కారణాలేమైనా గానీ…తెలంగాణాలో సీనియర్ నేతా, ‘కాకా’గా పిలవబడే వాడూ, దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ కెరీర్ గల వాడూ అయిన వెంకట స్వామి…ఒక్కసారిగా ‘బ్రేక్’ అయ్యాడు.

దాంతో కాకా…గావు కేక పెట్టాడు.

వాళ్ళనీ వీళ్ళనీ గాక… ఏకంగా, పార్టీ అధ్యక్షురాలికి గురిపెట్టి మాటల తూటాలు పేల్చాడు. తుస్సంటాయో, బుస్సంటాయో తర్వాత విషయం! ముందైతే నోరు విప్పి ‘సోనియా…దిగిపో’ అన్నాడు.

‘ఆమెకి క్షేత్ర స్థాయి అనుభవం లేదు. ఆమె నాయకత్వంలో పార్టీ మట్టి గొట్టుకు పోతుంది. ఈ విదేశీ వనిత వద్దు. దేశీయ అధ్యక్షుడు కావాలి’…అన్నాడు.

ఇక చూస్కోండీ…!

కేకే, వీహెచ్, డీఎస్ వంటి ‘తెలంగాణా’ నేతలు, కాకాని తిట్లు లంకించుకున్నారు.
సిగ్గూ లజ్జా… లేశమాత్రం లేకుండా, తమ కట్టు బానిసతనాన్ని, నిగ్గర్ల నైజాన్ని మరోసారి ప్రదర్శించుకున్నారు.

476. ఈగ – ఇలాంటి నిగ్గర్లు ఇప్పటికీ ఉన్నారు! [10/12/10]
http://ammaodi.blogspot.com/2010/12/blog-post.html

“కాకా స్పృహలో ఉండి మాట్లాడినట్లు లేడు. ఆయనవి నీచమైన మాటలు. సోనియా లాంటి త్యాగమయిని (కొవ్వొత్తిని) విదేశీ వనిత అనొచ్చా? ఆయ్” అంటూ కోప్పడ్డాడు డీఎస్.

కాకపోతే…

“నాకు దేశం ప్రధానం. కుమారుడు కాదు. ఎంపీ అయిన కుమారుడికి ఇబ్బంది వస్తుందని, దేశం ఏమై పోయినా చూస్తూ ఉండాలా?” అంటూ వెంకటస్వామి… తాను స్పృహలో ఉండే మాట్లాడుతున్నానని చెప్పకనే చెప్పుకున్నాడు.

ఇక వీహెచ్… “రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కాకా నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆయన వాలకం తిని తిన లేదన్నట్లుగా ఉంది. ఆయన వ్యాఖ్యలు చూసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రక్తం ఉడుకుతుంది (తన రక్తం కూడా ఉడుకుతుందట)’ అని సెలవిచ్చాడు.

[కార్యకర్తల రక్తం… మండే ధరలకి ఆవిరై, ఎప్పుడో ఇగిరి పోయింది. ఇంకెక్కడ ఉడుకుతుంది గానీ…అదలా ఉంచండి.]

నిజానికి వెంకట స్వామి పక్కా రాజకీయ నేత. అందరు రాజకీయ రాక్షసుల్లాగే అతడూ… అన్ని దారులా సంపాయించ ప్రయత్నించిన వాడే! కొంత సఫలత, కొంత విఫలతా పడిన వాడే! తన కుటుంబం నుండి ఓ కొడుకుని ఎంపీగా, ఓ కొడుకుని ఎంఎల్ ఏగా, అల్లుణ్ణి మంత్రిగా పదవులు రాబట్టుకున్న పచ్చి స్వార్ధ పర రాజకీయ నాయకుడే!

అదే విధంగా… 2007 జూన్ లో ప్రతిభాపాటిల్ ని రాష్ట్రపతిగా సోనియా ఎంపిక చేసిన తదనంతర కాలంలో… ‘తాను రాష్ట్రపతి పదవికి అభ్యర్ధించినా, తనని కాదని, ఊరూ పేరూ తెలియని ఆమెని తెచ్చి అధ్యక్ష భవనంలో కూర్చొపెట్టారని’ అంగలార్చిన వాడే! అడప దడపా…(తనకి కాంగ్రెస్ అధినేత్రి అపాయింట్ మెంట్ నిరాకరించి నప్పుడల్లా) ఇది గుర్తుకు తెచ్చుకుని… రొప్పుతూ దెప్పి పొడిచిన వాడే!

అయితే…రాష్ట్రపతి పదవి ఆశించి భంగపడీ మూడున్నరేళ్ళయ్యింది. మరో ఒకటిన్నర సంవత్సరం ఓర్చుకుంటే…మరింతగా విధేయత చూపుతూ, అధినేత్రి కాళ్ళుపిసికితే…రాష్ట్రపతి పదవి వరించే అవకాశం ఉంది. అలాంటి చోట…చూస్తూ చూస్తూ చేజేతులా అవకాశాన్ని ఎవరు కాలదన్నుకుంటారు?

అలాంటి చోట… వెంకట స్వామి (కాకా) అంతగా ‘బ్రేక్’ అయ్యాడంటే… ఎప్పుడో రాష్ట్రపతి పదవీ భంగపాటు కారణం కంటే, తాజాగా ‘చిరంజీవి కివ్వబడిన ప్రాధాన్యమే’ (తానే చెప్పుకున్నట్లు) కారణం కావడానికి అవకాశాలెక్కువ.

ఇకపోతే…కాకాని ఇన్ని మాటలంటున్న వీహెచ్ కి, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యత్వంతో పాటు, ఇతర ప్రయోజనాలకి గండి కొట్టబడితే…అప్పుడు అతడూ కాకా లాగే పెను కేకలు పెడతాడన్నది ఎవరికైనా అర్ధమయ్యేదే!

ఎవరి ‘బ్రేక్ పాయింట్’ వారిది మరి!

[నిజం చెప్పాలంటే – వీళ్ళందరి ఉమ్మడి నైజం – ప్రజల సొమ్ము ఎలా దోపిడి చేయాలన్నదే గానీ, ప్రజలకి సేవ చేయడం కాదు. సోనియా వీరభక్తుల ఆవేశం, ఆవేదన ఏమిటంటే – తమ దొంగల రాణిని తిడితే, ఎక్కడ తమ గ్రూప్ వీక్ అయి, తమ అవకాశాలు తగ్గి పోతాయోననే బాధ తప్పితే, నాయకురాలి మీద ప్రేమ కాదు. ఎందుకంటే ఇప్పుడు తమ దొంగల రాణిని తిడుతున్న కాకా కూడా ఒకప్పుడు డీఎస్, వీహెచ్, కేకేల్లాగా నాయకురాలికి వీరభజన చేసిన వాడే!]

ఇక సోనియా వీరభక్తుడు కేకే! పదీ జనపథ్ లో తిన్న దోశలూ, పూరీలు అరిగే వరకూ… విధేయత పాఠాలు, ‘సోనియాని ఎవరైనా ఏమైనా అంటే సహించేది లేదన్న’ భక్తి పాటలూ వల్లిస్తూనే ఉంటాడు.

ఇదంతా పక్కన బెట్టినా…

వెంకట స్వామి ప్రశ్నించినట్లు…2009 ఎన్నికలప్పుడే గాక… నిన్న మొన్నటి దాకా,

‘కాంగ్రెస్ పాపపంకిలం’ ’అవినీతి సాగరం’ కాంగ్రెస్ ని భూస్థాపితం చెయ్యాల్సిందే’ అన్న చిరంజీవితో…

‘కాంగ్రెస్సోళ్ళని పంచెలూడేలా కొడతాం’ అని సోదరుల చేత నాలుకలు రువ్వించిన చిరంజీవితో…

కాంగ్రెస్ ఎందుకు, (అతడి ఇంటికి ఆంటోనిని పంపి మరీ) వ్యవహారాలు నడుపుతున్నట్లు?

దశాబ్దాల తరబడి విధేయత చూపిన సీనియర్లకి, చివరికి తెలంగాణా వ్యవహారమై వెళ్ళినా, వై.ఎస్.(అతడు బ్రతికి ఉన్న రోజుల్లో) పై ఆరోపణలతో వెళ్ళినా… రోజుల తరబడి పడిగాపులు పడినా… పదీ జనపథ్ తలుపులు తెరుచుకోలేదు.

అదే చిరంజీవికి… తొక్కలోది పదిహేనుమంది ఎమ్మెల్యేలున్న వాడికి అంత ‘రాయల్ ట్రీట్ మెంటే’మిటి? స్వయంగా అధిష్టానం దూతగా ఆంటోనీ, చిరంజీవి ఇంటికి పోయి మాట్లాడిన ప్రాధాన్యతేమిటి? అణిగి మణిగి ఉన్న వాళ్ళని మరింత నిర్లక్ష్యం చేస్తూ, ధిక్కరించి పోయిన వాణ్ణి బ్రతిమిలాడుతూ, తలెగరేసిన వాళ్ళని బుజ్జగిస్తూ…అసలు కాంగ్రెస్ అధిష్టానం పాట్లేమిటో, పాపం వెంకట స్వామికి అంతు చిక్కనట్లుంది. అందుకే ‘బ్రేక్’ అయిపోయాడు.

దెబ్బతో కాంగ్రెస్ వాళ్ళల్లో కలకలం రేగింది. అంతా కలిసి కాకాని తలో మాట అంటున్నారు. రేపో మాపో…‘వయసై పోయింది రాష్ట్రపతి పదవి ఆశించి భంగపడ్డాడు. నిరాశ ఆవరించి, మతి స్థిమితం తప్పింది’ అని టాంటాం వేసేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆ విషయంలో బాగానే ముందడుగులో ఉన్నారు కాంగ్రెస్ అధినేత్రి విధేయులు.

అయితే ఎంతగా ‘మతిస్థిమితం కోల్పోయాడు’ అందామన్నా, (స్వయంగా అతడి కుటుంబ సభ్యుల చేతే నయానో భయానో అనిపించినా)… అతడి మాటల్లో ఓ ‘లాజిక్’ ఉంది.

అదేమిటంటే – ‘చిరంజీవి స్వయంగా తాను సమైక్యవాదిని అని ప్రకటించుకున్నాడు. తమ పార్టీ, ప్రరాపా కూడా సమైక్యమే నన్నారు. మరి అలాంటి ప్రరాపా, చిరంజీవితో పొత్తు కుదుర్చుకోవాలనో, మరొకందుకో, ఆంటోనీ స్వయంగా వచ్చి మంతనాలాడారంటే – తద్వారా కాంగ్రెస్, తెలంగాణా వాదులకు ఏమని సంకేతాలిస్తోంది? – అని అడుగుతున్నాడు. సబబే కదా!
[కాంగ్రెస్ లో ప్రరాపా విలీనమైతే అది వేరే విషయం. అప్పుడు తెలంగాణా విషయంలో చిరంజీవి, అధిష్టానం మాటే నామాట అంటాడా? నిన్నటి దాకా కాంగ్రెస్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఇప్పుడు విలీనమైతే… చిరంజీవి తన ‘కమేడియనిజాన్ని’ నిలబెట్టుకున్నట్లే! లాబీయింగ్ తో హీరోగా కొనసాగటానికి, గాడ్ ఫాదర్లు చెప్పినట్టల్లా చేయటం మాత్రమే నేర్చుకున్న చిరంజీవి వంటి నటుల నిజనైజం అది! ]

అలాంటి సబబైన ప్రశ్నకి… డీఎస్, కేకే, వీహెచ్ ల వంటి తెలంగాణా నాయకులు, ఏం సమాధానం చెబుతారు? “తెలంగాణా కోసం ప్రాణాలు లెక్కచెయ్యం. పదవి ఓ లెక్క లేదు. విసిరి అవతల పారేస్తాం” అన్న కేకేల వంటి వాళ్ళు… ఇటీవలి కేంద్రమంత్రి వర్గ విస్తరణ నేపధ్యంలో ‘తెలంగాణాకీ పదవులకీ సంబంధం లేదు. మంత్రి పదవి ఇస్తానంటే తీసుకుంటాం’ అని ప్రకటించటం చూసి, జనం నోళ్ళలెళ్ళ బెట్టి ఉన్నారు.

ఇదంతా పరిశీలించి చూస్తే…ఇంతగా expose అవుతున్నా, తెలంగాణా ప్రజలకి తమ నాయకుల నీచ స్వభావాలు అర్ధంకావటం లేదా?’ అనిపిస్తోంది (ఏ పార్టీ అయినా ఒకటే! ఏ ప్రాంత నాయకులైనా ఒకటే! ఏ ప్రాంత ప్రజలకైనా ఇంతే!) కెరీర్ కోసం ఏ నీచానికైనా వెనుదీయని లజ్జాహీనత చూసి జుగుప్స కలగటం లేదా తెలంగాణా సామాన్యుడికి?

ఇంకా పైగా…సోనియా వీరభక్తులు, వెంకటస్వామిని కోప్పుడుతూ…‘అతడికీ, అతడి కుటుంబానికీ కాంగ్రెస్ ఎన్నో పదవులిచ్చి ఎంతగానో ఆదరించింది. అతడి కుటుంబం కాంగ్రెస్ కి ఋణపడి ఉండాలి’ అని సుద్దులు చెబుతున్నారు.

కాంగ్రెస్ అంటే సోనియానా? ఈమె వచ్చింది 1998లో! ఈ పదమూడేళ్ళేగా! అంతకు ముందు నుండీ, దశాబ్దాలుగా, వెంకట స్వామి, అతడి కుటుంబం రాజకీయాల్లో ఉన్నారు గదా! అయినా…పదవులిచ్చింది కాబట్టి ప్రశ్నించకూడదా! ఇది కాదూ అవినీతి అంటే!?

అదీగాక…కాంగ్రెస్ లో ఎవరు ఎవరిని విమర్శించినా (గతంలో కూడా) ‘తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనీ, అసంతుష్టులు తమ అసంతృప్తిని అలా వెళ్ళగక్కుతారనీ, కనుక విమర్శలు సహజమేననీ!’ బోలెడు ఆత్మసూక్తులు వల్లిస్తారు కదా! మరి అవన్నీ సోనియాకి వర్తించవా!? ఆమెకేం ప్రత్యేకతలున్నాయో మరి! ‘కాంగ్రెస్ ని బండ తిట్లు తిట్టినా ఫర్వాలేదు. సోనియాని అంటే మాత్రం కళ్ళు పోతాయి’ అన్నట్లు గింజుకుంటారెందుకు?

‘గతంలో శరద్ పవార్, సోనియా విదేశీయతని ప్రశ్నించినప్పుడు, అతడి కారణాలు అతడివి. ‘అప్పటి వరకూ, పీవీజీ హయాంలో కూడా నెంబర్ టూ పొజిషన్ గా పేరుబడ్డాననీ, తదుపరి ప్రధాని అవకాశం తనదేననీ’ అనుకుంటూ రాజకీయాలు నడుపుతున్న పవార్ కి, కాంగ్రెస్ పగ్గాలు సోనియా చేపట్టటం అశనిపాతంలా తగిలింది.

దాంతో ఆమె విదేశీయతని ప్రశ్నించి స్వంత పార్టీ పెట్టుకున్నాడు. తర్వాతి కాలంలో గూఢచర్య బలానికి తలొగ్గి పొత్తు పెట్టుకున్నాడు. అయితే పవార్ సోనియాని విమర్శించినప్పుడు, ఈ సోనియా భక్తులు ఇంత వీరంగమూ చేసారో లేదో, ఇప్పుడెవరికీ గుర్తు లేదు.

ఏదేమైనా… కాంగ్రెస్ ని తిట్టు. ‘అది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం’ అంటారు.

కాంగ్రెస్ లోని గతించిన నాయకుల్ని తిట్టు. అసలు పట్టించుకోరు.

అప్పట్లో ‘ఇందిరాగాంధీ వంటి వాళ్ళనీ విమర్శించారు గదా?’ అని గుర్తు చెయ్యి. ‘పార్టీలో అసమ్మతి ఉన్నప్పుడు అది సహజం’ అంటారు.

అదే… సోనియాని, తిట్టక్కేర్లేదు విమర్శించినా చాలు! గఁయ్యిన లేస్తారు. సదరు సోనియా అంత ప్రత్యేకమైన వ్యక్తి కాబోలు! ఆమెకేమీ రాక్షసుల మాదిరి కొమ్ములూ కోరలూ గానీ, లేక కర్ణుడి మాదిరి సహజ కవచకుండలూ గానీ ఉన్నాయేమో! అలాంటి ప్రత్యేకతలున్నప్పటికి రాక్షసులూ, కర్ణుడూ కూడా మాటలూ పడ్డారు, దెబ్బలూ తిన్నారు గానీ, ఈ ఇటలీ స్త్రీ మాత్రం మరింత ప్రత్యేకం మరి! అంతగా ఆమెని కాపాడుకొంటుంది నకిలీ కణిక వ్యవస్థ!

ఇక… వెంకట స్వామి అన్న మరోమాట!

‘సోనియాకి క్షేత్రస్థాయి అనుభవం లేదు’. అతడికి ఆలస్యంగానైనా గుర్తుకొచ్చిన నిజం ఇది. డీఎస్ గట్రాలకి ఇంకా గుర్తుకు రావటం లేదులెండి!

ఓ చిన్న ఉదాహరణ చూద్దాం!

గత ఎన్నికలప్పుడు, చిరంజీవి కాంగ్రెస్ ని దుమ్మెత్తి పోస్తూన్నప్పుడు, క్రింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలూ… చిరంజీవి అభిమానులూ… ఒకరికొకరు పోటీపడుతూ, ఒకరికొకరు జాతర బొమ్మలై పోయి, తెగ తిట్టుకున్నారు. చెప్పుకోదగినంతగా వైషమ్యం చిమ్ముకున్నారు.
ఇప్పుడు పైస్థాయిలో నాయకులు… వాళ్ళూ వాళ్ళూ రాజీ పడిపోతే… వీళ్ళు వెర్రి వెంగళప్పల్లా, నోట్లో వేలేసుకు చూస్తూ నిలబడటం… ఎంత బాధాకరంగా, ఎంత లజ్జా హీనంగా ఉంటుందో తెలియాలంటే…క్షేత్రస్థాయి అనుభవం ఉండాల్సిందే మరి!

అంతే కాదు, కాంగ్రెస్ కండువా మార్చకుండా క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్యెల్యేలకు పదవులు ఇవ్వకుండా, అవసరార్ధం తెచ్చుకున్న ప్రక్క పార్టీ నాయకులకు పదవులను కట్టబెడితే, పార్టీకి పని చేసిన కార్యకర్తల పరిస్థితి… ఎంత బాధాకరంగా ఉంటుందో తెలియాలంటే…క్షేత్రస్థాయి అనుభవం ఉండాల్సిందే మరి!

ఇంత చేసినా…వెంకట స్వామి మీద చర్య తీసుకునేందుకు సోనియాకి ధైర్యమే చాల్లేదో, పరిస్థితులింకా అర్ధం కాలేదో, లేక పై‘బాసు’ నుండి అసైన్ మెంట్ రాలేదో గానీ…ఇప్పటికీ అవే సన్నాయి నొక్కులు… అరిగి పోయిన రికార్డు లాగా…అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అంటున్నారు పార్టీ అధికార ప్రతినిధులు.

ఆ సరైన సమయం ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే!

[ఇక ఇంత సీనియర్ నాయకుడు ఎందుకంతగా బ్రేక్ అయ్యాడో అన్నది ఆసక్తికరమైన అంశమే! దాన్ని మరోసారి పరిశీలిద్దాం.]
వీటన్నిటిలో ఓ మాంచి మెరుపు తునక ఏమిటంటే…

పది రోజుల క్రితం జగన్ వర్గీయుడు అంబటి రాంబాబు, సోనియాని ‘సైతాన్’ అన్నాడు.

ఆ వ్యాఖ్య పూర్తి పాఠం – “వై.యస్.ని ఇప్పుడు అవినీతి పరుడు అంటున్నారు. అతడు అవినీతి పరుడైతే…అతడి పాలనని ఎప్పటికప్పుడు సమీక్షించిన వీరప్ప మొయిలీ, సోనియాలని కూడా అవినీతిపరులే అనాలి. జగన్ ని అణిచి వేయటానికి ప్రయత్నిస్తున్న నలుగురు సైతాన్ లలో సోనియా ఒక సైతాన్ (దుష్ట చతుష్టయం, సూచనలు సోనియా టు బాబు వయా కిరణ్, రామోజీరావు)” అన్నాడు.

దాంతో కాంగ్రెస్ నేతలు (షరా మామూలుగా హల్ చల్ లు నిర్వహించే ఏక్ దిన్ కా వార్తల కింగులు) గఁయ్యిమంటూ… ‘సోనియాని విమర్శించే పాటి వాడివా?’ ‘సోనియాని సైతాన్ అంటావా?’ అంటూ హుకరించారు. అయితే… గురి అంతా (concentration) కేవలం ‘సైతాన్’ అన్నమాట మీదే ఉంది.

ఆ విధంగా… అసలు వ్యాఖ్య ‘వై.ఎస్.ని అవినీతి పరుడంటే, అతడి పాలనని సమీక్షించిన వీరప్ప మొయిలీ, సోనియాలని కూడా అవినీతి పరులనాలి’ అనేది కాస్తా మరుగున పడిపోయింది.

అలా మరుగున పడేటందుకే…‘సైతాన్ అంటావా?’ అన్న మాట మీద ఫోకస్ చేసారు. అది చల్లారుతూ చల్లారుతూ ఉండగానే కాకా…గావుకేక మొదలైంది.

అందులోనూ ఈ వృద్ధ రాజకీయ నేత…

>>>గతంలో రాష్ట్రం నుండి ప్రతినెలా, దూత కేవీపీ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళి దక్షిణలు ముట్టచెప్పి వచ్చేవాడు. సోనియా అవినీతి గురించి తర్వాత మాట్లాడుకుందాం”… అంటూ విమర్శించడం విశేషం!

మొత్తానికి ‘రాజకీయ జంబలకిడి పంబ’ ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

Well said. :)

మీరు మంచి విషరము మీద చర్చ మొదలు పెట్టారు.

అనాదిగా జరుగుతున్నదే (criticism of the foreigner by some Indians), ఈ నాడు జరిగింది (re-action against the criticizer by other Indians in support of foreigner).

For 1000 years our land was ruled by foreigners in some form or the other.

In all those years, if 50-70% Indians fight against the enemy, another 30-50% Indians supported the enemy.

1) Mughals employed Rajputs in big numbers to defeat other native kings (e.g. Maratas, South Indians, etc).

2) East India Company (EIC) employed Indians in military and bureaucracy

3) 1857 revolution. Many sided EIC against other Indians.

4) British employed Indians in military, bureaucracy and as petty Kings and Nawabs.

5) Freedom struggle. Many Indians (Communists, etc) sided British.

6) Sonia captured the power with the help of Indians. Ruling India with the help of Indians.

There is no hope in the future too. One Caste or group of Castes always side the foreigner against other Indians.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu