సాధారణంగా రాజకీయ నాయకులు, ప్రజా సమస్యలు పట్టుకుని [ధరలు పెరిగాయనో, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనో, తమ పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారనో/ పధకాల వర్తింపులో అన్యాయం జరుగుతుందనో, మరో xyz అనో... ] ధర్నాలు, రోడ్దు రోకోలు చేస్తుంటారు. [ఎక్కువగా ఎర్రపార్టీల వాళ్ళిలా చేస్తుంటారు. ఆ క్రమంలో కాసిన్ని తన్నులూ తింటుంటారు. తన్నులు తినటమే... పైకి ఎదగటానికి మార్గం అనుకునే సంస్కృతి ఎర్రపార్టీలలో ఉంది.] నిరాహార దీక్షలూ చేస్తుంటారు. [తెలంగాణా కోసం కేసీఆర్ చేసిన దొంగ దీక్షల్లాగా కూడా!] అలాంటప్పుడు, మామూలుగానే పోలీసులు వాళ్ళని అరెస్టులు చేస్తుంటారు.

అంతే గానీ... కుళ్ళ బొడవరు, చితక్కొట్టరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక కెరీర్ రికార్డు ఉంది. ఐటీ అభివృద్దితో జాతీయఖ్యాతి గడించిన వాడు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక వ్యక్తిగా వ్యవహరించిన వాడు. అలాంటి వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది.

అలాంటి చోట... తెదేపా నేతల్ని ‘బాబ్లీ చూపిస్తాం రమ్మని’ నమ్మించి తీసికెళ్ళి [చంద్రబాబు ఇలాగే చెప్పుకున్నాడు మరి!], చెప్పులూడి పోయేదాక, దుస్తులు చిరిగి పోయే దాకా.... ఎలా కుళ్ళ బొడవ గలిగినట్లు?

పైగా ‘వాళ్ళ బాధలు చూడలేక, తామే విమాన ఖర్చులు భరించి, వెనక్కి రప్పించామని’ ముఖ్యమంత్రి రోశయ్య సెలవిచ్చాడు. వాళ్ళ బాధలు చూడలేనప్పుడు "నేరగాళ్ళ మీదే ధర్డ్ డిగ్రీ ఉపయోగించరు. అలాంటిది, మాతోటి ప్రజా ప్రతినిధులని అలా విరగ తన్నటం ఏమిటి?" అని మహారాష్ట్రని నిలదీయాలి గానీ, "ఏదో ఒక బండిలో ప్యాక్ చేసి పంపండి" అనటం ఏమిటి? ఖర్చులు భరించి... చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం, మిగిలిన తెదేపా నేతలందరికీ కలిపి ఒక విమానం ఎందుకు సిద్దం చేయించినట్లు?

‘ఔరంగబాద్ జైలుకి తీసికెళ్తున్నామని చెప్పి, ఎయిర్ పోర్టుకి తీసికెళ్ళారని’ చంద్రబాబు చెబుతున్నాడు. అంటే 20 జూలై, 2010, మంగళ వారం, ముందుగా రోశయ్య ప్రభుత్వం చెప్పినందునే, వాళ్ళని ధర్మాబాద్ నుండి ఔరంగాబాద్ కు తరలించి, విమానంలోకి ఎక్కించి పంపించారా? అంటే ‘వాళ్ళని తన్ని మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ కు పంపండి’ అని చెప్పాడా, రోశయ్య[అధిష్టానం]?

"కేసులు ఎత్తేసాం. వెళ్ళిపొండి" అన్నారు మరాఠా పోలీసులు. ఆ తర్వాత మరాఠా గృహమంత్రి పాటిల్ "అదేం లేదు. వాళ్ళ మీద కేసులు అలాగే ఉన్నాయి" అన్నాడు. [అసలుకే... కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పి, ఆస్తిపాస్తుల్ని అమ్మించటం, చాలా సులభమన్నది ఈ రాజకీయ నాయకులకి బాగానే తెలుసు.]

దీన్నంతటినీ తెదేపా వాళ్ళు, కోర్టులో సవాలు చేయక పోవటం వింతే! నిజామాబాద్ నుండి ఓ నారాయణ ప్రజావ్యాజ్యం [పిల్] వేసాడు.

సాక్షి దిన పత్రిక, 22 జూలై, 2010, మొదటి పేజీలో చెప్పినట్లుగా, హైకోర్టు:

>>> అన్నీ తెలిసిన వ్యక్తులు అక్కడికి ఎందుకు వెళ్ళారు?
అక్కడికి వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా...
వారు చట్టాన్ని ధిక్కరించవచ్చా, శాంతి భద్రతల సమస్య సృష్టించవచ్చా?
మహారాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల చర్యలు తీసుకోకూడదా!
శాంతి భద్రతల విధులను నిర్వర్తించవద్దని ప్రభుత్వాలను ఆదేశించగలమా?
రాష్ట్రం పరిధిలోని వ్యవహారంలో కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది?
ఇటు వంటి వ్యాఖ్యాలను విచారించే ప్రసక్తే లేదు... పిటిషనర్ ను హాజరు పరచండి.

అన్నది. నిజానికి మొదట, ఆంధ్రా మహారాష్ట్ర సరిహద్దుల దగ్గర, మరాఠా పోలీసులు కదా చంద్రబాబుని, అతని బృందాన్ని ‘బాబ్లీని చూపిస్తామని’ తమ వ్యానుల్లో తీసుకెళ్ళి, ఆ తరువాత మీరు అరెస్టు చేయబడ్డారని చెప్పింది? దీన్ని కదా కోర్టు మొదట విచారించాలి. అది తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడింది కోర్టు.

గతంలో కొన్ని వందల వేల పిల్స్, రకరకాల విషయాల గురించి, కోర్టుల్లో పడి ఉంటాయి. అప్పుడెప్పుడూ కూడా "నీకేం అవసరం? నువ్వెందుకు కేసు వేసావు? నీకేం అధికారం ఉంది? నీకెవరు అధికారం ఇచ్చారు? అసలు వాళ్ళకీ నీకూ సంబంధం ఏమిటి?" అని, కోర్టు, పిల్ వేసిన వాళ్ళని అడిగినట్లు వార్తలు లేవు. ఆ ‘పిల్స్’ ‘వేసేంత అవసరం ఉందా? లేదా?’ అన్నది చూడటం మాత్రమే కోర్టు చేసింది. అవి కూడా ఆప్రాధాన్య విషయాల మీదే ఎక్కువ!

చివరికి జంతు పరిరక్షణ కై వేయబడ్డ కేసుల్లో కూడా, "సదరు ప్రాణులు నీకు అధికారం ఇచ్చాయా?" అని కోర్టులు అనవు కదా? మీదు మిక్కిలి "ఇలాంటి పిల్ వేసినందుకు జరిమానా వేస్తాం. సోమవారం కోర్టుకు ఫిర్యాదుదారుణ్ణి హాజరు కమ్మనండి" అంటూ హుకుం జారీ చేసింది కూడా!

ఇది చూసాక... ఇక తెదేపా వాళ్ళు గానీ, చంద్రబాబు గానీ, వాళ్ళ తరుపున మరొకరు గానీ సుప్రీం కోర్టుతో సహా ఏ కోర్టుకీ వెళ్ళే ఆలోచన చేయరు, చేయించరు. అవినీతి నేరాలతో ఎందరో న్యాయమూర్తుల కేసులు బహిర్గతం అయ్యాక... కోర్టులు నీతికి నిలయాలనీ, న్యాయమూర్తులు నిజాయితీకి నిలువెత్తు రూపాలనీ, ఈ రాజకీయ నాయకులు నమ్మరు. మన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సింఘ్వీ విషయంలో, ఇది మాకు స్వానుభవం. దీని గురించి గత టపాలలో వ్రాసాను. ఆధార పత్రాలను స్కాన్ చేసి, మా ఆంగ్లబ్లాగు ‘Coups On World' లో ఉంచాను.

పైకి అనక పోయినా, న్యాయమూర్తుల పదవులకి సంబంధించిన బదిలీలూ, పదోన్నతలూ అన్నీ... కేంద్రప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నాక, [రాష్ట్రపతి భవనం రబ్బరు రహదారి, రాష్ట్రపతి రబ్బరు బొమ్మలే కదా!] కోర్టు తీర్పులూ, న్యాయమూర్తుల వ్యాఖ్యలూ, సామాన్యులకి అర్దం గాకపోయినా, చంద్రబాబు నాయుడి లాంటి ముదురు రాజకీయ నాయకులకి బాగానే తెలుసు.

కాబట్టే ‘మెతుకు పట్టి చూస్తే తెలియదా అన్నం ఉడికిందో లేదో చెప్పటానికి?’ అన్నట్లు, రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యను చూడగానే అర్ధమైంది, చంద్రబాబుకి, తనకి కోర్టు ద్వారం మూయబడిందని. గూఢచర్యపు వలయంలోకి ఇష్టపూర్తిగా దిగబడ్డాక, తనకి తెరచి ఉన్న ద్వారం తప్ప మిగిలిన వేవీ వర్కవుట్ కావు. అచ్చం గదిలో బంధించిబడిన పాముకి, తెరచి ఉన్న దారి తప్ప మరేదీ ఉండనట్లు!

కొన్నిరోజుల క్రితం... సానియా మీర్జా వరుడు సోయబ్ మాలిక్ Vs ఆయేషా సిద్దిఖీ కేసులో... షోయబ్ ‘సిద్దిఖీ మీద పరువు నష్టం దావా వేస్తాననీ, కోర్టు కెక్కుతాననీ’ బీరాలు పలికాడు. అదే సమయంలో కోర్టు, ఇలాంటి మరో కేసులో "ఇవాళ పెళ్ళి చేసుకోవటం - రేపు కాదనటం ఫ్యాషనై పోయింది" అని చురక వేసి వ్యాఖ్యానించింది. దెబ్బతో షోయబ్, తనకి కోర్టు ద్వారం ముసుకుపోయిందని అర్ధమై, ఆ దారి తొక్కలేదు. గూఢచర్యంలో ప్రవేశం ఉన్నవారికి, ఆ మాత్రం [సంకేత] భాష బాగానే అర్ధమౌతుంది.

ఇక చంద్రబాబునీ, అతడి బృందాన్నీ మరాఠా పోలీసులు కొట్టి తిట్టి పంపించేశాక కూడా అటు శివసేన నేత బాల్ థ్రాక్రే, ఇటు మహారాష్ట్ర గృహమంత్రి పాటిల్ కూడా బాగానే నోరు చేసుకున్నారు.

సరే, వాళ్ళు ప్రక్క రాష్ట్రపు వాళ్ళు! అందునా.... కొళాయిలో నీళ్ళ దగ్గర, ఇరుగుపొరుగులు, ఒకళ్ళు మరొకళ్ళని నీళ్ళు పట్టుకోనివ్వడం లేదనో, ఒకళ్ళ మరొకళ్ళకి నీళ్ళు రానివ్వడం లేదనో... తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అలాగే, దిగువ రాష్ట్రాల వాళ్ళు, ఎగువ రాష్ట్రాల వాళ్ళతో, తమ నీటి వనరులకి గండి కొడుతున్నారని వివాద పడతారు. కాబట్టి, ఎగువ రాష్ట్రమైన మరాఠా రాజకీయ నాయకులు, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులైన తెదేపా వాళ్ళని, తిట్టి కొట్టారనుకుందాం.

అప్పుడు మిగిలిన ఆంధ్రా నాయకులైనా బాబుకు గట్టిమద్దతుగా రావాలి కదా? ఎర్రపార్టీలు గానీ, తెరాస ప్రరాపాలు గానీ, కాంగ్రెస్ గానీ... ఒక్క పార్టీ రాలేదు, మచ్చుకి ఒక్క నాయకుడూ రాలేదు. కనీసం చంద్రబాబు బృందానికి "అరే! పాపం! ప్రక్క రాష్ట్రానికి పోయి, మనకు నీళ్ళ కోసం, తన్నులు తిని వచ్చారే" అనే సానుభూతి కూడా రాలేదు.

నిజానికి.... మీడియా తలుచుకుంటే అదేమంత విషయం కాదు. ఈ పాటికి చంద్రబాబు ‘ఆంధ్రా భగీరధుడు’ అయిపోయి ఉండేవాడు. అలాంటి సహకారాన్ని, మీడియా, బాబుకి ఇవ్వలేదు గాక ఇవ్వలేదు. చితక్కొట్టించుకున్న నాలుగు రోజులు కూడా, చిలవలూ పలువలూ, చంద్రబాబు అగచాట్ల గురించే చెప్పబడింది గానీ, బాబ్లీలో నీళ్ళ కోసం అతడి effort ని గానీ, వాళ్ళ [so called] పోరాటం గురించి గానీ, మీడియా చెప్పలేదు.

అదే మీడియా చెప్పదలుచుకుంటే... తాను పాజిటివ్ బాకా ఇవ్వదలుచుకుంటే... ఎలా ఉంటుందో -

1982-83ల్లో ఎన్టీఆర్ ని ఈనాడు ఆకాశానికి కెత్తేసిన నాడు మనకు తెలుసు. తెలుగు వాడి ఆత్మగౌరవం అంటూ పలికిన నాడు తెలుసు.

గతంలో, అంతదూరం ఎందుకులే అనుకుంటే, గత ఏడాది సెప్టెంబరులో, వై.యస్సార్ చనిపోయినప్పుడు, ఈనాడు అతణ్ణి ‘దేవుణ్ణి’ చేసినప్పుడు మనకు తెలుసు.

అదే విధంగా, గత ఏడాది డిసెంబరు 10న, [అంతకు ముందు కూడా] ‘బక్క మహత్ముడు’, ‘ముక్కు మనీషి’ కేసీఆర్ ని ‘తెలంగాణా గాంధీ’ని చేస్తూ ఈనాడు, పేపరంతా నింపినప్పుడు మనకు తెలుసు! [లేక పోతే లగడపాటి బదులు ఈనాడు పత్రికే ముందు చెప్పి ఉండేది TPN గురించి?]

ఈనాడు ట్రెండ్ ని అనుసరించి, అదే బాకాని భారీగా వాయించే కొన్ని మీడియా సంస్థల సహకారమూ మనకి తెలుసు. అధిష్టానపు ఆశీస్సులతో, రవి ప్రకాష్ ల వంటి మీడియా మెగా పర్సన్స్ చూపించే పెరఫార్మెన్సులూ మనకి తెలుసు.

వాటన్నిటితో సరిపోల్చి చూసినా, చంద్రబాబుకి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదు. ఎందుకని?

ఎందుకంటే -

మీడియా నవాబు, ఈనాడు రామోజీరావుకీ, చంద్రబాబుకీ చెడింది గనక!

ఈనాడు రామోజీరావుకి చంద్రబాబు కంటే కూడా, కాంగ్రెస్ అధిష్టానం సోనియా నే ఆప్తురాలు గనక!

వివరంగా చెప్పాలంటే -

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు తరుపున, ప్రపంచపు అంచుల దాకా ‘లాబీయింగ్’, ‘కొరియర్ షిప్’ చేసి వచ్చేందుకు, శక్తి వంచన లేకుండా పనిచేసిన రోజుల్లో, చంద్రబాబుకి అది గూఢచర్యమని తెలుసు గానీ, మెదళ్ళతో యుద్దమని తెలియదు. ఓటమే స్ట్రాటజీ అయిన రీత్యా... నెం.5 వర్గపు బలమూ, పట్టు కూడా తెలియదు. అసలతడికి, అప్పటికి, రామోజీరావుకి సోనియా ఎంత ముఖ్యమైనదో కూడా తెలియదు.

అంచేత... రామోజీరావు పలకమన్నది పలికాడు. పెట్టమన్న పరుగు పెట్టాడు, మామకైనా వెన్నుపోటు పొడవమంటే, పొడిచాడు.

అయితే పెద్దలంటారు... ‘దుష్టుడితో చెలిమి ఎప్పటికైనా చేటే’ అని! అప్పట్లో ఇది మరిచిపోయాడు చంద్రబాబు. [తానూ దుష్టుడే గనక అది సహజమే కదా!] దుష్ట భాగస్వామ్యం నడిచినంత కాలం బాగానే నడుస్తుంది. చెడినాకే తెలుస్తుంది చేటెంతో! ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సంభవించిన సంకటం!

చంద్రబాబుకి, అప్పట్లో, రామోజీరావు గూఢచర్యపరంగా బలంగా కనిపించాడు. మామ ఎన్టీఆర్ కి అమెరికా వైట్ హౌస్ కి ఆహ్వానం ఇప్పించేంత బలంగా! అమెరికా అధ్యక్షుడు క్లింటన్ చేత, తన భుజాల మీద చేతులు వేయించి, తనకి కితాబు లిప్పించేంత బలంగా! ఇప్పుడు, దాదాపు ఆరేడేళ్ళు తిరిగే సరికి, పరిస్థితి తిరగబడి కన్పిస్తోంది.

మరో వైపు... నెం.5 వర్గం, మొత్తంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని వారికి అనివార్యం చేస్తున్న ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లు, ‘కన్నా?కాలా?’ స్ట్రాటజీ తో పడుతున్న కడగండ్లు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఒక దశలో పార్టీ మూత వేసుకుంటాను అనేంతగా చంద్రబాబు విసిగి వేసారి పోయాడు కూడా! అప్పటి పైకారణం వై.యస్.కి హవా నడవటం. [అఫ్ కోర్సు! అందులో వై.యస్. గారెల వంట గూఢచర్యం కూడా ఉందనుకొండి.]

ఇలాంటి నేపధ్యంలో.... డబ్బు పరంగా, కెరీర్ పరంగా, [పార్టీ కుటుంబ ఆస్తిగా పరిణమించటంతో] పార్టీ పరంగా కూడా, చెప్పుకోలేని బాధలు చంద్రబాబుకి చాలానే ఉన్నాయి.

ఇతడికి [చాలామందితో పోలిస్తే] గూఢచర్యాన్ని బాగానే ఆకళింపు చేసుకునే లక్షణం ఉంది. కాబట్టే, ఎన్టీఆర్ హయంలోనూ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కంటే, ఈ చిన్నల్లుడికే హవా నడిచింది. వై.యస్. లో ఆ లక్షణం తక్కువ గనకే, 1992 ల దాకా కూడా, వై.యస్.ని రామోజీరావు అసలు ఎప్పుడూ తలకెత్తుకోలేదు. [ఇప్పుడు జగన్ కి సొంతబలం చూపించుకోవాలన్న లక్షణం, అతడి తండ్రి దగ్గర నుండి వచ్చిందే! కాబట్టే రామోజీరావు, వై.యస్.ని ఎప్పుడూ తలకెత్తుకోలేదు. అనివార్య అవసర పరిస్థితుల రీత్యా, 2003లో పాదయాత్రతో వై.యస్.ని తలకెత్తుకున్నాడు.]

ఆ విధంగా చంద్రబాబుకి, గూఢచర్యాన్ని ఆకళింపు చేసుకునే లక్షణం, సాపేక్షంగా ఎక్కువగా ఉండటంతో, ఇప్పుడు రామోజీరవుకి తిరగబడ్డ కథ కూడా, రిలేటివ్ గా అతడికే ఎక్కువ అవగాహన కలిగింది, కలుగుతోంది. ‘తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ’ అంటూ... వేర్పాటు సమైక్య వాదాల నిప్పు బాగా రేగిన సమయానికి కాస్త ముందూ వెనకలుగా, చంద్రబాబు, తనకి తెలిసిన గూఢచర్యపు గుట్టుమట్లని, ముందుగా తన పార్టీ అగ్రనేతల దగ్గర నుండి ముఖ్యమైన వారని తాను భావించే ప్రాంతీయ, జాతీయ నాయకుల దాకా, అందరికీ పంచాడు. [ఇక్కడా, అతడి తన సహజ లక్షణం ‘వెన్నుపోటు’ను రామోజీరావుకి చూపించాడు.]

క్రమంగా ఇతరులకీ [స్ప్రెడ్ చేయటం] పంపకం చేయటం మొదలుపెట్టాడు. అదే ‘గుర్రు’ రామోజీరావుకీ, చంద్రబాబుకీ మధ్య ప్రారంభమైంది! కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానంని ప్రయోగించి, చంద్రబాబు మెడలు వంచే కార్యక్రమాన్ని, రామోజీరావు ఉపయోగించటం మొదలు పెట్టాడు. ఇది ప్రారంభమై కొన్ని నెలలు గడిచింది, పాకన బడి ఇప్పటికి పైకి కనబడుతోంది.

ఇందులో భాగమే... మొన్నామధ్య పోలీసులు క్యాజువల్ గా నాకాబందీ నిర్వహిస్తుంటే పట్టుబడ్డ 7 కోట్ల రూపాయలు నగదు కూడా! ‘ఇలాగే నీ నల్లడబ్బుని పట్టుకుంటాను సుమా’ అన్న బెదిరింపూ, కోడాల వంటి దెబ్బలబ్బాయిలని గుర్తుకు తేవటమూ, అందులో ఉన్నాయి.

గత టపాలలో చెప్పినట్లు... గూఢచారికి, గూఢచర్యానికి ‘బహిర్గతం కావటం’ మరణం వంటిది. లోతట్టున జరిగే current spying events గురించిన అవగాహనని, చంద్రబాబు తన పరిధిలో అందరికీ అంద చేస్తే... అది నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలకు చాలా ‘ఇరుకు’ సృష్టిస్తుంది.

క్రమంగా చాలామంది [లాలూ ప్రసాద్ లు, శిబూ సోరెన్ లూ గట్రాలు చాలామంది] తోకఝాడిస్తారు. అందుకే కట్టడి చేయ ప్రయత్నం! ఈ విధంగా ‘గూఢచర్య గుట్టు మట్ల పంపిణీ’ వ్యవహారంలో, చంద్రబాబుకి హెచ్చరికగా.... అతడికి, చేదోడు వాదోడుగా ఉండే నాగం జనార్దన రెడ్డిని, తెలంగాణా వేర్పాటు వాదం పేరుతో, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, కిరాయి విద్యార్దులు[రౌడీలు] చితక్కొట్టారు. చంద్రబాబు బృందాన్ని మరాఠా పోలీసులు చితక్కొట్టారు.

కాబట్టే, చంద్రబాబుకి మీడియా సపోర్టు రాలేదు. జాతీయ పార్టీల నాయకులెవ్వరూ సపోర్టు రాలేదు. ఏదీ, అద్వానీ ఒక్క మాటయినా అన్నాడా? ఒకప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చి, కేంద్రంలో చక్రం తిప్పి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు గురించి, అద్వానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదేం? ఎర్రపార్టీల అగ్రనేతలూ గట్టిగా నోరు విప్పలేదేం? ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు చేత మద్దతు ఇప్పించటానికి కీలక పాత్ర వహించిన రామోజీరావు, ఇప్పుడు చంద్రబాబుకి జరిగిన అవమానానికి, జాతీయ స్థాయిలో నాయకుల చేత, పత్రికల చేత మద్దతు ఇప్పించేందుకు రామోజీరావు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి లాబీయింగ్ చేయలేదేం?

ఎందుకంటే - రామోజీరావు + కాంగ్రెస్ అధిష్టానానికీ, చంద్రబాబుకీ మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం ఇదే!

"ఇకనైనా నోరు మూసుకుని కూర్చో! గూఢచర్య స్థితిగతుల గురించి ఇతరులకి అవగాహన కలిగించటం మానెయ్" ఇదే హెచ్చరిక చంద్రబాబుకి పదే పదే ఇవ్వబడుతోంది.

ఈ నేపధ్యంలో.... నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాకి, చంద్రబాబుకి మధ్య నడుస్తున్న సంకేత భాషనీ, సంబంధిత దృష్టాంతాలనీ పరిశీలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

8 comments:

is it true

meeru vrastunna dantlo nijam teliyadu kaani, suspense thriller chadivinatlundi.

yes, its very true

Isn't it easier to kill Babu than scaring him off?
Moreover, tommorrow if in any case Babu has to be made CM of AP, isn't it going to hurt far more?

I am sure next TDP leader Bala krishna (if babu was killed) is much easier to maintain than Babu. I am sure Babu will give Ramoji much more trouble if become CM as he also remembers Tirupati attack on him. Let us see how long can Babu live both politically and really.

naku same feeling

మొదటి, రెండవ, ఐదవ అజ్ఞాత గార్లు! మీ విజ్ఞత!
మూడవ అజ్ఞాత గారు: నెనర్లండి!
నాలగవ అజ్ఞాత గారు: వేచి చూడండి! జరుగుతున్న వాటిని పరిశీలించండి.

డియర్ AMMA ODI!

మొన్న మీరడిగిన "ఠాక్రే" ల తగవుల గురించి క్రింది టపా చూడండి. వీలైతే డీవీడీ కూడా చూడండి.


http://harephala.wordpress.com/2010/07/27/baataakhaani-290/

కృష్ణశ్రీ గారు: గుర్తుంచుకుని లింక్ వెతికి ఇచ్చినందుకు నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu