తమ అనుయాయూలైన కార్పోరేట్ కంపెనీలకు, ఇబ్బడిముబ్బడిగా వ్యాపారావకాశాలు ఇచ్చేటందుకు, నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య వలయం సృష్టించే కృత్రిమ వస్తు కొఱత గురించి పరిశీలిస్తే...

గత టపాలో వివరించిన, సిమెంట్ తయారీదారుల సిండికేట్ ఒక ఉదాహరణ! ప్రయత్నపూర్వకంగా, ఉమ్మడిగా, ఉత్పత్తి తగ్గించి, మార్కెట్టులో కృత్రిమంగా కొరత సృష్టిస్తారు. సహజంగానే లభ్యత తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదా! ఇక నల్లబజారు విక్రయాలకి హద్దుండదు. సంబంధిత శాఖ అధికారులూ, మంత్రులూ, ఇతర రాజకీయ నాయకులందరూ ప్రేక్షక మాత్రులే!

తెర వెనక ఎంతగా లంచాలు గుమ్మరించారో గానీ, తెర మీద, సిమెంట్ సిండికేట్, సాక్షాత్తూ ప్రభుత్వాన్ని... సిమెంట్ ధర పెంచుకోవటానికి అనుమతించటంతో పాటు, తమ ఇతర కోరికలు అంగీకరించకపోతే, ఉత్పత్తి ఆపి వేస్తామని బాహాటంగా బెదిరింపు [అల్టిమేటమ్] ఇచ్చారు. ఇదంతా 2008లో వార్తాపత్రికల ప్రధాన శీర్షికల సాక్షిగా జరిగిందే!

రాష్ట్రంలో ఉల్లి వ్యాపారుల వ్యవహారం మరో ఉదాహరణ! రైతుల నుండి ఉల్లి పంటని కోనే కమీషన్ వ్యాపారులు వీళ్ళు. అక్రమంగా ఉల్లి నిల్వలు చేసి మార్కెట్టులో కొరత సృష్టించారు. తర్వాత చేసేది ఉల్లి ధర అమాంతం పెంచటమే! అంతా ఏకఛత్రాధిపత్యమే![Monopoly] ఇది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.

ఎనిమిది తొమ్మిదేళ్ళ క్రితం, అంటే 2001, 2002 లలో, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు, మీడియా తొలిపేజీ వార్తలుగా ఈ విషయం ప్రకటింపబడింది. కర్నూలుకు చెందిన కేవలం ఆరుగురు ఉల్లి కమీషన్ [ఉల్లి] వ్యాపారులు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి మార్కెట్ ని నియంత్రిస్తున్నారని, ఈనాడు పెద్ద అక్షరాలలో వ్రాసింది కూడా! అప్పట్లో ఉల్లిధర చాలా ఎక్కువగా ఉండింది.

యధాప్రకారం, ప్రభుత్వం[నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు] సదరు కమీషన్ వ్యాపారులని గానీ, వాళ్ళ వ్యాపారాన్ని గానీ నియంత్రించ లేదు. నియంత్రించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. మీడియా కూడా, వార్తలు వ్రాసిందే తప్ప, ప్రభుత్వం ఆ దిశలో పనిచేసేటట్లుగా ఒత్తిడి చెయ్యలేదు.

కేవలం, సదరు ఉల్లి వ్యాపారుల గురించి ప్రొజెక్ట్ మాత్రమే చేసింది. ఆ వార్తల్లో... `ఉల్లి అక్రమ వ్యాపారం, దందా' ఎలా నడుస్తుందో, కేవలం ఆరుగురితో కూడిన ఉల్లి సిండికేట్ ఎంత శక్తివంతమైనదో, వాళ్ల ముందు ప్రభుత్వం ఎంత ఆశక్తమైనదో, వాళ్ళ లంచగొండి వ్యాపారం ఎంత బలమైనదో, చదువరుల బుర్రలకి ఇంకేంత చక్కగా వ్రాయబడింది.

ఆ విధంగా... జయప్రదంగా, వ్యూహాత్మకంగా... చెడు బలమైనదనీ, సమాజంలో చెడే ఉందనీ, చెడ్డవాడే బాగుపడగలుగుతున్నాడనీ, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదనీ, మంత్రులూ అధికారులూ కూడా లంచాలతో మునిగి తేలుతూ ఏదీ పట్టించుకోవటం లేదనీ, ప్రజలకి ఇంకించే ప్రయత్నం కొనసాగించబడింది.

‘కాబట్టి ఇవాళ్ళా రేపూ అవినీతిదే రాజ్యం, డబ్బు సంపాదనే లక్ష్యం! డబ్బున్న వాడు ఏంచేసినా చెల్లుతుంది. అక్రమాలు బయటపడినా ప్రమాదం ఏమీ లేదు, పైగా పేపర్లో పడి పరపతి పెరుగుతుంది’ అన్నట్లు పరిస్థితి తయారయ్యింది.

ఈ విధంగా ప్రజా దృక్పధాన్ని ప్రభావపరిచే ఏ అవకాశాన్నీ మీడియా వదులుకోదు కదా?

మరో ఉదాహరణ రైతులకి విత్తనాల పంపిణీ! ఇవన్నీ పీరియాడికల్ గా సంభవించే వ్యవహారాలన్న మాట. ప్రతీ సంవత్సరం తిరిగి తిరిగీ సంభవిస్తూనే ఉంటాయి. కార్పోరేట్, ప్రైవేట్ విత్తన కంపెనీలు, వీలయినంత గరిష్ఠ స్థాయిలో రైతులను దగా చేస్తూనే ఉన్నాయి.

విత్తన కంపెనీల వాణిజ్య ప్రకటనలు రైతులని ఆకర్షిస్తాయి. వాళ్ళ ప్రచార క్యాంపెయిన్లు రైతులని ఆకర్షిస్తాయి. కానీ వాళ్ళ విత్తనాలు మాత్రం రైతులని కుప్పకూలుస్తాయి. ఒకోసారి విత్తనాలు మొలకెత్తవు. ఒకోసారి మొలకలొస్తాయి, మొక్కలు బలంగా, ఏపుగా పెరుగుతాయి, కానీ కాయవు. గొడ్డుమోతు మొక్కల్లా పొలం నిండా నిలబడతాయి. ప్రభుత్వం, మీడియా పాత్రలు ఇందులో కూడా యధాతధం!

ఈ కార్పోరేట్ విత్తన కంపెనీలు రాక ముందు, ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేయటం మొదలు పెట్టక ముందు, పూర్వకాలం రైతులు ఏం చేసే వాళ్ళో ఈనాటి యువరైతులకి, నడి వయస్సు రైతులకీ, తెలియను కూడా తెలియదు. తరం నుండి తరానికి సంక్రమించాల్సిన వారసత్వ వాస్తవ విజ్ఞానధార, వ్యవహార జ్ఞానధార, ఎప్పుడో రెండు తరాల క్రితమే సన్నగిల్లింది. క్రమంగా అంతరించింది. ఇన్ స్టంట్ పుడ్ లాంటి ఇన్ స్టంట్ వ్యవహారాలకి అలవాటుపడ్డారు, పడుతున్నారు.

మొదట్లో ‘మన రైతులది మూర్ఖత్వమనీ, పాతరాతి యుగపు వ్యవసాయమనీ, ఆధునిక పద్దతులు తెలియవనీ, కాబట్టే దిగుబడి ఎక్కువగా సాధించలేక పోతున్నారనీ’ ఊదర బెట్టబడింది. ‘వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, ఆధునిక వ్యవసాయ జ్ఞానం పాటించాలి’ అంటూ హోరెత్తించబడింది. మొదట్లో కొందరు శాస్త్రవేత్తలు నిజాయితీగా రైతు శ్రేయస్సు కోరి పని చేసారు.

తర్వత్తర్వాత, లంచగొండులు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వరదలా ప్రవేశించటంతో, ఆ ఒరవడిలో ఈ నిజాయితీ పరులు ఎప్పుడో గల్లంతయి పోయారు. ఇప్పుడు అక్కడక్కడా మిగిలి ఉన్నారు. ఇదే స్థితి ఏ ప్రభుత్వ యంత్రంగానిదైనా.

ఇక ఈ స్థితి వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు..... క్రమంగా ఉన్న స్థితిని ధ్వంసం చేయవచ్చు. ఆధునిక వ్యవసాయ జ్ఞానాన్ని టాంపర్ చేస్తే సరి! మొత్తంగా దేశంలో... వ్యవసాయ రంగంలో నైపుణ్యాలు, వాస్తవిక జ్ఞానం పులుసులో కలిసిపోతుంది. అదే జరిగింది.

చిన్న ఉదాహరణ గమనించండి. సామాజిక అడవుల పేరిట, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఇచ్చిన సలహాల ప్రకారం, సరుగుడు చెట్లు పెంచబడ్డాయి. వాటితో పాటు సుబాబుల్ కూడా! ముఖ్యంగా సర్వి చెట్లు/యూకలిప్టస్ చెట్లు! ఎవరైనా ధనవంతులు, ఊరు చివర భూములు కొన్నప్పుడు కూడా.... ఊరు పెరిగి వాటికి ధర పెరిగే వరకూ వేచి ఉండాల్సి వచ్చినప్పుడు... అవి దురాక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు, సామాజిక అడవులు అంటూ సర్వి, యూకలిప్టస్ గట్రా చెట్లు పెంచారు. [వాచ్ మెన్ లని నియమించుకుని భూముల్ని కాపాడుకోవటం ఖర్చుతో కూడుకున్నది.] అందుమూలంగా చాలా లాభాలుంటాయంటూ దూరదర్శన్, ఆకాశవాణి వ్యవసాయదారుల కార్యక్రమాలలో కూడా చెప్పబడింది.

అయితే.... సర్వి చెట్లు, యూకలిప్టస్ చెట్లతో కలప, ఔషధ ప్రయోజలుండవచ్చుగాక, కానీ, వాటి మూలంగా భూగర్భ నీటి నిల్యలు పడిపోతాయనీ, ఈ దుష్పరిణామం ఇటీవలే గుర్తించబడిందనీ 1992 లో డీడీ వార్తల్లో చూశాను. అవి మేము గూఢచర్యం గురించి ‘అ ఆ’ లు తెలుసుకుంటున్న రోజులు.

సదరు ఊరి చివరి బీడు భూముల్లో సర్వి, యూకలిప్టస్ ల బదులు మరేవైనా చెట్లు పెంచుకోవచ్చు. అదీ భూగర్భ జనవనరులని దెబ్బతీయని చెట్లని! సామాజిక అడవుల పేరుతో... సర్వి, యూకలిప్టస్ చెట్లని పెంచితే వచ్చే ‘సత్ర్పయోజనాలు, దుష్పయోజనాలని’ పరిశీలిస్తే... వచ్చే లాభం [కలప, ఔషధ తయారీ] తక్కువ, పోయే నష్టం ఎక్కువ! భూగర్భ జలాలు అడుగంటితే, దశాబ్దాల తర్వాత వచ్చేది దారుణ క్షామమే!

ఇప్పుడు గమనించి చూడండి. ఒకప్పుడు బస్సులో ప్రయాణిస్తూ, కిటికీ నుండి చూస్తుంటే, చాలా చోట్ల సరుగుడు, యూకలిప్టస్ చెట్లతో నిండిన స్థలాలు కన్పించేవి. ఇప్పుడవి నామమాత్రంగా కనిపిస్తాయి.

ఈ విషయంలో... గతంలో ప్రభుత్వమే ప్రజలకి, రైతులకి... ‘బీడు నేలల్లో ఖాళీ భూముల్లో సరుగుడు, యూకలిప్టస్, సూబాబుల్ పెంచమంటూ’ సలహాలిచ్చే విధంగా... మొత్తం జాతినే Misguide చేయటం... నకిలీ కణికుల కుట్రలో భాగమే! అదే స్థితి కొనసాగి ఉంటే, ఇప్పటి కంటే తీవ్రమైన నీటి యెద్దడిని, ఈ పాటికే అనుభవిస్తూ ఉండేవాళ్ళం.

ఇలాంటి చాలా విషయాల్లో, నకిలీ కణికులు అప్పటి వరకూ [1992 వరకూ] ప్రజల దృష్టికి రాకుండానే నెరవేర్చుకుంటూ వెళ్ళిన కుట్ర కోణాలని, అదే విధంగా పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం, ప్రజల దృష్టికి రాకుండానే ఛేదించుకుంటూ నడిపిస్తున్నారు.

వాస్తవిక వ్యవహార జ్ఞానం, తరం నుండి తరానికి సంక్రమించ వలసిన అనుభవ సారం, అనుశృతంగా నడవకుండా, ధ్వంసం చేయటమే పరమావధిగా.... నకిలీ కణిక వ్యవస్థ పనిచేసింది. ఇందుకు మరో ఉదాహరణ పరిశీలించండి.

ఇటీవల వృద్ద రైతులు ఒకరు చెప్పగా వార్తపత్రికలో ఓ మూల అప్రాధాన్యా వార్తగా వచ్చిన అంశం ఇది. ఆ వృద్ద రైతులు, వ్యవసాయంలో దిట్టలు, జ్ఞానులు. క్రింది వార్తాంశాన్ని పరిశీలించండి.

[>>>రైతుల మేథస్సుకు భద్రత
సాగు మెలకువల రక్షణకు సాఫ్ట్‌వేర్‌
ఐఐటీ, బయో డై వర్సిటీ బోర్డు సంకల్పం
కోచి, అక్టోబర్‌ 6:

'ముంగారు మొలక' అంటే తెలుసా? మీకే కాదు... నేటితరం రైతుల్లో చాలామందికి తెలియకపోవచ్చు! వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? విత్తనాలు ఎప్పుడు వేయాలి? ఇలాంటి విషయాలపై ముందే అంచనాకు వచ్చేందుకు పాతకాలం రైతులు చేసే ప్రయోగమిది.

సరిగ్గా ఉగాది రోజున పూచే ఈ మొలకకు వచ్చే పువ్వుల సంఖ్యను బట్టి, రైతులు వర్షాకాలంపై అంచనాకు వస్తారు. అంటే.. సీజన్‌ ప్రారంభానికి మూడు నెలల ముందే, వానలపై రైతులు అవగాహన పెంచుకుంటారు. ఇది పాతతరం రైతులకు మాత్రమే తెలిసిన కిటుకు.

ఇలాంటి సంప్రదాయ సాగు విజ్ఞానం మన రాష్ట్ర రైతుల్లో అపారం. ఇలాంటి మెలకువలను భద్రపరిచి భవిష్యత్‌ తరాలకు అందించేందుకు, ఇతరులు కాపీ కొట్టకుండా పేటెంట్‌ సాధించేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ప్రత్యేకం.

ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌ బయో డైవర్సిటీ బోర్డు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సాగులో పాటించే మెలకువలను ఆయా రైతులతోనే చెప్పిస్తారు. ఈ వివరాలతో ఆడియో - వీడియో టేపులు తయారు చేస్తారు. వీటిని ఆంగ్లంలోకి అనువదిస్తారు.

అంతర్జాతీయ మేథోసంపత్తి హక్కుల సంస్థ వెబ్‌సైట్‌కు అప్‌లింక్‌ చేసి... పేటెంట్‌ పొందుతారని రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు కార్యదర్శి బీజీ రమణ మూర్తి తెలిపారు. ఈ ఏడాది ఉగాది పర్వదినం రోజునే ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. కేరళలోని కొచ్చిలో ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడాడుతూ "ముంగారు మొలకపై తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా పరిశోధనలు సాగిస్తోంది.

ఈ మొలక సరిగ్గా ఉగాదిరోజే పూస్తుందని రుజువైంది. గ్రామ పంచాయతీల స్థాయిలో 12వేలు, మండలాల స్థాయిలో 1100, జిల్లాల స్థాయిలో 28 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను నియమించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం'' అని వివరించారు. బహుళ జాతి కంపెనీల దాడి నుంచి సాంప్రదాయ సాగు పద్ధతులను కాపాడేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ]

ముంగారు మొలక నాటటం ద్వారా, మూడు నెలల ముందే ఆ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయో తెలుసుకోవటం లెక్క కట్టగలరు. ఒకప్పుడు ఇలాంటి వాటినే, ‘అదంతా ట్రాష్!’ అనీ ‘మూఢనమ్మకం’ అనీ ఆనాటి ఆధునిక శాస్త్రం అన్నది. చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలూ అదే అన్నారు.

నాలుగు దశాబ్దాల గడిచే సరికి, రైతు, రెంటికీ చెడ్డ రేవడైనాడు. తరాల నుండి సంక్రమించిన అనుభవ జ్ఞానమూ శూన్యమైంది. ఆధునిక వ్యవసాయ శాస్త్రం, ఆర్దిక శాస్త్రంతో కలిసి... మన్మోహన్ సింగ్ లూ, ఆహ్లు వాలియాలూ, చిదంబరాలు, ప్రణబ్ ల వంటి ఆర్దిక మేధావుల సాక్షిగా... రైతు బ్రతుకునే శూన్యం చేసింది.

ముంగారు మొలక ముడుచుకుపోయింది. బంగారు పంటలు పాటల్లోనూ, వాణిజ్య ప్రకటనల్లోనూ మాత్రమే మిగిలిపోయాయి.

కొసమెరుపు ఏమిటంటే - పైన ఉటంకించిన అనుభవజ్ఞానాన్నీ, ముంగారు మొలకకూ శాస్త్రీయత ఉందనీ ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించటమూ!

ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపి ‘వ్యాపారం కోసం కృత్రిమంగా వస్తు కొరతలని సృష్టించటం’ దగ్గరికి తిరిగి వస్తాను.

గతంలో జరిగిన ఒక సంఘటన.

అవి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజులు! హఠాత్తుగా పిల్లలు పాలపొడి డబ్బాలకు కరువొచ్చింది. పాలడబ్బాలు... నెస్లే వంటి కార్పోరేట్ కంపెనీలు ఉత్పత్తి చేసేవి! హఠాత్తుగా, ఒక్కసారిగా, మీడియా ఈ విషయమై గగ్గోలు మొదలెట్టింది. వేడి వ్యాఖ్య ఏమిటంటే - "ఒక మహిళ పరిపాలిస్తున్న దేశంలో, పసిబిడ్డ తల్లులకు పిల్లల పాలపొడి డబ్బాలకు కూడా కరువొచ్చింది" అన్నది!

నా చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పట్లో పెద్దలు మాట్లాడుకోవటం విన్నాను. మా నాన్న, ఇతరులతో చర్చిస్తూ "ఏమిటీ పాల డబ్బాల గోల? వేల ఏళ్ళుగా ఈ దేశంలో తల్లులు లేరా, పిల్లలు లేరా? తల్లిపాలకి ఏం లోటువచ్చిందని డబ్బాపాల గోల? సీసాతో పాలు పట్టేందుకైనా ఆవుల్లేవా, గేదేల్లేవా?" అంటూనూ, "అందం చెడుతుందని ఆడవాళ్ళు పిల్లలకు పాలివ్వడం మానేసారట. ఇదేం ఘోర కలి?" అంటూనూ అనుకోవటం విన్నాను.

అయితే ఈ తర్కాన్ని గానీ, సందేహాల్ని గానీ, డబ్బాపాల మోజుల గురించి గానీ, మీడియా మాట్లాడలేదు. మీడియాతో సహా ప్రతిపక్ష నాయకులు, కొందరు అధికార పక్ష నాయకులు కూడా, ఈ పాల డబ్బాల కొరత గురించి తగినంతగా గోల చేసారు. కొద్ది రోజుల తర్వాత ఇది పత్రికల ప్రధాన శీర్షికల నుండి ప్రక్కకి వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులూ గమ్మున ఉండిపోయారు.

ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ ఉంది. బాలింతలకు వాడే మందులలో, తల్లిపాలు[Brest Milk] తగ్గేటట్లుగా మందుల కాంబినేషన్ ఉన్న మందులను వాడిస్తే చాలు! బాలింతలు అనివార్యంగా పిల్లలకు డబ్బా పాలనే వాడతారు. ఆ కంపెనీలకి ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం. ఆ పాల డబ్బాల ఉత్పత్తిని తగ్గిస్తే చాలు, పిల్లలకి పాల బాధలే కదా! ఈ వ్యాపార సూత్రం, కుట్రకోణం ఆనాటి ప్రజలకు తెలియదు. ఎందుకంటే - అంతంటి మోసాన్ని ఊహించాలంటేనే తప్పు చేస్తున్నామనే భావన ఉండేది. అన్నింటిలోనూ ఉండేది ‘మంచే’ అనుకోవాలనుకునే తత్త్వం!

నిజానికి స్వాతంత్ర సమరపు రోజులలోనూ, అంతకు ముందూ కూడా.... నకిలీ కణిక వ్యవస్థ, మనదేశం మీద పనిచేస్తూనే ఉంది. అయితే బ్రిటీషు వాళ్ళ వెనక దాక్కుంది! స్వాతంత్ర సమరం నాడు, స్వతంత్రం వచ్చాక... దేశంలో ఉన్న రాజకీయ నాయకులలో ఎక్కువమంది నిస్వార్ధపరులూ, దేశభక్తులూ ఉండటంతో... నకిలీ కణిక వ్యవస్థ యొక్క వ్యవహార సరళి, కుట్రతీరు కొంత తక్కువ వేగంతో ఉండేవి. మెల్లిగా నిజాయితీ పరులని తరిమేసారు.

ముఖ్యంగా ‘కోడలి’ నంటూ సోనియా ప్రధానమంత్రి ఇంట పాగా వేసాక, నమ్మకం పోగు చేసుకున్నాక... కుట్ర వేగం అన్యూహంగా పెరిగింది. ఇక ఇప్పుడు ఈ ఇటలీ మహిళ ప్రభుత్వ చోదక శక్తిగా అవతరించాక, కుట్ర వేగం అత్యధిక మవ్వటమే కాదు, బాహాటంగా కూడా పరిణమించింది. అప్పుడు పరోక్షం, ఇప్పుడు ప్రత్యక్షం. అంతే వ్యత్యాసం!

ఈ కుట్రలో భాగమే... పాల డబ్బాల కొరతల వంటివి. ఇవే కాదు, కొత్తగా అవసరాలు కూడా సృష్టిస్తారు. గత దశాబ్దాలలో... ‘చైనాలో గిరాకీ ఉందంటూ’ పల్లెల్లో పట్టణాల్లో కప్పల్ని హతమారిస్తే... ఇప్పుడు వేల కోట్ల రూపాయల కొద్దీ మస్కీటో రిపల్లెంట్ల వ్యాపారం నడుస్తోంది. దీని గురించి గత టపాలలో వివరించాను.

ఇక ఇప్పుడు చూడండి... All Out ఇక నుండి దోమల్ని తరమటం కోసమే కాదు, ఈగల్ని తరమటానికి కూడా పనికి వస్తుందట. ఇక కాచుకోండి! ఇబ్బడిముబ్బడిగా దోమలు పెరిగినట్లు, రోజు రోజుకీ దోమల ఇమ్యూనిటీ పెరిగి పోయినట్లు... ఇక నుండీ ఈగలు పెరుగుతాయి. ఇప్పటి దాకా రాత్రుళ్ళు మాత్రమే వాడబడుతున్న All Out వంటివి, ఇక నుండి పగలూ రాత్రీ వాడాలి కాబోలు! ఈగలూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. వాటికీ [ఇమ్యూనిటీ] రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతకంతకూ శక్తివంతమైన, ప్రభావ శీలమైన రిపల్లెంట్లు, మార్కెట్టులోకి వస్తాయి. అలాగే అలర్జీలు, అంతు తెలియని రోగాలు వస్తాయి.

‘ఈగా? మజాకా?’ - అనుకోవాల్సిందే మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

చాలా మంచి విషయాలు తెలియ జేస్తున్నారు. ధన్యవాదాలు. ముంగారు మొలకను గుఱించి నేను ఇంతవరకూ వినలేదు. పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాను.

ఈ మధ్య బ్రేక్ ఫాస్ట్ గురించి ఊదర గొడుతున్నారు గమనించారా. మద్యాహ్నం, సాయంత్రం కంటే బ్రేక్ ఫాస్ట్ అయితే కంపెనీలకు ఎక్కువ లాబం కదా.

నరసింహ[వేదుల బాలకృష్ణమూర్తి]గారు: ముంగారు మొలక గురించి మీకే తెలియదంటే ఇక ఇప్పటి చిన్న వయస్సు వాళ్ళ గురించి చెప్పేదేముంది. ఇప్పటి యువతరం గురించి అయితే అసలు వాళ్ళు తినే బియ్యం రకాల గురించైనా వాళ్ళకి తెలుసా అని నాకు అనుమానం! నాకూ ఎక్కువ తెలియదనుకొండి!:)

అజ్ఞాత గారు: ఆవునండి నేనూ ఈ మధ్య గమనించాను.

http://apmediakaburlu.blogspot.com/2010/07/blog-post_04.html

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu