనికైనా ఓ హద్దు అవసరం అని పెద్దలన్నది!

ఈ విషయాన్ని ఎంత హృద్యంగా చెబుతుందో భాగవతంలోని దేవహూతి కథ!

బ్రహ్మదేవుడు సృష్టి గురించి ఆలోచన చేస్తుండగా ఆయన నాలుగు ముఖాల నుండి బుగ్యజుస్సామ అధర్వణ వేదాలు పుట్టాయి. అలా సర్వశాస్త్రలూ ప్రభవించాయి.

ప్రజాసృష్టి గురించి ఆలోచన చేయగా స్వాయంభువ మనువు, ఆయన భార్య శతరూప ప్రభవించారు. [ఇక్కడ ‘ఆలోచన నుండే జనించటం’ గురించి చెప్పబడింది. ‘సంకల్పమే అన్నిటికీ ప్రారంభం’ అని ఇందుకే అంటారేమో! ‘భావం నుండే అన్నీ జన్మించాయి. భావమే తప్ప భౌతిక ప్రపంచం లేదు. అది అభాస మాత్రమే, ఉన్నదను కోవటం భ్రాంతే’ అనే తత్త్వ చింతనకి, ఆధార బీజాలు ఇక్కడ కనిపిస్తాయి.]

ఈ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే కుమార్తెలు కలిగారు. ఉత్తానపాదుడు కుమారుడే ధృవుడు.

ఆకూతిని రుచికిచ్చి, దేవహూతిని కర్దముడి కిచ్చి, ప్రసూతికి దక్షుని కిచ్చి వివాహం జరిపించారు. వీరి వల్ల మానవ ప్రపంచం ప్రవృద్దమయింది.

[ఇది భాగవతం తొలి అధ్యాయాలలో చెప్పబడింది.
దేవహూతిని గురించిన కథ ఇక్కడ వివరిస్తున్నాను.]

ఒకనాడు స్వాయంభువ మనువు, తన కుమార్తె దేవహూతిని వెంట బెట్టుకుని కర్దముని ఆశ్రమానికి వెళ్ళాడు.
వచ్చిన అతిధిని ఆదరించిన కర్దముని తో స్వాయంభువ మనువు “ఆర్యా! ఈమె నా బిడ్డ దేవహూతి. పురుషోత్తముని దర్శించిన వారికి తప్ప అన్యులకు యీమె గోచరించదు. ఈమెను కాముకదృష్టితో చూసిన వారికి ఆ క్షణంలోనే మృత్యువు సంభవిస్తుంది.

అటువంటి శీలవతి, పవిత్ర హృదయ అయిన నా బిడ్డ, నిన్ను భర్తగా వరిస్తున్నది. నీకు అంగీకారమైతే ఈమెను నీకు ధారపోస్తాను”అన్నాడు.

తండ్రి ప్రక్కన నిలబడి ఉన్న ముగ్ధ, దేవహూతి ని చూసి కర్దముడు,

“ఈమెకూ నాకూ గుణ రూపాలలోనే కాక, నడవడిలో కూడా పోలికలున్నాయి. కాబట్టి ఈమెను నేను వరిస్తాను. అయితే ఒక నియమం ఉంది. దాంపత్య జీవితానికి పరమావధి అయిన సంతానం కలగగానే, నేను యోగాభ్యాసంతో శ్రీహరి ధ్యానంలో ఉంటాను. ఆ విధంగా ముక్తి సాధన చేస్తాను. అందుకు అంగీకారమైతే, నీవు నాకు కన్యాదానం చేయవచ్చు” అన్నాడు.

[చూడండి. కర్దముడు దేవహూతి అందాన్నో స్వాయంభువ మనువు సంపదనో పరిశీలించలేదు. ఆమెకూ తనకూ… గుణంలోనూ, రూపంలోనూ, ప్రవర్తనలోనూ పోలికలుండడాన్ని గమనించాడు. అప్పుడే దంపతులు సుఖంగా జీవించగలరని ఆయన ఉద్దేశం. స్వభావంలో, గుణంలో తూర్పు పడమరల్లా ఉన్నా, రూపంలో ఒకరు అందంగా మరొకరు అనాకారిగా ఉన్నా, నడవడికలో ఒకరిది శాంత స్వభావం మరొకరిది క్రోధ స్వభావం గలవారైనా వాళ్ళు ఒకరితో ఒకరు సర్ధుకు పోలేక పోవచ్చు.

ఏమైనా గుణరూప నడవడికల్లో పోలికలున్న వారైతే… కలిసి జీవించడం శాంతీ సంతోషాలాతోనే కాదు, ముక్తి సంపాదించే ప్రయత్నంలో ఒకరికి మరొకరు తోడ్పాటు నివ్వగలరన్నదే ఇక్కడ ఉద్దేశం.]

కర్దముడి అభిప్రాయం, నియమాల గురించి స్వాయంభువ మనువు తన భార్య శతరూపతో, కుమార్తె దేవహూతితో సంప్రదించాడు. వారిద్దరూ అంగీకరించారు. దాంతో దేవహూతిని కర్దముని కిచ్చి వివాహం జరిపించాడు.

[‘ఆఁ ఆడవాళ్ళతోనా వ్యవహారం!?’ అనుకోకుండానూ… ‘మన కుటుంబాల్లో ఆడవాళ్ళని అడిగే అలవాటు లేదు!’ అనకుండానూ… భార్యనీ, కుమార్తెనీ కూడా సంప్రదించాడు స్వాయంభువ మనువు. పెళ్ళి చేసుకోవాల్సింది కుమార్తె గనుక ఆమెనీ, తల్లి గనుక తన భార్యనీ సంప్రదించాడు!]

వివాహానంతరం దేవహూతిని, కర్దమునికి అప్పగించి తిరిగి వెళ్ళే సమయంలో, ఆ తండ్రి హృదయం విషాద భరితం అయింది. ఎంత అపురూపంగా పెంచినా, అనురాగం పంచినా, అప్పటి వరకూ తమ చేతుల్లో ఆడిపాడిన, తమ ఇంట్లో నడయాడిన తమ కన్నబిడ్డ… ఇప్పుడు అల్లుడి సొత్తు! ఒకసారి దానం ఇచ్చాక, ఇక ఆమెపై తల్లిదండ్రుల ప్రమేయమూ, ప్రభావమూ ఉండవు కదా!

బిడ్డను కౌగలించుకుని, శిరసు ముద్దాడి, వెన్నుదువ్వుతూ కొంత సేపు కన్నీరు విడిచి, మనస్సు దిటవు చేసుకున్నాడు. సంసార నౌకలోకి అడుగు పెట్టిన కుమార్తెకు, అల్లుడికి కొన్ని మంచి మాటలు చెప్పి సెలవు తీసుకున్నాడు. దారిలో బ్రహ్మావర్ష దేశంలో విష్ణువరంగా సత్ర్కుతువులు చేసి రాజధాని చేరాడు.

పార్వతీ దేవి పరమశివుని ఆరాధించే రీతిలో, దేవహూతి తన భర్తను సేవిస్తూ, భక్తితో ఆయన శుశ్రూషయే పరమావధిగా భావిస్తూ, కామ క్రోధాది అరిషడ్వర్గాలనీ, అహంకారాన్నీ దరి చేరనీయకుండా, సర్వమూ తనకు భర్తయే అని త్రికరణశుద్దిగా విశ్వసిస్తూ జీవయాత్ర సాగిస్తున్నది.

[సన్మార్గుడైన భర్తని అనుసరిస్తూ సేవించడం సతీధర్మం. అధర్మ పరుడైనా నోరెత్తక పడి ఉండమనే వ్రత కథలూ, కుష్ఠురోగ పీడితుడైనా వేశ్యా సంపర్కాన్ని కోరిన భర్తని గంపలో మోసుకెళ్తూ సూర్యోదయాన్ని ఆపమంటూ సూర్యుణ్ణి శపించబోయిన సతీ సమతుల కథలు ప్రక్షిప్తాల్లో భాగాలు!

హిందూ ఇతిహాసాలని అవహేళన చెయ్యడానికి… సినిమాలలో చూపే విధంగా సాంబారులో తామే బొద్దింకని వేసి, ఆపైన నానా రచ్చ చేసి హోటల్ వాడి నుండి పైకం రాబట్టే రేలంగిలా… హిందూ ఇతిహాసాలపైనా, పురాణాల పైనా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అమలు చేసిన కుట్రలో భాగమే ప్రక్షిప్తాలు! అసలు చరిత్రే వారి దృష్టిలో చింపేస్తే చెరిగి పోయేది. తామేది ప్రచారిస్తే అదే… చరిత్ర అయినా, మరేదైనా!]

ఆ విధంగా తనని సేవిస్తున్న భార్యని చూచి, ఓ రోజు… కర్దముడు “ఇల్లాలా! నీ సేవాభావం నా మనస్సుకి ఆహ్లాదం కలిగించింది. నీకు దివ్యదృష్టి వరంగా యిస్తున్నాను” అన్నాడు.

దేవహూతి చల్లని వెన్నెలలా మందహాస చేస్తూ“స్వామీ! మీ సేవలో మీ సర్వశక్తులూ నాకు లభిస్తాయని తెలుసు.” అంది.

కర్దముడు చిరునవ్వుతో చూసాడు.

ఆమె వినయంగా “మన కల్యాణ సమయాన, మీరు వాగ్ధానం చేసిన సంతాన విషయం విస్మరించరని నమ్ముతాను” అంది.
అంతట కర్దముడు తన శక్తితో మణులు చెక్కిన స్తంభాలతో అలరారే సువర్ణ సౌధాలు కల్పించాడు. దాని నిండా సంసారానికి అవసరమయిన శయ్యాగారాలు, భోజన శాలలు, సువర్ణ పాత్రలు, పట్టు పీతాంబరాలు సృష్టించాడు. భవనం చుట్టూ ఉద్యానవనాలు, వనాలలో లతానికుంజాలు, ఫలవృక్షాలు, శుక పిక సంతతులు, సరోవరాలు, క్రీడామందిరాలు సర్వశోభాయమానంగా ఉన్నాయి. రంగురంగుల పూలు, సుమధుర పరిమళాలు, పూలపై వాలుతున్న తుమ్మెదల అలంకారాలు! పిట్టల కువకువలు, సరోవరాల్లో హంసల విహారాలు!

[ఇంత కంటే గొప్ప విల్లాలను ఏ constructing company కట్టగలదు?]

ఇక వీటన్నిటితో నిండిన దివ్యవిమానం సృష్టించాడు.

అదంతా చూసినా దేవహూతికి సంతోషం కలగలేదు. ఆమె పన్నెత్తి చెప్పకపోయినా, కర్దముడామె హృదయాన్ని గ్రహించాడు.

“ఈ బిందు సరోవరంలో స్నానం చెయ్యి. దానివల్ల అన్నికోరికలూ నెరవేరతాయి” అన్నాడు.

దేవహూతి సరోవరంలో దిగి, స్నానం చేసింది.

ఆమె సరస్సులోకి దిగిన ఉత్తర క్షణం, ఆ నీటిలో నవయౌవన శోభనాంగులు వెయ్యిమంది దాసీలు ప్రత్యక్షమయ్యారు. వారిలో కొందరు ఆమెకి సకల సపర్యలూ చేశారు. భవనాలలో, ఉద్యానవనాల్లో, విమానంలో కావలసిన పనుల్లో కొందరు నిమగ్నమయ్యారు. కొందరామె సేవలో నిమగ్నమయ్యారు.

ఆమెకు చక్కగా అభ్యంగన స్నానం చేయించి, అగరధూపంతో తల ఆర్చి, దువ్వలువలు ధరింప చేసారు. తీరుతీరుగా కురులు ముడిచి పుష్పాలంకరణ చేసారు. రత్నాభరణాలతో అలంకరించారు.బొట్టూ కాటుకలతో ముఖారవిందాన్ని మురిపించారు.

షడ్రసోపేతంగా భోజనం పెట్టి, కర్పూరహారతు లిచ్చి, చక్కని ఆసనం మీద కూర్చుండబెట్టి, ఎదురుగా నిలువెత్తు అద్దం ఉంచారు.

దేవహూతి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ, భర్తను స్మరించింది. ఉత్తర క్షణంలో ప్రక్కగా నిలిచాడాయన.

పెళ్ళినాడు ఏ వయోరూప సౌందర్య లావణ్యాలు ఉన్నాయో, అదే రీతిగా ఈ క్షణంలో ఉన్న దేవహూతిని ప్రియంగా చూస్తూ, భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు కర్దముడు. దాసీజనాలతో కూడా దంపతులు విమానం ఎక్కారు.

సర్వసుఖ సౌకర్యాలతో ఉన్న ఆ విమానంలో సకల లోకాలూ తిరిగి వచ్చారు దేవహూతి, కర్దములు. [ఇంతకంటే గొప్పదైన హనీమూన్ ప్యాకేజీని ఏ అంతర్జాతీయ సంస్థ అయినా ఇవ్వగలదా!?]

విహార యాత్ర అనంతరం, తన నివాసానికి వచ్చి, దేవహూతితో సాంసారిక సుఖభోగాలను అనుభవిస్తూ కొంతకాలము గడిపారు. ఆ రోజులలో కర్దముని అనుగ్రహంతో దేవహూతి తొమ్మండుగురు ఆడపిల్లలను ప్రసవించింది.

అప్పుడు కర్దముడు సన్యాసాశ్రమం స్వీకరించబోగా, ఆమె ఆయన పాదాలపై వ్రాలి “స్వామీ! ఈ బాలికలకు వివాహం చేసి, నాకు తత్త్వోపదేశం చేయగల కుమారుని దయచేసి మీరు సన్యాసం తీసుకొండి” అని వినయంగా ప్రార్ధించింది.

[ఆ తల్లి తన కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయగల కుమారుడిని మాత్రమే అడగ లేదు. ఆ కుమారుడు తనకు తత్త్వోపదేశం కూడా చేయగలిగి ఉండాలని కోరింది.]

కర్ధముడు ఆమె అభీష్టాన్ని మన్నించాడు. మరికొంత కాలం గడిచింది. ఆ దంపతుల ధర్మనిష్టపై భగవంతుడి కరుణ అన్నట్లుగా వారికి ఒక కుమారుడు కలిగాడు. శ్రీహరి అంశం, ఆమె గర్భాన పుత్రరూపంలో ప్రవృద్ధమై, కపిలముని జన్మ పొందింది.

ఆ సమయాన వచ్చిన బ్రహ్మాది దేవతలందరూ దేవహూతిని, కర్దమునీ అభినందించి ఆనందంతో తిరిగి వెళ్ళారు.

చతుర్ముఖుని ఆజ్ఞానుసారం, కర్దముడు తన బిడ్డలు తొమ్మండుగురినీ, ఘరీచి, ఆత్రి, అంగీరస, పులస్త్య, క్రతు, భృగు, వశిష్ఠ, అధర్వులకిచ్చి వేదొక్తంగా వివాహం జరిపించాడు.

కొంతకాలం గడిచింది.

ఒకనాడు కర్దముడు తన యింట కపిల రూపంలో ప్రభవించిన మహావిష్ణువును సమీపించి “పురాణపురుషా! సర్వ మానవులూ నీ చరణ సేవతో ముక్తిధామం చేరుతారు. మా అదృష్టవశాన మా పుత్రుడవై జన్మించి మాకు తరణోపాయం చూపించావు. ఇక నేను సంసారం వదలి, వనానికి పోయి, యోగ మార్గాన ముక్తి సాధించుకుంటాను” అన్నాడు.

కపిలుడు మందహాసం చేసి “ఈ మానవులందరినీ ఉద్దరించడానికే కపిల మునిగా అవతరించాను. సాంఖ్య యోగ ప్రభోధంతో వీరిని తరింప జేస్తాను. నువ్వు నిశ్చితంగా పరంజ్యోతి ధ్యానంతో కైవల్య పదం చేరు” అని పంపించాడు.

కర్దముడు ప్రశాంత తపోవనం చేరి యోగనిష్ఠతో ఈశ్వరధ్యానంతో పరమ భాగవతోత్తముల స్థానం చేరాడు.

[తన తపశ్శక్తితో తృటిలో అంత సంపదనీ, సకల సౌకర్యవంతమైన సకల లోకాలనూ చేరగల విమానాన్నీ సృష్టించగల కర్దముడు… ఆ సుఖభోగాలలో మునిగి పోవాలనుకోలేదు. అవి అశాశ్వతమని తెలుసు. అలాగని ‘అసలే భోగమూ అనుభవించను’ అనీ అనుకోలేదు. సంసారికీ ఎంత సుఖసౌకర్యాలు కావాలో, సంసారి గా ఏ గమ్యాన్నీ చేరాలో ఆయనకి నిర్ధిష్టంగా తెలుసు. దాన్నే నిగ్రహంగా అనుసరించాడు. దేనికి ఏది ఎంత యుక్తమో కర్దముడు ఆచరించి చూపాడు.]

మరికొంత కాలం గడిచింది.

బిందువరం దగ్గర దేవహూతి, కపిలుని చేరి తనకు తత్వం ఉపదేశించమని కోరింది.

[ఏ సరోవరం దగ్గరైతే భర్తతో సంసార జీవితాన్ని ప్రారంభించిందో, అక్కడే కుమారుణ్ణి తత్త్వం బోధించమని అడిగింది. సంసారపు తుది గమ్యం అదే అన్నట్లుగా!]

కపిలుడు చిరునవ్వు వెన్నెలలు వెదజల్లుతూ శాంత గంభీర స్వరంతో తల్లికి తత్త్వోపదేశం చేసాడు.

[ఉషశ్రీ వచన భాగవతంలో క్లుప్తంగా వ్రాసినా… ఈ తత్త్వోపదేశం దాదాపు నాలుగు పేజీలలో ఉంది. అది మరోసారి!]

స్వాయంభువ మనువు, శతరూపల కుమార్తెలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. దేవహూతి కర్దముల పుత్రుడు నారాయణ అంశగల కపిల ముని. ప్రసూతి దక్షుల కుమార్తె పార్వతీదేవి అంశగల సతీ దేవి.

అందుకే, శ్రీమహా విష్ణువు, పార్వతీ దేవి లను వరుసకు అన్నాచెల్లెళ్ళుగా చెబుతుంటారు.

ఈ పురాణ గాధలో… మన పూర్వీకులు ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి, వాళ్ళకి సంపదా తెలుసు, సుఖసౌకర్యాలూ తెలుసు. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఎంతెంత గానో! అలాగే దేనికి ఏది అవధో కూడా! సుఖశాంతులతో బ్రతకడానికి, సంపద ప్రమేయం కొంతే! అలాగే సంపద పోగొట్ట గలిగే విచార దుఃఖాలు కూడా కొంతే!

కాబట్టి – బ్రతకడానికి డబ్బు కావాలి. కానీ డబ్బే బ్రతుకు కాదు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటారు. డబ్బుకోసం పరుగుపెట్టి ఆయాసం తెచ్చుకున్నాక, పోయిన ‘మహాభాగ్యం’తో పోల్చుకుంటే… ఏదీ ఆ వెలితి పూడ్చలేదు.

కారు పోతే, మరో కారు కొనుక్కోగల అవకాశం ఉంది. ఒక ఇల్లు అమ్ముకుంటే, అంతకంటే మంచిదైన మరో ఇంటిని కొనుక్కోగల అవకాశం ఉంది.

కానీ భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని పోగొట్టుకుంటే, మరో దాన్ని తెచ్చుకోలేం! జీవితమూ అలాంటిదే! ఒక దాన్ని పోగొట్టుకుంటే మరోదాన్ని పొందగలిగే వీలు లేదు.

పోగొట్టుకున్న కాలాన్నీ తిరిగి పొందగలిగింది లేదు. కాబట్టి – సుఖంగా సౌకర్యాలతో బ్రతికేందుకు సంపద సంపాదించుకోవాలి. దాన్ని, శాంతంగా సంతోషంగా ఆస్వాదించేందుకు తీరికా కావాలి.

ఆ అవధిని గుర్తించుకుంటే ఆనందం మన వెంటే! అప్పుడు దోపిడికీ హద్దులు ఏర్పడతాయి. వ్యాపారం మోసంగా పరిణమించటం మాని, మానవ జీవితాన్ని దురాక్రమణ చేయకుండా ఉపశమిస్తుంది.

అందుకు సర్వమానవాళి నిజాలు తెలుసుకోవాలి!

సత్యాన్ని చూడాలన్నా, అంగీకరించాలన్నా ధైర్యం కావాలి. ఆత్మశక్తి కావాలి.

అది సామాన్యులకి లభ్యమైనప్పుడు ప్రాకృశ్చిమాల మేలు కలయికనీ…

పాత కొత్త రోజుల మంచినీ…

ఏర్చికూర్చుకుని,

వర్తమాన మానవ జాతి, భవిష్య ప్రపంచానికి అందిస్తే!?

ఎంత తియ్యటి కల కదూ!

నిజమౌతుందని ఆశిద్దాం!

నిజమయ్యేందుకు…

మన కర్తవ్యం మనం పాటిస్తే…

నిజం చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్దిస్తే…

నిజం కావటం అసాధ్యం ఎప్పటికీ కాదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈ నేపధ్యంలో నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను.

నెయ్యి రంగు రుచీ వాసనా తెలియని వారికి, ఎన్నిరకాలుగా చెప్పినా నెయ్యిని స్ఫురింప చెయ్యలేం. కాబట్టే మన పెద్దలు ‘నేతి నేతి’ ని ‘బ్రహ్మానందాన్ని తెలుసుకోవటం’ అనే నేపధ్యంలో వాడతారు.

ఏ విషయాన్నైనా… కనీసం దాని ప్రాధమిక రూపమైనా తెలియనిది, దానిపై ఏ ఊహానీ చెయ్యలేం! సైన్స్ డెవలప్ మెంట్ ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో, రైట్ బ్రదర్స్ విమానాలని ప్రజలు నమ్మలేనట్లు, రోబోలనీ నమ్మలేనట్లు!

కాబట్టే… కళలూ సాహిత్యాన్ని బట్టి, ఆయా కాలల్లో సమాజపు జీవన స్థాయిని చరిత్ర కారులు లెక్కగడతారు.

మత గ్రంధాలు, మత సాహిత్యం, మతపరమైన కళలూ, ఆచార వ్యవహారాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే… భారతీయుల హిందూ పురాణాలు, వేదాలు ఆనాటి వారి మానసిక స్థాయిని చెబుతాయి. పురాణ గాథలలోని వర్ణనలు ఆనాటి సామాజిక స్థితులని, సౌభాగ్య వైభవాన్ని వివరిస్తాయి,

ఆ సంపదని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాయి. రత్నఖచిత ఆభరణాలు, పట్టు పీతాంబరాలు దైవ విగ్రహాల ఆవిష్కరణలోనే కాదు, దేవతామూర్తుల వర్ణనలలోనూ ఉన్నాయి. ఆలయాలలో శిల్ప సంపదలోని ఆభరణాల శైలి, ఆ వైభవాన్ని వేనోళ్ళ చాటుతుంది.
అలంకార ప్రియులుగా, ఆభరణాలతో నిండిన దేవతా రూపాలు హిందువుల పూజలందుకుంటాయి.

అదే గ్రీకు వారి పురుణాలు ఇలియాడ్ గట్రాలలో చూస్తే… వీనస్, హెర్కులస్, జూపిటర్, ధేసిస్ వంటి, వారి దేవతల ఆభరణాలు, దుస్తులూ, హిందూ దేవతల ఆభరణాలూ దుస్తులంత వైభవంగా ఉండవు. [ఇక్కడ నాకు గ్రీకులని గానీ మరే ఇతర దేశీయులని గానీ చిన్నబుచ్చే ఉద్దేశం లేదు.] ఎవరి శైలి వారిది అనుకున్నా… గ్రీకు దేవతల వారి దేవతల రాజు జూపిటర్ యొక్క కిరీటాల దగ్గరి నుండి అన్ని అభరణాలలోనూ, విశేష పనితనం, కళాత్మకత, వైభవం ఉండవు.

ఉదాహరణకు చెప్పాలంటే – గత టపాలల్లో వ్రాసిన ‘300 యోధులు’ సినిమాలో లియో నైడర్స్ స్పార్టా కు రాజు. అతడి వేషధారణ గానీ, అంతఃపురం గానీ ఎలా ఉన్నాయో అందరం చూసిందే! అదే, జానపద కథలుగా భారతీయులకి, ముఖ్యంగా తెలుగు వారికి, తెలిసిన ఏ ‘జగదేశ వీరుని కథ’ వంటిదో, పౌరాణికాలైన ‘మాయబజార్’, ‘నర్తన శాల’ వంటిందో అయితే… అందులో రాజుల వేషధారణ, అంతఃపురాల కళాత్మక ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలుసు! అదీ వ్యత్యాసం!

చివరికి రాజాధి రాజుగా కీర్తించబడే జెక్సీస్ మహారాజు ఆభరణాలు, వేషధారణ చూస్తే… అతడి కంఠసీమలో ఉండే ‘కంటె’ వంటి ఆభరణాలు మన దేశంలో గిరిజనుల ఆభరణాలని తలపిస్తాయి.

అదీ… ‘తెలిసినతనం’లో ఉండే వ్యత్యాసం!

క్రైస్తవుల మత గ్రంధం బైబిల్ లో, క్రీస్తు జన్మించినప్పుడు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళే జ్ఞానులూ, ఇతరులూ సమర్పించే కానుకలు… బంగారం, సాంబ్రాణి! చివరికి బైబిల్ లో వర్ణించబడిన సాలమోను చక్రవర్తి సంపద వివరాలలో కూడా… పాత నిబంధన

గ్రంధం, 11 వ అధ్యయాలలో… దిగువ పేరాలను ఓ సారి పరిశీలించండి.

>>> సొలోమోనునకు ఏటేట ఇంచుమించు 66 బారువల బంగారము లభించెడిది. వర్తకుల మీద విధించిన కప్పముల నుండియు, వర్తకుల నుండియు, ఆరేబియా రాజు నుండియు, రాష్ట్రపాలకుల నుండియు లభించిన బంగారము ఈ లెక్కలో చేరలేదు.

అతడు కమ్మచ్చున తీసిన బంగారముతో రెండు వందల పెద్ద డాలులను చేయించెను. వానికొక్కొక్క దానికి ఆరువందల తులముల బంగారము వాడెను. కమ్మచ్చున తీసిన బంగారముతోనే మూడువందల చిన్న డాలులను గూడ చేయించెను. వానికి ఒక్కొక్క దానికి నూటయేబది తులముల బంగారము వాడెను. వానినన్నిటిని “లెబానోను అరణ్యము” అను పేరుగల మందిరమున నుంచెను.

అతడు దంతముతో సింహాసనము చేయించి దానిని మేలిమి బంగారమున పొదిగించెను. ఈ సింహాసనమునకు ఆరుమెట్లు కలవు. ఒక్కొక్క మెట్టునకు రెండు సింహముల చొప్పున మొత్తము పండ్రెండు సింహముల బొమ్మలు కలవు. సింహాసనమునకు వెనుక తట్టున ఎద్దుతలను చెక్కించెను. సింహాసనమున రెండు చేతులకు ప్రక్క రెండు సింహముల బొమ్మలు కలవు. ఏ రాజును ఇటువంటి సింహాసనమును చేయించిఎరుగడు.

సొలోమోను పానపాత్రములన్నియు, లెబానోను అరణ్యము అను పేరుగల మందిరములోని పాత్రములన్నియు మేలిమి బంగారముతోనే చేయబడెను. సొలోమోను కాలమున వెండికి విలువ లేదు గనుక దానితో అతడు వాడిన పాత్రలలో దేనిని చేయరైరి.

సొలోమోనునకు నావలును గలవు. అవి హీరాము నావలతో పాటు సముద్రయానము చేసేడివి. ప్రతి మూడేండ్ల కొకసారి అతని ఓడలు వెండి బంగారములతో, దంతములతో, రకరకముల కోతులతో తిరిగి వచ్చెడివి. విజ్ఞానముననేమి వైభవముననేమి సొలోమోను ఈ నేలను ఏలిన రాజులలోనెల్ల అధికుడు.

ప్రభువు అతనికి అనుగ్రహించిన విజ్ఞాన సూక్తులను వినుటకై ప్రపంచములోని జనులెల్లరు రాదొడగిరి. అతనిని చూడవచ్చిన వారు వెండి బంగార వస్తువులను, ఆయుధములను, సుగంధ ద్రవ్యములను, గుఱ్ఱములను, గాడిదలను బహుమతులుగా కొని వచ్చిరి. ఏటేట ఇట్లే జరుగు చుండెడిది.

సొలోమోనునకు గొప్ప రధబలమును గలదు. అతడు పదునాల్గు వందల రధములను తయారు చేయించెను. పండ్రెండు వేల గుఱ్ఱములను సంపాదించెను. వానిలో కొన్నిటిని రథనగరములందు నిల్పి యుంచెను. కొన్నిటిని యెరూషలేముననే ఉంచెను.

~~~~~~~

బైబిల్ ని గానీ, క్రైస్తవ మతాన్ని గానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. బైబిల్ వారి మత గ్రంధమే కాదు, వారి చరిత్రనీ, సామాజిక జీవనాన్ని కూడా వివరించే గ్రంధం. నిజానికి ఏ మత గ్రంధమైనా అంతే! ఆ ప్రామాణికత మేరకే పోలుస్తున్నాను.

అంత గొప్పగా కీర్తించబడిన, ఆరు మెట్లూ ఒకో మెట్టుకీ ఇరువైపులా సింహాల బొమ్మలూ ఉన్న, సొలోమోను సింహాసనంతో పోల్చితే… మన జానపద భట్టి విక్రమాదిత్యుల కథలోని సువర్ణ సింహాసనం ఎక్కువ వైభవంగా ఉంటుంది. ముప్పై రెండూ మెట్లూ, మెట్టు మెట్టుకీ పలుకు నేర్చిన సువర్ణ సుందరీ ప్రతిమలతో…!

ఇంకా… రామాయణంలోని సుందరకాండలో వర్ణించబడిన లంకానగర వైభవం ఎంతటి దంటే – ఆ నగర సంపద, సౌందర్యాల కారణంగా దాన్ని సుందర కాండ అని పిలిచేంత! మయుడి శిల్పకళా చాతుర్యం, నగర భవనాలని సువర్ణ శోభితం చేస్తుంది. మరకత మాణిక్యాలు పొదిగిన స్తంభాలతో, గవాక్షలతో, ముత్యాలూ రతనాలూ కూర్చిన తోరణాలతో… ఆ సంపద వైభవపు వర్ణన, చూడకుండానే కళ్ళు మిరుమిట్లు గొల్పుతుంది.

అంతగా ఊహించాలంటే వాల్మీకి మహర్షికి అంత సంపద ఉంటుందనీ, ఉండగలదనీ సూచన ప్రాయంగానైనా తెలియాలి కదా!? అసలు ఆధారమే లేకుండా అంత ఉచ్ఛ స్థితిని ఊహించలేడు గదా! వాల్మీకి ఒక కవిగాక వందమంది కవులైనా సరే! (ఈ వాదనలు కూడా… వాల్మీకి, వ్యాసమహర్షుల విషయంలో చేసారు లెండి!) ఆ వందమంది ‘వాల్మీకులకీ’ అంతటి సంపద యొక్క ప్రాధమిక ఉనికి అయినా తెలియాలి కదా!?

ఇదంతా ఎందుకు చెప్పానంటే… ‘ఇప్పుడు ఐశ్వర్యంతో మిడిసి పడుతున్న పాశ్చాత్య ప్రపంచం కళ్ళు తెరిచే నాటికే… ఈ వేదభూమి సిరి సంపదలని అనుభవించి, హద్దులు తెలుసుకొని ఉంది’ అని చూపేందుకే!

ఇంతగా సంపదా, వైభవమూ తెలుసుకాబట్టే… ‘ఎన్ని తాపత్రయాలు పడినా, ఏది పొందాలో అదే పొందుతామనీ, పోయేటప్పుడు వెంట వచ్చే అసలు సంపద ఏమిటో తెలుసుకొమ్మనీ’ చెప్పారు పెద్దలు.

‘ఒయాసిస్సుల్ని వదిలిపెట్టి, ఎండమావుల వెంట పరుగెత్త వద్దని’ హెచ్చరించారు. ‘ఎంత పొర్లాడినా ఎంత అంటుకోవాలో అంతే అంటుకుంటుందని’ ముతక సామెతలూ ఇందుకే చెప్పారు.

ఎందుకంటే – ప్రకృతిలోనే ఆ ‘సమతుల్యత’ (Balance) ఉంది. మనిషి దాన్ని ధిక్కరిస్తున్నాడు, ధ్వంసం చేస్తున్నాడు.
కొల్లేటి సరస్సు లోకి వలస కొంగలతో సహా పలు పక్షులొస్తాయి. వాటి రెట్టలతో చేపలు తామర తంపరగా వృద్ధి చెందుతాయి. చేపల్ని తిని కొంగలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి. ఆ విధంగా అవి పరస్పరాశ్రితాలు. ప్రాకృతిక వలయాలు.

నీటి చక్రంతో సహా… అంటే సముద్రాల్లో నీరు ఆవిరై వర్షమైతే… అది వాగులూ వంకలై, నదులుగా విస్తరించి మళ్ళీ సముద్రాన్ని చేరినట్లుగా… ప్రకృతిలో ఎన్నో సమతుల్య వలయాలున్నాయి. మనం భౌతిక శాస్త్రంలో చదువుకునే డాల్టన్ పదార్ధ నిత్యత్వ సూత్రంలాగా! ప్రకృతిలో ఆయా ప్రదేశాల్లో ఓ జీవికి మరో జీవి సహజ శతృవూ, ఒక జీవికి మరో జీవి ఆహారమూ, ఒక జీవికి మరో జీవి సహచరమూ అయినట్లుగా!

ఆ సమతుల్యతని దెబ్బతీస్తూ…

అభివృద్ధి సాధిస్తున్నాం, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాం అంటూ…

కొండల్ని మింగేస్తూ…

సరస్సుల్ని తాగేస్తూ…

అడవుల్ని మాయం చేస్తూ…

మనిషి, తనకు తానే హాని చేసుకుంటున్నాడు. తోటి పశుపక్ష్యాదుల్నీ, క్రిమి కీటకాదుల్నీ హత్యలు చేస్తున్నాడు.
ప్రకృతి మనిషికి కడుపు నింపే కన్నతల్లి వంటిది. గూడునిచ్చి అవసరాలు తీర్చే కన్నతండ్రి వంటిది. అలాంటి ప్రకృతిని నాశనం చేస్తే… సర్వజీవులూ మానవాళీ కూడా నాశనం కాక తప్పదు.

ఒక ఉదాహరణ గమనించండి. బైకుల మీద ఇప్పుడు రఁయ్యి రఁయ్యిన ప్రయాణిస్తున్నాం. దానికి ఇంధనం కోసం భూగర్భాన్ని గుల్ల చేస్తున్నాం. తిరిగి ఆ గుంతలు పదార్ధంతో పూడాలంటే, అదే ఇంధనం ఏర్పడాలంటే – లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంతకాలం పట్టినా మళ్ళీ ఏర్పడక పోవచ్చు కూడా! ఎందుకంటే ప్రకృతి సహజ పరిణామ వలయాన్ని మనిషి అభివృద్ధి పేరుతో ఆటంక పరుస్తున్నాడు గనుక!

ఒకప్పుడు ఈనాటి బైకులంత వేగంగా గాకపోయినా, ఆనాటి కాలానికి తగిన వేగంతో వెళ్ళాలంటే గుర్రాలని వాడేవాళ్ళు. బైకు భూగర్భంలో నుండి వచ్చే పెట్రోలుని తాగితే, గుఱ్ఱం భూఉపరితలం మీది గడ్డి నములు తుంది. పెట్రోలు ఓ సారి తీస్తే మళ్ళీ రాదు. గడ్డి మేసిన కొద్దీ పెరుగుతుంది. ఆపైన గుఱ్ఱపు లద్దెతో మళ్ళీ మళ్ళీ చిగురిస్తుంది.

అలాగని మళ్ళీ అందరూ… బైకులూ, కార్లూ రైళ్ళూ విమానాలూ మూలన పడేసి ఎద్దుల బళ్ళు గుఱ్ఱాలూ ఎక్కమని అనటం లేదు. ‘దేనికైనా ఒక హద్దు అవసరం’ అంటున్నాను.

‘అభివృద్ధి పేరుతో, విస్తరిస్తున్న నగర సంస్కృతితో, వ్యవసాయాన్ని మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, ప్రకృతి కడుపులో చిచ్చు పెడితే… అది సర్వనాశనానికే దారి తీస్తుంది’ – అంటున్నాను.

దాని పేరు కాలుష్యం కావచ్చు, కార్చిచ్చు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, సునామీలు వరదలూ భూకంపాలూ కూడా కావచ్చు. కాబట్టే దేనికైనా ఓ హద్దు అవసరం అని పెద్దలన్నది!

ఈ విషయాన్ని ఎంత హృద్యంగా చెబుతుందో భాగవతంలోని ఈ కథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

‘మంచి చెడు కర్మలలో ఎవరేది చేసుకుంటారో!’ అన్నది వాళ్ల మనస్సుని బట్టే ఉంటుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ మితృవు, నీ మనస్సే నీ శతృవు’ అంటుంది.

ఇక ఈ తత్త్వ చింతన [లేదా కొంతమంది భాషలో వేదాంతం] వదిలేసి… తిరిగి ఆర్ధికరంగం దగ్గరికి వస్తే…
ముందే చెప్పినట్లు, ఒక మోసం జరిగితే… మోసగించే వాడి కపటానికి ఎంత బాధ్యతో, మోసగింపబడిన వాడి అజ్ఞానానిదీ అంతే బాధ్యత! అయితే దీనికీ పరిమితులున్నాయి. వ్యక్తి మీద వ్యవస్థ పనిచేస్తున్న నేపధ్యంలో… వ్యక్తిగతంగా మోసపు తీరుతెన్నులు తెలిసినా, మోసగించబడటం, దోపిడికి గురవ్వటం అనివార్యం అవుతోంది.

ఉదాహరణకి నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ నడుస్తోందని ప్రజలకి తెలుసు. కానీ నియంత్రణ ప్రజల చేతుల్లో లేదు. సిమెంట్ సిండికేట్ వంటివి తమ జేబుల్ని కొల్లగొడుతున్నాయని తెలుసు. నిస్సహాయంగా చూడటం తప్ప చేయగలిగింది పెద్దగా లేదు. అలాగన్న మాట.

ఎందుకంటే – ఇక్కడ వ్యక్తుల మీద వ్యవస్థ పనిచేస్తోంది. అది గూఢచర్యంతోనూ, అధికారపు అండదండలతోనూ, వ్యాపార దోపిడితోనూ మిళితమై ఉంది.

సదరు వ్యవస్థనే నేను నకిలీ కణిక వ్యవస్థగా ఉటంకించాను. అది సృష్టించిన పరుగు… జీవితంలో ఓ భాగమై పోయి, దోపిడిని అనివార్యంగా అంగీకరిస్తూ, ‘అవినీతి అంతటా ఉంటుంది, అది సహజం’ అని నిట్టూరుస్తూ లేదా ఆ ప్రభావంలో, ప్రవాహంలో, తామూ పడి ఉరకలేస్తూ… ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలోనూ సామాన్యుల జీవన చిత్రం ఇదే!

అందరూ ఒక్కసారిగా పరుగు ఆపితే తప్ప, ఒక్కరుగా ఎవరు పరుగు ఆప ప్రయత్నించినా అది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవటం వంటిదే!

ఇంత లోతుగా… పరుగు, దోపిడిల మాటున దాగిన గూఢచర్యం… జీవితంలోకి చొచ్చుకొని వచ్చాక… అది గుర్తించే నేర్పు, వివేకం కూడా చాలామందిలో కనుమరుగయ్యాయి. ‘ఇది ఇప్పటి రోజులకి తగిన జీవన విధానం’ అనే ధోరణి ప్రబలింది. ‘ప్రజాదృక్పధాన్ని ఆ విధంగా ప్రభావ పరచటమే’ నకిలీ కణిక వ్యవస్థకి ప్రధాన దన్ను అయిన మీడియా నిర్వహించింది. అందునా సుదీర్ఘ కాలంగా నిర్వహించింది.

ఇక్కడ మీకు కొన్ని చిన్న సంఘటనలు చెబుతాను.

ఓ సారి… అప్పటికి మేం శ్రీశైలంలో ఉండేవాళ్ళం. పనులన్నీ అయ్యాక, రాత్రి భోజనం చేసుకుని, రాత్రి తొమ్మిదిన్నరకి మల్లయ్య స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఉచిత దర్శనం ఉండేది.

ఓ రోజు… అయ్యవారి ఆలయంలో దర్శనం క్యూలో ఉన్నాం. పెద్దగా భక్తులు లేరు. గుడి ఖాళీగానే ఉంది. పంచాక్షరి జపిస్తూ దర్శనానికి వెళ్తుండగా… హడావుడిగా ఓ గుంపు లోనికొచ్చింది. అంతా గ్రామీణులు… ఓ అయిదారుగురు ఆడవాళ్ళు, పదిమంది మగవాళ్ళు ఉన్నారు. బహుశః ఏ వ్యానో వేసుకుని వచ్చినట్లున్నారు.

క్యూలో మా వెనుక ఉన్న వాళ్ళంతా దర్శనం కోసం ఆతృత పడుతూ తొయ్యసాగారు. వాళ్ళ హైరానాకి, గలభా గలభాగా మాట్లాడుతున్న వాళ్ళ గోలకీ, నేనూ మా వారూ ప్రక్కకు తప్పుకొని వాళ్ళనే ముందుకు వెళ్ళనిచ్చాం. నిజానికి వాళ్ళని చూస్తే అంతగా అలిసిపోయి ఉన్నట్లు కూడా కన్పించలేదు.

సరే, వాళ్ళ వెనకాల మేం ప్రశాంతంగా మల్లయ్య దర్శనం చేసుకుని భ్రమరాంబ అమ్మవారి ఆలయపు మెట్ల దగ్గరికి వెళ్ళే సరికే, వాళ్ళు తల్లి దర్శనం పూర్తి చేసుకుని మాకు ఎదురు వచ్చారు. మేం దర్శనం చేసుకుని, గుళ్ళో కాస్సేపు కూర్చొని బయటికి వచ్చేసరికి… ఆ గుంపులోని వాళ్ళు గుడి ముందర దుప్పట్లు పరుచుకొని పడుకొని ఉన్నారు. ఒకళ్ళిద్దరు అప్పటికే గుర్రు కొడుతుంటే, మిగిలిన వాళ్ళు పడుకొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

నాకూ, మా వారికి అది చూసి నవ్వొచ్చింది. ‘అంత ఉరుకులూ పరుగులూ పెట్టి, పక్క వాళ్ళని తోసి మరీ దర్శనం చేసుకుని వచ్చింది ఇందుకా?’ అన్పించింది. ఎంతో దూరం నుండి స్వామి దర్శనానికి వచ్చి ఆలయ ప్రశాంతతని అనుభవించకుండా, దర్శనానుభూతి ఆస్వాదించకుండా ఉరుకులు పెట్టారు.

అమ్మవారి కోవెలలో స్తంభాల మీద శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. కనీసం దాన్ని కన్నెత్తి చూసేంత సమయం కూడా వాళ్ళు గుడిలో ఉండలేదు. ‘అసలెందుకు క్షేత్ర దర్శనానికి వచ్చారా?’ అన్పించింది. తిరిగి తమ ఊరి కెళ్ళాక ‘మీమిన్ని ఊళ్ళూ చూసి వచ్చాం’ అని చెప్పుకోవడానికి తప్ప, మరెందుకూ పనికిరాని క్షేత్ర దర్శనం అది!

మరోసారి… అప్పటికి నేను గుంటూరులో బ్యాటరీ ఫ్యాక్టరీ నడుపుతున్నాను. ఓ రోజు మనస్సు ప్రశాంతంగా లేదని అమరావతి వెళ్ళాను. అక్కడి గుడి, కృష్ణవేణి నది చాలా మనోహరంగా ఉంటాయి. దైవదర్శనం చేసుకుని, విశ్రాంతింగా నది ఒడ్డున గట్టు మీద, కాళ్ళు నీళ్ళల్లోకి వేలాడేసి కూర్చున్నాను. పారుతున్న నదిని చూస్తూ చల్ల గాలికి అలా కూర్చుండి పోయాను.

అంతలో ఓ టూరిస్టు బస్సు వచ్చి కొద్ది దూరంలో ఆగింది. బిలబిలమంటూ ఓ యాభైమంది స్త్రీ పురుషులు దిగారు. వీళ్ళూ గ్రామీణులే! రఁయ్యిన గుడిలోకి అరుపులూ కేకలతో ఉరుకులు పెట్టారు. పదే నిముషాల్లో బయటికొచ్చారు. మగవాళ్ళల్లో కొందరు చుట్టలూ, బీడీలు, సిగరెట్లు వెలిగించి దమ్ములాగుతూ, పచార్లు కొడితే, ఆడవాళ్ళల్లో కొందరు హడావుడిగా నది నీళ్ళల్లో బట్టలుతకడం మొదలు పెట్టారు. నాకు పగలబడేంత నవ్వొచ్చింది. బాగోదని ఊరుకున్నాను.

నిజానికి అమరావతి పెద్ద గుడి. అంతస్థులుగా ఉంటుంది. గుడి ఆవరణలో పొన్న పొగడ చెట్లుంటాయి. చిన్న చిన్న గుడులు మరికొన్ని ఉంటాయి. నింపాదిగా ఓసారి చుట్టి రావాలన్నా గంట పడుతుంది. అలాంటిది పది నిముషాల్లో పరిగెత్తు కొచ్చి వీళ్ళు చేస్తోంది ‘దమ్ముకొట్టటం, బట్టలుతకడమునా?’ అనిపించింది.

పోనీ అది కర్మాసక్తి లేదా కర్తవ్యనిర్వహణ అందామన్నా… ఆ బట్టలుతకడంలో వాళ్ళ ‘పని రంధి’, దమ్ముకొట్టడంలో ‘బావుకునే రంధి’ తప్ప మరేం కనబడలేదు.

మరోసారి… అప్పటికి మేం శ్రీశైలంలో బడి నడుపుతున్నాం. ఓ సెలవు రోజు ఉదయాన్నే పాతాళ గంగ దగ్గరి కెళ్ళి కాస్సేపు జలాశయపు అందాలు ఆస్వాదించి, చేపలు కొనుక్కొని ఇంటికి వెళుతున్నాం! మా పాప, నేనూ, మా వారూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాం.

చలికాలపు ఉదయం! కొండల మీద మబ్బుల గుంపులు దిగాయి. చుట్టూ అందంగా పచ్చగా కొండలూ లోయలూ, వీస్తోన్న పచ్చిగాలి… హృద్యంగా ఉంది వాతావరణం.

అప్పుడే కంభం సత్రం రెండో అంతస్థులో ఓ యాభైమంది దాకా స్త్రీ పురుషులు నింపాదిగా కూర్చొని దిక్కులు చూస్తున్నారు. చల్లగాలినీ, కొండలపై మబ్బుల నీడలినీ, చూస్తూ… మెల్లిగా… రికామీగా… గుడిపాటి వెంకట చలం పరిభాషలో చెప్పాలంటే ‘సోమరి గాలి’ని ఆస్వాదిస్తూ… అలా గడుపుతున్నారు. వీళ్ళూ గ్రామీణులే! టూరిస్టు బస్సులో వచ్చినట్లున్నారు.

వాళ్ళని చూసి ముచ్చటేసింది. ‘ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో కదా!’ అనుకున్నాం. అప్పుడనిపించింది ‘పరుగులు పెట్టడంలో గ్రామీణులనీ, నగర వాసులనీ తేడా లేదు. అది వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది’ అని! నగర జీవనం మనిషిని పరుగులు పెట్టించగలిగినా, పల్లె జీవనం కొంత స్థిమిత పడనిచ్చినా అది కొంత భాగమే! నియంత్రణ కోసం ప్రయత్నించడం వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుంది కదా!

గమనించి చూడండి. ఒకప్పుడు ‘వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడు’ అంటూ, భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం ప్రారంభమై,… ‘ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదిస్తే గానీ అవసరాలు తీరడం లేదు’ అనే వరకూ ప్రయాణించాం.

ఒక్కోసారి… ప్రశాంతంగా కూర్చొని… కాగితం కలం తీసుకొని ‘అసలు సంపాదిస్తోంది ఎంత? ఖర్చు పెడుతోంది ఎంత? పొందుతోంది ఎంత? పోగొట్టుకుంటోంది ఎంత?’ …అని లెక్కలు వేసుకుంటే…?

నగరాల్లో మహా అయితే ఉద్యోగస్తులైన భార్యాభర్తలిద్దరికీ చెరో పాతిక ముఫ్ఫైవేలు వస్తున్నాయనుకొండి. పట్టణాల్లో అది చెరో పది పన్నెండు వేలుంటే ఎక్కువ. ఇంకా చిన్న పట్టణాల్లో అయితే చెరో అయిదారువేలుంటుంది, అంతే!

ముందు నగరాల సంగతే చూద్దాం! భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైన చోట… గృహ నిర్వహణ ఇద్దరికీ భారమే! అనివార్యమై కొంతా, అత్యవసరమై మరికొంతా… ఖర్చులు తప్పవు.

తగిన సమయానికి అందుకునేందుకు హడావుడి ప్రయాణాలూ తప్పవు. ప్రయాణ ఖర్చులు, (స్వంత వాహనం ఉన్నా ఇంధనం+రిపేర్+కొన్నాళ్ళకి రీప్లేస్ ఖర్చులు కలుపుకు చూడాల్సిందే) ప్రతీ రోజూ బయటికెళ్ళడంతో…ఇస్త్రీ బట్టలు, పాదరక్షలూ, ఇతర యాక్సెసరీస్ ఇంకా మెయింటెన్స్ ఖర్చులు చాలానే ఉంటాయి.

ఒక్కసారి లెక్కవేసుకు చూస్తే… కర్చీఫుల దగ్గర నుండి సెంటు బుడ్డీల (అదేలెండి బాడీ స్ప్రేలు లేదా పెర్ ప్యూములు) దాకా… కనబడని ఖర్చు కౌంటబుల్ గానే ఉంటుంది. నలుగురిలో తక్కువగా కనిపించకుండా ఉండటానికి, ఖరీదైన లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలు తప్పవు.

ఆపైన పిల్లల బాగోగుల మీద, చదువు సంధ్యల మీదా పెద్దగా శ్రద్ధ పెట్టలేమనిపిస్తుంది. అదో వెలితిగా బాధిస్తుంది. ‘ఇంత కష్టపడుతోంది పిల్లల భవిష్యత్తు కోసమే కదా’ అనిపిస్తుంది. దాంతో ఖరీదైన కార్పోరేట్ విద్యాసంస్థల కోసం వెదుకుతాం. ‘డబ్బెంతైనా ఫర్వాలేదు, వాళ్ళ చేతుల్లో పిల్లల బాధ్యత పెడితే నిశ్చింత!’ అనిపిస్తుంది – ఆ ఖర్చు ఎంత భారమో అనుభవంతో తెలుస్తుంది.

ఆపైన ట్యూషన్ల అవసరం పడుతుంది. పర్యవసానంగా వారమంతా పిల్లల ముఖం మనమూ, మన ముఖం పిల్లలూ చూడలేదనిపిస్తుంది. దాంతో వారానికోసారో, నెలకోసారో వాళ్ళని ఏ ధీమ్ పార్కుకో,గండిపేటకో, శిల్పారామానికో తీసి కెళ్తే గానీ మనశ్శాంతిగా అనిపించదు. అధమపక్షం బయటికి తీసికెళ్ళి రెస్టారెంట్ లో తినిపించాలనన్నా అనిపిస్తుంది.

వీటన్నిటికీ పైసలు సమకూర్చుకొని, ఇంకొన్ని దాచుకోవాలంటే ఒళ్ళిరగ కష్టపడక తప్పదు. దాంతో నిజంగానే ఒళ్ళు, విరిగో అరిగో కూర్చోంటుంది. ‘ఒత్తిళ్ళు ఎక్కువయ్యాయి’ అనే అందమైన పేరు దానికి పెట్టబడుతుంది.

దేవుడిచ్చింది ఒకటే దేహం. అరిగితేనో, విరిగితేనో దెబ్బకి మటాష్! ‘ప్రాణం కంటే ఎక్కువా?’ అనుకొని కార్పోరేట్ ఆసుపత్రిల్లోనో, మామూలు ఆసుపత్రుల్లోనో చికిత్సకి వెళతాం. ఆ టెస్టులనీ, ఈ టెస్టులనీ, మందులనీ, ఆపరేషన్లనీ… ఎంత హైరానా అయినా తప్పదు. రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరవలేరు గదా!? ఏడాదికి మెడికల్ బిల్లు చూసుకుంటే… సంపాదించిన దానిలో దాని వాటా తక్కువేం ఉండదు.

ఇక ఇన్ని పనుల మధ్య ప్రతీరోజూ వంట… పెద్ద తంటానే! రుచి కోసమో, తీరిక లేకనో ‘కర్రీ పాయింట్లనీ, రెడీ టూ ఈట్ ఫుడ్ పాకెట్లనీ, సాంబారు రసం పొడులనీ, రెడీమెడ్ మసాలాలనీ’, ఆశ్రయించక తప్పదు. అందులో వాడే ఇన్ గ్రేడియంట్లలో (రంగు రుచి వాసనల కోసం వాడే రసాయనాలతో) అలర్జీల దగ్గరి నుండి అంతు దొరకని, అర్ధం కాని అనారోగ్యాలూ, ఈతిబాధలూ వస్తాయి. ఏది ఎందుకు వచ్చిందో కూడా గుర్తించుకునే తీరిక ఉండదు.

ఒకేరోజు తిన్న నూడిల్స్ నుండి వచ్చిందో, పిజ్జా బర్గర్ నుండి వచ్చిందో, చాక్లెట్లూ బిస్కట్లకే వచ్చిందో, దుమ్ము గాలికీ, ట్రాఫిక్ లో ఇంధన పొగకి వచ్చిందో తెలియని జలుబూ తుమ్ములూ మాత్రం, పర్మెనెంట్ కేరాఫ్ అడ్రెస్ గా మన ఇంట్లోనో ఒంట్లోనో ఉండి పోతాయి.

యధాప్రకారం మెడికల్ బిల్లు మన జేబుని గీకుతూనే ఉంటుంది.

ఇక కరెంటు టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ సిలెండరూ, సూపర్ మార్కెట్ నుండి సరుకులూ తెచ్చుకునేందుకు వేరెవరి సాయమో అవసరమౌతుంది. ఆ సేవల రంగంలోని సంస్థలని మామూలుగా పోషించాల్సి రావచ్చు. పండుగ పబ్బాలకి పులిహోర పాయసాలు కూడా స్వగృహ ఫుడ్ నుండి తెచ్చుకున్నట్లుగా, పెళ్ళి పేరంటాలకి ఈవెంట్ మేనేజర్స్ కీ, బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలకీ మరికొంత సమయం వెచ్చించక తప్పదు.

వీటన్నిటిలో ‘అవసరమైన ఖర్చెంత? అనవసరమైన ఖర్చెంత? అనివార్యమైన ఖర్చెంత?’… లెక్క వేసుకుంటే?

నిజానికి… గృహ నిర్వహణ అవమానకరమైన పని కాదు. తమ దోపిడికి ముందస్తు బ్రెయిన్ వాష్ గా నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించిన అంశాల్లో ఇది ఒకటి. భార్యాభర్తల్లో ఎవరికి సహనం ఎక్కువగా ఉంటే వారు, ఎవరికి వీలైతే వారు – గృహ నిర్వహణని ఒక బాధ్యతగా తీసుకుంటే పైసమస్యల్లో చాలా వాటి సంఖ్య తగ్గిపోతుంది.

ఎందుకంటే – డబ్బు కంటే, ఆస్తుల సంపాదన కంటే విలువైనవి… ఆరోగ్యమూ, కుటుంబ జీవనమూ, భావితరాల పెంపకమూ! ముందటి తరం పట్ల కృతజ్ఞతా, వారికీయ వలసిన గౌరవం, చేయవలసిన సేవ… అంతకంటే విలువైనవి. ఒకసారి వాళ్ళు తమ కాల్షీటు పూర్తి చేసుకొని, భగవంతుడి పిలుపు అందుకొని వెళ్ళిపోయాక… ‘వాళ్ళు బ్రతికి ఉన్నరోజుల్లో మనం ఇంతకంటే ఇంకా బాగా ప్రవర్తించి ఉండాల్సింది!’ అని ఎంతగా అనుకున్నా, గడిచిన కాలం తిరిగి రాదు కదా? పోయిన ఆప్తులూ మనం ఎంత ఆర్తిగా తలుచుకున్నా తిరిగి రారు!

అలాంటి చోట… కుటుంబంలో ఇద్దరూ సంపాదన కోసం పరుగుమాని, ఒక్కరు కుటుంబ శ్రేయస్సు కోసం సమయం కేటాయిస్తే… చాకలి/డ్రైక్లీనర్ బిల్లు దగ్గరి నుండి మెడికల్ బిల్లుల దాకా… ఫ్యాన్సీ షాపు నుండి పచారీ కొట్టు దాకా… చాలా మిగులే వస్తుంది. పిల్లల గురించి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్న తృప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన ఆనందం మిగులుతుంది.

ఎంత మిగులు వచ్చినా జీతం అంత మిగులు రాకపోవచ్చు. కాని కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు అన్న సూత్రమే ఇక్కడా వర్తిస్తుంది.

సహజంగా స్త్రీకి ప్రకృతి పరంగా పిల్లలతో మమేకం ఎక్కువా, సహనం ఎక్కువా గనుక, గృహ నిర్వహణ తల్లి బాధ్యతగా, ఉపాధి నిర్వహణ తండ్రి బాధ్యతగా పెద్దలు అమర్చి ఉంటారు. అందులో పురుషాధిక్యత అహంకారానికి ఓ రూపమైతే, ఫెమినిజం మరో రూపం!

ఏమైనా… ఆర్ధికంగా ఇంటిని నడపటం ఎంత ముఖ్యమైనదో, కుటుంబ సభ్యుల ఆలనా పాలనా కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి గృహ నిర్వహణ గౌరవనీయమైనదే, అది స్త్రీ నిర్వహించినా పురుషుడు నిర్వహించినా! కాకపోతే పురుషుడు నిర్వహిస్తే వింతగా చూడటం మన సమాజంలో సుదీర్ఘకాలంగా ఉంది. అవగాహనా రాహిత్యమే అది! గృహ నిర్వహణ అవమాన కరమైనది కాదు, మనిషి జీవితానికి అత్యంత విలువైనది. గృహమే కదా మరి స్వర్గ సీమ! ఎంత బాగున్నా, ఎంత ఖరీదైనదైనా, ఇంటి కంటే ఏదీ పదిలం కాదు.

కాబట్టే మన పెద్దలు… మన పరుగుకి, సంపద సృష్టికి కొన్ని హద్దులు ఏర్పరిచారు.

ఈ నేపధ్యంలో నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గత టపాలలో వివరించినట్లు, షేర్ల సహజ క్రయ విక్రయాల పరిమాణం చాలా తక్కువైపోయి చాలా రోజులే అయ్యింది. అది రోజు రోజుకీ మరింత తగ్గిపోతోంది.

కాబట్టే ఇన్ని మోసాలూ, అసత్య ప్రచారాలు! అది ఒక్క షేర్ మార్కెట్ విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో అదే దోపిడి, అదే మోసం!

నిజానికి …ఒక మోసం జరిగిందంటే – మోసగించే వాడి తెలివి, కుత్సితం, కపటాల బాధ్యత ఎంతో, మోసగింపబడే వాడి అమాయకత్వం, అజ్ఞానం, అనవగాహన (కొన్ని సందర్భాల్లో ఆశ) ల బాధ్యత కూడా అంతే!

కాబట్టి – ఆలోచించవలసిన అవసరం, మోసాలని అర్ధం చేసుకోవలసిన అవసరం, సామాన్యులకి తప్పదు. లేకపోతే కరిమింగిన వెలగ పండు లాగా సంపాదించుకున్నది కరిగిపోతుంది. నిరంతరం శ్రమ దోపిడి, మేధో దోపిడి, సమస్త దోపిడికి గురౌతూ, మోసపోవటం కూడా జీవితంలో భాగమై, మొత్తంగా బ్రతుకు భారమౌతుంది.

పరిస్థితులు మరింత విషమించి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు… ఓ వైపు మోసగింపబడుతూ… మరో వైపు అవకాశం వస్తే తామూ మోసాలకు పాల్పడుతూ… వెరసి వైతరణిని భూలోకానికి, నిజ జీవితంలోనికి తెచ్చుకోవడ మౌతోంది. ఇదే గత టపాల్లో ‘చెంపదెబ్బలు’ అనే టపాలో ఉదాహరణలో చెప్పాను.
22. భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్ర – 2[చెంప దెబ్బలు] [Dec.11, 2008]
http://ammaodi.blogspot.com/2008/12/2_11.html

వాళ్ళ వ్యాపారం కోసం మీడియా, ప్రభుత్వాలు, కార్పోరేట్ కంపెనీలు ప్రజల జీవితాల్లో పరుగుని సృష్టిస్తే… అందరూ ఆ వేగంలో పడి కొట్టుకు పోతే… పరిస్థితి ఇక్కడికే చేరుతుంది. అదే ఇప్పుడు నిరూపించబడింది.

ఒక ఉదాహరణ చెబుతాను.

మనం ఓ ఉద్యాన వనాన్ని లేదా ధీమ్ పార్కుని చూడటానికి వెళ్ళామను కొండి. ప్రవేశ రుసుం తీసుకుని లోపల ప్రవేశించాం. పార్కు మూసేసే లోగా అన్నీ చూడాలని కుతుహల పడతాం. ఆ ఉబలాటం సహజమే! అది కాస్తా ఆతృత లోకి, ఆపైన పరుగులోకి పరిణమిస్తేనే కష్టం.

ఒకో అంశాన్ని పరిశీలిస్తూ, ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలనుకుంటాం. ఆనందాన్ని ప్రశాంతంగా ఉంటేనే పొందగలం. ప్రశాంతంగా చూడాలని, ఆనందించాలని మెల్లిగా తిరిగితే కొన్నిటినే చూడగలం, ఆనందించగలం. అలాక్కాదని పరుగులు పెడితే ఆయాసం మిగులుతుంది. మిగిలిన వేవీ చూడలేం. అంతేగాక చూసిన ఆనందం కూడా మిగలదు.

ఇదే పోలికని జీవితానికి అనువర్తిస్తే… పార్కు లాంటిదే జీవితం. ఇంకా టిక్కెట్ తీసుకుని పార్కులో ప్రవేశిస్తే… ఫలానా టైం లోపల అన్నీ చూచి రావాలని, రావచ్చని ఓ అంచనా ఉంటుంది. జన్మ ధరించి ఈ లోకంలోకి వచ్చాక ఎవరికీ తిరిగి తను ఎగ్జిట్ టైం ఏమిటో తెలియదు. కాబట్టి బ్రతికిన నాలుగు నాళ్ళలోనే మరికొన్ని ఆనందాలని అనుభవించాలనుకుంటాం. అది తప్పు కాదు కూడా! అయితే, అలాగని పరుగులెత్తితే వచ్చేది ఆనందం కాదు, ఆయాసం మాత్రమే!

కాబట్టే మన పెద్దలు ‘ఆలస్యం అమృతః విషం’ అనీ చెప్పారు, ‘నిదానమే ప్రధానమనీ’ చెప్పారు. ఏది ఎప్పుడు ఎంత వరకూ పాటించాలో తెలుసుకోగలగటమే విజ్ఞత. ఖచ్చితంగా చెప్పాలంటే జీవన కళ! (Art of Living అన్నమాట!)

దీన్నే స్పష్టంగా భగవద్గీత…

శ్లోకం:
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా

భావం:
మితాహార నిద్రా విహారాలు, మితనియత కర్మలూ, మితమైన మెలకువా కలిగి అభ్యాసం చేసే వాడికే – సర్వదుఃఖ నాశకమైన యీ యోగం సిద్దిస్తుంది.

నిజానికి భగవద్గీత కంటే గొప్ప పదార్ధ వాద గ్రంధం నాకు మరొకటి కనిపించదు.

మనం తినేందుకు అరటి పండ్లు ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కుళ్ళి, నీరు కారుతున్నవి ఎంచుకుంటామా? అవి తింటే రోగాలొస్తాయనీ, రుచిగా ఉండవనీ మనకి తెలుసు! కాబట్టి – తాజాగా ఉన్నవాటినీ, చక్కగా పండి నిగారింపుతో ఉన్నవాటినీ ఎంచుకుంటాం.

ఇప్పుడు తింటే మరికాస్సేపటికి అరిగిపోయే అరటిపండు విషయంలోనే అంత జాగ్రత్త తీసుకునేటప్పుడు అధమ పక్షం అరవై ఏళ్ళు, దీర్ఘాయువు అంటే నిండు నూరేళ్ళు ఉండే జీవితం విషయంలో, జీవానానందం, ఆస్వాదనల విషయంలో మరింకా ఎంత జాగ్రత్త, శ్రద్ధ తీసుకోవాలి?

అదే మనకి భగవద్గీత చెబుతుంది.

ఆనందంగా జీవించడమే జీవితానికి సార్ధకత, జీవిత లక్ష్యమూ అయినప్పుడూ, ఆ ఆనందానుభవం, ప్రత్యక్షంగా అల్పకాల ఆనందాన్నిచ్చి, పరోక్షంగా దీర్ఘకాల దుఃఖాన్నివ్వ కూడదు. అప్పుడది నష్టపు బేరమే!

ఉదాహరణకి ప్రొగతాగటం! అప్పటికి ఆనందాన్నిచ్చినా ఆనక క్యాన్సర్ నిచ్చినట్లు!

కాబట్టి జీవితంలో ఉత్తమమైన ఆనందాన్ని అందుకొమ్మంటుంది భగవద్గీత. అరగంటలో అరిగిపోయే అరటిపండు విషయంలోనే ఉత్తమమైన పండుని ఎంచుకునేటప్పుడు… ఇదీ అంతే గదా! కాబట్టి … తక్కువ ఆనందం కోసం ఎక్కువ ఆనందాన్ని పోగొట్టుకోవద్దంటుంది. అలా చూస్తే ‘గీత’ కంటే పదార్ధ వాదాన్ని ప్రతిపాదించగల గ్రంధం ఇంకేది?

ఇక్కడ మీకు ఓ చిన్న కథ చెబుతాను.

ఇది శ్రీ రామనుజాచార్యుల వారి పేరిట ప్రసిద్ధిమైనది. నిజ సంఘటనగా పేర్కొనబడినది.

ప్రతీరోజూ కావేరినదిలో స్నానమాచరించి, రంగడి ఆలయానికి వెళ్ళే రామానుజాచార్యుల వారికి ఓ దృశ్యం కళ్ళబడేది.

రంగదాసు ఆ వూరిలో ప్రముఖ వ్యాపారి కుమారుడు. ధనికుడు. అతడు తన ప్రేయసి రంగనాయకి కి గొడుగు పట్టి, ఆమె వైపు ముఖం పెట్టి వెనకకు నడుస్తూ ప్రతీ రోజూ ఆలయానికి వస్తుంటాడు.

జనం అతణ్ణి చూసి నవ్వుతున్నా అతడవేవీ పట్టించుకోడు. ఓ రోజు రామానుజాచార్యుడు రంగదాసుని “నాయనా! ప్రతీ రోజూ ఈ యువతికి గొడుగు పట్టుకుని వస్తావెందుకు?” అని అడిగాడు.

రంగదాసు స్థిరంగా “స్వామీ! నాకు ఆమె సౌందర్యమంటే ఇష్టం. ఆమె ముఖ కమలం, అందులో కలువ రేకుల వంటి ఆమె కన్నులంటే మరీ మరీ ఇష్టం! ఎండకవి కందిపోయి, వడలి పోకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుంటాను” అన్నాడు.

“మరి వెనక్కి నడుస్తూ వస్తావేం?” ప్రశ్నించారు రామానుజాచార్యులు వారు.

“ఒక్కక్షణం కూడా ఆ సౌందర్యాన్ని చూడకుండా ఉండటం నాకిష్టం లేదు” ఠకీమని జవాబు చెప్పాడు రంగదాసు.

“జనం నిన్ను చూచి నవ్వుతున్నారు కదా?” నిశితంగా పరిశీలిస్తూ అన్నారు రామానుజులు.

“ఎవరేమను కుంటే నాకేమిటి? నా ఆనందమే నాకు ముఖ్యం” వెఱపులేని సమాధానం రంగదాసుది.

ఆ యువకుడిలో సమాజం పట్ల పట్టింపు లేనితనం, ఎవరేమనుకుంటారోననే వెఱపులేని తనం రామానుజుల కర్ధమయ్యింది.

రంగ దాసుతో “నాయనా! రంగనాయకి సౌందర్యం, నిశ్చయంగా గొప్పదే! అయితే ఆ చిన్నదానికి… కోపమో, అసూయో కలిగిందనుకో! అప్పుడా వదనం అంత అందంగా ఉండదు. ఆమెకి ఏ వ్యాధో వచ్చిందనుకో! ఆ కళ్ళు కాంతి కోల్పోతాయి. వార్ధక్యం మీద పడితే, ముఖం ముడతలు పడుతుంది. ఇంత ఆశాశ్వతమైన అందానికే ఇంతగా దాసుడవయ్యావు. శాశ్వత సౌందర్యాన్ని చూపిస్తాను, ఆరాధిస్తావా?” అన్నాడు.

“నిజంగా మీరు అంతటి సౌందర్యాన్ని చూపించాలే గానీ నిశ్చయంగా దాసుణ్ణవుతాను” అన్నాడు రంగదాసు.

అతణ్ణి వెంట బెట్టుకుని ఆలయంలోకి వెళ్ళారు రామానుజాచార్యులు. కమండలంలోని నీటితో కళ్ళు కడుక్కుని రంగనాధుడి విగ్రహాన్ని దర్శించమన్నాడు.

ఏ తీరుగా రామానుజుల వారు, రంగదాసుడికి విశ్వసౌందర్యాన్ని, విరాట్స్వరూపాన్ని చూపించగలిగారో తెలియదు గానీ, రంగదాసు ఆయన శిష్యుడిగా మారిపోయాడు. కాలక్రమంలో అతడే పద్మపాదుడిగా పేరు గాంచాడు.

ఇదీ కథ!

ఇందులో చెప్పినట్లుగా మన ఈ భౌతిక శరీరంతో ముడిపడిన ఆనందం తృణప్రాయం కాదు గానీ, శాశ్వతం కూడా కాదు. ఒక పురుషుడు స్త్రీని, లేదా ఒక స్త్రీ పురుషుణ్ణి, వారి అందమైన శరీరాన్ని చూచి ప్రేమిస్తే… ఆ ప్రేమ, ఆనందం కొన్ని రోజులకి తరిగి పోగలదు. అదే అందమైన మనస్సుని చూసి ప్రేమిస్తే… ఆ ప్రేమ, ఆనందం రోజులు గడిచే కొద్దీ పెరుగుతుంది.

శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండే ఆనందం కన్నా, భౌతిక వస్తువులతో ముడిపడి ఉండే ఆనందం కన్నా మానసిక ఆనందం గొప్పది. ఆ దారిలో వెళ్తే ఆత్మానందాన్ని ఏదో నాటికి అందుకుంటాం. అది అత్యంత ఉత్తమమైనది. అలాంటి పరమానందాన్ని పొందాలంటే స్థిర బుద్దిని సాధించాలి. దాన్ని సాధించమనే , అందుకొమ్మనే, చెబుతుంది గీత! కాబట్టే గీత కంటే పదార్ధ వాదాన్ని చెప్పే గ్రంధం మరొకటి లేదనిపిస్తుంది.

ఎందుకంటే – గీత, భౌతిక వాదం కంటే భావవాదం గొప్పది గనుక మట్టి గొట్టుకు పొమ్మనదు. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ఇవ్వాలంటుంది. ధర్మబద్దంగా ద్రవ్య సంపాదన చెయ్యమంటుంది. అయితే ద్రవ్య సంపాదనే జీవితం అనుకోవద్దంటుంది.
మరోమాటలో చెప్పాలంటే… ధర్మకార్యాలు చెయ్యటానికి, జీవించటానికి డబ్బు (ద్రవ్యం) కావాలంటుంది. జీవితమే ‘డబ్బు’ అనదు.

ఎందుకంటే – సంపాదించిన ఆస్తిపాస్థులు ఇక్కడే మిగిలిపోతాయి. పుట్టుకతో తెచ్చుకున్న శరీరం, జీవించినంత కాలం మనతో పాటే పెరిగి మనకి ఆశ్రయం ఇచ్చిన శరీరం, ఇక్కడే మిగిలి పోతుంది. ‘మనం అనుభవించిన వాటి ముద్రలూ, భావనల వాసనలూ మాత్రం మనతోనే వస్తాయి’ అంటుంది గీత!

శ్లోకం:
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ర్కా మతీశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్II

భావం:
గాలి సువాసనను తీసికొని పోయేటట్లుగా – దేహాధికారియైన జీవుడు క్రొత్త శరీరం పొందేటప్పుడు – వెనుకటి శరీరం నుంచి భావ పరంపరను తీసుకు పోతున్నాడు.

కాబట్టి కూడా, మంచి భావనలనీ, భావ పరంపరగా విలసిల్లే సంపదనీ సంపాదించు కొమ్మంటుంది. ‘చేసిన మంచి చెడని పదార్ధం’ అంటుంది. ‘ఆస్తులూ అప్పులూ వెంట రావు గానీ… మంచి చెడుగులు, పాపపుణ్యాలు వెంట వస్తా’యంటుంది. ‘కర్మఫలం మన వెంటే ఉంటుంది’ అంటుంది.

‘జన్మ సిద్ధాంతం నమ్మాలా, వద్దా?’ అని నేనిక్కడ చర్చించటం లేదు. నమ్మితే వచ్చే నష్టం లేదనీ, మీదు మిక్కిలి ఇప్పటి ఇహలోక జీవితంలో సైతం శాంతి సౌఖ్యాలు అనుభవింప వచ్చనీ నా వ్యక్తిగత నమ్మకం! నమ్మకాల విషయంలో వాదనలు అనవసరం అన్నది నా అనుభవం!

ఈ నేపధ్యంలో… కొందరు పుట్టుకతో కొన్ని లోపాలని తెచ్చుకుంటారు. అవీ పూర్వజన్మ వాసనేనేమో అనుకుంటాను. కొందరు పుట్టుకతోనే కొన్ని నైపుణ్యాలు, కళలూ తెచ్చుకుంటారు. అదీ పూర్వజన్మ పుణ్యమే అనుకుంటాను.

క్యారమ్స్ ఆట ఆడేటప్పుడు బోర్టుమీద కొన్ని ‘కాయిన్స్’ పెట్టి ఆడతాం. ఒకో ఆటలో పోగొట్టుకునే అవకాశం ఎంతో, గెలుచుకునే అవకాశమూ అంతే ఉంటుంది. జన్మలోనూ అంతేనేమో! ప్రతీ జన్మలోనూ పాపం, చెడు కర్మలు చేసుకునే అవకాశం ఎంతో, పుణ్యం, మంచి కర్మలూ చేసుకునే అవకాశం కూడా అంతే!

ఎవరేది చేసుకుంటారో అన్నది వాళ్ల మనస్సుని బట్టే ఉంటుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ మితృవు, నీ మనస్సే నీ శతృవు’ అంటుంది.

ఇక ఈ తత్త్వ చింతన [లేదా కొంతమంది భాషలో వేదాంతం] వదిలేసి… తిరిగి ఆర్ధికరంగం దగ్గరికి వస్తే…

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

దోపిడి పందిరికి కనబడని గుంజ కార్పోరేట్ రంగమే అనేందుకు మరొక చిన్న తార్కాణాన్ని పరిశీలించండి. వీలయినప్పుడల్లా మీడియా, ముఖ్యంగా ఈనాడు, తెగ పొగిడి పారేసే వారిలో ధీరూభాయ్ అంబానీ ఒకడు.
చెంపన చెయ్యి జేర్చుకున్న అతడి ఫోటోని తరచుగా ప్రచురిస్తూ, ఆయా పత్రికలు, అవేవో మహత్ముల ప్రవచనాల స్థాయిలో, అతడి స్టేట్ మెంట్లనీ ప్రచురిస్తుంటాయి. అతి సామాన్య స్థాయి నుండి కోట్ల రూపాయల ఆస్థిని సృష్టించిన వ్యాపారవేత్తగా… అతడి గురించి విద్యార్ధులకి పాఠాలు కూడా చెప్పబడ్డాయి.

ఆ so called వ్యాపార దిగ్గజం యొక్క వారసుల విషయం ప్రక్కన బెట్టినా, సదరు ధీరూభాయ్ అంబానీ యే విదేశాల్లో పనిచేస్తూ… వెండి దొంగ రవాణా చేసి డబ్బు సంపాదించడం గురించి గతంలో ‘అమ్మఒడి’ లో వ్రాసాను.
408. అంబానీల ఐశ్వర్యం – వెండి లండన్ కు చేరవేత ! [July 09 , 2010]
http://ammaodi.blogspot.com/2010/07/blog-post_09.html

ఇప్పుడు మన దేశంలోనే, అతడు అడ్మినిస్ట్రేషన్ సాక్షిగా, బ్యూరాక్రాట్లు, మంత్రి మగానుభావుల సహాయసహకారాలతో, ఎంతగా చేతివాటం చూపాడో దిగువ వ్యాసాన్ని ఓ సారి పరిశీలించండి.

>>> 07/12/10

సర్కారుపై వ్యాపారుల పెత్తనమా?
-భరత్ ఝన్‌ఝన్‌వాలా
స్పెక్ట్రమ్ వివాదం సూచిస్తున్నదేమిటి? వ్యాపారులు, మం త్రులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై సొంత ప్రయోజనాల కోసం చట్టాల నియమ నిబంధనలను మార్చి వేశారనే కాదూ! నిజానికి ఇది పాత కథే.

ఆర్థికవేత్త ఆర్.కె.హజారే (ముంబై విశ్వవిద్యాలయం) 1967లో ప్రణాళికా సంఘానికి ఒక నివేదిక సమర్పించారు. 1957-66 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు జారీచేసిన మొత్తం లైసెన్స్‌లలో 20 శాతం బిర్లా గ్రూపు కంపెనీలకే ఇవ్వడం జరిగిందని హజారే నివేదిక పేర్కొంది.

ఇటీవలి సంవత్సరాలలో అత్యధిక లైసెన్స్‌లను దక్కించుకోవడంలో అంబానీలు అగ్రగాములుగా ఉన్నారు. ప్రభుత్వ వ్యవస్థలోని అత్యున్నత స్థాయి వ్యక్తులపై కార్పొరేట్ సంస్థల ప్రభావానికి దేవెగౌడ ఉదంతం నొకదాన్ని నిదర్శనంగా చెప్పవచ్చు. పద్నాలుగేళ్ళ క్రితం నాటి మాట. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న దేవెగౌడ ప్రధాన మంత్రి పదవికి ఎంపికయ్యారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకై ఆయన బెంగుళూరుకు ధీరూభాయ్ అంబానీ సొంత విమానంలో ప్రయాణించారు! ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ వ్యవహారాలలో బడా పెట్టుబడిదారుల జోక్యం ఉండకుండా ఎలా ఉంటుంది? ఈ చట్ట విరుద్ధ వ్యవహారాన్ని ఎవరూ నిర్ద్వంద్వంగా ఖండించడం లేదు.

ప్రభుత్వం బలహీనంగా ఉన్నప్పుడు, సమర్థ పాలన నందించలేకపోతున్నప్పుడు అవినీతి ద్వారా అవసరమైన పనులను సుళువుగా చేయించుకోవడం సాధ్యమవుతుంది. అయితే అక్రమ ఆర్జనకు, వ్యాపారంలో సమస్థాయిలో లేని పోటీదారులను అణచివేయడానికి కూడా అవినీతి ఉపయోగపడుతుంది. ఇదొక తరహా అవినీతి.

హ్యామిష్ మెక్‌డోనాల్డ్ తన గ్రంథం 'అంబానీ అండ్ సన్స్' లో ఇటువంటి అవినీతికి పలు ఉదాహరణలను పేర్కొన్నారు. సింథటిక్ వస్త్రాలను 'పాలియెస్టర్ ఫిలామంట్ యార్న్' (పిఎఫ్ వై) నుంచి తయారు చేస్తారు. 1970ల్లో మన దేశంలో పిఎఫ్‌వై కొరత తీవ్రంగా ఉండేది. దేశీయ మార్కెట్‌లో దాని ధర అంతర్జాతీయ విపణిలోని ధర కంటే దాదాపు పదిహేడు రెట్లు ఎక్కువగా ఉండేది.

అటువంటి పరిస్థితులలో, నైలాన్ వస్త్రాలను ఎగుమతి చేసి పిఎఫ్‌వై ను దిగుమతి చేసుకోవడానికి అనుమతి జారీ చేసేందుకు ఆర్థిక మంత్రి టి.ఏ.పాయ్‌ను ఒప్పించడంలో ధీరూభాయ్ సఫలమయ్యారు. దరిమిలా ఆయన నైలాన్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేశారు. నిజానికి ఈ ఎగుమతి కాగితాల మీద మాత్రమే జరిగింది. అప్పట్లో నైలాన్ ధర అంతర్జాతీయ విపణిలో మీటరుకు రెండు రూపాయల కంటే తక్కువగా ఉండగా తాను నాలుగు రూపాయలకు అమ్మినట్టు ధీరూభాయ్ పేర్కొన్నారు.

నిజానికి ఆయన నైలాన్ వస్త్రాలను ఓడరేవుల్లోనే ఉంచారు. లేదూ అడిగిన ధరకు విక్రయించారు. ఆయన లక్ష్యం పిఎఫ్‌వైను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన పర్మిట్‌లను సమకూర్చుకోవడమే. నైలాన్ ఎగుమతుల మూలంగా ఆ పర్మిట్లు ఆయనకు మంజూరయ్యాయి. అలా దిగుమతి చేసుకున్న పిఎఫ్‌వైని భారీ ధరకు విక్రయించి భారీ లాభాలను ఆర్జించారు. 'ఎగుమతి' చేసిన నైలాన్ మీద వచ్చిన నష్టం కూడా ఆ లాభాలతో తీరింది.

1982లో అంబానీల పాతాళగంగ ప్లాంట్ ప్రారంభమయింది. ఆ వెంటనే పిఎఫ్‌వై పై ప్రభుత్వం టన్నుకు 15 వేల రూపాయల చొప్పున అదనపు దిగుమతి సుంకాన్ని విధించింది. డంపింగ్ (ఎగుమతి చేసే దేశం తన మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువ ధరకు ఎగుమతి చేయడం) కు వ్యతిరేకంగా ఈ అదనపు సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. నిజానికి అప్పుడు డంపింగ్ అనేది జరగడం లేదు.

అదనపు సుంకాలతో దేశీయ మార్కెట్‌లో పిఎఫ్‌వై ధర విపరీతంగా పెరిగిపోయింది. అంబానీకి లాభాలు మరింతగా పెరిగాయి. అసలే కొరతగా ఉన్న సరుకు దిగుమతిపై అదనపు సుంకాన్ని విధించడమేమిటి? ఈ విషయమై 'ఆల్ ఇండియా క్రింపర్స్ అసోసియేషన్' తీవ్ర నిరసన తెలిపింది. దేశీయ జౌళి పరిశ్రమను ఈ అదనపు దిగుమతి సుంకం దెబ్బతీస్తుందని వాదించింది.

ఈ అదనపు సుంకాన్ని ఉపసంహరించుకోవాలని పలు విధాల అభ్యర్ధించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కారణమేమిటి? ప్రభుత్వంలో రిలయన్స్ (అంబానీ కంపెనీ) కి ఉన్న పలుకుబడి. అయితే ఆ కంపెనీ వాటాదారులు పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. ధీరూభాయ్ చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆవేదన చెందారు. వాటాదారుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిచ్చే వ్యాపార ధర్మాన్ని ధీరూభాయ్ అనుసరించడం వల్లే ఆయన అంతగా ఎంతో మందికి ఆప్తుడయ్యారు.

దేశ ఆర్థికాభివృద్ధికి ధీరూభాయ్ అందించిన సేవలు గణనీయమైనవనడంలో ఎవరికీ సందేహం లేదు. ఆయన ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడు. స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి. ప్రతిష్ఠాత్మక వ్యాపార, పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నిర్మించిన ప్రతిభావంతుడు. రిలయన్స్ కథలో రెండు పరస్పర విరుద్ధాంశాలు మనకు కన్పిస్తాయి. ధీరూభాయ్ ఒక వైపు ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడితో తన పోటీదారుల అడ్డును తొలగించుకున్నారు. మరో వైపు తన కంపెనీ వాటాదారులకు మరెవరూ ఇవ్వలేని భారీ లాభాలను ఆర్జించి పెట్టారు.

నికర ప్రభావమేమిటి? ధీరూభాయ్ చర్యల వల్ల దేశానికి ఒనకూరిన ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా జరిగి ఉండవచ్చు. ఈ లాభనష్టాలను కచ్చితంగా అంచనా వేయవల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బడా వ్యాపారుల ప్రభావంలో ఉన్న ప్రభుత్వం ఈ బాధ్యతను నిష్పాక్షికంగా నిర్వహిస్తుందా? నిజాయితీగా అంచనా వేయడానికి అనుమతించని వ్యవస్థలో స్వతసిద్ధ లొసుగులు ఉన్నట్టేనని చెప్పక తప్పదు.

ఇది 1950ల్లో బిర్లాలకు, 1980ల్లో అంబానీలకు, 2010లో స్పెక్ట్రమ్‌కు సమానంగా వర్తిస్తుంది. మరి ప్రభుత్వం ప్రజలకు శ్రేయస్సు సమకూర్చేందుకు పారదర్శకంగా ఎలా వ్యవహరించ గలుగుతుంది? సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించేలా వ్యాపారులను ఎలా నిర్దేశించగలుగుతుంది? బిర్లాలు, అంబానీలు ఉద్దేశపూర్వకంగానో లేక కాకతాళీయంగానో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసి ఉండవచ్చు.

అయినంత మాత్రాన ఏకంగా ప్రభుత్వ వ్యవస్థను వారు తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం సమర్థనీయం కాదు.తమ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికై ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని జిడి బిర్లా, ధీరూభాయ్ పూర్తిగా ఉపయోగించుకున్నారు. స్పెక్ట్రమ్ లైసెన్స్‌ల విషయంలో కూడా ఇదే విషయాన్ని చెప్పవచ్చు.

ప్రభుత్వంపై బడా వ్యాపారుల పెత్తనం దేశ శ్రేయస్సుకు ఎంతమాత్రం మంచిది కాదు. కనుక బడా పారిశ్రామికవేత్తలు దేశా ఆర్థికాభివృద్ధికి ఎంతగా తోడ్పడినప్పటికీ ప్రభుత్వ వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వారు చేసే ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా ఖండించాలి. బడా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు తమ పరిధి మీరకుండా ప్రభుత్వం తప్పకుండా వాటిని నియంత్రిచాలి.

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/dec/7/edit/7edit2&more=2010/dec/7/edit/editpagemain1&date=12/7/2010

ధీరూభాయ్ అంబానీల వంటి వారు కార్పోరేట్ రంగంలో చాలామందే ఉన్నారు. షేర్ మార్కెటులో వాళ్ళ మాయాజాలంలోని వింతలూ విశేషాలూ ఇప్పుడు మెల్లిమెల్లిగా వెలుగు చూస్తున్నాయి.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే…

పడిపోతున్న షేర్ మార్కెట్లని నిలబెట్టుకోవటానికి తాము నానా నాట్యాలూ చెయ్యవలసి వస్తోన్నందునా, అంత నాట్యం చేసినా ఒకోసారి నిభాయించుకోలేక పోతున్నందునా… కొన్నిసార్లు మార్కెట్లు కూలడాన్ని చూస్తూ ఊరుకుంటూ… అందుకు కారణాలని సృష్టిస్తున్నారు.

ఆ విధంగా మార్కెట్లు కూలడానికి పైకారణాలని (over leaf reasons) ని చూపించి “మొన్నంటే ఫలానా కారణంగా మార్కెట్లు కూలిపోయాయి గానీ, లేకుంటే అదేమంత విషయం కాదు” లాంటి ప్రచారాలు నిర్వహించాలన్న ప్రయత్నం అది.

ఉదాహరణకి మొన్నామధ్యన (22 నవంబరు, 10) మార్కెట్లు కుప్పకూలాయి. కొరియాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటం దానికి కారణంగా ప్రపంచ మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద శతష్నుల దాడి చేసింది. అంతే! మార్కెట్లు కుప్పకూలాయి.

దశాబ్దాలుగా కొరియాల మధ్య శతృత్వం నెలకొనే ఉంది. యుద్ధ భయం పక్కలో బల్లెంలా ఉంది. అదిప్పుడు ఒక్కసారిగా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద దాడికి దిగబడటంతో… ఇక యుద్ధం రాజుకుంటుందేమోనన్న భయానికి మార్కెట్లు మందగించాయి – ఇదీ హోరెత్తిన ప్రచారం!

ఏదీ… ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మీద, ఒక్కసారి శతష్నుల దాడి చేసినందుకు ఇంత ప్రచారం, ఇంత ఉపద్రవం! మర్నాటి నుండి మళ్ళీ మామూలే! ప్రపంచాన్నంతా నడిపిస్తోంది ఒకే గూఢచార ఏజన్సీ అయినప్పుడు…పడిపోతున్న మార్కెట్లని నిలబెట్టుకోవటం దానికి అవసరమైనప్పుడు… ఆపాటి శతష్నుల దాడిని నిర్వహించటం అసాధ్యమా, అసంభవమా? ఈ యుద్ధ ప్రచారాన్ని అవసరమైనంత మేరకు సాగదియ్యటం అసాధ్యమా?

[కొసమెరుపేమిటంటే – అమెరికా, మద్దతుగా అణు యుద్ధనౌకను తీసుకొని, దక్షిణ కొరియాకు వెళ్ళి సైనిక విన్యాసాలు చేసింది. సవాళ్ళు ప్రతిసవాళ్ళు నడిచినా గానీ… ఆ రోజు గానీ, తరువాత రోజు గానీ మార్కెట్లేమీ పడిపోలేదు.]

ఇలాంటి సర్కస్ ఫీట్లతో కొన్నిసార్లు కూలుతున్న మార్కెట్లని చూస్తూ ఊరుకుంటున్నారు. ఆ విధంగా కనీసం కొన్ని రోజులైనా, గెయిన్ చేసుకోవటమే అది! లేకుంటే మరీ వరస బెట్టి, నిల్వలు కరిగించి తమ షేర్లను తామే క్రయ విక్రయాలు చేసుకోవాలి మరి! అందునా కరిగించుకునేది బంగారు నిల్వలయ్యె!

షేర్ల సహజ క్రయ విక్రయాల పరిమాణం చాలా తక్కువైపోయి చాలా రోజులే అయ్యింది. అది రోజు రోజుకీ మరింత తగ్గిపోతోంది.

కాబట్టే ఇన్ని మోసాలూ, అసత్య ప్రచారాలు! అది ఒక్క షేర్ మార్కెట్ విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో అదే దోపిడి, అదే మోసం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఉన్న కార్లు సొట్టలు పడి, కొత్తకార్లు కొనటం సంగతి దేవుడెరుగు, సొట్టల కార్లకి రిపేర్లే చేయించడం లేదనుకొండి! ఏమనుకుంటాం? ‘తొందర్లో ఈ కార్లూ మూలన పడేయటమో, అమ్ముకోవడమో జరుగుతుంది’ అనుకుంటాం.

ఇది దేశాలకైనా, కార్పోరేట్ కంపెనీలకైనా వర్తిస్తుంది. అదే బ్రిటన్ లోని హిత్రూ విమానాశ్రయంలో కన్పిస్తోంది.
అన్ని దేశాల్లో, కార్పోరేట్ రంగంలో… ఆ గడబిడనే ప్రస్తుతం మనం చూస్తున్నాం!

ఇలాంటి ఆర్ధిక నేపధ్యంలో… ప్రభుత్వ మద్దతుతో, నానా గల్లంతులూ చేసి మరీ, మార్కెట్లు నిలబెట్టుకునే పెనుగులాటనే మనం కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం.

బంగారు నిల్వలు అడుగంటే పరిస్థితి వస్తే… అసలా ఊహే వాళ్ళ వెన్నుల్లో చలి పుట్టోస్తోంది. ఆ గాభరానే అన్ని చోట్లా కనబడుతోంది. ఎందుకంటే – ఏ కలవరం లేదా కల్లోలం జరిగినా… ‘ఇందులకేదో నిమిత్తం ఉండి ఉండవలయును’ అనే పంచతంత్రం కథ దానికి పునాదిగా ఉంటుంది గనుక!

ప్రభుత్వం, ప్రత్యేకంగా మనదేశంలో అయితే (ఏ దేశమూ ఇందుకు మినహాయింపు కాదను కొండి.) ఇంత భారీగా అవకతవకల్లో అవినీతిలో కూరుకుపోయి కన్పిస్తోంది కూడా ఇందుకే! ఎంత డబ్బు సమకూర్చుకుంటే… కుప్పకూలుతున్న కాగితపు స్తంభాలని నిలబెట్టుకోగలరు? ఎంతగా సమాచారం కొనుక్కుంటే గానీ, ఎంతగా ఏజంట్లను తృప్తి పరిస్తే గానీ, తమకి అనుకూలంగా పరిస్థితులు కొంత మేరనైనా మలుచుకోలేరు. ఎందుకంటే…‘ఏదైనా డబ్బుతోనే! డబ్బు తప్ప ఇతర మానవ విలువలేవీ లేవు’ అన్నది ‘వాళ్ళు నేర్పిన పాఠమే’ ప్రతి వారికీ! (తమ ఏజంట్లకి కూడా!)

ఇక వ్యాపారం పేరుతో డబ్బు దోచుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు పన్నుతారో మరోసారి పరిశీలించండి.

1]. >>> 23/11
లైట్‌గా రెడ్‌వైన్ కొడితే షుగర్‌తో తంటాలుండవు
లండన్, నవంబర్ 22 : మీరు మందు బాబులా? అయి తే.. మీకు ఇక షుగర్ వచ్చినా భయం లేదేమో? మీ టేస్ట్ కొద్దిగా మార్చుకుని రెడ్ వైన్ క్రమం తప్పకుండా రోజుకింతని కొట్టేయండి. ఆప్పుడు మధుమేహం కూడా తగ్గిపోతుందట. రెడ్‌వైన్‌లో శరీరంలో గల చక్కెర నిల్వలను నియంత్రించే రసాయనాలు ఉన్నాయని వియన్నాలోని యూనివర్సిటీ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ అప్లైడ్ లైఫ్ సెన్సెస్ పరిశోధకులు కనుగొన్నారు. ఒక పరిమితిలో ఉంటూ మద్యం తాగే వారికి మధుమేహం రాదని లేదా నియంత్రణలో ఉంటుందని గతంలో జరిగిన అధ్యయనాల్లో తేలింది.

Pasted from https://www.andhrajyothy.com/worldnewsshow.asp?qry=2010/nov/23/world/23world3&more=2010/nov/23/world/worldmain&date=23/11/2010

ప్రపంచంలో 600 పై చిలుకు కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో సగానికి అటూ ఇటూగా మధుమేహ వ్యాధి పీడితులుంటారు. (ఈ మధ్య మధుమేహ వ్యాధిగ్రస్తులను గందరగోళ పరచటానికి టైప్ – 1, టైప్ – 2 లంటూ వాళ్లని వర్గీకరించారు. అంతేగాక కొన్ని సార్లు ఏదైనా ఆరోగ్యసమస్యతో డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు ఒకసారి మధుమేహ వ్యాధి ఉండటం, మరోసారి వీళ్ళే వేరే చోట్ల పరీక్షించుకుంటే ఆ వ్యాధి లేకపోవటం జరిగినట్లు చాలాసార్లు మనం వినటం కద్దు!)

ఇక వారిలో మద్యప్రియుల సంఖ్యా చెప్పుకోదగినంత గానే ఉంటుంది. వారికీ వార్త ఎంతో ప్రియంగా ఉంటుంది. మద్యప్రియులు కాని వారినీ, అప్పుడప్పుడూ మాత్రమే మద్యం పుచ్చుకునే వారికీ కూడా ‘కొద్దిగా రెడ్ వైన్ పుచ్చుకుంటే షుగర్ పేషంట్లుకి మేలు కలుగుతుందన్న’ వార్త ఆకర్షణ కలిగిస్తుంది.

మద్యం అలవాటు లేని వారికి కూడా ‘అవునా? అయితే ప్రయత్నిద్దామా?’ అన్పిస్తుంది. ఇక ఎంతగా వ్యాపారానికి కట్టలు తెగుతాయో ఎవరూ లెక్కలు వెయ్యలేరు.

శాస్త్ర పరిశోధనలింతే చెప్పాయంటే ఎవరు కాదనగలరు?

2]. మరో ఉదాహరణ,…
>>> 23/11

గూడు.. గోడు!
సొంత ఇంటి కలకు ఒక్క జీవోతో బ్రేకు
రియల్టర్లతో అధికారుల కుమ్మక్కు!
ఇంటికంటే ప్లాట్లు పదిలమనేలా నిబంధనలు
పర్యావరణం పేరిట అసాధ్యమైన ఆంక్షలు
పది శాతం సెట్‌బ్యాక్, పది శాంతం తనఖా!
120 చదరపు మీటర్లలో సింగిల్ బెడ్‌రూమ్ కట్టలేం

హైదరాబాద్, నవంబర్ 22 : మహేశ్‌కు నగరంలో 120 చదరపు మీటర్ల స్థలం ఉంది. అంతకుమించి కొనలేకపోయాడు! మధ్య తరగతి జీవితం మరి! స్థలం కొని చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు అందులో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఆర్కిటెక్ట్ వద్దకు వెళ్లి ప్లాన్ గీయమన్నాడు.

ఆర్కిటెక్ట్ పెన్సిల్ తీసుకుని... 120 చదరపు మీటర్ల స్థలం మధ్యలో ఒకే ఒక్క చదరం గీశారు. ఇదే మీ బిల్డింగ్ ప్లాన్ అని మహేశ్‌కు చెప్పాడు. 'ఇది హాలు ఓకే! మరి బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్ ఎక్కడ?' అని మహేశ్ ప్రశ్నించాడు.

అప్పుడు ఆర్కిటెక్ చకచకా అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు. "ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ప్రకారం... మీ 120 చదరపు మీటర్ల స్థలంలో 49 శాతం సెట్‌బ్యాక్స్ కింద వదిలేయాలి. అంటే... 58 చదరపు మీటర్లు ఖాళీగా పెట్టాలి. మిగిలింది 62 చదరపు మీటర్లు. అందులో... పది శాతం సర్కారుకు తనఖా పెట్టాలి. అది కూడా తీసేస్తే... 55.8 చదరపు మీటర్లు. ఈ స్థలంలో ఎవరైనా, ఇంతకంటే బెటర్ ప్లాన్ ఇవ్వలేరు!'' అంటూ ఆర్కిటెక్ట్ తేల్చి చెప్పారు. అంతే... మహేశ్‌కు మతిపోయినంత పనైంది.

120 చదరపు మీటర్ల ఖాళీ స్థలంలో కట్టుకోడానికి మిగిలేది 55.8 చదరపు మీటర్లు మాత్రమే. అంటే... 504 చదరపు అడుగులు. ఇందులో కనాకష్టంగా సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు మాత్రమే కట్టుకునే అవకాశముంటుంది. స్థలం, ఇంటి నిర్మాణం ఖర్చు కలిసి కనీసం రూ.20 లక్షలు అవుతుంది. ఇంకో మూడు నాలుగు లక్షలు అదనంగా పెడితే ఎంచక్కా డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ వస్తుందిగా!... అని మహేశ్ అనుకున్నాడు. సరిగ్గా ఇక్కడే సవరించిన జీవో నెంబర్ 86 'అసలు' ఉద్దేశం నెరవేరింది.

బిల్డర్ల బల ప్రదర్శన ఆర్థిక మాంద్యం ఫలితమో... తెలంగాణ ఉద్యమమో! నగరంలో ఒకటి రెండేళ్లుగా ఫ్లాట్ల అమ్మకాలు నిలిచిపోయాయి. నిజాంపేట, ప్రగతినగర్, మణికొండ, మాదాపూర్, ఉప్పల్... ఇలా అనేక ప్రాంతాల్లో వేలకొద్దీ ఫ్లాట్లు విక్రయానికి నోచుకోలేదు. ఇప్పుడు... ఆర్థిక మాంద్యం మబ్బులు మెల్ల మెల్లగా వీడుతున్నాయి. 'రియల్'లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో వేలాదిగా మిగిలిపోయిన ఫ్లాట్లను అమ్ముకునేందుకు కొందరు బడా రియల్టర్లు పావులు కదిపారు.

మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి చెందిన వారు సొంత ఇల్లు (ఇండివిడ్యువల్ హౌస్) కట్టుకునే ఆలోచన కూడా చేయకుండా కొందరు అధికారులతో కలిసి కుట్ర పన్నినట్లు బలమైన ఆరోపణలున్నాయి. దీని ఫలితంగానే జీవో 86కు సవరణ జారీ అయినట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుకూల 'గ్రీన్ హౌస్' పేరిట విచక్షణను మరిచి మరీ సెట్‌బ్యాక్స్ నిబంధనలు విధించారు.

ఇందులో భాగంగానే... వెయ్యి చదరపు మీటర్లు కొనగలిగే బడా బాబులకూ, నూటొక్క చదరపు మీటర్ల స్థలంలో మాత్రమే ఇల్లు కట్టుకోగలిగే సామాన్యులకూ ఒకే రకం నిబంధన విధించారు. సెట్‌బ్యాక్స్‌ను 49 శాతంగా నిర్ణయించారు. జనంతో కిటకిటలాడుతూ, కాంక్రీట్ అరణ్యాన్ని తలపించే హైదరాబాద్‌కు మాత్రమే కాదు... రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, చివరికి మున్సిపాలిటీలకు కూడా ఇవే నిబంధనలను వర్తింపజేశారు.

ఎక్కడా లేని చిత్రమిది...

దేశంలో మరెక్కడాలేని విధంగా పర్యావరణ భవంతులు అంటూ ప్రభుత్వం సామాన్యులపై నిబంధనల ఉచ్చు బిగించింది. 'ఇల్లు కొంచెం, చుట్టూ స్థలం ఘనం' అనే నిబంధన పర్యావరణ పరిరక్షణ నిమిత్తమే అంటోంది. నిజానికి... కేవలం సెట్‌బ్యాక్స్ వదిలేసినంత మాత్రాన అది 'పర్యావరణ భవంతి' అయిపోదు. తీసే పునాదుల నుంచి వేసే రంగుల వరకు... ప్రతి దశలో ప్రత్యేకమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. సిమెంటుకు బదులు ఒండ్రు మట్టిని ఉపయోగించాలి.

స్టీల్‌ను తక్కువగా, శాస్త్రీయ విధానం ప్రకారం వాడాలి. ఇసుక, ఇటుకల వినియోగంలోనూ నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. గాలీ వెలుతురు పుష్కలంగా వచ్చేలా బిల్డింగ్‌ను డిజైన్ చేయాలి. అలాగే... మామూలు విద్యుత్తును కాకుండా, సౌర విద్యుత్తును మాత్రమే అధికశాతం ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే... అది పూర్తిస్థాయిలో పర్యావరణ భవంతి అవుతుంది. కానీ... ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా కేవలం సెట్‌బ్యాక్స్ వదిలేస్తే చాలు, అదే గ్రీన్‌హౌస్ అయిపోతుందనేలా నిబంధనలు విధించింది.

ఏవిధంగా చూసినా 120 చదరపు మీటర్ల స్థలంలో గ్రీన్‌హౌస్ ఇంటిని కట్టుకోవడం అసాధ్యం. ఇంకా చెప్పాలంటే... గ్రీన్ సిటీగా, గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరులోనే ఇలాంటి ఆంక్షలు లేవు. అక్కడ భవనం ఎత్తును ప్రామాణికంగా తీసుకుని సెట్‌బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది. ఉదాహరణకు 11.5 మీటర్ల ఎత్తులో నిర్మించే భవనానికి నాలుగు వైపులా 5 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలితే చాలు.

ఆపైన అదనంగా నిర్మించే ప్రతి అంతస్తుకు సెట్‌బ్యాక్‌ను నాలుగు వైపులా ఒక్కో మీటరు చొప్పున పెంచాల్సి ఉంటుందని బెంగళూరు మహానగర పాలిక అడిషనల్ టౌన్‌ప్లానింగ్ అధికారి తిరుకన్ గౌడ తెలిపారు. కానీ... మన హైదరాబాద్‌లో 120 చదరపు మీటర్ల స్థలానికే నాలుగు వైపులా 10 మీటర్ల సెట్‌బ్యాక్‌ను వదలాలంటూ నిబంధనలు విధించడం గమనార్హం. ఇప్పటికే కట్టి ఖాళీగా ఉన్నా, మున్ముందు కట్టబోతున్న అపార్ట్‌మెంట్లలో విక్రయాలు పెంచుకోవడానికి రియల్టర్లు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది.

Pasted from https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/nov/23/main/23main14&more=2010/nov/23/main/main&date=23/11/2010

గ్రీన్ హౌస్ పేరిట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాలు, పట్టణాలలో ఇళ్ళ నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ఒక జీవో జారీ చేసింది.

120 గజాల స్థలంలో ఓ సగటు మానవుడు ఓ చిన్న స్వంత కొంప కట్టుకుందామని ఉబలాటపడితే… సదరు జీవో నియమ నిబంధనల ప్రకారం, చుట్టూ స్థలం వదిలేస్తే మిగిలేది 55 గజాలు మాత్రమే! అందులో ఓ గది వేసుకుని ముడుక్కుని బతికేయాలి. లేదంటే నోరు మూసుకుని సింగిల్ బెడ్ రూమ్ లేదా డబుల్ బెడ్ రూం ప్లాట్ కనుక్కోవాలి.

చూడండి, ఎంత కాలిక్యులేట్డ్ దోపిడినో ఇది! ఓ సామాన్యుడు ఓ 120 గజాల స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే తమకి (అంటే ప్రభుత్వాధికారంలో ఉన్నవారికి) వచ్చేదేం ఉండదు. అదే అపార్ట్ మెంట్లు కట్టి అమ్ముకునే బిల్డర్స్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండయితే… భారీ మొత్తాల్లో డబ్బు, బహుమతులుగా, లంచాలుగా అందుతుంది.

కాబట్టి ఇన్ని నియమనిబంధనలు! చుట్టూ స్థలం వదిలి పెట్టకుండా, మొక్కా మోడు పెంచకుండా, అగ్గిపెట్టెలు పేర్చినట్లుగా, ఇరుకిరుగ్గా ఇళ్ళు కట్టుకొని, సామాన్యులు భూగోళాన్ని వేడెక్కిచ్చేస్తున్నారనే పైకారణం (over leaf reason) తో గ్రీన్ హౌస్ జీవో జారీ చేసేసింది శ్రీమాన్ ప్రభుత్వం!

అప్పుడు ఈ గోలంతటి కంటే ఓ అపార్ట్ మెంట్ కొనుక్కోవటమే మేలనిపిస్తుంది. అక్కడికి తీసి కెళ్ళాలన్నదే ప్రభుత్వ యోచన! ఎందుకంటే ఎవరికి వారు చిన్న ఇల్లు కట్టుకునే మామూలు మనిషి నుండి తమకి రాలేదేం లేదు, అదే భారీగా అపార్ట్ మెంట్లు వ్యాపారం చేసే వారి నుండైతే కాసులు బాగానే రాలుతాయి మరి!

3]. మరో ఉదాహరణ…

ఒకప్పుడు మన దేశపు రోడ్లు అధ్వాన్నంగా ఉండేవి. ఇప్పుడూ చాలా చోట్ల అలాగే ఉన్నాయి లెండి. ప్రయాణం అసౌకర్యంగా ఉండటం మాత్రమే మనం గమనిస్తాం. కానీ గతుకుల రోడ్ల మీద ప్రయాణిస్తే… పెట్రోలు డీజిలు వంటి ఇంథన వినియోగం చాలా ఎక్కువ. తద్వారా చమురు సంస్థలకి, రిలయన్స్ ల వంటి కార్పోరేట్లకి (ఇటీవలే ప్రపంచ చమురు వ్యాపారంలో 2% తమదేనని గొప్పగా ప్రకటించుకున్నాడు ముఖేష్ అంబానీ!) ఒపెక్ దేశాలకి ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం!

అదొక్కటే కాదు… వాహనాల టైర్ల మన్నిక గణనీయంగా తగ్గిపోతుంది. టైర్ల జీవన కాలం సగానికి సగం పడిపోతుంది. ఇక రబ్బరు, టైర్ల ఉత్పత్తి సంస్థల వ్యాపారం ఎన్ని వేల లక్షల కోట్లల్లో ఉంటుందో ఏ పత్రికా లెక్కలు చెప్పదు.

ఇంధనమూ, టైర్లే కాదు! కమాను కట్టల నుండి ఆటోమోబైల్ రంగంలో వాహనాల విడివిభాగాల ఉత్పత్తి సంస్థలకీ, మొత్తంగా లారీ బస్సులు గట్రా వాహనాల ఉత్పత్తిదారులైన టాటా, ఆశోక్ లేలాండ్ ల వంటి వారికి…? ఊహాకి అందనంత వ్యాపారం!

అందుకే… ఇష్టాపూర్వకంగా, అవినీతి మహారాజ పోషణ మాదిరిగా నడిపించబడుతుంది. ఈ అవినీతి పందిరికి… కాంట్రాక్టర్లూ, అధికారులూ, రాజకీయ నాయకులు కనబడే గుంజలైతే, కార్పోరేట్ కంపెనీలు కనబడని గుంజ వంటివి.

ఇలాంటి దోపిడీలు, ఆర్ధిక మోసాలు లెక్కకు మిక్కిలి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇలాంటి ఆర్ధిక నేపధ్యంలో నరసింహమూర్తిగారు ఆంధ్రజ్యోతికి వ్రాసిన ఈ దిగువ వ్యాసం ఒకసారి పరిశీలించండి.

>>>10/11

పాఠం నేర్వకపోతే ప్రమాదం
- కె.నరసింహమూర్తి
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన తాలూకూ రాజకీయ, ఆర్థిక పర్యవసానాలు, ఫలితాలు ఎలాగైనా ఉండనీ, ఈ పర్యటనలో ఆయన చేసిన రెండు మూడు వ్యాఖ్యలు మాత్రం సగటు భారతీయులందరికీ మోదం కలిగిస్తాయి. స్వదేశంలో ఉపాధి అవకాశాల కల్పన కోసం భారత్ అండ కావాలని ఒబామా కోరడం, అంతర్జాతీయ సంక్షోభం దెబ్బకు తట్టుకుని నిలిచిన దేశంగా భారత్‌ను ఆయన శ్లాఘించడం... మన ఆర్థిక రంగం పటిష్ఠతకు నిదర్శనం.

ప్రపంచదేశాలన్నీ సంక్షోభంతో అల్లాడిపోతున్న సమయంలో భారత ఆర్థిక రంగం తట్టుకుని నిలబడటం సాధారణ విషయం కాదు. ఈ బలం మనకు ఎక్కడిది? దీన్ని మనం కాపాడుకుంటున్నామా? లేక చేజేతులా ధ్వంసం చేస్తున్నామా..? ఈ కీలక ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసియా దేశా ల చేయూత, మరీ ముఖ్యంగా భారత్ వంటి దేశాల అండ చాలా అవసరం. అమెరికా వెన్నంటి నడిచే యూరప్ దేశాలు సైతం కోలుకోలేని సంక్షోభంలో ఉన్నాయి. ఇటీవల నేను మాక్స్ బూపా బీమా కంపెనీ బోర్డు సమావేశం కోసం లండన్ వెళ్లాను. ప్రపంచ ప్రఖ్యాత హిత్రో విమానాశ్రయం పరిస్థితి, లండన్ ప్రధాన వీధుల్లోని పరిస్థితి నన్ను ఆశ్చర్య చకితున్ని చేసింది.

హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయమైనప్పటికీ పెద్దగా జనసందడి కానరాలేదు. మాసిన గోడలు, నీరసమైన వాతావరణం కనిపించాయి. అక్కడున్న లగేజ్ ట్రాలీలు సైతం పాతబడిపోయి లాగడానికి నానా ఇబ్బందిపడాల్సి వచ్చింది. రోడ్లపై ఒకటి రెండు టయోటా ఇన్నోవాలు, లాండ్‌రోవర్లు మినహాయిస్తే అన్నీ పాతకార్లే. ఇక మంచినీళ్ల సీసా ఒక్కటి ఒక్క పౌండ్ (71 రూపాయలు).. అంతర్జాతీయ కాల్ ఒక్కటికి నిమిషానికి 6-7 పౌండ్లు, ఆడవాళ్ల హ్యాండ్‌బాగ్ ఇండియాలో 1000 రూపాయల ఖరీదు ఉండేది.

అక్కడ 600-700 పౌండ్లు ఉంది. సరుకులు ఏవీ ముట్టుకున్నా భగ్గుమంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ అత్యంత వ్యయభరితంగా తయారైంది. బ్రిటన్ రుణభారం జిడిపిలో 78 శాతానికి చేరింది. ఏటా రుణ సమీకరణ మెనెస్ 11.5 శాతం ఉంది. అంటే అప్పులు తీర్చడానికి మాత్రమే కాకుండా ఇతర ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తున్నదన్న మాట.

సంక్షోభం దెబ్బతో బెంబేలెత్తిన ప్రభుత్వం ఇప్పటికే విద్య, ఆరోగ్యం, రక్షణ వ్యయాల్లో కోతపెట్టింది. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఎదురవుతున్న నిరసనను చవిచూస్తున్నది. యూర ప్‌లో కేవలం ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రమే ఈ విధంగా లేదు. ఫ్రాన్స్ రుణాల మొత్తం జిడిపిలో 85 శాతం ఉండగా గ్రీస్ రుణభారం 125 శాతానికి చేరింది. ఇటలీ అప్పుల మోత జిడిపి లో 119 శాతం. ఇక బెల్జియం 100 శాతం ఉండగా, పోర్చుగల్ 85 శాతం, జర్మనీ 78 శాతం, ఫ్రాన్స్ 76 శాతం, ఆస్ట్రియా 70 శాతం రుణభారంతో అల్లాడిపోతున్నాయి.

ఈ దేశాల నికర రుణ సమీకరణ మైనస్‌లోనే ఉంది. అంటే అప్పు చేసి పప్పుకూడు తినక తప్పని స్థితిలో ఈ దేశాలు ఉన్నాయి. అమెరికా, యూరప్‌లను కుంగదీసిన ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలు ఏవైనా, సంక్షే మం పేరుతో దుబారా, రాబడిని మించి ఖర్చు చేయడం, వినియోగ సంస్కృతి పతాక స్థాయికి చేరడం... ఈ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.

యూరప్ దేశాల్లో ఉచిత వైద్యం, మధ్యా హ్న భోజనపథకాలు, నిరుద్యోగ భృతి...ఇలాంటి సామాజిక భద్ర త ఏర్పాట్లపై భారీ వ్యయం కారణంగా భవిష్యత్‌కు సంబంధించిన భయాలు లేకపోవడంతో సాధారణ ప్రజలు విచ్చలవిడి వినియోగ సంస్కృతికి అలవాటు పడ్డారు. పని సంస్కృతిని దెబ్బతీసే విధానాలు, ప్రజలను సోమరులుగా మారుస్తాయి. పాత సోవియె ట్ యూనియన్ దేశాలు 22 ఏళ్లు గడిచినా ఇంకా ఒడ్డుకు చేరలేదంటే కారణం అదే.

గ్రీస్, ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్, పోర్చుగల్, బ్రిటన్, జర్మనీ... యూరప్‌లో ఒకదాని తర్వాత ఒకటి పేకమేడల్లా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న దేశాలు. సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ దేశాల ప్రభుత్వాలు శాయశక్తుల ప్రయత్నిస్తున్నా యి. అయితే ప్రజల ధోరణిలో మార్పు రాకుండా ఈ ప్రయత్నాలు ఫలించడం కష్టం. ఈ సంక్షోభం భారత్‌ను అంటకపోవడానికి ప్రధాన కారణం మన పొదుపు సంస్కృతి.

ఇది ప్రభుత్వాలు అలవాటు చేసింది కాదు. రేపటి కోసం ఆదా చేసుకోవడం మన సంస్కృతిలో ఒక భాగం. భారత్ బలం దాని సేవింగ్స్ కల్చర్‌లో ఉంది. నిజానికి మన రుణభారం మొత్తం కూడా జిడిపిలో 80 శాతం ఉంది. అయితే మన అప్పంతా అంతర్గత రుణం. యూరప్ దేశాల అప్పు అంతా విదేశీ రుణం. అత్యధిక స్థాయి సేవింగ్స్ రేటు వల్ల భారత ప్రభుత్వం అంతర్గతంగానే రుణాలను సమీకరించగలుగుతున్నది.

అందువల్ల అంతర్జాతీయ సంక్షోభంలోనూ మన ఆర్థికరంగం భద్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ సేవింగ్స్ రేటు తగ్గుతున్నది. అది ఆందోళనకర విషయం. సేవింగ్స్ రేటు 2007లో 37 శాతం ఉండగా 2010లో 34 శాతానికి తగ్గింది. వ్యయానికి సంబంధించి పశ్చిమదేశాల అలవాట్లు మన యువతను లొంగదీస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరుగుతున్నాయి.

ఆదాయా న్ని మించి వ్యయానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం రకరకాల సబ్సిడీలపై భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది. వినియోగసంస్కృతి విస్తరిస్తున్నది. ఇవన్నీ మంచి సంకేతాలు కావు. ఈ రోజు అమెరికా, యూరప్ ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి మనం గుణపాఠాలను నేర్చుకోకుండా అవే తప్పులను చేస్తున్నాం.

ఉదాహరణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని వల్ల గ్రామీ ణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు, పరిశ్రమలకు కూలీల కొరత ఏర్పడింది. మూడు రోజులు ఎన్అర్ఇజిఎస్ కింద పనిచేస్తే ఆరు రోజులు హాయిగా తినవచ్చన్న ధీమాతో పనుల్లోకి వెళ్లడం లేదు. ఇందుకు కారణం నిత్యవసరాలన్నీ చౌకగా పిడిఎస్ వ్యవస్థ ద్వారా లభించడమే.

ఈ పిడిఎస్ ప్రభుత్వ సబ్సిడీ వ్యయం కూడా భారీ గా పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పని సంస్కృతి దారుణం గా దెబ్బతింటున్నది. మరోవైపు ఉత్పాదకత కుప్పకూలుతున్నది. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి వ్యయా న్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

లేని పక్షంలో అంతర్జాతీయ రంగంలో మనం పోటీపడే సత్తా దెబ్బతింటుంది. రుణభారం, సేవింగ్స్ రేటు తగ్గడం, అనుత్పాదక వ్యయం, సబ్సిడీల భారం... ఇవి భారత ఆర్థిక రంగం ముందున్న సవాళ్లు. వీటి పరిష్కారంపై తక్షణం దృష్టి సారించాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణభారాన్ని జిడిపిలో 60 శాతంకంటే తక్కువస్థాయికి తగ్గించుకోవాలి. అనుత్పాదక వ్యయా న్ని, అనవసర సబ్సిడీలను తగ్గిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎన్ఆర్ఇజిఎస్‌ను సార్వత్రకంగా కాకుండా అవసరమైన ప్రాంతాల్లో అంటే ప్రత్యామ్నాయ ఉపాధి వ్యవసాయం పరిశ్రమలు లేని మండలాల్లో మాత్రమే అమలు చేయాలి. ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో అమలు చేయడం వల్ల ఉత్పాదకతకు నష్టం వాటిల్లుతున్న విషయం గమనించాలి.

వ్యవసాయం ముమ్మరంగా సాగుతున్న ప్రాంతాల్లో ఈ స్కీమ్‌వల్ల లేబర్ దొరకడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సబ్సిడీలను ఆరోగ్యంగా, సంపాదించగల వయస్సులో ఉన్న వారికి ఇవ్వకూడదు. అనారోగ్యంతో ఉన్న వారికి వికలాంగులకు, వృద్ధులకు మాత్రమే పరిమితం చేయాలి. స్వయం సహాయక బృందాలకు సామర్థ్యం మెరుగుకోసమే సబ్సిడీలు ఇవ్వాలి తప్ప బియ్యం రూపంలో కాదు. సేవింగ్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు ఉండాలి. సేవింగ్స్‌ను ప్రోత్సహించాలి. విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని నియంత్రించాలి.

మరి ముఖ్యంగా ఎఫ్ఐఐ నిధులపై కన్నేసి ఉంచాలి. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. జిడిపి వృద్ధిలో వ్యవసాయం వాటాను పెంచనిదే, సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు. స్వదేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్న కారణంగా బ్రిటన్ రెండేళ్ల నుంచి స్విట్జర్లాండ్ నుంచి పాలను దిగుమతి చేసుకుంటున్నది. భారత్‌కు అలాంటి పరిస్థితి రాకూడదు. రెండేళ్లు గా గరిష్ఠ స్థాయిల్లో ఉన్న ద్రవ్యోల్బణం వల్ల ఉత్పత్తి వ్యయం భారీ గా పెరిగే ప్రమాదముంది.

వ్యయం తక్కువగా ఉన్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మన కంపెనీలు పోటీ ఇవ్వగలుగుతున్నాయి. తాత్కాలికంగా విమర్శలు వచ్చినా దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంతో గట్టి చర్యలకు శ్రీకారం చుట్టనిదే మనం కూడా యూరప్ తరహా అనుభవాలను చవిచూడాల్సి వస్తుంది.

రేపటికోసం ఆదా చేసుకోవడం మన ఆర్య సంస్కృతిలో భాగం.

- కె.నరసింహమూర్తి
బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/nov/10/edit/10edit3&more=2010/nov/10/edit/editpagemain1&date=11/10/2010

అది బ్రిటన్! డబ్బున్న ఆసామీ. ఒకప్పుడు [అంటే 1450ల తర్వాత] సాంస్కృతి పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవాలతో, ఒక్కసారిగా ఆర్ధికంగా దూసుకెళ్ళిన యూరప్ కి అగ్రగామి అది! దోపిడికి పుట్టినిల్లు కూడా! దోచుకోవడానికి విదేశీయులింకా దొరకని దశలో స్వదేశీయుల్ని దోచుకున్న ప్రభువంశాలు, కులీనులు కుప్పులుగా ఉన్న దేశం!

అక్కడి రాజవంశ బంధువులే ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ గట్రాలకు రాజు, రాణీలుగా ఉండేవాళ్ళు. అప్పట్లో రోజుకి 16-18 గంటల పాటు పదిహేనేళ్ళ పసిపిల్లల చేత కూడా ఫ్యాక్టరీలలో పని చేయించే వాళ్ళు. పని చెయ్యలేక అలిసి కునికిపాట్లు పడిన పసివాళ్ళని కొరడాలతో కొట్టేవాళ్ళు.

ఆ విధంగా శ్రమ దోపిడితో సృష్టించుకున్న సంపదని ఒక్కసారి భోజనానికి కూర్చుంటే నాలుగు సార్లు పింగాణీ భోజన సామాగ్రినీ, టేబుల్ క్లాత్ లనీ కూడా మార్చేంత ఆర్భాటంగా ప్రదర్శించుకునే వాళ్ళు. ఇక వాళ్ళ జల్సాలకి ఆకాశమే హద్దు!

ఆ దెబ్బలకీ, ఆ దోపిడికీ విసిగిన మధ్య తరగతి ప్రజలు తిరగబడితే… గిలెటిన్ యంత్రాలతో కులీనుల, రాజవంశీయుల తలకాయలని, ఉల్లిపాయలని తరిగినట్లు తరిగారు. చెమటనీ, రక్తాన్నీ ఏరుల్లా ప్రవహించిన దేశాలు అవి!
[ఇప్పుడెన్ని నీతులు చెబుతాయో? మానవతా వాదానికి తామే ఆద్యులం అన్నట్లు ముఖం పెట్టి మరీ నీతులు చెబుతాయి ఈ యూరప్ దేశాలన్నీ! అమెరికా కూడా అంతే! ఆఫ్రికాలో నల్లజాతి వారిని, అడవిలో మృగాలని వలవేసి పట్టుకున్నట్లు పట్టుకుపోయి, మన పశువుల దొడ్లో పశువుల చేత చాకిరీ చేయించుకున్నట్లు చాకిరీ చేయించుకున్న వాళ్ళు… ఈ రోజు పెద్దన్నలై ప్రపంచానికి మానవతా పాఠాలనే నేర్పారు!?]

అలాంటి బ్రిటన్, దాని పరిసర దేశాలు… సముద్రమార్గాలు కనుక్కొని వలస రాజ్యాలు స్థాపించుకున్నాక… విదేశాల నుండి తెచ్చిన దోపిడి సొమ్ముని, తమ దేశీ జనాలకి కూడా పంచారు. వలస రాజ్యాలలో ఉన్నత ఉద్యోగాల పేరిట, వ్యాపార సంస్థలని అనుమతించటం ద్వారా… వలస రాజ్యాలలో దోపిడికి మార్గాలు చూపారు, దోచుకోనిచ్చారు.
దాంతో అంతకు ముందు వరకూ… రాజుల ధన సహాయంతో భారత్ వంటి దేశాలకూ సముద్ర మార్గం కనుకొనడానికి బయలు దేరిన నావికుల గుంపుల్ని సముద్రపు దొంగల గుంపులుగా ఎగతాళి చేసిన బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్ గట్రా యూరోపియన్ దేశీయులు, క్రమంగా… దోపిడి అవకాశాలు తమ దాకా వచ్చేసరికి, తమ తమ ప్రభువుల్ని కొనియాడటం మొదలెట్టారు. ఆ విధంగా ‘వర్గం మారితే వైషమ్యం మారుతుంది’ అనే కారల్ మార్క్స్ మాట అక్కడ నిజమైంది.

ఆ విధంగా ఆయా ప్రభువంశీయులు కూడా, తమ చుట్టూ పరిస్థితుల్ని తమకి అనుకూలంగా చక్కబెట్టుకున్నారన్న మాట!

దరిమిలా, దాదాపు రెండు మూడు శతాబ్దాలుగా ఆర్ధికంగా వెలిగిన యూరప్ దేశాలు… మధ్యలో ప్రపంచ యుధ్దాల కారణంగా ఒడిదుడుకులకు లోనైనా, డబ్బున్న ఆసాములు గానే కొనసాగ గలిగారు. ఎందుకంటే వాళ్ళకి గూఢచర్య లాబీయింగ్ కొనసాగింది.

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి, ఆయా దేశాల్లో రాజకీయ, కార్పోరేట్ వ్యాపార ఏజంట్లున్నారు మరి! వాళ్ళని పచ్చగా ఉంచారు, తదనుగుణంగా ఆయా దేశాలూ బాగానే రెపరెపలాడాయి. అందునా కాగితపు సంపదతో, ఆర్ధిక అసత్య సిద్ధాంతాలతో, అర్ధం కాని నిర్వచనాలతో, అయోమయపు లెక్కలతో, దోపిడిని ప్రశ్నించలేని విధంగా ప్రచ్ఛన్నంగా దాచి ఉంచి, ఏవేవో పైకారణాలని ప్రచారించారయ్యె!

అది ఇప్పుడు బద్దలవుతుండే సరికి… మెల్లిగా అసలు వాస్తవాలు బయటికొస్తున్నాయి. ఓ ఉదాహరణ చూడండి. పేదవాడు తన ఇంటికి సున్నం కొట్టించుకోవాలనుకున్నా… ఏ పెళ్ళో పేరంటమో అయితే గానీ, అందుకు నడుం కట్టలేడు. అదే ఓ ధనిక ఆసామీ అయితే – తన భవంతిని తళ తళలాడేలా ఉంచుకోవటం తన ప్రిస్టేజ్ కి సంబంధించిన విషయంగా చూసుకుంటాడు. కాబట్టి రంగు వెలసినట్లు అనిపించక పోయినా, వెలుగు తగ్గిందనుకోగానే కొత్తరంగులు వేయించేస్తాడు.

అలాగ్గాక మెల్లిగా ధనికుడి భవంతికి రంగు వెలసిందనుకొండి. ఇంకా మెల్లిగా పెచ్చులూడిందను కోండి! ఏమనుకుంటాం? ‘సదరు ఆసామికి కానికాలం వచ్చినట్లుంది’ అనుకుంటాం.

ఉన్న కార్లు సొట్టలు పడి, కొత్తకార్లు కొనటం సంగతి దేవుడెరుగు, సొట్టల కార్లకి రిపేర్లే చేయించడం లేదనుకొండి! ఏమనుకుంటాం? ‘తొందర్లో ఈ కార్లూ మూలన పడేయటమో, అమ్ముకోవడమో జరుగుతుంది’ అనుకుంటాం.

ఇది దేశాలకైనా, కార్పోరేట్ కంపెనీలకైనా వర్తిస్తుంది. అదే బ్రిటన్ లోని హిత్రూ విమానాశ్రయంలో కన్పిస్తోంది.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

బంగారం…! అదెప్పుడూ విలువైనదే! అదెప్పుడూ మనిషిని ఆశకు గురి చేసేదే!

ఇదే సూత్రం కార్పోరేటు రంగంలో కీలక దిగ్గిజాల దగ్గరా పని చేస్తుంది.

కాబట్టి… కార్పోరేట్ కంపెనీల బడాబాసులు తమ సంపద నిల్వలని స్థిరాస్థుల రూపంలోది పోగా… మిగిలినది కరెన్సీ రూపంలో కొంతే ఉంచుకుంటారు, బంగారు రూపంలో మరింతగా దాచుకుంటారు.

ఈ బంగారం నేపధ్యంలో, 1990-92 నాటి రాజకీయ నేపధ్యాన్ని ఓసారి పరిశీలిస్తే… అప్పట్లో బంగారం ధర ఇప్పటితో పోలిస్తే 8వ వంతు కంటే కూడా తక్కువే! బయట చూస్తే ఆర్ధికంగా దేశం ఎంత క్లిష్టదశకు చేరిందంటే పీవీజీ కి ముందు ప్రధాని పదవి వెలగబెట్టిన భోండ్సీ బాబా చంద్రశేఖర్, విశ్వవిఫణిలో బంగారాన్ని, భారత ప్రభుత్వం తరుపున తనఖా పెట్టాడు.
చంద్రశేఖర్ ప్రభుత్వానికి ముందటి ప్రభుత్వం (వీపీ సింగ్ ప్రభుత్వం) పదివేల రూపాయల ఋణాలను రద్దు చేయటం వలన ఆర్ధిక స్థితి దివాళా దశకు చేరి పరిస్థితి అక్కడకి దారి తీసింది.

ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఆ తర్వాతి ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురవుతాడనీ, తదుపరి పీవీజీ ప్రధానిగా చేయబడతాడనీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులకి తెలుసు. అది మన బోటి వారికి, సాధారణ ప్రపంచానికీ తెలియకపోవటం వేరే విషయం.

ప్రధానిగా పీవీజీ హయాంలో దేశాన్ని ‘1992 డిసెంబరు ఆరున బాబ్రీ మసీదుని కూలగొట్టటం’ అనే పైకారణంతో ముక్కచెక్కలు చెయ్యాలన్నది వాళ్ళ చిరకాల వాంఛ!

కాబట్టే – బాబ్రీ మసీదుని కరసేవకులు నేలమట్టం చేస్తున్నప్పుడు… అద్వానీ ఆనందంగా “నా శరీరం పులక లెత్తుతోంది. మన చిరకాల వాంఛ నెరవేర బోతోంది. నా జన్మసార్ధక మయ్యింది” ఇత్యాది పరవశోక్తులు పలికాడు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఇతడి లక్ష్యం అదే మరి! [అద్వానీ పరవశాన్నీ, పలుకుల్నీ గురించి పోలీసు అధికారిణి అంజూగుప్తా ఇటీవల సాక్ష్యం చెప్పింది.]

ఆ విధంగా… దేశాన్ని కుప్పకూల్చేందుకు సర్వ సన్నద్ధంగానే ఉన్నారు. కాబట్టే డిసెంబరు 6, 1992 న భాజపా, ఆర్.ఎస్.ఎస్., వి.హెచ్.పి. లు లెక్కకు మిక్కిలిగా కరసేవకుల్ని సమీకరించి, అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన సందర్భంలో, ఆ సంఘటనని కవర్ చేయటానికి బి.బి.సి. వంటి వార్తా సంస్థల దిగ్గజాలతో సహా, ప్రపంచ మీడియా భారత్ లోనే తిష్ఠ వేసింది.

ప్రత్యక్ష ప్రసారాలతో విషయాన్ని రక్తి కట్టించటానికీ, మలుపులు తిప్పటానికీ అది పూర్ణ సన్నధ్దత తో ఉంది. ఇప్పుడంటే – మీడియా, ఏ విధంగా రాజకీయాలనీ, ప్రపంచ దేశాల స్థితిగతులనీ కూడా నడిపిస్తుందో ఇంతగా బహిర్గతం అయ్యింది గానీ, అప్పటికి ‘ఇదీ విషయం, ఇదీ మీడియా పనితీరు!’ అంటే నమ్మగల వాళ్ళు చాలా చాలా తక్కువ.
నిజానికి ప్రపంచ యుద్ధాలకు దారి తీసిన కారణాలలో అయా దేశాల మీడియాది కూడా ప్రధాన పాత్ర అయినా, అది పదో తరగతి పిల్లల సాంఘీక శాస్త్ర పాఠంలో ఓ చిన్న పేరాగా ఉంటుందే తప్ప, ఇంపార్టెంట్ ప్రశ్నల జాబితాలో కూడా ఉండదు. అలాంటి చోట, ప్రజలకి అది తెలిసేంత ప్రచారంలో ఎలా ఉంటుంది? అప్పటికి ప్రచార పట్టు మొత్తం వాళ్ళదే కదా!

ఇక… ఒక వేళ అయోధ్యలోని బాబ్రీ కూల్చివేత వ్యవహారం గానీ తగినంత మోతాదులో దేశ విస్ఫోటనం చెందించక పోతే… భాజపా జాబితాలో అయోధ్యలోని ‘రామ జన్మభూమి - బాబ్రీ మసీదు’ వివాదం తర్వాత, మధుర లోని ‘శ్రీ కృష్ణ జన్మభూమి-మసీదు వివాదం’ ఉంది. ఆ తదుపరి అదే జాబితాలో మరో 500 చోట్ల మసీదులు పడగొట్టి మందిరాలు కట్టే ప్రణాళిక ఉంది. ఈ విషయం పీవీజీ తన అయోధ్యలో స్పష్టంగా వివరించారు. మందిరాలు కట్టినా కట్టకపోయినా… ఆ పైకారణం(over leaf reasons) తో మత ఘర్షణలైతే బాగా రేపవచ్చు.

వాటిని కవర్ చేయడానికే ప్రపంచ మీడియా ఆనాడు భారత్ లో తిష్ఠ వేసింది. ముస్లిం దేశాల అండదండలతో చెలరేగే ముస్లిం తీవ్రవాద సంస్థలు, ఆల్ ఖైదాలూ, తాలిబాన్లు అప్పటికి చాపక్రింద నీరులా ఉన్నాయి గనక, వాటి బలం ఎంతో… ఇప్పుడు తేటతెల్లమైనట్లుగా అప్పటికి తెలియదు కూడా!

అలాంటి చోట… చంద్ర శేఖర్ హయాంలో బంగారాన్ని తనాఖా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. తర్వాతి కాలంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. పీవీజీ ప్రధాని అయ్యాక అనివార్యమై కూడా వెన్వెంటనే సరళీకరణకి ద్వారాలు తెరిచాడు. అయితే ఆయన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టగానే…మన్మోహన్ సింగ్ వంటి ఆర్ధికవేత్తల అభివృద్ధి పరుగెత్తుకు రాలేదు. సదరు మేధావుల మాయాజాలం తో షేర్ మార్కెట్ లో బూమ్ వచ్చింది. అందులోంచి హర్షద్ మెహతా వచ్చి కూర్చున్నాడు.

ఇప్పుడు… దాదాపు 18 ఏళ్ళు గడిచాక…పీవీజీ 1992 లో, ఆ తర్వాతా సమీకరించిన నెం.5 వర్గపు పని తీరు కారణంగా, మెదళ్ళతో యుద్ధం కారణంగా, ఇప్పుడు భారత్ ని ఇలా అమెరికా అధ్యక్షులు ఒబామాలు ప్రశంసిస్తున్నారు గానీ, అప్పటి పరిస్థితి వేరు.

1992, డిసెంబరు 6న బాబ్రీ ఘటన నాటికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల చిరకాల వాంఛ ప్రకారం – భారత్ ని కుప్పకూల్చి, ముక్కచెక్కలు చెయ్యగలిగితే… అందుకోసం మత ఘర్షణలని కార్చిచ్చులా దేశమంతా వ్యాపింప జేస్తే…

అంతకు ముందు సంవత్సరాల్లో చంద్రశేఖర్ గట్రాల హయాంలో బంగారం తనఖా పెట్టిన కేంద్ర ప్రభుత్వం దగ్గర ద్రవ్యనిధులే మాత్రం ఉండి ఉంటాయో ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు. అలాంటి చోట, పెచ్చరిల్లే మత ఘర్షణలని, అణచి వేసేందుకైనా కేంద్రం దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు. ఇటు ముస్లిం వర్గాలకూ, అటు భాజపా, వీ.హెచ్.పీ., ఆరెస్సెస్ వర్గాలకూ మాత్రం, గొడవలు రేపేందుకు, శరీర దార్డ్యత గల ప్రొఫెషనల్స్ ని కిరాయికి తెచ్చుకునేందుకు… అన్నిరకాలుగా మత కల్లోలాలని ఆర్గనైజ్ చేసేందుకు, కావలసినంత ఆర్ధికబలం ఉండింది.

అందుకే… ద్రవ్యలోటుతో ఉన్న కేంద్ర ప్రభుత్వం, బంగారాన్ని తనఖా పెట్టుకున్న ప్రభుత్వం, పీవీజీ చేతుల్లో కొచ్చింది. ఆ పైన బాబ్రీ కూల్చివేతని ఎదుర్కుంది. కాకపోతే 1992 మధ్యనాటికే పీవీజీ కి గూఢచర్యవలయంలో కీలక స్థానమైన రామోజీరావు ఉనికి తెలియడం, ఆ తీగ లాగితే ప్రపంచాన్ని అల్లుకున్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల గూఢచర్య వలయం తెలియటంతో… వాళ్ళ ఈ వ్యూహాలన్నీ తల్లక్రిందులయ్యాయి.

ఇది రాజకీయ నేపధ్యం!

ఇక… ఆర్ధిక రంగంలో…

ఆ తదనంతర పరిణామంలో వాళ్ళు అనుకున్నట్లే భారత దేశం మత ఘర్షణలతో కుప్పకూలి సుమారు ఓ 500 చిన్న చిన్న రాజ్యాలుగా (సంస్థానాలుగా) విడిపోయి ఉంటే – రూపాయి కి విలువెక్కడి నుండి వచ్చేది? అప్పుడు బంగారానిదే హవా! అంతటి పాత్ర ‘బంగారం’ది.

(అందుకు బదులు గానే… డాలర్, పౌండులకు మాదిరిగా రూపాయికీ ఓ ‘చిహ్నం’ అంతర్జాతీయంగా గుర్తించబడింది. మొదట వాణిజ్యపరంగా భారత్ కు గుర్తింపు వచ్చి, ఆ తర్వాత రూపాయికి గుర్తింపు వచ్చింది. అదీ నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ మధ్య… గూఢచర్య యుద్ధం లేదా మెదళ్ళతో యుద్ధంలో భాగంగా… నడిచే ‘సవాళ్ళు-ప్రతి సవాళ్ళ’తో కూడిన భాష! )

చిన్నచిన్న రాజ్యాలు లేదా సంస్థానాలుగా విడిపోతే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంటే వాళ్ళే ఆయా చిన్న రాజ్యాలకు మహారాజులు! అందుకోసం భారీగానే బంగారం నిల్వలున్నాయి, మాజీ సంస్థానాధీశుల దగ్గరా, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల తాలుకూ కీలక ఏజంట్ల దగ్గరా! ఆ జాబితాలో కొందరు కార్పోరేట్ దిగ్గజాలు కూడా ఉన్నారు.

ఎటూ జైపూర్ మాజీ రాణులు, రాజులు, సంస్థానాధీశులు తమ ఆనాటి రాజసౌధాలని హెరిటేజ్ హోటళ్ళుగా మార్చి, స్వయంగా కొన్ని కంపెనీలలో వాటాలు కలిగి ఉండి… అదునైన సమయం రాగానే పరిస్థితుల్ని అంది పుచ్చుకోవటానికి సిద్దంగానే ఉన్నారు.
ఇక్కడ ఉదాహరణకి సౌదీ రాజునే తీసుకొండి. అతడి రాజవంశం ఎప్పటి నుండో సౌదీని ఏలిన రాజ వంశం కాదు. బ్రిటీషు వాళ్ళు అంతర్జాతీయంగా చాలా దేశాలలో స్వాతంత్రాలు ప్రకటించిన తరువాత ధనికుడైన సౌదీ వ్యక్తి సౌదీకి రాజుగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత అతడిని సౌదీ రాజుగా వ్యవహరించటం మొదలైంది. ఇంకో తరం తర్వాత ‘సౌదీ రాజు పూర్వీకులు నిజంగానే సౌదీని వంశపార్యపరంగా ఏలేరేమో!’ అనుకుంటాం. అదీ మీడియా ప్రచార బలం.

కాబట్టి ధనికులు, కార్పోరేటు దిగ్గజాలు, భారీ బంగారు నిల్వలని ఆనందంగా, రహస్యంగా దాచుకున్నారు.

ఇప్పుడు, ఈ ఆర్ధిక మాంద్యంలో, అన్నిదేశాలలో ప్రభుత్వాల చేత ప్రకటించుకున్న ఉద్దీపనలన్నీ బావిలో పోసిన బక్కెట్ నీళ్ళలాగా అయ్యేసరికి… గమ్యం చేరటం కోసం నౌక చెక్కలు నరికి తగలేసిన ఫిలియాస్ ఫాగ్ లాగా… (విపర్యయ పోలికే ననుకొండి) ‘ఈ గండం గడిస్తే చాలు’ అనే పరిస్థితికి ప్రయాణించారు.

ఎందుకంటే – కంపెనీలు కూలితే మిగిలేది శూన్యమే మరి! కాబట్టి కూడా షేర్ మార్కెట్ ని నిలబెట్టు కోవాల్సి వస్తోంది. అందుకోసం అనధికార బైబ్యాక్ (అంటే తమ షేర్లని తామే బినామీగా క్రయ విక్రయాలు జరిపించుకోవటం) నిర్వహించాలంటే పైకం కావాలి.

(మార్కెట్ లోకి సామాన్య మదుపరులూ, అమాయక చక్రవర్తులూ రావటం ఎందుకు తగ్గిందో గత టపాలలో వివరించాను.) ఆ పైకం సమకూర్చు కునేందుకు, తమ దాచుకున్న బంగారు నిల్వలు బయటకు తీస్తున్నారు.

అలాంటప్పుడు కొన్నేళ్ళ క్రితం లాగా (అంటే గత అర్ధ దశాబ్దం వరకూ) బంగారానికి తక్కువ విలువ ఉంటే ఎలా? అందుకే… రెండేళ్ళు తిరిగే సరికే, బంగారం విలువ అమాంతం అయిదేసి రెట్లు పెరిగి పోయింది.

‘బంగారం విలువ ఇన్నేళ్ళల్లో అన్నిరెట్లు పెరిగింది, ఇంత శాతం పెరిగింది’ అంటూ గ్రాఫులతో సహా విశ్లేషణలు చెప్పే ఏ మీడియా కూడా, ఎందుకింత పెరిగిందో చెప్పక పోవటానికి కారణం కూడా ఇదే! ఇప్పుడు క్రొత్త ప్రచారం – ‘షేర్ మార్కెట్ మందగమనం వలన బంగారం కొనుగోళ్ళు పెరిగాయని, అందుకే చైనా, భారత్ లు భారీగా బంగారం దిగుమతి చేస్తున్నా’యన్నది.

[ఇక ఇప్పుడు వెండినీ మరింతగా ఆకాశంలోకి ఉరికించ దలుచుకున్నారు గనకనే ‘ఇక పేదవాడి బంగారం వెండీ’ అంటూ వెండి కంఠా భరణాలని నాజూకు డిజైన్లలో రంగుల ఫోటోలని ముద్రించి ప్రచారం ప్రారంభించారు. ఎటూ ‘వెర్రి, మోజు’ ఎక్కించి, కుహనా విలువ పెంచితే… ఆ మాయ లో పడే వాళ్ళు ఇంకా చాలామందే సమాజంలో ఉన్నారు కదా! వారిలో కార్యకారణ సంబంధం తెలీని వారు కొందరు, మీడియా ప్రచారాన్ని నమ్మేవారు మరి కొందరు!
ఇప్పుడు బంగారం ధర ఇరవై వేలు దాటాక, ప్రత్యామ్నాయాలు వెదుక్కునే ఎగువ దిగువ మధ్య తరగతి ప్రజల మీదికి ఒన్ గ్రాం ఆర్నమెంట్ ప్రచార వల విసురుతోంది మీడియా! ఊదర పెట్టే కథనాలు, ఊరించే రంగుల ఫోటోలతో తరచూ ఆర్టికల్స్ ని, ప్రత్యామ్నాయంగా మనకి చూపిస్తూనే ఉంటుంది.

అంటే వెరసి… సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి జేబులు పట్టనంత సంపాదనా అంటూ 5 లక్షల ఫ్లాటు 25 లక్షల రూపాయలకు అమ్మి దోపిడి చేసినట్లు, 10 గ్రాముల బంగారం, నాలున్నర ఐదు వేల రూపాయలలో ఉన్న ధర కాస్తా 20 వేల రూపాయలకి చేరింది. ఇదో రకం దోపిడి. వెండిది కూడా ఇలాంటి దోపిడియే!

ఇంత విపరీతంగా పెంచిన బంగారు ధరతో, తమ వద్దనున్న బంగారాన్ని డబ్బుగా మార్చుకొని, దాంతో తమ షేర్లని తామే దొంగ కొనుగోళ్ళు అమ్మకాలు చేసుకుంటూ నిభాయించుకో ప్రయత్నిస్తున్నారు. (అన్ని గాక పోయినా అధిక భాగం, అలాగే అన్ని కంపెనీలు గాకపోయినా బడా కంపెనీల్లో అధిక భాగం)

నిభాయింపు ఎప్పుడూ గుప్తంగానే ఉంటుంది. నిభాయించుకునే ప్రయత్నాల్లో భాగంగా, కొద్దిపాటి ఒడిదుడుకులే తెరపైన మనకి కనిపిస్తాయి. నిజానికి నిల్వలు పెంచుకునే స్థితి నుండి, నిల్వలు కరిగించుకునే స్థితికి రావటమంటేనే కష్టాల సుడిగుండంలో ఉన్నట్లే! అది బాహాటంగా అందరికీ తెలియటానికి మరికొంత సమయం పట్టవచ్చు గాక, వాళ్ళకైతే తమ ‘కంత’ ఎంత పెద్దదో తెలుస్తుంది కదా!

బయట వాళ్ళకి మొత్తం కుప్పకులాకే తెలియవచ్చు గానీ, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుసు… తమ నిల్వలు పెరుగుతున్నాయో, తరుగుతున్నాయో! అన్ని దేశాలలో, కార్పోరేట్ రంగంలో, ఆ గడబిడనే ప్రస్తుతం మనం చూస్తున్నాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇక ఈ గృహ ఋణాల, సూక్ష్మ ఋణాల విషయాన్ని ఇక్కడితో వదిలేసి తిరిగి షేర్ మార్కెట్ మతలబులని పరిశీలిస్తే…

`మణి మాణిక్యాలతో నిండిన బంగారు బిందె’లా కనబడే షేర్ మార్కెట్ ప్రచారాలనీ, ఆర్ధిక గణంకాలనీ… నెం.5 వర్గం lateral thinking ని ప్రయోగించి… ‘బంగారు బిందెల్ని బోర్లా పడేట్లు చేసి, చిల్ల పెంకులని ప్రదర్శింపచేయటం’ గురించి గత టపాలలో వివరించాను. అది పదే పదే జరగటంతో… షేర్ మార్కెట్ లో కీలక పాత్ర పోషించే ‘బుల్’ లకు కీలక పరిణామం ఎదురైంది.

అదేమిటంటే…

సాధారణంగా ‘బుల్’ లు, షేర్ల క్రయ విక్రయదారులకూ, కార్పోరేట్ కంపెనీలకు మధ్య అనుసంధాన కర్తలుగా కూడా వ్యవహరిస్తారు. మార్కెట్ గురించి వాళ్ళ అంచనాలు విలువైనవిగా అటు కంపెనీలు, ఇటు షేర్లలో పెట్టుబడి పెట్టే వారు (షేర్ల క్రయ విక్రయదారులు) భావిస్తారు.

‘బుల్’ లు తమ క్లయింట్లకు (అంటే షేర్ల క్రయ విక్రయాలకై తమ దగ్గరకు వచ్చే మదుపుదారులు) జవాబుదారిగా ఉంటారు. అదే విధంగా కంపెనీలకి ప్రయోజనాలు కలిగించటానికి ప్రయత్నిస్తారు. ఓ పిసరు మొగ్గు, కంపెనీల వైపే ఉంటుంది. కాబట్టి కంపెనీల తరుపున మౌఖిక ప్రచారాన్ని ప్రభావవంతంగా నిర్వహిస్తారు. మీడియా ప్రచారంతో బాటుగా మౌఖిక ప్రచారం కూడా ఈ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

అలాంటి నేపధ్యంలో… ‘బుల్’ లు, పైకి తమ క్లయింట్ల శ్రేయస్సు కోసం పాటుపడినట్లుగా కన్పించినా… అంత కంటే ఎక్కువ మోతాదులోనే కంపెనీల శ్రేయస్సు కోసం పాటు పడేవాళ్ళు. స్వల్ప వ్యవధిలో ఒడిదుడుకులు సరిదిద్ద బడేవి గనక, కంపెనీల కోసం స్వల్పకాలిక మౌఖిక ప్రచారాన్ని నిర్వహించి పెట్టుబడిదారులని ప్రభావపరిచే వాళ్ళు.

అయితే… కొంతకాలంగా… వాస్తవంలో తరుగుదలే కానీ పెరుగదల లేని/ రిస్క్ ఎక్కువగా ఉన్న ఆర్ధిక స్థితి రీత్యా… తమ వ్యాపారంలో గుడ్ విల్ నిలబెట్టుకోవటమే పెట్టుబడి వంటిది గనుక… క్రమంగా ‘బుల్’ లు, క్లయింట్లకు, లోతట్టుగా కంపెనీల గుట్టుమట్లు చెప్పక తప్పలేదు. ఫలానా షేర్లు ఇక పెరగ బోవనో, లేక ఇంత మేరకు తరుగనున్నాయనో… ఇలాగన్న మాట?
ఎందుకంటే - ఇప్పుడు తమ క్లయింట్లందరూ నష్టపోతే… ఆనక తమ దగ్గరికి ఇంకెవరూ రారు! ఆర్ధిక మాంద్యం నుండి కంపెనీలు బయటపడతాయోమో గానీ, గుడ్ విల్ కోల్పోయాక తమ కార్యాలయాలు మాత్రం తెరవబడవు. అందుచేత కూడా… క్లయింట్ల పట్ల కొంతైనా నిజాయితీగా ప్రవర్తించక తప్పనిసరి వారిది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికస్థితి కుదేలవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం!

దాంతో చాలా కార్పోరేట్ కంపెనీలకు… బినామీ పెట్టుబడి దారుల రూపంలో తమ షేర్లని తామే క్రయవిక్రయాలు జరుపుకోక తప్ప లేదు, తప్పడం లేదు. [రిస్కు తీసుకుని షేర్ల వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. వారిని మినహాయిస్తే !] అలాగ్గాక షేర్ ధరలు పడిపోతున్నా చూస్తూ ఊరుకుంటే తమ ఆస్తుల విలువలు కృశించి, బ్యాంకు ఖాతాల లిమిట్స్ కృంగి, కొంగు నెత్తి నేసుకోవాల్సి వస్తుంది మరి!

అదే ఇప్పుడు జరుగుతోంది! మరైతే… ఈ బినామీ క్రయ విక్రయాలకు డబ్బు వెలితి ఎలా పుడ్చుకోబడుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన అంశం!

గమనించి చూడండి! గణాంకాలు అందుబాటులో ఉంటే ప్రాక్టికల్ గా పరిశీలించండి! షేర్ మార్కెట్లు i.e. సెన్సెక్స్ పడిపోయినప్పుడల్లా దానికి రెండు రోజున బంగారం ధరలు ధగధగలాడి పోయాయి, పోతున్నాయి.
2000 - 2001 లో కూడా తులం బంగారం నాలుగున్నర వేల రూపాయలుంది. 2008 తర్వాత విపరీతంగా దూసుకుపోయి ఇప్పుడు ఇరవై వేలై కూర్చుంది. ఎందుకలా దూసుకు పోయింది, పోతోంది?

ఈ ప్రశ్నకు మీడియా గానీ, విశ్లేషకులు గానీ ఉలకరూ, పలకరు. పసిడి ధర ధగధగలాడి పోతోందనీ, అంతయ్యిందనీ, ఇంతయ్యిందనీ, ఇన్నిరెట్లు అన్నిరెట్లు పెరిగిందని మాత్రం… గ్రాఫులు, బార్ డయాగ్రంలు చిత్రిస్తారు. స్వల్పకాలంలో నాలుగు రెట్లుకు బంగారం ధర ఎందుకు పెరిగిందో మాత్రం చెప్పనే చెప్పరు.

పెట్టుదారులు షేర్లపై భద్రతా భావం కోల్పోయి, బంగారం కొనేందుకు ఎగబడటంతో గిరాకీ పెరిగి బంగారు ధర పెరిగిందన్న విశ్లేషణ తరచుగా వింటూ ఉంటాం! (Demand & supply) సిద్ధాంతం ప్రకారం అన్నమాట. నిజానికి అది కాగితపు పులి వంటి సిద్ధాంతమే! చాలా సార్లు కృత్రిమ కొరతలు, కృత్రిమ గిరాకీలు సృష్టింపబడటం చూసిందే!

సరే, అదే నిజమనుకుందామన్నా…. అంతగా పెట్టుబడి దారులు బంగారం కొందామని ఎగబడితే అమ్ముతున్న వారెవ్వరు? ఏ దేశంలో నైనా… ఆయా దేశాలలో గనుల నుండి దేశీయ ఉత్పత్తిగా సమకూడే బంగారం ఎంత? విదేశాల నుండి దిగుమతి చేసుకునే బంగారం ఎంత? భారత్ విషయాన్నే తీసుకుంటే… మనదేశపు గనుల్లోనో, ఇతరత్రానో ఉత్పత్తి అవుతున్న బంగారు పరిమాణం ఎంత? సాలుసరిగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్నదెంత? ఏడాదికి రిజర్వ్ బ్యాంకు మార్కెట్టులోకి విడుదల చేసే బంగారం ఎంత?

ఈ లెక్కలు డొక్కలన్నీ అంతగా ప్రచారించబడవు. అధికారికంగా ప్రకటింపబడవు. ప్రకటించబడిన నివేదికలలోనూ వివరాలు ఎవరికీ అర్ధం కాకుడదన్నట్లు అవన్నీ గ్రీక్ & లాటిన్ లో ఉన్నట్లు గానో లేక అక్షరాలన్నీ పచ్చపచ్చగా ఎఱ్ఱెఱ్ఱ గానో ఉంటాయి. ఎందుకంటే… అవి ఎవరికీ అవగతం కాకూడన్నదే ప్రభుత్వ లక్ష్యం గనుక!

అదీగాక, షేర్ మార్కెట్ మీద భద్రతా భావం లోపించి పెట్టుబడిదారులందరూ బంగారం కొనేందుకు ఎగబడేసరికి ధర పెరిగిందని ప్రచారిస్తారు. మరైతే షేర్ మార్కెట్ నిలబడినప్పుడు బంగారం ధర పడిపోవాలి కదా! కాని అది జరగదు. మరోసారి షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు, మళ్ళీ బంగారం ధర, క్రితం పెరిగిన ధర నుండి పెరుగుతుంది. అలా అలా బంగారం ధర నిత్యం పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఏ దేశమో బంగారం నిల్వలను అమ్మింది అన్నప్పుడు బంగారం ధర కొంత తగ్గుతుంది. అది కూడా పెరిగిన ధరతో పోల్చితే చాలా స్వల్పం.

మరెందుకు… షేర్ మార్కెట్ [సెన్సెక్స్] కుప్పకూలినప్పుడు, ఆ తర్వాతి ఒకటి రెండు రోజుల్లో బంగారం ధర అమాంతం పెరిగి పోతుంది? ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దూసుకు పోతుంది? గత ఆరునెలల కాలంలో ఈ అవినాభావ సంబంధాన్ని పరికించినా ఈ విషయం స్పష్ట మౌతుంది.

కాకపోతే ఆ గణాంకాలన్నీ ఒక చోట మదింపు చేసి వివరంగా అందుబాటులో ఉండాలి. వార్తా పత్రికలని పరిశీలించాలంటే కొంచెం ఓపిక కావాలి. సామాన్యుల బ్రతుకు పోరులో అంత ఓపికా, తీరికా మృగ్యం కదా!? అదే వాళ్ళ భరోసా మరి!

సెన్సెక్స్ ఎగుడు దిగుళ్ళకీ బంగారం ధరల పెరుగుదలకీ సంబంధం ఏమిటి? ఇది నిగూఢమైనది!
ఇక్కడ మీకు కొన్ని పోలికలు ఉదాహరణలు చెబుతాను.

ప్రస్తుతం మనదేశంలో 500 రూ. నోట్లూ, వెయ్యి రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఉన్నట్లుండి, ప్రభుత్వం ఆ నోట్లని రద్దు చేసిందనుకొండి. ఎవరి దగ్గరైతే ఆయా నోట్లు ఎన్నెన్ని ఉన్నాయో, వాటికి లెక్కలు చూపించి, బ్యాంకుల్లోనూ, ప్రభుత్వ కౌంటర్లలోనూ ఇచ్చి, చిల్లర నోట్లు అంటే వందలూ యాభైలూ తీసికొమ్మందను కొండి.

అప్పుడు… లంచగొండులు, అవినీతి పరులూ, రాజకీయ నాయకులూ, బడా వ్యాపార వేత్తల దగ్గర దొంగ లెక్కల్తో ఉన్న సొమ్మంతా మురిగి పోతుంది. ఒక్క ప్రకటనతో అయిదు వందల, వెయ్యి రూపాయల నోట్లు చెత్త కాగితాలతో సమానమై పోతాయి.

ముందు రోజు వరకూ ఎంతో విలువైన కరెన్సీ నోటు మర్నాటి కల్లా పనికిమాలినదై పోవడానికి ఒక్క ‘సంఘటన’ చాలు.

అదే విధంగా… ఒక రోజున ఓ దేశం కుప్పకూలిపోయిందను కొండి. 1990లో ఎల్సిన్ Vs గోర్బచేవ్ ల నాటకీయతతో USSR కుప్పకూలి పోయి, 17+ ముక్కచెక్కలుగా మారిపోయినట్లన్న మాట!

ఆ ఒక్క సంఘటన తర్వాత, అప్పటి వరకూ విలువైనదిగా చలామణి అయిన రూబుల్ కాస్తా, విలువ మాసి పోయింది. అంతకు క్రితం… పది రూబుళ్ళు పెడితే ఓ కిలో ఓట్సు వచ్చేది కాస్తా, పది వందల రూబుళ్ళు పెట్టినా అరకేజీ రావడం గగనమై పోతుంది.

ఒక్కసారిగా రూబుల్ అనబడే కరెన్సీ… విలువ కోల్పోవడానికి ఆ ఒక్క సంఘటనా చాలు!

ఇందుకోసం ఓ దేశం కుప్పకూలేంత పరిస్థితే రానక్కర లేదు. ఆ దేశపు ఆర్ధిక రంగం, మార్కెట్లు పేకమేడలా నేలమట్టం అయిపోయినా చాలు! జింబాబ్వేలో జరిగినట్లన్న మాట! అప్పుడు ఓ పెద్ద కర్రల సంచి నిండా కరెన్సీ నోట్లు మోసుకుని పోయి, అరచేతిలో పట్టేంత బన్ను ముక్క తెచ్చుకోవాల్సి వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల పట్టునడుస్తున్నప్పుడు… ఇలాంటి సంఘటనలు (అంటే రష్యా లాగా దేశాలు కుప్పకూలటం లేదా జింబాబ్వేలాగా ఆర్దిక రంగం, మార్కెట్టు కుప్పకూలటం) జరిగే ముందే… జరిపించేది తామే కాబట్టి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ… తమకి ప్రీతిపాత్రులైన వారికీ, తమ కీలక ఏజంట్ల వంటి వారికీ, ఆ సమాచారం ముందే చెప్పి ఉంచేవి!

ఆయా దేశాల్లో… ప్రభుత్వ ప్రకటన కారణంగా కరెన్సీ నోట్లు రద్దు చేయబడినా, ఇదే పరిస్థితి! తమవి కాని ప్రభుత్వాలు ఆయా దేశాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ వారు కీలక స్థానాల్లో ఉన్నారు గనక ఆ సమాచారం ముందే వాళ్ళకి ‘లీక్’ కావటం మామూలుగా జరిగిపోయేది.

అప్పుడు తమ ఏజంట్లు (వారిలో కార్పోరేట్ దిగ్గజాలే గాక, రాజకీయులు, బ్యూరాక్రాట్లు గట్రాలు కూడా ఉంటారు) ముందు జాగ్రత్త పడతారు. అయితే ఆ విధంగా ముందు జాగ్రత్త పడగలిగింది కొంత మేరకే!

అందుచేత – కార్పోరేట్ రంగంలో బడా బాబులూ, రాజకీయుల్లో బ్యూరాక్రాట్ల లో అత్యంత సంపాదనా పరులూ, తమ ఆస్థుల్ని నగదు రూపంలో (అంటే కరెన్సీగా) గాకుండా, విలువైన వస్తు రూపంలో దాచుకుంటారు. అందులో విలువైన రాళ్ళు, ఇతర వస్తువుల కంటే, బంగారానిదే అధిక ప్రాధాన్యత!

ఎందుకంటే – బంగారం ఎన్నటికీ వన్నె తరగనిది. మోజు తీరనిది ఎంతగా అంటే… తరాలు, యుగాలు మారినా విలువ తరగనంత! శతాబ్దాలే కాదు, సహస్రాబ్దాలు గడిచినా బంగారం బంగారమే!

గత దశాబ్దం లో విడుదలై, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మమ్మీ’ సినిమాలో… ఎప్పుడో వేల యేళ్ళ క్రితం చంపబడి మమ్మీగా చేయబడిన మాంత్రికుడు, ఇప్పటి మనుష్యుల్లో ఒకణ్ణి బంగారం ఇచ్చి లొంగదీసుకుంటాడు. ఆ బంగారానికి ఆశపడిన ఆ బక్కవాడు, తన సహచరులని కూడా మోసగించి తెచ్చి మంత్రగాడికి అప్పగిస్తాడు. ఆ మంత్రగాడు వారి అవయవాలని గ్రహించి తిరిగి, తన భౌతిక దేహం సంపూర్తి చేసుకుంటాడు.

అంటే బంగారంతో అవయవాలని కొనుక్కున్నాడన్న మాట! అదే నాటి గ్రీకు కరెన్సీ ఉండి ఉంటే, అది ఆ బక్కవాణ్ణి కించిత్తయినా ఆకర్షించి ఉండేదా? (ఆ బంగారం మీది ఆశతోనే, వాడు, బంగారాన్ని బయటకు చేరవేసే ఆత్రంలో ప్రాణాలు పోగొట్టు కుంటాడు లెండి.)

చివరికి ఆనాటి రాగి నాణాల వంటివి అయినా, ఇప్పుడు అంతగా పనికి వచ్చి ఉండేవి కావు. అప్పట్లో ఆ రాగినాణానికి ఎంతో విలువ ఉండవచ్చు గాక, ఇప్పడది బరువుని బట్టి రాగి విలువ అయి ఉంటుంది. అదే బంగారమైతే…? అదెప్పుడూ విలువైనదే! అదెప్పుడూ మనిషిని ఆశకు గురి చేసేదే!

ఇదే సూత్రం కార్పోరేటు రంగంలో కీలక దిగ్గిజాల దగ్గరా పని చేస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మార్కెట్లో డబ్బు సంక్రమణం (Rotate) అయ్యి, కంపెనీలు నిలబడాలి. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయ ఉపాధి పధకం, xyz పధకం పేరుతో పందారం చేస్తుంది. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పధకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించింది కార్పోరేట్ ఆసుపత్రులకే మరి!

ఆ రూపంగా ఓ ప్రక్క ఓట్లు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేట్ కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింప చేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగా లేదా లంచాలుగా రాబట్టు కుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి వర్తులం. (Robery cycle)

ఇది ఎంత దారుణ దోపిడి అంటే… సూక్ష్మ ఋణ కంపెనీలు, వెంటబడి ఋణాలిస్తే సెల్ ఫోన్ల దగ్గరి నుండి చాలా వినిమయ వస్తువుల్నే అలవోకగా కొనేసుకున్న లబ్ధిదారులు…తీరా ఋణ వాయిదాలు కట్టలేక కూలబడితే, సూక్ష్మ ఋణ కంపెనీల ప్రతినిధులు వారిని నానా దుర్భాషలూ ఆడి ఆత్మహత్యలకి తెగబొడే దాక తీసుకెళ్తున్నారనీ, అది భీమా సొమ్ము కోసమేననీ కొన్ని సంఘటనలు కూడా వెలుగు లోకి వచ్చాయి.

ఏది ఏమైనా, అమెరికాలో గృహ ఋణాలు, భారత్ లో సూక్ష్మ ఋణాలు అంటూ… ఎంతకైనా తెగబడే స్థితికి ఆర్ధిక రంగం, రాజకీయ రంగం పెనవేసుకుని మరీ దారి తీసాయి. అది, కార్పోరేట్ రంగంలోని ఆర్ధిక మందగమనాన్ని తగ్గించుకోవడానికే!
అది ఎలా గంటే…

‘Round the World in 80 Days’ అనే ప్రసిద్ది నవల చాలామంది చదివే ఉంటారు. అందులో ఫిలియాస్ ఫాగ్, అట్లాంటిక్ సముద్రాన్ని దాటేటప్పుడు నౌకలో ఇంధనం అయిపోతుంది. కానీ అతడికి గడువు లోపల గమ్యం చేరటం తప్ప
మరేవీ పట్టవు.

ఇంధనం అయిపోయిన క్లిష్ట దశలో, ఓడ చెక్కల్ని నరికి, ఇంథనంగా వాడి నౌక నడుపుతారు. చివరికి ఫిలియాస్ ఫాగ్, భారత్ లో అతడు సతీసహగమనం నుండి రక్షించిన యువతి ఆయుదా, అతడి అనుచరుడు పాస్పార్తూ, కొద్దిమంది నౌక సిబ్బంది… నిలబడేందుకు అడుగు చెక్క తప్ప, ఓడ మొత్తాన్ని వలిచి తగలెట్టేస్తాడు.

ఇది ధీరోదాత్తుడైన ఫిలియాస్ ఫాగ్ లక్ష్యాన్ని ఛేదించిన తీరు! ఇది పాజిటివ్ కోణం!

ఇదే నెగిటివ్ కోణంలో ఉంటే… అదే ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అందులోని కీలక వ్యక్తుల స్థితి! అందులో కార్పోరేట్ కంపెనీల వారు ‘కీలకమైన ఏజంట్లు’ మరి! ఆర్ధిక మందగమనాన్ని దాటేందుకు ఫిలియాస్ ఫాగ్ నౌక చెక్క నరికినట్లు గానే… ‘ముందు ఈ స్థితి దాటితే చాలు! ఆనక ఇప్పుడు మార్కెట్టులోకి పంపిణీ చేసిన విత్తానికి రెట్టింపు తిరిగి రాబట్టు కోవచ్చు. అదేగాక ఈ గండం గడిస్తే…పట్టు సంపాదించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. ఒకసారి గూఢచర్య పట్టు తిరిగి సంపాదిస్తే… ఇక మళ్ళీ దోపిడికి అడ్డేముంది? అసత్య ప్రచారాలకి హద్దేముంది?’ – ఇదే తపన!

ఆ పర్యవసానమే… స్వంత ఇంటి ఋణాలైనా, సూక్ష్మ ఋణాలైనా! సామాన్య ప్రజలకి ఋణం రూపేణా డబ్బు ప్రవహింప చేస్తే…స్వంత ఇంటి ఋణాలంటే… ప్లానింగ్ చేసే ఇంజనీరింగ్ కంపెనీలు… నిర్మాణ సంస్థలు, సిమెంటు ఇనుము ఉత్పత్తిదారులు, వడ్రంగి, ఫర్నిచర్, వస్తు నిర్మాణ సంస్థలు… అందరికీ వ్యాపారం వస్తుంది. అచ్చం రోల్స్ రాయిల్స్ కారు ఆర్డరు కథలో లాగే!

అదే సూక్ష్మ ఋణాల విషయంలో కూడా! అడగకుండానే ఇంటికి వచ్చి మరీ అప్పిస్తే… సెల్ ఫోన్లు, కలర్ టీవీలు, బైక్ లూ, మోపెళ్ళు… ఎంత వ్యాపారం!? చివరికి గొర్రెల కాపర్ల చేతిలో కూడా కిలకిల మన్నది సెల్ ఫోన్!

‘ముఫ్ఫై మూడో నాడు అప్పు తీర్చక పోతే తన్ని వసూలు చేసుకుంటాం! అప్పు తీర్చలేక ఋణ గ్రహీతలు చచ్చినా ఫర్వాలేదు. జీవిత భీమా సౌకర్యం కల్పించుకుంటాం. డబ్బు Rotate కావడం ముఖ్యం!’ – ఇదే ప్రాతిపదికగా నడిచిన వ్యాపారమే అది! ‘నల్లడబ్బు సూక్ష్మ ఋణ సంస్థల ద్వారా మార్కెట్ లోకి ప్రవేశించిందని’ ఓ మాట కూడా బయటికి వచ్చింది.
నాలుగైదేళ్ల క్రితం సూక్ష్మఋణాల సంస్థలు రంగ ప్రవేశం చేసినప్పుడు… “రానున్న కాలంలో తిరిగి పట్టు సంపాదించుకోలేమా? ఈ
లోపున ఇరుకును దాటక పోతే కష్టం” అనుకుని చేపట్టిన ప్రణాళిక అది.

2007లో ఈనాడు ఆదివారపు సంచిక సెంటర్ స్ప్రెడ్ లో… అమెరికాలో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి, బంగ్లాదేశ్ లో విజయవంతమైన సూక్ష్మ ఋణాల స్ఫూర్తితో, భారత్ లో నిరుపేదల్ని ఉద్దరించాలనే సదాశయంతో, పేద ప్రజలపై ప్రేమతో, స్వదేశం వచ్చేసిన ఓ యువకుడి గురించి… ఉపమాన ఉత్ర్పేక్ష రూపకాలంకారాలతో వ్రాసింది. ఇంతకీ బంగ్లాదేశ్ లో అది విజయవంతమైందని మీడియా ప్రచారం. భారత్ లో అది విజయ వంతం అయ్యిందని బాంగ్లాదేశ్ లోనో మరో చోటనో ప్రచారించినా ఆశ్చర్యం లేదు. ఎటూ విభజించి ప్రచారించటమే కదా వాళ్ళ స్ట్రాటజీ !?

ఏదేమైనా… స్వగృహ ఋణాలు, సూక్ష్మ ఋణాలు గట్రా పైకారణాలలో మార్కెట్ లోకి డబ్బు ప్రవహింప చేసి (పనిలో పనిగా అందులో నల్లడబ్బు కలిపేసి), ఆర్ధిక మందగమనాన్ని త్వరిత పరచ ప్రయత్నించారు. కాకపోతే ‘బావిలో పోసిన బక్కెట్ నీళ్ళలాగా’ అది నిష్క్రయోజనమైంది. కాలం గడిచినా పరిస్థితి మారక పోవడమే ఇందుకు నిదర్శనం.

ఇదే విషయాన్ని మరో కోణంలో నుండి పరిశీలించండి.

>>> ఆంధ్రజ్యోతి లోని జాహ్నవి గారి ఎడిటోరియల్
>>>07/11

మేధో మథనం

మసకబారిన నల్లసూరీడు
- జాహ్నవి
మంచి మెజారిటీతో ఎన్నికై, ప్రపంచ ప్రజలందరి చేత 'ఔరా!' అనిపించుకున్న ఒబామా రెండే ళ్ళు తిరక్కుండానే పరాజయాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆర్థిక వ్యవస్థ అదుపులోకి రావడం లేదు. ముగుద్దామనుకున్న యుద్ధాలు ముగిసే సూచనలు కనిపించడంలేదు. నిరుద్యోగం తగ్గడంలేదు. డాలరు కొనుగోలు శక్తి రోజురోజుకీ తగ్గిపోతోంది. ఫలితంగా మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం. ఏం జరిగింది? ఎక్క డ తప్పు జరిగింది? దీన్నుంచి మనం నేర్చుకోగలిగిందేమైనా ఉందా?

ఒబామా అధ్యక్షపదవికి ఎన్నికల్లో ప్రచారం చేసే సమయానికే అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. అంతకు ముందు ఎనిమిదేళ్ళు పాలించిన జార్జి బుష్ చేపట్టిన తప్పుడు విధానాల వల్ల 1930లో వచ్చిన స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీనికి ఒక నేపథ్యం ఉంది. 2001-02లో కంప్యూటర్ - ఐటీ రంగం బుడగ పగలడం కారణంగా ఒక మాదిరి సైజులో ఆర్థిక మాంద్యం వచ్చింది. దాన్ని తప్పించుకోవడానికి ఇంకో బుడగను సృష్టించారు.

అసలు ఆర్థిక మాంద్యం అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రభుత్వం చేసే తప్పిదాల వల్లే వస్తుంది. మార్కెట్‌ను తనపని తాను చేయనీయకుండా, ఆర్థిక వనరుల్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. తనకు పేరు తెచ్చి పెట్టే పథకాలు, ఎన్నికల్లో లబ్దినిచ్చే పథకాల అమలుకు ఆ ఆర్థిక వనరుల్ని వెచ్చిస్తారు. జార్జిబుష్ చేసిందదే. 2001- 02లో వచ్చిన మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేస్తానని బీరాలు పలికాడు.

మనకు రిజర్వు బ్యాం కు ఉన్నట్లే, అమెరికాకు ఉన్న ఫెడరల్ రిజర్వు ద్వారా వడ్డీరేట్లను అథమస్థాయికి బలవంతంగా తగ్గించేశారు. "అమెరికా ప్రజలందరికీ సొంత ఇల్లు'' అనే పథకాన్ని మొదలెట్టారు. బ్యాంకులు నిబంధనలు మార్చేసి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకు అతి తక్కువ వడ్డీతో వెంటపడి మరీ రుణాలిప్పిలంచారు. అమెరికలో అన్నీ ప్రైవేటు బ్యాంకులే కదా? తిరిగి చెల్లించలేరు అనుకున్న వాళ్ళకు రుణావ్వరు కదా!

అందుకని కేంద్ర ప్రభుత్వం సొమ్ము తో ఫ్రెడీమాక్, ఫానీమే అనే రెండు సంస్థలను స్థాపించారు. తిరిగి చెల్లించని రుణాల బాధ్యత ఈ రెండు సంస్థలూ తీసుకునేందుకు బ్యాంకులతో ఒప్పందం. ఇక తమకు ఏ రిస్కులేదు కాబట్టి బ్యాంకులు ఎగబడి మరీ రుణాలిచ్చాయి. దాంతో ఇళ్ళకు డిమాండ్ పెరిగింది. ఇళ్ళు ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతున్నాయి కదా ని అవసరమున్నా లేకున్నా ఒక వ్యాపార పెట్టుబడిగా ఇళ్ళు కొనడం మొదలెట్టారు. మన దగ్గర జరిగిన రియ ల్ ఎస్టేట్ బూమ్ లాగే.

కొన్ని బ్యాంకులకు కూడా ఆశపుట్టి సొంత రిస్కు మీద కొన్ని రుణాలివ్వడం మొదలెట్టాయి. అమెరికాలో అర్థిక సేవల మార్కెట్ చాలా సంక్లిష్టమైనది. చాలా పెద్దది కూడా. భవిష్యత్తులో తిరిగి చెల్లించే రుణాల మేర కొన్ని సంస్థలు అప్పులు తీసుకున్నాయి. భవిష్యత్ చెల్లింపులను కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి.

రుణాలు తిరిచి చెల్లిస్తారా లేదా అన్న విషయం మీద కొందరు మార్కెట్‌లో స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధమైన వ్యాపార ప్రక్రియలే. ఒకానొక రోజున ఈ బుడగ పేలింది. వెరసి బుష్‌గారి పథకం పేరుతో, పన్నుల డబ్బును అడ్డంపెట్టుకుని ఆడిన జూదంతో అమెరికా ఆర్థిక వ్యవస్థంతా పతనం అంచున నిలబడింది. ప్రజల నిజమైన అవసరాలు, మార్కెట్‌లతో సంబం ధం లేకుండా ఓట్ల కోసం రాజకీయనాయకులు చేసే ప్రయోగాలు కాస్త ముందో, వెనకో విఫలంకాక తప్పదు.

ఆర్థిక సూత్రాలకు ఏ వ్యవస్థయినా తలవంచక తప్పదు. కృత్రిమ బుడగలాంటి ఇళ్ళ బూమ్ 2007- 08లో బద్ధలయింది. దాంతో ఉపద్రవం స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాలకోసం, ప్రభుత్వాలకున్న విశేషమైన అధికారాలతో ఆర్థిక వ్యవస్థ మెడలు వంచి, సోషలిస్టు పుక్కిట పురాణాలతో "నా ప్రజలకు అది కావాలి, ఇది కావాలి, నేను అది చేస్తాను'' అని ఉపన్యాసాలు దంచి ప్రజలు సంపాదించిన డబ్బు ను పన్నుల రూపంలో లాక్కుని తప్పుదారిలో పెట్టుబడులుపెడితే బుడగలు,బూమ్‌లు, బద్దలవడాలు, మాం ద్యాలు తప్పవు. ఇది వందేళ్ళుగా ఆర్థికవేత్తలకు తెలిసిన వాస్తవం.

అయినా అత్యధిక శాతం ఆర్థిక మేధావులు ఆస్థాన మేధావులై, ప్రభుత్వాలు చేసే పాపాలను వెనకేసుకొస్తారు. జరిగిన ఉపద్రవాలకు వేరే ఎవర్నో కారకులుగా ఎత్తి చూపుతారు. ఎవరికీ అర్థంకాని తర్క భాష లో రకరకాల అంకెలు, గ్రాఫుల గీతలతో ప్రజల దృష్టి మరల్చేస్తారు. అమెరికా కూడా దీనికి అతీతం కాదు.

వచ్చిన మాంద్యాన్ని వాల్‌స్ట్రీట్‌లోని పెట్టుబడిదారులు, స్పెక్యులేటర్ల మీదకి తోసేశారు. దాంతో సమస్య మూల కారణాలు మరుగున పడిపోయాయి. 'అమెరికన్లందరికీ సొంతిల్లు' అనే సోషలిస్టు సంక్షేమ పథకం ద్వారా ఇళ్ళ మార్కెట్‌లో ప్రభుత్వం త్రీవమైన జోక్యం చేసుకోవడం అసలు సమస్య అని గుర్తించడానికి నిరాకరించారు. ఇక పరిష్కారాలు మాత్రం ఏమంత హేతుబద్ధంగా ఉంటాయి? ఒబామా మంచి వాక్చాతుర్యంగల నాయకుడు.

ఉపన్యాసాలతో ఓటర్లను ఉత్తేజపరచగలడు. అమెరికా అర్థిక మాంద్యానికి తాను సూచించిన పరిష్కారాలు పూర్తిగా అసంబద్ధమైనవి. ఈ విషయం తన ఎన్నికల ప్రచార సమయంలోనే ఆస్థానంతో సంబంధంలేని ఆర్థికవేత్తలకు అర్థమయింది. కానీ త్రీవమయిన ఆర్థిక మాంద్యం, ఎటూతేలని ఆప్ఘన్, ఇరాక్ యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న ప్రజలు ఒబామా ఏదో ఒకటి చేసి తమను ఒడ్డునపడేస్తారని నమ్మారు.

పాలన చేపట్టిన నాటినుంచి ఒబామా ఒకదానికి మించి ఇంకో తప్పు చేస్తూనే వచ్చారు. ఆర్థిక మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యమే ఈ ఆర్థికమాంద్యానికి మూల కారణం. అయినా పరిష్కారంగా ప్రభుత్వం జోక్యాన్ని ఇంకా పెంచారు. తప్పుడు అంచనాలతో జూదమాడిన సంస్థలకు దివాళా తీయనీయకుండా ప్రజల పన్నుల డబ్బుతో ఆ సంస్థలను నిలబెట్టారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవా రంగాల్లో నియంత్రణలు పెంచేశారు.

[బావిలో పోసిన బక్కెట్ నీళ్ళ వంటివే సదరు ఉద్దీపన పథకాలు! – అమ్మఒడి]

ప్రభుత్వ రుణాలను విపరీతంగా పెంచారు. డెభ్భైలక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి సరిపడా డాలర్లు ముద్రకొట్టారు. వడ్డీరేట్లు నేలమట్టానికి తగ్గించేశారు. ఈ చర్యలన్నిటి ఫలితంగా డాలర్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రజలు దాచుకున్న డబ్బు విలువ పడిపోయింది. కొనేశక్తి లేక, మార్కెట్‌లో వస్తు, సేవల డిమాండ్ పడిపోయింది. దాంతో కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు రావడంలేదు.

ఉన్నవి విస్తరించట్లేదు, సరికదా, కుదించబడుతున్నాయి. దాంతో ఉద్యోగాలు పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావడంలేదు. నిరుద్యోగం పదిశాతంలో ఉండి క్రిందకు దిగనంటుంది. పరిస్థితులు ఇలా ఉండగా, తగుదునమ్మా అం టూ అమెరికాలోని ఆరోగ్యం, వైద్యం రంగాన్ని పూర్తిగా జాతీయం చేసే దిశగా పథకాలకు తెరతీశారు.

తద్వారా ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలందించిన చారిత్రక పురుషుడిగా మిగిలిపోవాలని కాంక్షిస్తున్నారు. ఈ శాసనం ప్రతినిధుల సభలో నెగ్గితే అమెరికా ఆర్థికవ్యవ స్థ దివాలా తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పొ చ్చు. ఇంగ్లండు, కెనడాల్లో జాతీయకరణ తర్వాత రోగు ల ఇబ్బందులు చూశాక అమెరికా ప్రజల మీద జాలి కలగక మానదు.

అంతే కాదు, త్రీవ సంక్షోభంలో ఉన్న కొన్ని కార్ల కంపెనీలలో ప్రభుత్వం సొమ్మును పెట్టుబడిగా పెట్టి గట్టెక్కించారు. వాళ్ళు తయారు చేసే కార్లకు డిమాండు సృష్టించేందుకు ఇంకో పథకం వేశారు. తక్కువ మైలేజినిచ్చే కార్లు పక్కనపడేసి ఎక్కువ మైలేజినిచ్చే కార్లు కొనేవాళ్ళకు సబ్సిడీలిచ్చారు. ఆ సబ్సిడీ డబ్బు పన్నుల డబ్బులోనిదే. ఇదే పద్ధతుల్లో చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టి, అవి దివాళా తీయకుండా బలవంతాన అపారు.

[వాళ్ళు ఇన్నాళ్ళుగా అత్యుత్తమమైనదిగా శ్లాఘిస్తూ ప్రచారించిన స్వేచ్ఛా విఫణి సిద్ధాంతానికే విరుద్ధం ఇది. మరో మాటగా చెప్పాలంటే స్వేచ్ఛా వాణిజ్యం యొక్క వైఫల్యం ఇది. – అమ్మఒడి]

ప్రజల డబ్బుతో అంటే జార్జిబుష్ చేసిన తప్పులను, దురాశకు పోయిన కొన్ని ఆర్థిక సంస్థలకు మార్కెట్ పోటీలో నిలవలేని కొన్ని కార్ల కంపెనీలకు ప్రజల చేత పరిహారం చెల్లింపచేశారు. ఈ కార్యక్రమాలన్నింటి పేరిటా పన్నులు పెంచారు. టీ (టీఈఏ-టాక్స్డ్ ఎనఫ్ ఆల్‌రెడీ) పార్టీల పేరుతో చాలా చోట్ల స్వచ్ఛందంగా బృందాలుగా ఏర్పడి, ప్రభుత్వ ఆర్థిక విధానాలకు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికి ఫలితమే మధ్యంతర ఎన్నికల్లో తీవ్ర పరాజయాలు.

అమెరికాలో ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఇప్పటిది కాదు. 1930 నుంచే మొదలైంది. రెండు పార్టీలు దీనికి అతీతులు కారు. ఆర్థిక సూత్రాలు విస్మరించి, పాపులారిటీ కోసం తప్పుమీద తప్పు చేయడాన్ని చరిత్ర విస్మరించదు, క్షమించదు. ఇంకా చాలదన్నట్లు ఔట్ సోర్సింగ్ మీద వాగ్దానాలు కురిపించడం సిగ్గుచేటు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల విపరీత జోక్యమే ఆర్థిక మాంద్యాలకు దారితీస్తుంది.

కృత్రిమంగా వడ్డీరేట్ల తగ్గింపు, లోటుబడ్జెట్లు, దానికోసం రూపాయిల ముద్ర ణ, ప్రజల డబ్బులో అత్యధిక భాగం రకరకాల పన్నుల రూపంలో లాక్కోవడం, దాన్ని ఓటర్లకు పంచిపెట్టడం -ఇవీ ప్రభుత్వాలు చేసే పాపాలు. మాంద్యం వచ్చినపుడు ఆర్థిక వ్యవస్థనుంచి ప్రభుత్వం దూరంగా జరగా లి.

కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా వ్యవస్థ తనంతట తాను సర్దుకుంటుంది. తిరిగి వృద్ధి బాటపడుతుం ది. మాంద్యం పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా జోక్యం చేసుకుంటే ఆ మేరకు మాంద్యం నుంచి బయటపడడం ఆలస్యమవుతుంది. వ్యవస్థ ఇంకా తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది ఆర్థిక సూత్రం. ఆర్థిక సత్యం. ఎన్ని ఉపన్యాసాలిచ్చినా దీన్ని మార్చలేము. ఉదాహరణ ఆమెరికాను చూడండి. ఒబామాను చూడండి.

- జాహ్నవి

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/nov/7/edit/7edit2&more=2010/nov/7/edit/editpagemain1&date=11/7/2010

>>> కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా వ్యవస్థ తనంతట తాను సర్దుకుంటుంది. తిరిగి వృద్ధి బాటపడుతుం ది. [ఈ అభిప్రాయంతో అమ్మఒడి ఏకీభవించదు. ఎందుకంటే ఆర్ధిక రంగమేమి పత్తిగింజ కాదు. రాజకీయ రంగం అంటే ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు చేసే తప్పిదాలకు ప్రోద్బలం ఆర్ధిక రంగం నుండే ఉంది. సాధారణ పరిస్థితులలో అయితే ఆర్ధిక రంగం కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా తనంతట తాను సర్ధుకోగలదేమో! గానీ, గూఢచర్యం ముడిపడి ఉన్నచోట దోపిడి బయట పడి తీరుతుంది. కాగితపు సంపద ఆవిరై తీరుతుంది. ఆ బాటలోనే ప్రస్తుత ఆర్ధిక+రాజకీయ రంగాలు ఉన్నాయి.]

ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటూ, పైకారణాల ప్రచారంగా సూక్ష్మ ఋణాల ఆత్మహత్యలతో మీడియా కాలం గడుపుతోంది.
గృహ ఋణాలు, సూక్ష్మ ఋణాలే కాదు, మరికొన్ని దోపిడి ప్రత్యామ్నాయాలు కూడా ప్రయోగించారు.

ఒక దశాబ్దం కాలం లోపున…ఐటీ ఉద్యోగులకి జేబులు పట్టనన్ని జీతాలొస్తున్నాయంటూ హోరెత్తించబడింది. దరిమిలా ఐదు లక్షల ఖరీదున్న ప్లాట్లు కూడా పాతిక లక్షలై కూర్చున్నాయి. అధిక మొత్తంలో జీతాలున్నాయి, ఋణ సౌకర్యాలు సులభంగా లభిస్తున్నాయి గనుక… తమ కార్యాలయాలకి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంలో అందరూ ఒకే ప్రాంతంలో ప్లాట్ల కోసం ఎగబడేసరికి (అలాగని ప్రచారం చేసారు మరి. అందులో నిజమెంతో?) గిరాకీ ఎక్కువై, 5 లక్షల ప్లాట్లు కాస్తా పాతిక లక్షల పలికాయని హొరెత్తించబడింది.

ఎటూ ‘కామమ్మ మొగుడంటే కామోసను కోవాల్సిందే’ గనక నిజమేననుకున్నాం.

తీరా మాంద్యం దెబ్బకో, మరొకందుకో… ఉద్యోగాలు ‘హుష్ ఫటక్’ అనే సరికి అప్పు భారమై, ఫ్లాట్లు గుండె పోట్లై కూర్చున్నాయి.

పరిశీలించి చూస్తే… ఐటీ ఉద్యోగులు… తిండీ నిద్రలు మాని, భార్యాపిల్లల ముఖాలు చూడటం కూడా కుదించుకుని, 5 లక్షల ప్లాట్లని పాతిక లక్షలకి కొనేందుకు కష్టపడినట్లుంది. ఈ చేత్తో సంపాదించామని పించుకున్నదాన్ని, ఆ చేత్తో ‘సమర్పయామి’ అనటమే కదా? 5 రెట్లు ఎక్కువ విలువకి వస్తువుని కొనటం అంటే దోపిడియే కదా? వెరసి ఎవరి కోసం అహరహమూ మేధస్సు వెచ్చించి శ్రమించినట్లు?

ఇది ‘క్లాస్ దోపిడి’ అన్నమాట!

ఇక మాస్ దోపిడి ఎలాంటి దంటే… నిత్యావసరాల సరుకులు (పప్పూ బియ్యం దగ్గర్నుండీ ఉప్పూ ఉల్లిపాయా చింతపండు దాకా) సిమెంటు ఇనుము వంటి కొంప కట్టుకునే వస్తువులూ, పెట్రోలు వంటి ఇంధనాలు… అన్నిటి ధరలూ సిండికేట్ అయ్యి అంతకంతకూ పెంచేసి చేస్తున్న దోపిడి!

రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, తిండి గింజల వ్యాపారంలోనూ సిమెంట్ వంటి ఉత్పత్తి సంస్థల వ్యాపారంలోనూ ధరల పెరుగుదలని చూసీ చూడనట్లు ఊరుకుంటూ, నియంత్రించకుండా, తెర వెనక మద్దతు ఇస్తూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దోపిడి నుండి, రాజకీయ ఏజంట్ల ద్వారా… నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులకి వాటాలు వెళ్ళిపోతాయి.

అందుకే విజిలెన్స్ దాడులుండవు, బ్లాక్ మార్కెట్ కంట్రోలు ఉండదు. సరికదా… సైకిల్ మీద బియ్యపు మూట వేసుకుని ప్రక్క ఊర్లో అమ్ముకొచ్చినంత సులభంగా… రేవుల ద్వారా ‘అనధికారికంగా’ ఎగుమతులు జరిగిపోతాయి. అది బియ్యమైనా, ముడి ఖనిజాలైనా, మరేదైనా! అన్నిటిలోనూ వాటాలు వస్తాయి.

ఆ డబ్బంతా కూడా ప్రస్తుతం వినియోగింపబడుతుంది షేర్ మార్కెట్ ని నిలబెట్టుకోవటానికే!

ఎందుకంటే కంపెనీలు కూలితే.. సామంతులు కూలితే కుప్పకూలిపోయే చక్రవర్తిలాగా… స్తంభాలు కూలిపోతే కుప్పకూలిపోయే భవనం లాగా… నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ కుప్పకూలిపోతుంది మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu