తమ వ్యాపారాభివృద్ది కోసం కార్ఫోరేట్ సంస్థలు, దేశభక్తి వంటి ప్రజల మనోభావాల మీదే కాదు, మానసిక బంధాల మీద, ఇతర భావోద్రేకాల మీద కూడా స్ట్రాటజీలు, పుకార్లు ప్రయోగిస్తారు.

ఉండీ ఉండీ హఠాత్తుగా ఓ ప్రచారం ఊపందుకుంటుంది. ‘అందరూ ఇలా అనుకుంటున్నారు’ అని ఎవరికి వాళ్ళే అంటారు. అలాగే మీడియా కూడా ప్రచారిస్తుంది. ఆ ‘అనుకోవడాలు’ ఎలాంటి వంటే... ఫలానా బొమ్మ లేదా ఫలానా వస్తువు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తోందని - ఇలాగన్న మాట. మనీ ప్లాంట్ పెంచితే, ఆ మొక్క పెరిగినట్లుగా సంపాదన పెరుగుతుందని, ఓ అర్ధ శతాబ్దం క్రితం వచ్చిన ప్రచారంతో, ఆకుపచ్చని పెద్ద ఆకులతో కూడిన ‘లత’ ఇంటింటా ప్రాకింది. ఇలాంటి వాటిలో అప్పుడెంత వ్యాపారం జరిగిందో తెలీదు గానీ, ఇంటి ముంగిట పచ్చదనం కాబట్టి నష్టం లేదు.

అయితే ఇలాంటిదే.... ఫలానా బొమ్మ లేదా xyz వస్తువు - అంటే, ఇక ఆ బొమ్మ లేదా వస్తు విక్రయాలు ఎంత ఊపందుకుంటాయో ఊహించండి. పోనీ, అలాగని ఆ బొమ్మ ఏదో, మన కొండపల్లి బొమ్మో, నిర్మల్ బొమ్మో ఉండదు. పక్కాగా ప్లాస్టిక్ బొమ్మో లేదా కార్పోరేట్ కంపెనీ ఉత్పత్తి చేసే బొమ్మో అయి ఉంటుంది. ఫిష్ ఎక్వేరియంలో గోల్డ్ ఫిష కూడా అలాంటిదే! vada ఫోన్ వాణిజ్యప్రకటనలో ఉన్న కుక్క జాతికి అమాంతం డిమాండ్ పెరగలేదూ, అలాగన్న మాట.

అలాంటి చోట, సదరు బొమ్మ లేదా వస్తువు ఉత్పత్తి తక్కువ చేసారనుకొండి. ఇక లభ్యత తక్కువైనప్పుడు సంభవించే డిమాండు ఎంతగా ఉంటుందో? అమ్మకాలు నల్ల బజారుకి వెళ్ళినా ఆశ్చర్యం ఉండదు.

మరో విషయం... చిన్నప్పుడు గుడ్డ ముక్కలతో మేం బొమ్మలు కుట్టుకుని, నల్లదారాలతో జుట్టుకుట్టేవాళ్ళం. అలాంటిదే అందంగా ఉన్న ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ గురించి. దాని కుటుంబసభ్యులూ, బాయ్ ఫ్రెండ్సూ, ఇల్లూ ఫర్నిచర్! పిల్లల్లో ఎంత ప్రచారమో, ఎంత మోజో! ఏటా ఇన్ని మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందనీ, ప్రపంచవ్యాప్తంగా సెకనుకి ఇన్ని బార్బీబొమ్మలు అమ్ముడౌతున్నాయనీ మీడియా చేసే ప్రచారాలు... ఇలాంటివే!

క్రమం తప్పకుండా, ఎవరూ గమనించని నిర్ణీత కాల వ్యవధులలో... వివాహిత అన్నా చెల్లెళ్ళు, లేదా అక్కా తమ్ముళ్ళ గురించి ఒక పుకారు/ప్రచారం వస్తుంటుంది. అదేమిటంటే - పెళ్ళయిన అక్కలు తమ తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళు తమ అన్నల్ని పిలిచి భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టాలనీ, బదులుగా అన్నలూ చెల్లెళ్ళకు, శక్తి కొద్దీ బహుమతులతో పాటు కొత్త చీర పెట్టాలనీ, లేకపోతే ఇరువురుకీ అరిష్టం అనీ! ఎందుకలాగా అంటే - "ఏమో ఈసారి నక్షత్రాలు అలా వచ్చాయట" అనే అరగొర సమాధానం వస్తుంది. ఎవరికీ ఏదీ ఇదమిద్దంగా తెలియని స్థితి!

"సరే! పోనీలే! పెట్టేది మన తోడబుట్టిన వాళ్ళకే గదా! ఈ పేరుతో నన్నా బంధాలు గట్టిపడతాయి" అనుకుంటాము మనం. ఖర్చు నిభాయించుకోగలిగిన వాళ్ళకి బాధ లేదు. అప్పటికే ఆర్దికంగా అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళకి, తప్పని సరి కావటంతో, ఇది ఆర్దిక భారమే!

అలాంటి చోట బంధాలు గట్టిపడటం కన్నా.... అసంతృప్తితో మాటల ఈటెలు రేగటం కూడా, అక్కడక్కడా జరగటం పరిపాటే! ఇదంతా ప్రక్కన బెడితే... ఈ పుకార్లతో, చందన బొమ్మన వంటి కార్పోరేట్ వస్త్రదుకాణాలకి పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తుంది. చిన్న దుకాణాల వారికి అమ్మకాలు పెరిగాయన్నా కూడా, అంతిమంగా ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం నడిచేది, కార్పోరేట్ టెక్స్ టైల్స్ సంస్థలు రిలయల్స్ లూ గట్రాలకే గదా?

ఇలాంటి ఉదాహరణలు కొకొల్లలు. ఎవరి కన్నూ పడకుండానే, అందరి మీదా అనవసర భారాలు పెంచుతూ, చాపక్రింద నీరులా ఆక్రమించి, జీవితాలు తడిచి మోపెడవుతాయి.

ఇక తమ వ్యాపారాభివృద్ది కోసం ప్రజలలో పెంచే వ్యసనాలకు తక్కువేం లేదు.

వెనకటికి మహాకవి శ్రీశ్రీ ‘కాదేదీ కవిత్వానికనర్హం’ అన్నాడు. కార్పోరేట్ కంపెనీలు ‘కాదేదీ వ్యాపారానికనర్హం’ అంటారు. అలాంటి వాటిల్లో జూదం, మద్యం వంటి వ్యసనాలది పెద్ద వాటా!

అసలు ప్రజలు వ్యసన పూరితులౌతున్నారంటేనే, సమాజం పతన దిశలో ఉందని అర్దం! మద్యపు అమ్మకాలు ఎక్కువైనాయంటే - ప్రజలపై వత్తిడి ఎక్కువ ఉందని సామాజిక శాస్త్రవేత్తలంటారు.

ఈ నేపధ్యంలో ... బెట్టింగ్ వ్యాపారం గురించి పరిశీలిద్దాం. క్రికెట్ లో ఈ వ్యాపారం మరింత పరిమాణంలో నడుస్తుంది. ఇటీవల సునంద పుష్కర్, శశిధరూర్ Vs లలిత్ మోడి వివాదాలతో మరోసారి హోరెత్తిన క్రికెట్ బెట్టింగ్ వ్యాపారంలో.... పాకిస్తాన్, ఐఎస్.ఐ.లు నిలబెట్టిన బొమ్మ దావూద్ ఇబ్రహీం, చేయితిరిగిన వాడన్న దుర్గంధం వెల్లువెత్తింది. అసలా ఐఎస్ ఐ, పాకిస్తాన్ లే.... నకిలీ కణిక అనువంశీయ గూఢచర్య వ్యవస్థ నిలబెట్టగా, సీన్ ఇవ్వగా, నిలబడిన బొమ్మలు!

పోతే... క్రికెట్ ఆటలో ఏ జట్టు గెలుస్తుందో ముందుగా ఊహించి పందేలు కట్టటమే బెట్టింగ్ వ్యాపారం. ఫలానా జట్టు గెలుపు లేదా ఓటమి అవకాశాలు ఇలా ఉన్నాయంటూ.... పుకార్లూ, ప్రచారాలూ, మీడియాలో సొల్లు విశ్లేషణలతో, బ్రహ్మడంగా జరిపించుకోగల వ్యాపారం బెట్టింగ్! ప్రజల్లో పందాలు కట్టే ఆసక్తినీ, ఉత్కంఠనీ రేపే విధంగా, మ్యాచ్ ఫిక్సింగ్ లతో రసకందాయంగా క్రికెట్ నాటకాన్ని నడిపించవచ్చు. వ్యక్తిగత స్కోర్ల మీద సైతం ఇదే దర్శకత్వం, మరింత వైవిధ్యభరితంగా సంఘటనలని జరిపించగలదు. ‘ఈ మ్యాచ్ లో లేదా సీరిస్ లో, ఫలానా ఆటగాడు ఫలానా రికార్డు చేరగలడా? లేదా?’ అన్న ఉత్కంఠ లేపితే చాలు, ఎంత వ్యాపారమో!

ఇక చిట్టచివర ఏ జట్టు గెలిస్తే.... అప్పటి వరకూ కట్టబడిన పందాలలో తమకి లాభమో, ఆ ప్రకారం గెలుపోటములు, క్రీడా మైదానంలో గాక, కంప్యూటర్ ముందు నిర్ణయించుకుంటారు.

ఈ బెట్టింగ్ వ్యాపారం క్రికెట్టు వంటి ఆటలతోనే గాకుండా, సెలబ్రిటీల జీవిత సంఘటనల మీద కూడా నడుస్తోందంటే - వ్యాపారంలోని అమానుషత్వం అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకి ‘సానియా మీర్జా వివాహం జరుగుతుందా? లేదా?’ వంటివి.

ఆ బెట్టింగ్ నిర్వాహకుల లాభనష్టాలని బట్టి, సదరు సెలబ్రిటీల జీవన పరిణామాలున్నా ఆశ్చర్యపోవలసింది లేదు. అదృష్టవశాత్తూ అంతటి స్థితి ఇప్పటికి వచ్చి ఉండకపోవచ్చు.

వ్యసనాలలో, ఈ బెట్టింగు వ్యసనం లాంటివి మరికొన్ని ఉన్నాయి. పాన్ పరాగ్, సిగరెట్, శీతల పానీయాలు, మత్తు పానీయాలు. చివరికి సెల్ మోడల్స్ ని మార్చడం కూడా! అశ్లీల చిత్రాల్ని చూడటం, మాదక ద్రవ్యాల వాడటం మరింత తీవ్రమైనవి. మీడియా వాటికిచ్చే కవరేజ్, వాటిని మరింత పాపులర్ చేయటానికే తప్ప, నిర్మూలించటానికి అన్నట్లు ఉండదు.

శీర్షికలు మాత్రం, సమాజంలో నెలకొన్న ఈ స్థితి పట్ల మీడియా విచారం వెలిబుచ్చుతున్నట్లే ఉంటుంది. 1992 కు ముందరైతే చాలా సినిమాలలో... స్కూళ్ళలో, కాలేజీలలో విద్యార్ధులంతా, బ్రౌన్ షుగర్ వంటి మాదకద్రవ్యాలు వాడుతున్నారన్నట్లే చూపబడేవి. అవి ఎలా దొరుకుతాయో, ఎలాంటి నెట్ వర్క్ వాటి అమ్మకాల వెనక ఉంటుందో, అందులో లాభాలెలా ఉంటాయో, ఆ వ్యాపారంలోకి ఎలా ప్రవేశించవచ్చో.... ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, వివాదాలు.... సదరు సినిమాలలో, మీడియా ప్రచారంలో ఉండేవి.

సినిమా అంతా ‘హింస, శృంగారాలు’ చూపించి, చివరలో ముక్తసరిగా, మొక్కుబడిగా ‘ఇదంతా తప్పు’ అంటూ ఓ నీతి వాక్యం జోడించినట్లుగా ఇదంతా ఉండేది. ‘ఆయా మాదక ద్రవ్యాలు వాడితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఓ సారి ప్రయత్నం చేద్దామా’ అని కుతుహలం రేపేటట్లుగానే ఉండేది చిత్రీకరణ!

1992లో, ఢిల్లీలో రోడ్డు ప్రక్కన కూర్చున్న యువకుడు, కాగితం మీద వేసుకున్న మాదకద్రవ్యాన్ని, మరో కాగితపు గొట్టంతో పీల్చడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాను. దాన్ని ‘హంటింగ్’ అంటారని అప్పటికే సినిమాలలో చూసి ఉన్నాను.

ఇదంతా ఎంతో చక్కగా ప్రొజెక్ట్ చేసే మీడియా, అలాంటి మాదకద్రవ్య స్మగ్లింగ్ నీ, వినిమయాన్నీ నిరోధించటానికి ప్రభుత్వం ఏం చేస్తోందో, ఏం చెయ్యాలో చెప్పేది కాదు. ప్రజలు ఆ దుష్టపరిణామాలకి ఎలా స్పందించాలో చెప్పేది కాదు. పిల్లలు వాటి బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి అన్న దానిమీద, అప్పుడప్పుడూ మాత్రం, నిపుణుల కౌన్సిలింగ్ లు వేసేది.

ఇంకా ఇప్పుడు ఆ విషయమై మీడియా దూకుడు కొంత తగ్గింది. అప్పట్లో అయితే.... ఒక దశలో, ఆనాటి పెద్దలు, యుక్తవయస్సులో ఉన్న తమ పిల్లల్ని విద్యాసంస్థలకి[ఢిల్లీ, ముంబై లాంటి చోట], యూనివర్సీటీలకి పంపటానికి కూడా సందేహించారు. ఎంతో ఆశ్చర్యం గొలుపుతూ మీడియా ఈ విషయంలో పాజిటివ్ ముఖం పెట్టుకుని నెగిటివ్ రోల్ పోషించింది.

అచ్చంగా ఇప్పుడు.... నేరాలు-ఘోరాలు, క్రైం రిపోర్ట్, క్రైం స్టోరీ గట్రా శీర్షకలతో, సమాజంలో జరిగిన నిజ జీవిత నేరాలని, ఉద్రేకభరితంగా ప్రజెంట్ చేస్తుంది చూడండి. సరిగ్గా అదే స్ట్రాటజీ అప్పుడూ ప్రయోగించింది.

ఇదే స్ట్రాటజీ.... చందనం, కలప స్మగ్లర్ వీరప్పన్ విషయంలోనూ పాటించారు. విషయాంతరమే అయినా, ఆ స్ట్రాటజీ ఇక్కడ ప్రసావనార్హమే! కలప దొంగ వీరప్పన్ కౄరుడు, నీచుడు! ఎందరో అమాయకుల్ని, పోలీసుల్ని చంపాడు. దేశ ద్రోహి, నేరగాడు!

అలాంటి వాడి గురించి మీడియా ఎన్ని విశేషాలు వ్రాసేదో! అతడికి కోతి రక్తమంటే ఇష్టమనీ, పచ్చినెత్తురు తాగుతాడనీ! చిత్తం వచ్చినట్లు ప్రవర్తించే మూడీ ఫెలో అనీ, మొండి వాడనీ! ఎవరికీ చిక్కని చాకచక్యం అతడి సొంతమనీ! నిజానికి, అడవి నుండి అతడు పంపే సరకు, బయట కొనే నాగరిక నేరగాడెవడో ఉండి ఉండాలి కదా!?

వీరప్పన్ అడవిలో ఉండే రాక్షసుడైతే, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్న రాక్షసులు. అలాంతి రాక్షసులెవరి సహాయసహకారాలో లేకుండా వీరప్పన్, తన దొంగ వ్యాపారం ఎలా చేసేవాడు? సంపాదించిన సొమ్ముతో జీవితాన్ని ఎలా ఆనందించే వాడు? అడవిలో పచ్చినెత్తురు తాగేవాడికి అంత డబ్బు సంపాదించినా ఒకటే, సంపాదించక పోయినా ఒకటే కదా!

స్టార్ హోటల్ లో చైనీస్ దగ్గరి నుండి అన్నిదేశాల వంటకాలు రుచి చూస్తూ జీవితాన్ని ఆనందించనపుడు, ఊరికే ఎందుకు డబ్బు సంపాదిస్తాడు? అందునా నేరాలు చేసి మరీ? అలాంటప్పుడు బయట నుండి వ్యాపార, అధికార, రాజకీయ వర్గాల నుండి వీరప్పన్ లాంటి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు ఉండి ఉండాలి.

నిజానికి వీరప్పన్ లే కాదు, చాలామంది అటువంటి అజ్ఞాత జీవితం గడిపే నేరగాళ్ళు, టెర్రరిస్టులూ.... ప్రచ్ఛన్న నామాలతో, ప్రచ్ఛన్న వేషాలతో, సీమాంతరాల్లో పంచతారల అతిధిగృహ సత్కారంలో ఆనందిస్తారని, తర్వాతి రోజుల్లో [1992 తర్వాత] వెల్లడి అయ్యింది. అలాంటి నేరగాడే కత్తుల సమ్మయ్య అనేవాడు, విమానం ఎక్కబోతూ, బాంబు హెచ్చరికతో జరిగిన తోపులాటలో మరణించటంతో ఈ విషయం దృష్టాంతపూరితం అయ్యింది. చందానగర్ హోటల్ గదిలో బాంబు పేలి గాయపడ్డ మొద్దు శీను వ్యవహారంతో అలాంటివి మామూలైపోయాయి.

ఇలాంటి నేపధ్యం వెనక నుంచుకొని కూడా, మీడియా, అడవి దొంగ వీరప్పన్ గురించి ఎంతో ఉద్వేగ పూరితంగా వ్రాసేది. సదరు వీరప్పన్ ని, నక్కీరన్ పత్రిక గోపాలన్ తప్ప మరెవ్వరూ కలుసుకోలేక పోయేవాళ్ళు. అతడి ఉనికి తెలిసినా, గోపాలన్, వీరప్పన్ పట్లే నిబద్దతతో ఉండేవాడు తప్పితే, ఆ నేరగాడి చిరునామా ప్రభుత్వానికి చెప్పేవాడు కాదు.

‘చెబితే ఈసారి వీరప్పన్ తనకి కూడా ఇంటర్యూ ఇవ్వడట. దాంతో అసలే సమాచారమూ తెలియకుండా పోయే ప్రమాదం ఉందట!’ ఎంత చక్కని పైకారణమో![over leaf reason]

ఇలాంటి సొల్లు కారణాలు చెబుతూ మీడియా, ఎంతో చక్కగా తన బాధ్యతలు విస్మరించింది. హక్కుల్ని మాత్రం ఎలుగెత్తి అరిచి సాధించుకునేది. ఎటూ వేదకాలంలో మునుల్ని గౌరవించినట్లు, ప్రజలు మీడియాని గౌరవిస్తారు, నమ్ముతారు. స్వాతంత్ర సమర సమయంలో కూడా, మీడియా ఒక పవిత్ర బాధ్యతని ఎంతో బలంగా, నిజాయితీగా నెరవేర్చింది. అందుకే ప్రజలు మీడియాని నిస్సందేహంగా నమ్ముతారు. అందుకే నకిలీ కణిక వ్యవస్థ, మీడియా ముసుగు వేసుకున్నది!

ఇక వీరప్పన్ వ్యవహారాన్ని ఇంతటితో ఆపి, తమ వ్యాపారం కోసం వ్యసనాలు పెంచే కుట్ర దగ్గరికి తిరిగి వస్తే.... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ప్రపంచవ్యాప్తంగా ఈ మాదకద్రవ్య వ్యాపారం నిర్వహిస్తుంది. ఆఫ్ఘన్, పాకిస్తాన్ లలోని పేదరైతులకి, ఒకప్పుడు, దాదాపు 100% పంట పాపీ పంటే! ప్రపంచవ్యాప్తంగా దాన్ని మార్కెట్ చేసిపెట్టిన మాఫియా, నకిలీ కణిక వ్యవస్థకి అనుబంధ అనుచర వ్యవస్థే!

మాదక ద్రవ్య వ్యసనంతో మనిషి జీవితం, ఎంత దుఃఖ భాజనమౌతుందో వాళ్ళకి అనవసరం. సమాజం ఎంత భ్రష్టమౌతుందో అంతకంటే అనవసరం! ఇందులో వ్యాపార మొక్కటే విషయం కాదు. తత్ఫలితంగా ప్రజలు వ్యసన పూరితులే కాదు, తమో గుణపూరితులూ అవుతారు. అదే అసలు లక్ష్యం నకిలీ కణిక వ్యవస్థకి!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలని తమోగుణంతో నిస్తేజ పరిస్తే.... ప్రస్తుతం కింగ్ మేకర్స్ గా ఉన్న నకిలీ కణిక అనువంశీయులు, భవిష్యత్తులో కింగ్ లు కాగలరు. ప్రస్తుతానికి కింగ్ కన్నా కింగ్ మేకర్ గొప్ప. ఎందుకంటే కింగ్ లు, అంటే - దేశాధ్యక్షులూ, ప్రధానమంత్రులూ గట్రా పదవులు, తాత్కాలికమైనవి, తక్కువ కాలవ్యవధి గలవి.

కాబట్టే - పరిస్థితులన్నీ సమకూడాక, తామే శాశ్వత కింగ్ లైతే.... క్రీస్తు పూర్వం నుండి అలెగ్జాండర్ ది గ్రేట్[?] లు కలలు కనీ, సార్ధకం చేసుకోలేక పోయిన దాన్ని, తాము సాక్షాత్కారింప చేసుకోగలరు. బ్రిటీషు వాడు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఆ కలను సాక్షాత్కారింపచేసుకున్నాడు.

ఇక్కడో గమ్మత్తు ఏమిటంటే - అలెగ్జాండర్, అతడి తండ్రికి ఉంపుడు గత్తె కొడుకే. నకిలీ కణిక అనువంశీయులకు తొలితరం వ్యక్తీ వేశ్యాపుత్రుడే! అందుకేనేమో, నకిలీ కణికులకి, అలెగ్జాండర్ పట్ల విపరీత ప్రచారం ఇచ్చేంత అమిత ప్రేమ!!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

prasthutam mana rastramloni JrNTR kooda aakovaloni vaade kaabatti, ramoji athani duvatam prarambinchaadu

అవునండి, మీరన్నది నిజం. ఇంతక్రితం ఒక టపాలో వివరించానండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu