నడుస్తున్న ప్రపంచ రాజకీయ నేపధ్యాన్ని పరిశీలిస్తే…

‘మానవ జాతి మనుగడ ఎటు వైపుకి దారితీస్తోంది?

మానవ ప్రస్తానం ఏ దిశలో, ఏ దశలో ఉంది?’… అనే ప్రశ్నలు ఉదయించక మానవు.

ప్రస్తుతం ట్యునీషియా, యెమన్, ఈజిప్టు, యూరోపు అరబ్బు దేశాలలో సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తూ…

‘ఈజిప్టులో ఉబికిన ఉద్యమం మన దాకా వస్తుందా? రాదా?

అరబ్బులలో వెల్లువైన చైతన్యం భారతీయుల్లో కరువైందా?

భారతీయులు అంత చేవచచ్చి ఉన్నారా?’ అని… ప్రశ్నించుకుంటున్న వాళ్ళున్నారు.

‘ఆఁ. అదిక్కడ సాధ్యం కాదండీ!’ అని… నిరుత్సాహం పడుతున్న వాళ్ళున్నారు.

‘అదంత తేలిక కాదు’ అని… చిరు ఆశతో చూస్తున్న వాళ్ళున్నారు.

‘అక్కడి ఉద్యమమే అణగారి పోతుంది. ప్రయోజనం పొందకుండానే సమసి పోతుంది. ఒక నియంత పోతే మరొకడొస్తాడు. ఎక్కడైనా ఇంతే! ఈ దోపిడి ఆగదు. ఈ అన్యాయమూ ఆగదు’ అని… నిరాశ పడుతున్న వాళ్ళున్నారు.

ఒకే విషయానికి ఉన్న భిన్న కోణాలివి!

వివిధ కోణాల్లో కనబడుతున్న అసంపూర్ణ సత్యాలివి!

నిజమే!

ఎక్కడైనా…ప్రపంచంలో ఏ దేశమైనా…అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా…రాజరిక బ్రిటన్, సౌదీలైనా… ప్రజాస్వామ్య భారత్, అమెరికా లైనా…అంతటా ఉన్నది ఒకే దోపిడి!

పేదలు మరింత పేదలై, ధనికులు మరింత ధనికులైన, అవుతోన్న దోపిడి!

సుదీర్ఘ కాలంగా, ప్యాకింగ్ మారినా లోపలి సరుకు మారని దోపిడి!

అధికారంలో ముబారక్ ఉన్నా… ముషారఫ్ ఉన్నా… యూపీఏ ఉన్నా… ఒబామా ఉన్నా…

అయితే రిగ్గుంగులూ లేకపోతే ఈవీఎంలతో… తమకి కావాల్సిన వాళ్ళనే గెలిపించుకోగల… తమ వాళ్ళకే సంపదలన్నీ సమకూర్చుకోగల… చట్టబద్ద దోపిడి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సారూప్యతే… ‘ప్రపంచాన్ని ఒకే వ్యవస్థ నడిపిస్తోందన్న’ సత్యాన్ని బహిర్గతం చేస్తోంది. [ఒకప్పుడు దాన్ని బ్రిటన్ అన్నారు, తర్వాత అమెరికా, రష్యాలన్నారు, ఆ తర్వాత సీఐఏ అన్నారు… నేను ‘నకిలీ కణిక వ్యవస్థ’ అంటున్నాను. అంతే తేడా!]

అలాంటి చోట…నిన్న ట్యూనీషియా, యెమన్ లలో, నేడు ఈజిప్టులో… ఇప్పుడు ఎగసిపడుతున్న ఉద్యమం, మరింత ఉధృతం కానివ్వండి లేదా సమసి పోనివ్వండి…ఇందులో ప్రపంచం తెలుసుకోవలసిన ‘పచ్చి నిజాలు’ కొన్ని ఉన్నాయి.

అవేమిటో పరిశీలించే ముందు… నా ఈ టపాల మాలిక ని మహాభారతం నుండి ఓ చిన్న సంఘటనని వివరిస్తూ… ప్రారంభిస్తాను.

ఇది మహాభారతం అరణ్యపర్వం లోనిది.

మాయాద్యూతంలో సర్వం కోల్పోయిన పాండవులు అరణ్యవాసం ప్రారంభించారు. భీమసేనుడు కిర్మీరుని వధించిన అనంతరం… పాండవులు ద్రౌపదీ దేవి సహితంగా, దైతవనం వైపు సాగుతుండగా… పాండవుల వనవాస వార్త విని, దృష్ట అంధక భోజ వంశీయులు, దృష్టద్యుమ్న, ధృష్టకేతు కేకయ రాజనందనులు, ధార్తరాష్ట్రులను (అంటే ధృత రాష్ట్ర పుత్రులైన దుర్యోధన దుశ్శాసనాదులను) నిందిస్తూ, పాండవులను చూడ వచ్చారు. శ్రీకృష్ణుడూ వచ్చాడు.

వారందరి ఎదుటా ద్రౌపదీ దేవి, తన పరాభవాన్ని, అన్న శ్రీకృష్ణుడికి చెప్పుకుని దురపిల్లుతుంది. సంభాషణలూ సంబాళింపుల తర్వాత, శ్రీకృష్ణుడు సుభద్రా అభిమన్యులను తీసుకొని ద్వారకకు బయలు దేరుతాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపదీదేవికి, పాండవుల వలన కలిగిన అయిదుగురు పుత్రులు, ప్రతివింధ్య, శ్రుతసోమ, శ్రుతకీర్తి, శతానీక, శ్రుత కర్ములను తీసుకొని, పాంచాల నగరానికి ప్రయాణమౌతాడు. ఛేది భూపతి ధృష్టకేతుడు, తన సోదరీ, నకులుని భార్యా అయిన కరేణుమతిని వెంటబెట్టుకు పోతాడు.

ఈ విధంగా బంధుమిత్రులు సెలవు తీసుకుని వెళ్ళాక… దైతవనంలో…

ఒకరోజు, ద్రౌపదీదేవికీ ధర్మరాజుకీ మధ్య ‘మనిషికి సహనం ఎంత ఉండాలి. క్రోధం ఎంత వరకూ ఉండాలి’ అనే విషయమై సంభాషణ నడుస్తుంది. క్రోధశోకాల అతిశయంతో ద్రౌపదీ దేవి, నాస్తిక వాదాన్ని ప్రతిపాదించిందని ధర్మరాజు అంటాడు.

“అసలు దేవుడనే వాడుంటే ఇంత అన్యాయం జరుగుతుందా? మనకి ఇన్ని కష్టాలొస్తాయా?” అనుకుంటాం చూడండి. అలాంటి దన్న మాట!

తదుపరి క్రమంలో భీమసేనుడు, ధర్మరాజుని కొంత నిందాపూర్వకంగా మాట్లాడుతూ ‘క్షాత్రధర్మం ప్రకారం యుద్ధం తగినదే’ అనీ, ‘అధర్మం పాటించిన దుర్యోధనాదుల పట్ల… ధర్మం, సత్యం అంటూ నీతులు అవసరం లేదనీ, కపట ద్యూతం నిర్వహించిన కౌరవులకు ప్రతిగా, 13 నెలల కాలాన్ని 13 సంవత్సరాలుగా జమకట్టి…ఇక అరణ్య వాసాన్ని కట్టిపెట్టి శతృవులని వధించాలి’ అనీ ప్రతిపాదిస్తాడు.

ఆ సందర్భంలో…

“గాండీవం ధరించి సవ్యసాచి నిలబడి ఉండగా దేవేంద్రుడు కన్నెత్తి చూడలేడే. అటువంటిది మీ ప్రమత్తత వల్ల ఈ రాజ్యం పోయింది. గోవులనూ, ఫలాలనూ ఎవరైనా హరించినా వికలాంగులు ఏమీ చేయలేనట్లే, జూదంలో సర్వమూ మీరు ఓడిపోతున్నా, మేము మౌనంగా ఉండిపోవలసి వచ్చింది. మీరు ధర్మతత్పరులు కనుక మీ వాంఛ నెరవేరింది. మీ శాసనాలను పాలించే మాకు దుఃఖమే ప్రాప్తమైంది. దుష్టులయిన ధార్త రాష్ట్రులను ఆనాడు సంహరించకపోవడం వల్ల నేటికీ వారు మనకు కష్టాలు కలిగిస్తూనే ఉన్నారు. మృగాల వలె వనవాసం చేయవలసిన దౌర్బల్యం మనకు లేదే! ఈ వనవాస క్లేశాలను కృష్ణార్జునులు గాని, నకుల సహదేవులు కాని, అభిమన్యుడు కాని, సృంజయవీరులు కాని, నేను కాని, ఆమోదించ లేక పోతున్నాం.

ధర్మ ప్రవచనాలతో, వ్రతాలతో, మీరు మాకు కష్టాలే కలిగిస్తున్నారు. వైరాగ్యంతో సాహస శూన్యత్వం మిమ్ము వరించిందో, నపుంసకుల వలె వ్యర్ధ జీవితం సాగించాలనుకుంటున్నారో… తెలియడం లేదు. అసమర్ధులు, దుర్భలులూ మాత్రమే, తమ సంపదలను సాధించడానికి ప్రయత్నించరు. సర్వశక్తి సంపన్నతకు దూరదృష్టి తోడుపడిన మీ వంటి వారు కూడా, చేజేతులా పురుషార్ధాలను విడిచిపెట్టారు.

ఎన్ని సుగుణాలు ఉన్నా ధనహీనుడు యజ్ఞకర్మ ధర్మాన్ని ఆచరించలేడు. ఈ ప్రపంచానికి ధర్మమే మూలకారణం. దానిని మించింది లేదు. ధర్మకార్యాచరణకు ఆవశ్యమైనది ధనం. భిక్షాటనం చేస్తూనో, నపుంసకత్వంతో చేతులు ముడుచుకు కూర్చుంటూనో, ధర్మం మీద మనస్సుతోనో ఉంటే – ధనం ప్రాప్తించదు. యాచనతో కార్యసాధన చేసే బ్రాహ్మణుల వలె మీరు చరించరాదు. వీరత్వంతో ధనం సంపాదించాలి. దానికి తగిన మార్గం చూడండి. ఉత్సాహ బల పౌరుషాలు క్షత్రియ ధర్మాలు. వానితోనే మీరు శత్రువులను వధించండి”…అన్నాడు.

దీనికి జవాబుగా ధర్మరాజు తన ‘వాదన’ని చెబుతూ

“సోదరా! ఆనాడు అరణ్య అజ్ఞాత వాసాలకు సమ్మతించి, సభ మధ్యంలో ఓడిపోయిన నేను, ధర్మం విడిచి రాజ్యం ఎలా అడగను? ద్యూత సమయంలో రెండు చేతులా దహిస్తానని నువ్వు లేచినపుడు, అర్జునుడు నిన్ను వారించాడు. ఆ సమయంలో గద పైకెత్తి శత్రువుల వైపు సాగబోయావు. అప్పుడే నువ్వు అలా చేస్తే, ఎంతటి ప్రమాదం సంభవించేది? ఒక్క విషయం నువ్వు మరచి పోతున్నావు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగం ఉన్నదే… అది, ఆనాడే సభామధ్యంలో, నా ప్రతిజ్ఞకు పూర్వం చేసి ఉంటే, ఎంతో సమంజసంగా ఉండేది.

ద్రౌపదికి కలిగిన క్లేశం, ఆమె విషాదవదనమూ, నాకూ బాధ కలిగిస్తున్నాయి. విషం త్రాగినంత బాధగా ఉంది నాకు. అయినా నా ప్రతిజ్ఞను ఉల్లంఘించలేను. పొలంలో విత్తనాలు చల్లి, పంటకోసం నిరీక్షించే రైతులా, నువ్వు కూడా ఓపికపట్టు. శత్రువు మోసగిస్తే సమయం వచ్చే వరకూ ఆగి, శత్రువును మూలచ్ఛేదం చేసే వాడే, రాజ్యలక్ష్మిని గ్రహించడానికి అర్హుడు. నీ శౌర్య ప్రతాపాల ముందు, శాత్రవకోటి తలవంచుతుందని నాకు తెలుసు. కాని ఈ లోగా ఎందరో మిత్రులు మనకు సమకూరుతారు. ఇంద్ర సహాయంతో దేవతలు సుఖంగా ఉండేటట్లు, మిత్ర సహకారంతో మనం శత్రువులను జయించి, ప్రశాంతంగా ఉండవచ్చు.
నాయనా! నా జీవితాన్నీ అమరత్వాన్నీ ఉపేక్షిస్తాను. కాని ఉత్కృష్టమైన ధర్మాన్ని విడిచి పెట్టలేను. ఈ రాజ్యమూ, దారాపుత్రులూ, యశోధనాలూ, సత్య ధర్మాలలో షోడశాంశం కూడా కావు. సత్యధర్మ పాలనమే నా జీవిత వ్రతం” అని భీమునికి సమాధాన మిచ్చారు.

[పై సంభాషణలు ఉషశ్రీ మహాభారతం నుండి యధాతధంగా గ్రహించాను.]

ఈ ఒక్కమాటకే ధర్మరాజు…అజాత శతృవనీ, ధర్మనిరతుడనీ,,, శ్రీకృష్ణుడు మొదలు మార్కండేయ మహర్షి వరకూ పొగడటానికి అర్హుడు!

[అలాంటి చోట,,, మన సినిమాలు ధర్మరాజుని ఎంత ‘హిపోక్రెట్’గా చూపించాయో! మన ఇతిహాసాల మీద ఆ రకపు కుట్రతీరు,,, తేలికగా అర్ధం చేసుకోలేనంత సంక్లిష్టమైనది, ద్వంద్వ పూరితమైనది.]

ఇక ఈ సందర్భంలో,,, ద్రౌపదీకీ, ధర్మరాజుకీ మధ్య సంభాషణ ఆసక్తి కరమైనదీ, నేటి సామాజిక పరిస్థితులకి అవసరమైనది.
ఒక సారి పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

మీ ఆవేదన అర్దం అయింది.

To rule any country, one must control the following institutions.

1) Army
2) Election Commission
3) Bureaucracy
4) Political Party
5) Media
6) Police
7) Intelligence Agencies
8) Powerful (Religious or Social) organizational backing

Lets examine which of the above Institutions are controlled by Sonia.

1) Army (through Defence Minister Anthony)
2) Election Commission (through CEC Thomas)
3) She controls the Governors
4) She controls Congress Party
5) Media dominated by her co-religious people (NDTV, The Hindu, etc)
6) CBI
7) కిరస్తాని చెర్చ్ is very powerful organization in India. They own huge land tracts, Media, Schools, Politicians, Hospitals, Colleges, Naxals, North-East (NE) extremists, they control illegal substance trade in NE)

She (and her progeny) can easily rule India for next 100 years.

Some one may ask, what is wrong if she rule India?

Then here is the assignment for that person. Study what కిరస్తాని YSR did to AP state between 2004 and 2009. He fundamentally altered secular Institutions to benefit his కిరస్తాని faith.

Then think about her, what she can do while ruling for those many years. Fundamentally (core institutions and/or articles in Indian Constitution) changing the character of India to suit కిరస్తాని faith is not acceptable.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu