అరణ్యవాస క్లేశాలు పడలేక, బాధతో చేసిన వాదనలే భీముడివీ, ద్రౌపదివీ! ధర్మాచరణలో కష్టాలు ఓర్చలేనప్పుడు, సహనంగా వేచి ఉండలేనప్పుడు… చేసే వాదనలు అవి!

‘సత్యమూ, ధర్మమూ, శాంతమూ, సహనమూ తొక్కా తోలూ’ అంటూ, ధర్మపన్నాలు చెబుతూ కూర్చుంటే…జీవితం నాశనమౌతుంది. చచ్చేదాకా ఇదే బాధల బ్రతుకు తప్ప సాధించేదేమీ ఉండదు. బ్రతుకంతా ఇలా కునారిల్లి పోవల్సిందే! అంతే! – ఇలాంటి వాదనలు వింటూ ఉంటాం, అంటూ ఉంటాం.

అదే భీమసేనుడూ, ద్రౌపదీదేవీ కూడా అన్నారు.

చూడండి, భీమసేనుడేమన్నాడో…

“మహారాజా! మీరు మరణధర్మం గల మానవులు కాలపాశ బంధితులు. ముగ్గిన పండులా, నీటి బుడగలా, కాలం కూడా నిలబడేది కాదు. జలపాత వేగంతో పోయే కాలాన్ని వృధా చేసి… సమయ, సావకాశాల కోసం నిరీక్షించి, సంధి చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. ఆ కాలం అతి సన్నిహితంగా ఉందని మీరు భావిస్తున్నారు. కంటికి పెట్టుకోవటానికి చేతి మీదికి తీసే కాటుకలా, కాలం హరించిపోతూ ఉంటుంది. ఆయుర్ధాయం క్షీణిస్తుంది. క్షణభంగురమైన జీవితం గల మానవప్రాణి, సమయ నిరీక్షణ చేయడం అర్ధరహితంగా కనిపిస్తోంది.

పదమూడు సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చుంటే… మృత్యువు మన గుమ్మం ముందు కూర్చుంటుంది. అసలు మృత్యువు దేహధారుల శరీరంలోనే తిష్ఠ వేసుకొని ఉంటుంది. దాని నోట్లో మనం పడకుండానే, మన రాజ్యం మనం సాధించుకోవాలి. తమ శక్తిని అణచి పెట్టుకుని ఉండేవాడు, భువికి భారభూతుడే. శత్రువులను హింసించనివాడు ఎద్దులా బాధలు పడుతూండవలసిందే!” – ఇదీ భీమసేనుడు వినిపించిన వాదన.

అంతేకాదు “మనం… నీతి ధర్మం, సత్యం అని కూర్చున్నంత మాత్రాన, ఎదుటి వాడు చూస్తూ ఊరుకోడు, బుద్దీ తెచ్చుకోడు. అలాంటప్పుడు, మనం సహనం చూపించి ప్రయోజనం ఏమిటి?” – ఈ వాదనా మనం వింటూ, అంటూ ఉంటాం.
ఇదే భీముడూ, ద్రౌపదీ ధర్మరాజుతో అన్నారు.

భీముడంటున్నాడు “ఈ భూమండలంలోని రాజులందరినీ మనం ఓడించాం. దుర్యోధనుడిని ఆశ్రయించి ఇప్పుడు వారందరూ ఉంటున్నారు. అటువంటి వారు, మనని ఆదరించి ఆశ్రయమిస్తారనుకోవటం శుద్ధ భ్రమ. పైగా వారే మన జాడ తెలుసుకుని, దుర్యోధనునికి తెలియజేయడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పటికి పదమూడు మాసాలు గడిచాయి. మనం గడపవలసిన సంవత్సరాలు పదమూడు. మానవులు మాసాన్ని సంవత్సరానికి ప్రతినిధిగా గ్రహిస్తారు. యాగాలలో ‘పూతిక’ను, సోమలతకు ప్రతిగా గ్రహించేటట్లు… ఈ పదమూడు మాసాలనే పదమూడు సంవత్సరాలుగా మనం పరిగణించవచ్చు. బరువు మోసే ఎద్దుకు కొరడా దెబ్బలు తప్పనట్లు, మీరు ఎన్ని కష్టాలు పడి మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నా, మీకు లభించే ప్రయోజనమేమీ లేదు. యుద్ధానికి మించిన క్షత్రియ ధర్మం లేదు. కనుక దుర్యోధనాదులపై ప్రతీకార చర్యకు యిప్పుడే కంకణం కట్టండి” అన్నాడు.

[ఇక్కడ భీముడు అన్నట్లే, చివరికి యుద్ధం చేయక తప్పలేదు. కాని, ధర్మరాజు చెప్పినట్లు… ధర్మం పాటించడం వలన, కౌరవుల దుష్టబుద్ది, దుష్టచేష్టలు దృష్టాంతపూరితంగా బహిర్గతం అయ్యాయి. కాలగతిలో ఎవరికి సత్యం, ధర్మం పట్ల నమ్మకం ఉందో, ఎవరు అసత్యం, అధర్మం వెంట పరుగులెత్తారో బహిర్గతం అయ్యింది. ఆ విధంగా చెడు నిర్మూలించబడింది.]

మనం ఓరిమి వహించినా… ఎదుటి వాడు, చెడు తల పెట్టడం మానడు, చెరుపు చేయటం ఆపడు. కాబట్టి మనమూ అదే దారి తొక్కుదాం – అనడమే ఇది.

ఎందుకంటే – అరణ్యవాస కష్టాలు తక్కువేం కాదు. మనం సినిమాలలో చూసినట్లు అమాంతం ఆశ్రమసెట్టింగు (ఎత్నిక్ హోటల్ కి లాగా) ఆకాశం నుండి ఊడిపడదు.

రాజులను జయించిన చేతులతో…

సిరిసంపదలను దానం చేయటం దగ్గరి నుండీ ఆస్వాదించిన చేతులతో…

వెదుళ్ళు కొట్టుకొని, కుటీరాలు నిర్మించుకోవలసిందే!

ఆ పరిస్థితి రావటమంటే భోగభాగ్యాల నుండి పరమ దారిద్ర్యానికి రావటమే!

‘సూర్యభగవాను డనుగ్రహించిన అక్షయ పాత్ర ఉండగా పాండవులేం కష్టపడ్డారు?’ – అనుకుంటూ ఉంటాం. ఆ కథ ప్రక్షిప్తం (అంటే తర్వాత చేర్చబడింది) అని ఓ వాదన ఉంది. వనవాస కాలంలో… కొంత కాలం తర్వాత, ధర్మరాజు సూర్యుని అర్చించి అక్షయ పాత్ర పొందాడనీ, అంతకు పూర్వం కందమూలాలే భక్షించారనీ ఓ వాదన ఉంది.

ఏదేమైనా… వనవాస క్లేశం, రాజమందిరాల్లో దాసదాసీ జన సేవలూ, హంసతూలికా తల్పాలూ, మృష్టాన్న భోజనాలు, చందన కర్పూరాది సైత్యోపచారాలు, మధుర ఫల రసాస్వాదనలూ ఉండే, నగర జీవన సౌఖ్యాలు అనుభవించే వారి పాలిట, ఎంత దుర్భరమో ఊహించవలసిందే!

ఏసీ లోంచి ఓ నిముషం బయటకు రాగానే… ‘హుష్! బాబోయ్!’ అని తపన పడే సందర్భంలో, రాజప్రాసాదం నుండి పర్ణశాలకు పర్యవసించిన జీవన కాఠిన్యం, కొంత అర్ధమౌతుంది.

అంత బాధనీ అనుభవిస్తున్నారు పాండవులు! అందునా అరణ్యవాసంలో ఒకే చోట స్థిరనివాసం వారికి కూడనిది. వ్యాసుడు ధర్మరాజుకి ఏమని బోధించాడో చూడండి.

“మీరు ఈ వనం వదిలి, మరోవనానికి వెళ్ళండి. మీరు ఒకేచోట ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. కొందరు మునులకు తపోవిఘ్నం కలిగి, వారికి ఆగ్రహం కలిగించిన వారవుతారు. ఇక్కడి కౄరమృగాలను సంహరించి ప్రశాంతత ఏర్పరచారు. విద్వాంసులైన విప్రులను పోషిస్తున్నారు. మీ అగ్ని కార్యాలలో యిక్కడి ఓషదులు క్షయమై పోతున్నాయి. త్వరగా వాసస్థలం మార్చాలి” అని పలికి ప్రతిస్మృతి ఉపదేశించి అదృశ్యమయ్యాడు.

[అంటే ఒకే చోట స్థిర నివాసం ఏర్పరుచుకోవటానికి వీలు లేదు. అనివార్యంగా రక రకాల ప్రదేశాలు మారవలసిందే!]

ఇలా… కాల పరిమితులతో నివాస స్థలాలు మారుస్తూ… పాండవులు చేసిన అరణ్యవాసం ఎంత బాధ, ప్రయాసల మయమో
మచ్చుకి ఈ సంఘటన చూడండి.

రోమశ మహర్షి మార్గదర్శకత్వంలో పాండవులు తీర్ధయాత్ర సాగించారు. వాతాపిని జీర్ణించుకున్న అగస్త్యాశ్రమ ప్రాంగణాన్ని దర్శించారు. ఆయా ప్రదేశాల కథలు తెలుసుకుంటూ, ఋష్యశృంగాశ్రమం, పరశురాముని క్షత్రియ సంహార గాధ, సుకన్యా చ్యవనుల ప్రణయ గాధ… ఇలా తెలుసుకుంటూ, దర్శించుకుంటూ… గంధమాదన పర్వతం వైపు ప్రయాణం సాగించారు.

కంటక, శిలామయ మార్గంలో నడిచి, నడిచి, అలసిన ద్రౌపదీదేవి, నడికట్టున చేతులుంచి నాలుగడుగులు వేసి కూలబడింది. అది చూసి భీమసేనుడు ఆమెను రెండు చేతులతో ఒడిలోకి తీసుకున్నాడు. ధర్మరాజు కంట తడి పెట్టి, ముఖాన చల్లని నీరు చిలికాడు. నకుల, సహదేవులు ఆమె పాదాలు ఒత్తుతున్నారు.

అంతగా వన వాస కష్టాలని అనుభవించారు పాండవులు.

ఆ కష్టకాలంలో… వాళ్ళల్లో…

‘ఈ చీకటి తర్వాత వెలుగు వస్తుంది’ అని ఓ నమ్మకం.

‘అరణ్య అజ్ఞాత వాసాల తర్వాత, తిరిగి తమ రాజ్యం, వైభవం తాము పొందగలమని’ ఓ ఆశ!

‘అనుకున్న వన్నీ అనుకున్నట్లు అవుతాయో లేదో నని’ ఓ నిరాశ!

‘తాము ధర్మం తప్ప లేదు. దైవం తోడుంటాడు’ అని ఓ ధైర్యం.

‘ఎన్ని కష్టాలని ఎదుర్కోగలం?’ అని ఓ దైన్యం.

కష్టనష్టాల చీకటిలో ఉన్నప్పుడు, సామాన్య మానవులమైన మనకెన్ని భావోద్వేగాలు కలుగుతాయో… అవన్నీ పాండవులకీ కలిగాయి.
సాక్షాత్తూ శ్రీకృష్ణుడే తోడుగా ఉన్నా, స్వయంగా తాము యోధులైనా…మన కున్నట్లే వారికీ…ఆశ, నిరాశ, ధైర్యం, దైన్యం…భావ సంచలనాలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించి, వాళ్ళు యుద్ధం చేసారు, విజయం సాధించారు.

రామాయణంలో లంకపై యుద్ధం ప్రారంభమైనప్పుడు, శ్రీరాముడన్నట్లు… ‘ఆరంభానికీ అంతానికీ మధ్య సుదూర సుదీర్ఘ సమయాన్ని’ సహనంతో భరించి మరీ, విజయాన్ని సాధించారు.

అరణ్యవాసం చేసే పన్నెండేళ్ళ సుదీర్ఘ కాలాన్ని, తమకి అనుకూలంగా మలుచుకున్నారు.

ఎన్నో ప్రాంతాలు చూసారు. ఎందరో ఋషులను కలిసి జ్ఞానాన్ని పొందారు. అర్జునుడు తపస్సుతో ఈశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం మొదలు… వరుణ యమ కుబేర ఇంద్రాదుల అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సాధించాడు.

భీమసేనుడు ఆంజనేయుడి అనుగ్రహం పొందాడు. వింధ్య, గంధమాదన, హిమాలయ పర్వతాల ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ…ఋషుల సత్సంగంతో ఆత్మశక్తిని పెంచుకుంటూ, ఆ అరణ్యవాస కాలాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
మార్కండేయ మహర్షి… పాండవుల ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ శ్రీరాముడి ధీర గంభీర విషాద గాధనీ, విజయ గాథనీ వినిపిస్తాడు. బృహదశ్వ మహర్షి… నల చక్రవర్తి కథ చెప్పి ధర్మరాజాదులను ఉత్సాహ పరుస్తాడు.

ఇన్ని రకాలుగా ఊరట పొందీ, ఉత్సాహాన్ని నింపుకునీ, విషయ పరిజ్ఞానాన్ని, ఆయుధ సంపత్తినీ పెంచుకుని సహనంగా కార్యాన్ని సాధించారు పాండవులు.

అందుకేనేమో, మన పెద్దలు ‘భారతంలో లేనిది మరి దేనిలోనూ లేదు’ అంటారు.

అందుకే భారతీయుల నుండి రామాయణ భారతాది ఇతిహాసాలని తుడిచి పెట్టే ప్రయత్నం చేసారు నకిలీ కణిక వ్యవస్థలోని కుట్రదారులు.

ఇక పోతే…

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

ఎప్పటిలా అద్భుతం. మరి మీరు సమాజాన్ని మార్చే బాధ్యత ప్రత్యక్షం గా కూడా తీస్కుంటే బావుంటుంది..

http://ibnlive.in.com/news/bjp-not-interested-in-pursuing-2g-case-shourie/143118-37-64.html

Karan Thapar: What about this? For at least a year, Sushma Swaraj and Arun Jaitley have been accusing not only the Prime Minister of a cover-up but even suggesting a possibility of involvement. You had proof that at least of cover-up the PM can be accused and you didn't make the proof available.

Arun Shourie: The BJP knows what I knew.

Karan Thapar: The BJP knows what you knew? Sushma Swaraj and Arun Jaitley know this?

Arun Shourie: I don't want to talk about BJP's internal meeting but it is certainly my assessment that they were not interested in following these things.

Karan Thapar: Even the BJP wasn't interested?

Arun Shourie: No.

Karan Thapar: The BJP had dynamite and they weren't interested in following it up?

Arun Shourie: That's true. That's unfortunately true. It is only the AIADMK MPs who were following this up.

Karan Thapar: Your own party had dynamite and they weren't interested in following it up?

Arun Shourie: I'm not going to make it a BJP v/s Arun Shourie business. But it is evident. And many of these people have had these very chaps as their clients, both on Kapil Sibal's side and other sides.

Karan Thapar: So, vested interests came into play?

Arun Shourie: I think that would be a fair statement and that is a very important service that Nira Radia has done to the country that she has lifted the lid and shown us that everybody is in touch with everybody else.

Karan Thapar: Arun Shourie, for the amazing story you've told me, Thank You very much indeed

రాజు గారు, అజ్ఞాత గారు: నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu