మొన్నటి [30 ఆగస్టు, 2010] ఈనాడు దినపత్రిక ప్రధాన సంచికలో చివరి పేజీ(14) లో పెద్దచ్చరాలలో చోటుచేసుకున్న ‘ఈ పాపం ఎవరిది?’ చదివితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

‘82 మ్యాచ్ లు ఫిక్స్’ ‘బెయిల్ పై మజర్ (బుకీ) విడుదల’ ‘అవును.... ఆసిఫ్ అలాంటి వాడే’ ‘మెరుపులు... అంతలోనే మరకలు’ ‘బుకీల సంపాదన 145 కోట్ల రూపాయలు’ ‘ఇక్కడ ‘ఫిక్సింగ్’ చేయబడును’ - అనే ఉపశీర్షికలతో... దాదాపు పూర్తి పేజీలో కవర్ చేయబడిన ఆ వార్తాంశంలో, ఆసక్తికరమైన విషయాలున్నాయి.

>>> క్రికెట్ ఆడే దేశాలెన్ని ఉన్నా... మ్యాచ్ ఫిక్సింగ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు పాకిస్థాన్. ఎక్కడ ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూసినా బయటికొచ్చే పేర్లు పాక్ క్రికెటర్లవే. సహజ సిద్ద క్రికెట్ ప్రతిభకు నెలవైన ఆ దేశంలో ఫిక్సింగ్ జాడ్యం ఇంతలా విస్తరించడానికి కారణమేంటి? మిగిలిన దేశాల క్రికెటర్లు ఆటను నమ్ముకుంటుంటే... పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్ పైనే ఎందుకు మోజు పడుతున్నారు? అక్కడి క్రికెటర్లను ఆట కంటే ఆకర్షిస్తున్నదేంటి? పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నా... నిషేధాలు ఎదుర్కొంటున్నా, వారిలో ఎందుకు మార్పు రావట్లేదు? అసలీ పాపం మొత్తం ఆటగాళ్లదేనా? అందులో బోర్డు పాత్ర ఏమీ లేదా?

>>> ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో ‘మ్యాచ్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికైనందుకు మహ్మద్ అమిర్ అందుకున్న మొత్తం దాదాపుగా రూ.3 లక్షలు. అతనికి జీతం కింద పాక్ బోర్డు ఇచ్చేది దాదాపు రూ.లక్ష. 2008 ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఏడాదికి రూ.3.8 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న ఇషాంత్ శర్మ... తొలి సీజన్ లో వేసిన ఒక్కో బంతికి అందుకున్న మొత్తం రూ.2 లక్షలు. పాక్ ఆటగాళ్ళు మిగిలిన క్రికెటర్లకు భిన్నమైన ఆదాయ మార్గాలు ఎందుకు ఎంచుకుంటున్నారో అర్ధం చేసుకోవడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. గత రెండు మూడు దశాబ్దాలుగా పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ళలో ఎక్కువ మంది నేపధ్యం పేదరికమే.

>>>కేవలం సహజ సిద్దమైన ప్రతిభతో జాతీయ జట్టుకు ఎంపికవుతున్న అక్కడి ఆటగాళ్ళకు చదువు, తెలివితేటలు, లౌక్యం... మిగిలిన దేశాల క్రికెటర్లతో పోలిస్తే తక్కువే. పేదరికం నుంచి వచ్చిన వారందరికీ తొలి లక్ష్యం డబ్బు సంపాదించడం. దేశంలో క్రికెట్ మ్యాచ్ లు లేక నష్టాల్లో కూరుకుపోయిన పీసీబీ, మ్యాచ్ ఫీజులు మినహా మరేం చెల్లించే స్థితిలో లేదు. ఇక స్పాన్సర్ షిప్ఫుల సంగతి సరేసరి. ఈ స్థితిలో ఒక్క నోబాల్ వేస్తే 10 లక్షలిస్తాం. ఒక్క క్యాచ్ వదిలేస్తే 50 లక్షలిస్తాం. ఈ మ్యాచ్ లో త్వరగా ఔటైతే కోట్లిస్తాం అంటూ బూకీలు పాక్ క్రికెటర్లకు తేలిగ్గా లొంగదీసుకుంటున్నారు. బాగా ఆడి మ్యాచ్ గెలిస్తే వచ్చే ఆదాయానికి ఎన్నో రేట్లు బుకీలు ఇస్తుండటంతో ఆటగాళ్ళు ఫిక్సింగ్ కు తలూపుతున్నారు.

>>>మరోవైపు ఎంత అద్భుతంగా ఆడినా జట్టులో చోటు గ్యారంటీ అన్న ధీమా లేకపోవడం కూడా పాక్ క్రికెటర్లు ఆత్యాశకు పోవడానికి ఓ కారణమే. ఉన్న కొద్ది రోజుల్లో వీలైనంత సంపాదించుకుందామన్న ఉద్దేశంలో వారు ప్రక్క దారి పడుతున్నారు. ఈ దారులు నచ్చని ఆటగాళ్ళు జట్టులో ఇమడలేక కౌంటీలకో, వేరే ప్రైవేట్ లీగ్ లకో వెళ్ళిపోతున్నారు.
~~~~~~

ఎంతో గొప్పగా ఈనాడు క్రీడా విభాగం వ్రాసిన ఈ వార్తాంశంలో......

పాక్ ఆటగాళ్ళు మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారని తేల్చి పారేశారు! అందుకు పేదరికమే కారణమని నిర్ధారించేసారు!!
పాక్ బోర్డు చూస్తూ ఊరుకుంటోందన్న మాట.

ఆట ఆడటం కంటే అలవోకగా ఔటైతే కోటిస్తాం అని బుకీలు ఆటగాళ్ళకి బేరం పెడితే...
సర్లెమ్మని ఆటగాళ్ళు అలాగే చేసి, ఒక్క దెబ్బతో కోట్లు సంపాదించుకుంటుంటే.........
పాక్ క్రికెట్ బోర్డు సభ్యులు నోరు తెరుచుకుని చూస్తూ, చేతులు ముడుచుకుని కూర్చుంటారా?
కోచ్ లూ, మేనేజర్లూ కూడా మేచ్ ఫీక్సింగులకీ, బాల్ టాంపరింగ్ కీ [పెట్రోలియం జెల్లీలు పూసి] పాల్పడుతున్నారట.

ఇదంతా సరే గానీ, ప్రపంచ వ్యాప్తంగా పాక్ ఆటగాళ్ళు, పాక్ జట్టు కోచ్ లూ, మేనేజర్లూ మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారా? వీళ్ళు మాత్రమే బుకీలకి లొంగి పోతున్నారా?

క్రికెట్ బెట్టింగ్ వ్యాపారపు విస్తారత గురించి వెల్లడైన నేపధ్యంలో చూస్తే... క్రికెట్ ఎంత లాభసాటి వ్యాపారమో! అందుకే కదా మీడియా ఎలుగెత్తి, "క్రికెట్ ఒక మతం. సచిన్ క్రికెట్ దేవుడు. ధోనీ ఇంద్రుడు. మరో xyz ప్రవక్త!" గట్రా ప్రఖ్యాతి ప్రచారిస్తుంటుంది![దాదాపు రెండు నెలల క్రితం అమ్మఒడి టపా:
క్రికెట్ ఒక మతం - ఒక మెగా మోజు! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 12]


అలాంటి చోట... ఒక ఆట గెలవాలన్నా, ఓడాలన్నా కేవలం పాక్ జట్టు మాత్రమే ఫిక్సింగ్ కి పాల్పడితే సరిపోతుందా? ఒక్క చేత్తో చప్పట్లు సాధ్యమైనట్లు.... కేవలం పాక్ క్రికెటర్లు మాత్రమే... పేదరికం కొద్దీ, కేవలం ఒక ఆటకి మూడు లక్షల రూపాయల వంటి తక్కువ ఆదాయం ఉండటంతో ఫిక్సింగ్ కి పాల్పడి, గెలుపు ఓటములను నియంత్రించగలుగుతున్నారా? అంత ప్రతిభావంతులా? ఎదుటి జట్టు ప్రమేయమేమీ లేకుండానే, తమ ఆటని తమ ఫిక్సింగ్ ప్రకారం.... గెలిపించటమో లేక ఓడించటమో చేయగలిగేంత ప్రతిభావంతులా?

పాక్ ఆటగాళ్ళు... నోబాల్ కో, బంతి క్యాచ్ పట్టకుండా జార విడవటానికో, సిక్సర్లు ఫోర్లూ ఎదుటి బ్యాట్స్ మన్ కొట్టే విధంగా బంతులు విసరటానికో ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం!

లేక

పాక్ ఆటగాళ్ళు... విరగ సిక్సర్లూ, ఫోర్లూ కొట్టడానికి, నాటవుట్ గా నిలబడటానికీ ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం. లేదా డక్ అవుట్ కావటానికో, నామ మాత్రపు పరుగుల తర్వాత తేలిగ్గా అవుట్ అయిపోవడానికో ఫిక్సింగ్ చేసుకున్నారనుకుందాం.

మరి ప్రత్యర్ది జట్టు ఏం చేస్తుంది? నోట్లో వేలేసుకుని కూర్చుంటుందా? రెండు జట్లు ఆడే ఆటలో, ఒక జట్టు మాత్రమే అ ఆట మొత్తాన్నీ ఎలా నియంత్రించగలదు?

అలాంటి చోట... పాకిస్తాన్ ఆటగాళ్ళు, కోచ్ లూ, మేనేజర్లూ తప్ప, ప్రపంచంలో మిగిలిన దేశాలలో క్రికెట్ ఆడే జట్లన్నీ పరమనీతి పరులన్నట్లు.... మీడియా భలే స్టంట్ చేస్తోందేం!?

అందునా భారతీయ బుకీలు బయటపడ్డాక కూడా!

ఇటీవలే ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ దుర్గంధం ముక్కుపుటాలు ఆదర గొట్టాక కూడా....!

ప్రక్కనున్న పాకిస్తాన్ ఆటగాళ్ళు అడ్డదారిలో కోట్లు సంపాదిస్తుంటే... భారతీయ క్రికెటర్లు మాత్రం మడిగట్టుకు కూర్చున్నట్లున్నారు. మొత్తానికీ ఆవులు చేలో మేస్తుంటే దూడలు మాత్రం బుద్దిగా గట్టునే మేస్తున్నాయన్న మాట?

మరి భారతీయ బుకీలు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగులు చేస్తున్నట్లు? మీడియా... మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ లుగా, డైనమెట్లుగా నిలబెట్టిన క్రికెట్ దేవుళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఇంకేమైనా ఉందా? [ముంబై ముట్టడితో సహా పాకిస్తాన్ తీవ్రవాదులు భారత్ మీద దాడి చేసినప్పుడు పన్నెత్తి ఒక్క మాట కూడా మాట్లాడని క్రికెట్ దేవుళ్ళు ఈ ఆటగాళ్ళు!]

మీడియా వీర భక్తులకి అగ్రహావేశాలు ఏ స్థాయిలో వస్తాయంటే... అలాగన్న వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేటంత! ఏం చేస్తాం? వాళ్ళ విజ్ఞతకీ జాలిపడి, వాళ్ళకి దండేసి దండం పెట్టాల్సిందే మరి!

ఇకపోతే... ఇందులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే - అదేదో పాక్ క్రికెటర్లు కి డబ్బులు తక్కువై [వాళ్ళ బోర్డు ఆటకి లక్ష మాత్రమే ఇస్తుందట వాళ్ళకి!] ఫిక్సింగ్ కి పాల్పడుతున్నారట.

మరి దేశంలో... రాజకీయ నాయకుల మొదలు, బోలెడు మంది ఉన్నతాధికారుల వరకూ, అందరికీ జీతాలు/ఆదాయాలు తక్కువై అవకతవకలకు పాల్పడుతున్నారా?

ఇవాళా రేపూ ఒక్క చిన్న స్థాయి అవినీతి ప్రభుత్యోద్యోగి మీద ఏసీబీ దాడి జరిగినా కోట్లలో అక్రమాస్థులు బయటపడు తున్నాయి. అలాంటి చోట, పాపం భారతీయ క్రికెటర్లు ‘తమకు సంతృప్తిగా రెమ్యూనరేషన్లు వస్తున్నాయి కదా’ అని ఫిక్సింగ్ కి పాల్పడటం లేదు కాబోలు!

మరి ఐపీఎల్ ఎలా బయటికి పొక్కినట్లు? బుకీలు ఎవరితో బేరాలు కుదుర్చుకుంటున్నట్లు? ఆటగాళ్ళు వాళ్ళకి సహకరించకపోతే అసలు బుకీలు ఎలా తయారౌతారు? దీన్నంతటినీ ‘తిమ్మిని బమ్మిని’ చేసి... మీడియా, క్రికెట్ సంస్థలూ, రాజకీయ నాయకులూ ఐపీఎల్ ఫిక్సింగ్ రచ్చని చల్లార్చే సారు. దాంతో అంతా నిశ్శబ్ధమే!

అసలు అన్నిటి కంటే అత్యంత ఆసక్తి కరమైన విషయం మరి కొన్ని ఉన్నాయి. టపా దిగువన గల వార్తాంశాలు పరిశీలించండి.

సవివరంగా, పార్లమెంట్ సాక్షిగా, ప్రముఖ రాజకీయ నాయకుల వ్యాఖ్యానాల సహితంగా రచ్చకెక్కిన ఈ బెట్టింగ్, ఫిక్సింగ్ ల విషయంలో ఎంత డబ్బు ఏ విధంగా ప్రయాణిస్తుందో కూడా వివరంగా వెల్లడయిన తరువాత కూడా..... అదంతా మామూలుగా ప్రక్కన పెట్టేసి, అదేదో ఇప్పుడే కొత్తగా కనుక్కున్నట్లు అంతా పాక్ క్రికెటర్లే చేసారు అనేస్తే ఓ పనైపోతుంది. గతంలో ఐపీఎల్ పాపం విషయంలో కూడా లలిత్ మోడీ, శశీధరూర్ అనబడే రెండు బలి గొర్రెలు తాత్కాలికంగా తెరమరుగైనాయి.

ఈ మొత్తం వ్యవహారాలని పరిశీలిస్తే తెలియటం లేదా... మీడియా, మాఫియా, దేశాల ప్రభుత్వాలు (క్రికెట్ ఉదాహరణలో అయితే ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, దుబాయ్ గట్రాలు) కలిసికట్టుగా, ఒకే లక్ష్యంతో, ఒకే గొడుగు క్రింద పనిచేస్తున్నాయని?

కలిసి కట్టుగా... ఐపీఎల్ ఫిక్సింగూ, బెట్టింగ్ రచ్చని చల్లార్చారు. ఇప్పుడు తాజాగా, పరమ కొత్తగా, పాకిస్తాన్ ఆటగాళ్ళే అంతా చేసారంటూ కొత్త రచ్చ మొదలెట్టారు. నాలుగు రోజులు పోతే ఇదీ చల్లారుస్తారు?

ఆ చల్లార్చడంలోనే... మీడియా, మాఫియా, దేశాల ప్రభుత్వాలు... ఒకే శృతిలో పనిచేస్తున్నాయన్నది తిరుగులేకుండా నిరూపితమౌతోంది.

కాకపోతే... సత్యాన్ని చూడగల కన్ను, నిజాన్ని ఒప్పుకోగల దన్ను ఉండాలి. అంతే!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~~~~~~
వార్తాంశాలు:

24/4/10
>>>
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: నెల రోజులుగా జేబులు ఖాళీ చేసుకుని, చదువులు గాలికొదిలి, కళ్లింతింత చేసుకుని మనం చూసిన హోరాహోరీ పోరాటాలన్నీ ఉత్తుత్తి లాలూచీ పోటీలేనని తేలిపోయింది. ఏ మ్యాచ్‌లోనూ రెండు ప్రత్యర్థి టీములు బరిలోకి దిగిందే లేదని, ఆడింది ఒక్క టీమేనని తేలిపోయింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ బెట్టింగ్‌ మాఫియా కోట్లాది క్రికెట్‌ ప్రేమికులతో ఆడిన దొంగాటే నని, ప్రతి మ్యాచ్‌ ముందుగానే ఫిక్సయిపోయిందని ఐటీ అధికారుల దర్యాప్తులో తేలిపోయింది. ‘ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కుంభకోణం తారస్థాయికి చేరింది అంటూ అది ఓ నివేదికను తయారు చేసింది.


ఆ నివేదిక, మనం విని తట్టుకోలేని మరో నిజాన్ని బట్టబయలు చేసింది. మనం ఆరాధించే క్రికెట్‌ ఇలవేలుపులే మనల్ని వంచించారని ఆ నివేదిక తేల్చేసింది. క్రికెట్‌ అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపార వేత్తలు, మాఫియా గ్యాంగులేకాదు, మన క్రికెట్‌ వీరులే కోట్లాది క్రికెట్‌ ప్రేమికులను చిత్తుచిత్తుగా ఓడించేశారని తేలిపోయింది.

ఇంతటి విషాదంలోనూ మిగిలిన ఒకే ఒక్క ఊరట....సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రావిడ్‌లు మాత్రం మనల్ని మోసగించ లేదు. ఐపీఎల్‌ పాపపంకిలం ఏ మాత్రం అంటని వారుగా ఆ ముగ్గురికీ ఐటీ నివేదిక క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ పంకిలాన్ని 'సాక్షి మొట్టమొదట బైటపెట్టిన సంగతి తెల్సిందే. ఇపుడు ఐటీ నివేదిక 'సాక్షి వరుస కథనాలను నిజం చేసింది.

క్రికెట్‌ వీరులు ఆడిన దొంగాట: మ్యాచ్‌ఫిక్సింగ్‌ల క్రీడలో ప్రముఖ భారత వీరులతో పాటు ఒక టీంకు కెప్టెన్సీ వహించిన విదేశీ యోధుడూ ఉన్నాడని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ దొంగాటలో సీనియర్లే ముందుండి జూనియర్‌లకు మార్గదర్శకత్వం వహించారు. కాదంటే బెదిరించి భయపెట్టి మరీ దారికి తెచ్చారు. అటూ ఇటూ రెండు జట్లలోనూ కాసులకు కక్కుర్తిపడి ఫిక్స్‌ అయిపోయిన క్రీడాకారులే. ఇక అడ్డేముంది. ముందస్తు పథకం ప్రకారం ఒక బౌలర్‌ ఇటు నుంచి చెత్త ఓవర్లు వేస్తాడు. అటు నుంచి మరో ఫిక్స్‌ అయిన బ్యాట్స్‌మెన్‌ ఉతికి ఆరేస్తాడు.

మరో ఆటగాడు స్కూలు పిల్లలు పట్టుకోగల క్యాచ్‌లు జార విడుస్తాడు. ఈ దొంగాటతో మ్యాచ్‌ 'అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. గెలుస్తుందనుకుంటున్న టీం ఓడిపోతుంది. ఓడిపోతుందనుకున్న టీం గెలుస్తుంది. మాఫియా యోధులకు ఏ మ్యాచ్‌ ఎప్పుడు ఎలాటి మలుపు తిరుగుతుందో ముందే తెలుసు కాబట్టి కోట్లకు కోట్లు గడించేస్తారు.

అందరూ దొంగలే: ఐపీఎల్‌ దర్యాప్తులో పాల్గొంటున్న అధికారులు మహా ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కటొక్కటిగా ఐపీఎల్‌ మహా పాప పంకిలంలోని లింకులు బయటపడి పోతున్నాయి. వాటి మూలా లు ఎక్కడెక్కడో తేలుతున్నాయి. ఐపీఎల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడీ చీకటి సామ్రాజ్యపు ప్రధాన కార్యాలయంగా బయటపడ్డ మారిషస్‌లోని వరల్డ్‌ స్పోర్ట్స్‌ గ్రూప్‌ (డబ్ల్యూఎస్‌జీ) అధిపతి వేణూనాయర్‌... అవిశ్రాం తంగా పనిచేస్తున్నఐటీ-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలముందు మహా సంతోషకరమైన నిజాన్ని వెలిగక్కాడు. సోనీ కంపెనీకి చెందిన మల్టీ స్క్రీన్‌ మీడియాకు (ఎమ్‌ఎస్‌ఎమ్‌), ఐపీఎల్‌కు ప్రసారహక్కుల ఒప్పం దం కుదిర్చినందుకుగాను... తమకు రూ.125 కోట్లు లంచంగా (కాదు కాదు, సహాయక ఫీజు అనాలి) అందిందన్న నిజాన్ని వెలిగక్కాడు.

అధికారులు ఆ తీగ పట్టుకుని సాగితే, అది బ్రిటన్‌కు చెందిన వర్జిన్‌ ఐలాం డ్స్‌కు చేర్చింది. ఐపీఎల్‌ పాపపు డబ్బు తమకు చేరే మార్గాలెన్నో ఉన్నాయని, వాటిలో రాజకీయ సంబంధాలూ భాగమేనని వేణూనాయర్‌ బయటపెట్టాడు.

పాపిష్టి డబ్బు ప్రవహించే మార్గం: మారిషస్‌లోని డబ్ల్యూఎస్‌జీకి, ఎమ్‌ఎస్‌జీ సమర్పించుకున్న రూ.125 కోట్లు... పన్ను ఎగవేత దారుల స్వర్గధామం వర్జిన్‌ ఐల్యాండ్స్‌కు చేరాయి. అదీ కూడా డబ్ల్యూఎస్‌జీ వ్యవస్థాపకుడుగా చెబుతున్న సీమస్‌ ఓ బ్రయన్‌ వ్యక్తిగత ఖాతాలోకి చేరాయి. అదీ సూటిగా జరిగింది కాదు. పలు దొంతర్ల లావాదేవీలతో సింగపూర్‌ మీదుగా, చివరికి 'పార్క్‌ హౌస్‌ హోల్డింగ్‌అనే సంస్థ పేరిట బ్రయన్‌ వ్యక్తిగత ఖాతాలోకి చేరాయి. ఇది ఐపీఎల్‌ ఛాంపియన్‌కోసమే ఏర్పాటు చేసిన ఓ పకడ్బందీ మార్గం.

ఐపీఎల్‌కు సంబంధించిన రకరకాల హక్కుల ఒప్పందాల ద్వారా ఆర్జించిన పాపపు సొమ్మునంతటినీ విదేశాలకు తరలించి....అక్కడి నుంచి తిరిగి భారత్‌లోకే తెచ్చి, వివిధ వ్యాపార సంస్థల ద్వారా దర్జాగా ఐపీఎల్‌ నిర్వహణలో పెట్టుబడులు పెట్టుకునే మార్గమిది. ఎమ్‌ఎస్‌మ్‌, మోడీ సంస్థకు లంచాలు చెల్లించి 2017 వరకు అధికారిక ప్రసార హక్కులను సంపాదించింది. దీనికోసం అది ఐపీఎల్‌కు దాదాపు రూ 8,200 కోట్లు చెల్లిస్తుంది. డబ్ల్యూఎస్‌జీ వేసిన ఈ దొంగదారిలో సోనీ భారతదేశానికి చెందిన హక్కులను, భారత్‌లోనే కొని చిల్లిగవ్వ కూడా పన్నులుగా చెల్లించ లేదు. సోనీ, ఇలా రూ.240 కోట్లు పన్ను ఎగ్గొట్టిందని అంచ నా. టీవీ ప్రసార హక్కుల డిస్కౌంట్‌ విలువలో మరో 7.5 శాతం (480కోట్లు) కూడా అది డబ్ల్యూస్‌జీకి చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.

Pasted from: http: uni.medhas.org="" unicode.php5?file="http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=486929%26Categoryid=1%26subCatId=32"

మోడి అల్లుడి సైట్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగులు కట్టాలని తహతహలాడిపోతూ, దారి తెలియక సతమతమయ్యే వారికో శుభవార్త. అలాంటి వాళ్ల కోసం ఆన్‌లైన్‌ సౌకర్యం ఉంది. 'కాయ్‌ రాజా కాయ్‌' అంటూ క్రికె ట్‌.కాం అనే వెబ్‌సైట్‌ ఆహ్వానం పలుకుతోంది. ఆ సైట్లో ఏ చీకూ చింతా లేకుండా ఐపీఎల్‌ జూదం....అదే బెట్టింగ్‌ ఆన్‌లైన్లో ఆడేసుకోవచ్చు.

ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించింది మరెవరో కాదు.... గ్లోబల్‌ క్రికెట్‌ వెంచర్స్‌(జీసీవీ). ఐపీఎల్‌కు ఈ సంస్థ అధికారిక డిజిటల్‌ మీడియా పార్ట్‌నర్‌! ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సెట్‌ను అదే నడుపుతుంది, ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నమెంట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌, డిజిటల్‌ ఇమేజింగ్‌ హక్కులన్నీ దానివే. జీసీవీ ఎవరిదనుకున్నారు? ఐపీల్‌ కమిషనర్‌ లలిత్‌ మోడీ సవతి అల్లుడు గౌరవ్‌ బర్మన్‌ది! బర్మన్‌ ప్రమోట్‌ చేసిన ఎలిఫెంట్‌ క్యాపిటల్‌ అనే సంస్థ గత నవంబర్‌లో జీసీవీలో కోటి డాలర్లు (రూ. 45కోట్లు) షేర్‌లుగా పెట్టుబడి పెట్టింది.

కాయ్‌రాజా కాయ్‌: క్రికెట్‌.కాం, మొదటి సెమీఫైనల్‌లో ముంబై గెలుస్తుందని పందెం కాస్తే 8 కి 11 ఇస్తానని చెప్పింది (8 రూపాయలు కాస్తే 11 రూపాయలు ఇస్తారు). బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌కు విజయావకాశాలు ఎక్కువని దాని అంచనా. అందుకే 11కు 10 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇక గురువారం జరగనున్న మరో సెమీ ఫైనల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌కు 1 - 1, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 8-11 ఇవ్వజూపుతున్నారు.

ఐపీఎల్‌ను రద్దు చేయండి: ఠాక్రే
ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను రద్దుచేసి క్రికెట్‌ను కాపాడాలని శివసేన అధినేత బాల్‌ ఠాక్రే డిమాండ్‌ చే శారు. క్రికెట్‌లాంటి మంచి ఆటను ఐపీఎల్‌ పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఐపీఎల్‌ అవకతవకలపై ఆదాయం పన్ను శాఖ ఆరు నెలల కిందటే నివేదిక ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ అన్నారు.


Pasted from:
18/4
మాఫియా కనుసన్నల్లో ఐపీఎల్‌!
రియల్‌ ఎస్టేట్‌, బాలీవుడ్‌లను శాసిస్తున్న అంతర్జాతీయ మాఫియా ముఠాల తాజా టార్గెట్‌..భారత ఉపఖండాన్ని ఏటా ఓ సునామీలా చుట్టేసే ఐపీఎల్‌...
ఈ సీజన్‌లో 'చీకట్లో' చేతులు మారుతున్న మొత్తం రూ.లక్ష కోట్లు
విజయవాడలాంటి నగరాలకు పాకిన
క్రికెట్‌ బెట్టింగ్‌.... ఆస్తులు ఒడ్డేస్తున్న కోస్తా
ముంబైపై రూపాయికి 70 పైసలు,
పంజాబ్‌పై రూపాయకి రూ.25

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి:

రియల్‌ ఎస్టేట్‌, బాలీవుడ్‌లను శాసిస్తున్న అంతర్జాతీయ మాఫియా ముఠాల తాజా టార్గెట్‌.. ఐపీఎల్‌! కొచ్చి ఐపీఎల్‌ టీమ్‌కు దూరంగా ఉండాలంటూ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు వచ్చిన ఎస్‌ఎమ్‌ఎస్‌ బెదిరింపు అంతర్జాతీయ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరులు పంపిందా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ... దావూద్‌ ముఠా ఐపీఎల్‌పై 'ప్రత్యేక ఆసక్తి'ని కనబరుస్తున్నదనడంలో మాత్రం సందేహం లేదు. భారత ఉపఖండాన్ని ఏ టా ఓ సునామీలా చుట్టేసే ఐపీఎల్‌... బాలీవుడ్‌ తార లు, మోడల్స్‌, నేతలు, బిజినెస్‌ టైకూన్లతో కళకళలాడిపోయే, నరాలు తెగేంత ఉత్కంఠను రేపే క్రీడా వేడుక. నిర్వాహకులకు, ఆటగాళ్లకు కూడా కనకవర్షం కురిపించే ఈ భారీ వే డుక సందర్భంగా సాగే 'తెరచాటు వ్యాపారం' విలువ దా దాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరి దావూద్‌భాయ్‌కి 'ప్రత్యేక ఆసక్తి' కలగక మానుతుందా?

బెట్టింగ్‌ పడగ నీడలో క్రికెట్‌

ఒకరోజు పరిమిత ఓవర్ల క్రికెట్‌తో అంతర్జాతీయ బెట్టింగ్‌(పందేలు కాసే జూదం)లో భారత ఉపఖండం ప్రముఖ స్థానంలోకి వచ్చింది. యాభై ఓవర్లలో ఫలితం తేలిపోయే పొట్టిక్రికెట్‌, కోట్ల రూపాయల జూదానికి వేదికగా మారింది. మాఫియా జోక్యంతో అది, మ్యాచ్‌ ఫిక్సింగ్‌లుగా వికృత రూపం ధరించింది. ఒకప్పుడు, 50 ఓవర్ల చాంపియన్‌ షిప్‌లో 400 కోట్ల రూపాయల బెట్టింగ్‌ జరిగేదని అంచనా. ప్రతి ఓవర్‌కీ, ఆ మాటకొస్తే బంతి బంతికీ ఆట తీరు మారిపోయే 20 ఓవర్ల క్రికెట్‌తో బెట్టింగ్‌ తారస్థాయికి చేరింది. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఐపీఎల్‌ బెట్టింగ్‌ మార్కెట్లో.... ఈ సీజన్‌లో 60 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల 'వ్యాపారం' జరగవచ్చని ఒక మాజీ బుకీ (పందేలు స్వీకరించే ఏజెంటు) 'సాక్షి'తో చెప్పాడు. సాక్షాత్తు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటే ఈ భారీ నిధుల గురించి ఆరా తీస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో మాఫియాగ్యాంగులు, ప్రముఖ రాజకీయవేత్తలు, బడా వ్యాపారవేత్తలు, సెలిబ్రిటీల ప్రమేయం ఉందని తెలుస్తోంది.

ఒకప్పుడు దుబాయ్‌, కరాచీ, ముంబై, ఢిల్లీల వంటి ప్రధాన నగరాలలోనే బెట్టింగ్‌ సాగేది. ఇప్పుడది నాగపూర్‌, భోపాల్‌, లాహోర్‌, కౌలాలంపూర్‌ల మీదుగా విజయవాడ వంటి చిన్న నగరాలకు కూడా విస్తరించింది. విజయవాడలో ని బెట్టింగ్‌ ముఠాలకు రాజస్థాన్‌ సిండికేట్లతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఆస్తులను ఒడ్డడం కోస్తా బెట్టింగ్‌ ప్రత్యేకత .

ఎవరు, ఎలా, ఎక్కడ ఆడతారు?

'పెద్దపెద్ద నగరాలలోని సిండికేట్లు తమ తమ బెట్టింగ్‌ ఏజెం ట్లద్వారా, పంటర్లద్వారా ఉపఖండం అంతటా వేలాది ప్రాం తాల్లో ఈ 'వ్యాపారం' సాగిస్తాయి. చట్టవిరుద్ధంగా సాగే ఈ రహస్య జూద క్రీడలో మోసానికి తావులేదని ఒక ప్రము ఖ బుకీ చెప్పాడు. 'అనుక్షణం 'భాయ్‌' కన్నేసి ఉంచుతాడు. మోసాన్ని సహించడు. ఎవరైనా మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటే వెంటనే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. మేం మాట్లాడేది కోట్ల గురించి, ఆషామాషీ కాదు. 24 గ ంటల్లోగానే, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలలోగానే గెలుచుకున్నవారికి డబ్బు ముడుతుంది' అని చెప్పాడు.

'టాస్‌ నుంచే బెట్టింగ్‌ మొదలుపెడ్తాం. టాస్‌ మీద బెట్టింగ్‌ రూ. 1. అంటే, రూపాయికి రెండు రూపాయల చొప్పున చెల్లిస్తారు. బంతి బంతికీ, ప్రతి బౌండరీకి, సిక్సర్‌కీ, మొత్తం బౌండరీలు, సిక్సర్లకూ కూడా బెట్టింగ్‌ ఉంటుం ది. మొత్తం స్కోర్‌ల మీద ఆడడానికి పెద్దగా ఆసక్తి చూపరు' అని చెప్పాడు ముంబైకి చెందిన ఒక బుకీ. 'ప్రస్తుతం ముంబై, ఆటలో ముందుంది. 20 రోజుల క్రితం దానిపై రూపాయికి రూ. 2.30 ఇచ్చారు. ఇప్పుడది 70పైసలకు పడిపోయింది. ప్రస్తుతం బెంగళూరుపై రూ 2.20, చెన్నైపై రూ. 1.30, ఢిల్లీపై రూ 3.00 పంజాబ్‌పై రూ.25 ఇవ్వజూపుతున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు హైదరాబాద్‌కు చెందిన శ్యామ్‌భాయ్‌ (పేరు మార్చాం). రోజుకు దాదాపు రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువ చేతులు మారుతుందని ముంబై-పుణె-అహ్మదాబాద్‌ బెల్ట్‌లోని పంటర్ల అంచనా. క్రితంసారి డెక్కన్‌ చార్జర్స్‌ గెలుపొందినప్పుడు దాదాపు రూ. 2,000 కోట్లు చేతులు మారాయని ముంబైకి చెందిన ఒక పంటర్‌ చెప్పాడు.

డిపాజిట్‌ సెషన్‌: 'డిపాజిట్‌ సెషన్‌' బెట్టింగ్‌లో కొత్త ఆవిష్కరణ. రూ. 20 లక్షలు పంటర్‌ దగ్గర డిపాజిట్‌ చేసి, తొమ్మిది ఓవర్లపాటు ఒ క్కో బంతికీ జూదమాడవచ్చు. అ డబ్బంతా ఒక్కరిదే కానక్కర్లేదు. 'సంపన్న కుటుంబాల యువతీయువకులు చిన్న బృందాలుగా ఇలా ఆడడానికి ఇష్టపడుతున్నారు. తమ గదుల్లోనే కూచుని పంటర్ల ద్వారానూ ఆడతారు, తమలో తాము కూడా పందేలు కాసుకుంటారు. ఈ డిపాజిట్‌ సెషన్‌ యువతలో బాగా పాప్యులర్‌' అన్నాడా పంటర్‌. ఒకప్పుడు ఈ బెట్టింగ్‌ అంతా ఫోన్ల మీద సాగేది. క్షణ క్షణానికి నంబర్లు మారుస్తూ పంటర్లు బెట్టింగ్‌లు స్వీకరించేవారు.

ఇప్పుడు ఉపగ్రహ సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక సదుపాయాలు అందులోకి రావడంతో, ఈ ముఠాలను పట్టుకోవడం ఆధికారులకు మరింత కష్టంగా మారింది. 'మాఫియా ప్రపంచం ఇప్పుడు ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతోందనడంలో సందేహం లేదు. ఒక టీంను చేజిక్కించుకోవ డం అనేది ఏమంత ముఖ్యం కాదు. తెరచాటున జరిగే బె ట్టింగ్‌ వ్యాపారమే ప్రధానం. సినిమా రంగంలో జరిగిందే ఇక్కడా జరుగుతోంది. మాఫియా ఇక్క డా జోక్యం చేసుకుంటోంది' అన్నాడు ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు సాగించిన ఒక మాజీ బుకీ.
Pasted from: http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3FCatId=481680%26Categoryid=1%26subCatId=32
~~~~~~~~~~~~~~~

5 comments:

వాళ్ళొట్టి పావులు. నకిలీ కణికుడు, 10వర్గమూ ప్రమేయం లేకుండా ఇవి జరిగే ప్రసక్తే లేదు.

ఇటీవలే ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ దుర్గంధం ముక్కుపుటాలు ఆదర గొట్టాక కూడా....!
నాకు తెలిసి ఐపీఎల్ లో జరిగింది పైసల గారడీ (అవినీతి) ఇందులో ఆటగాళ్ళు సరిగా ఆడకుండా ఉండటానికో లేక అడటానికో తీసుకున్నారని నాకైతే తెలియదు (..వినలేదు )... ఏ మాత్రం ఫిక్సింగ్ ఉన్నా ... ఆటగాళ్ళపై చర్యలు ఉండేవి కదా ..

ఇంకో పాయింట్ ఏంటంటే అవతలి వాడిని అవుట్ చేయకుండా బౌల్ చేయటం సులభం .. మరియు ఎక్కువ పరుగులు సాధించే విధంగా బౌల్ చేయటమూ సులభమే .. ఈ విషయం లో చప్పట్లు కొట్టడానికి రెండో చేయి అవసరం లేదు కదా .. అక్కడ ఆడేది వీధి ఆటగాళ్ళు కాదు కదా.. ఎంత సులభమైనా పరుగులు తీయలేకపోవటానికి ...కాకపొతే బౌలర్ తన ఉనికిని చాటు కునేందుకు కొన్ని సార్లు మంచి బంతులు (కటినమైనవి ?) వేయవచ్చు ... ఈ సందర్భం లో అవుట్ కాకుండా ఉండటానికి బాట్స్మన్ సహకారం అవసరమే... కాని 11 మంది అలా అవుట్ కాలేరు కదా .. ఒక్క వికెట్ తీసినా ఈ సందర్భం లో బౌలర్ తన పని ని తప్పు పట్టకుండా ఒక వికెట్ తీసానని చెప్పుకోవచ్చు ..సో అతను ఇక మంచి బంతుల సంఖ్యా తగ్గిస్తాడు .. అందువలన అవతలి జట్టు ఓడిపోయే అవకాశం తక్కువ .. సో రెండవ చేయి అవసరం లేదు చప్పట్లకి.. మీరేమంటారు ?

మూలాలు సరిగా లేక పాకిస్తాన్ వెనక బడుతుంది అనేది నా అభిప్రాయం .. లౌకికం పై సరైన స్పష్టత లేదని .. ఒక మతాన్ని ఆధారం గా నిర్మింప బడ్డ దేశం .. ఆ గోడల లోపలే ఉంటుంది .. బయటకి ఎలా వస్తుంది ? కామన్ ధోరణి మారకుండా ఆ దేశం బాగు పడదు ... మత అడ్డు గోడలు దాటకుండా ఆ ద్రక్పథం రాదేమో

idi oka vyaapaaramgaa maari manaku karentu korataku daariteestOmdi. paniki maalina maachula gurimchi konni vela unitla current, mana sampaadana vrudhaa avutunnaayi. kapil deo nundi, ajaruddeen varaku anta indulo bhaagaswaamulayinappudu nashtaanni gurtimchi bcci mana medianu guppetlo pettukondi. DC vamti patrikaa yaajamaanyaalu sponsoring chestunnaayi. IPL kampu kottesariki mafia don laa fojulichche modi gaadini okkadipainaa, alaage veella kotla vyaapaaraala guttu bayatapadinappudu o mantripainaa charyalateesukunna dramalato saripetti prajalanu mabhyapedutunnaaru. koddikaalamaagite idi kooda tappaka fadeout avutundi.

బ్లాగ్ బాబ్జీ గారు: నిరంభ్యంతరంగా!:)

వ్యాఖ్యలిచ్చిన అందరికీ నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu