కొన్ని దశాబ్దాల క్రితం.... ఆయుధ తయారీ సంస్థలు, దేశాల మధ్య యుద్దాలు సృష్టించి, యుధ్ధభయాలను పుట్టించి ఆయుధాల వ్యాపారం చేసుకునేవన్నది ప్రకటిత సత్యం. దాని వెనక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్యమే!

అదే నెట్ వర్క్ .... ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా, రోగాలనీ, కృత్రిమ వస్తు కొరతలనీ, మోజులనీ, పర్యావరణ అసమతుల్యతనీ సృష్టించి సరికొత్త వ్యాపారాలు చేస్తోంది. ఎందులోనైనా అదే స్ట్రాటజీ! అదే కుట్ర! అదే గూఢచర్యం! నారద నీతికి విపర్యయం, కణిక నీతికి పర్యాయం!

ముందుగా రోగాల గురించి పరిశీలిద్దాం!

వైద్యరంగంలో నకిలీ కణికుల కుట్ర గురించి నా ఆంగ్ల బ్లాగు Coups on World లో Coup on Medicines and Medical Field అనే శీర్షిక క్రింద వివరించాను. ఇప్పుడు కేవలం నకిలీ కణిక వ్యవస్థ, కార్పోరేట్ కంపెనీల ద్వారా సమాజంలోకి ప్రవేశపెడుతున్న రుగ్మతలూ, ఇతర దుష్పరిణామాల గురించి వివరిస్తాను.

ఉదాహరణకి మార్కెట్టులో లభించే పళ్ళని తీసుకోండి. ఈ రోజు, అరెటిపళ్ళ మొదలు అన్నిరకాల ఫలాలు ‘కార్భైడ్’ అని పిలవ బడే రసాయన పదార్ధంతో కృత్రిమంగా మగ్గ వేస్తున్నారు. [Acetilene Gas ని ఉత్పత్తి చేసేందుకు బ్యాటరీ తయారీ రంగంలో ఈ కెమికల్ ని ఉపయోగిస్తారు.] ఒకప్పుడు వరిగడ్డి పరచిన గదిలో పళ్ళని, వారం పైగా నిల్వ ఉంచితే పళ్ళు మాగేవి. అందుకోసం ‘గదుల’ అద్దె ఎక్కువ అవుతుంది.

అదే..... రసాయనం ఉపయోగిస్తే, నాలుగు గంటలలో ఒకే గదిలో ఎన్నో ఫళ్ళు మాగపెట్టవచ్చు. రసాయనంతో ఆకర్షణీయమైన రంగులో పండినట్లుగా అవుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ పళ్ళని మాగేసి మార్కెట్టుకి పంపించేయవచ్చు. అవి తింటే దాదాపు నూటికి 80 మందికి అలర్జీలొస్తాయి. [ఉప్పునీటిలో కొన్ని నిముషాలు నానబెట్టి, ఆపైన కడిగి తింటే, కొంత వరకూ ఆ రసాయన దుష్పలితాన్ని అరికట్టవచ్చు.]

ఇప్పుడు మార్కెట్ లో లభించే పనస వంటి పళ్ళు తప్ప దాదాపు అన్నిరకాల పళ్ళు కార్భైడ్ తో, చక్కని రంగు సంతరించుకొని, వినియోగ దారులని ఆకర్షిస్తున్నవే! ఇలా పండించినవి త్వరగా కుళ్ళుతాయి. కార్భైడ్ తో మగ్గబెట్టిన పళ్ళని ఫ్రిజ్ లో పెట్టి చూడండి. పసుపు రంగులో మెరుస్తూ నోరూరించే మామిడిపళ్ళు కూడా, ఆకుపచ్చని కాయలుగా [అక్కడక్కడా పసుపు మచ్చలుంటాయి లెండి] మారిపోతాయి.

ఏ పళ్ళైనా, కార్బైడ్ తో మాగ పెట్టినవి తింటే.... కడుపునొప్పి, అలర్జీలు, ముఖంపైన చిన్న చిన్న గుల్లలు లేవటం వంటి బాధలు తప్పవు. దాంతో ఔషధాల[మందుల] వాడకమూ తప్పదు.

ఇలాంటి పళ్ళే కాదు, కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్ధాలు కూడా ఔషధ వ్యాపారాన్ని ఇతోధికంగా పెంచేవే! ఔషధాలలోనూ నకిలీ వి, నాణ్యత లేనివి, సైడ్ ఎఫెక్టులు కలిగించేవి ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. కొత్త రోగాలు, రకరకాల రోగాలకు.. మందులు వాడతాం. వాటితో మరికొన్ని కొత్త బాధలు పుడతాయి. మళ్ళీ మందులు. మళ్ళీ కొత్త రోగాలు. ఇలా ఇదో చక్రం. ఒక దాని వెంట ఒకటి అనుసరించే వలయం. కావలసినంత వ్యాపారం.

నిజానికి ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న ఔషధాలలో అధిక శాతం విదేశాలలో నిషేధింపబడినవే! దుష్పలితాలినిస్తున్నాయనీ, రోగ నివారణ కంటే వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా ఉన్నాయనీ నిర్దారింపబడినవే! చట్ట రీత్యా ఇబ్బందులు రాకుండా, చాక చక్యంగా, మూల పదార్ధాల కాంబినేషన్ ని మార్చి, పేర్లు మార్చి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వీటి మీద ప్రభుత్వం కిమ్మనదు సరికదా, కార్పోరేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకి, తమ ఔషధాలను విక్రయించుకునేందుకు తగినంత సహాయ సహకారలందిస్తుంది. మీడియా సరేసరి!

మైదా పిండికి రంగు రుచి వాసనలద్ది మందుబిళ్ళలంటూ, ఐదు పైసల ఖరీదు చెయ్యని వాటిని, మూడు రూపాయల యాభైపైసలకు అమ్ముతూ, విజయవాడ ఫార్మాస్యూటికల్స్ పట్టుబడినా.... నాలుగు రోజుల హడావుడీ తప్ప అన్నీ మామూలై పోయాయి. ఆ మందు ఖరీదు విషయంలో రోగి పడే దగా కంటే, మందులు వాడుతున్నామంటూ, రోగం తగ్గుతుందని ఆశపడుతూ, నమ్మకంతో వేచి చూస్తూ పడే దగా... ప్రాణాంతకమైనది. అయినా మీడియా గానీ, ప్రభుత్వం గానీ కిమ్మనదు.

పైగా... ఆయుర్వేదం, ప్రకృతి సహజ పదార్ధాలతో చికిత్స, గట్రాలని ఒకప్పుడు మీడియా బాగానే విమర్శించింది. వెక్కిరించింది. చెట్టు బెరళ్ళూ, వేళ్ళూ నూరుకు తాగుతారనీ, ఆకులు నములు తారనీ... గట్రా చెణుకులు ఆ ఔషధాల మీదా, ఔషధాలని వినియోగించే వారి మీదా వేసింది.

ఆయుర్వేదం గురించి పాజిటివ్ చెబుతున్నట్లు శీర్షికలున్నా, లోపల మాత్రం సదరు ఔషధాల వాసన, రుచి భరించటం కష్టం అనీ, జబ్బు తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందనీ, పధ్యాలుండవలసి ఉంటుందనీ బాగా చెప్పబడింది. ఎంత బాగా అంటే - మనసుకి ఎక్కేటంతగా! క్రమంగా ఆయుర్వేద వైద్యం సమాజంలో బాగానే అంతరించింది.

మళ్ళీ ఈ ఒకటిన్నర దశాబ్దంలోనే, ఆయుర్వేద వైద్యం వాడకం గురించి బాగా వినబడుతోంది. గతంలో అయితే, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలల్లో ప్రభుత్వ వైద్యులు హాయిగా పనేం లేకుండా తీరికగా జీతాలు తీసుకునే వాళ్ళు. [శ్రీశైలంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది.]

ఇప్పుడు అవే ఆయుర్వేద ఔషధాలు, సౌందర్యోత్పత్తులూ, ఆయుర్వేద సబ్బులూ, కార్పోరేట్ కంపెనీలకు కాసులు కురిపిస్తున్నాయి. కలబంద కాస్తా అలోవెరా అయిపోతే కావాల్సినంత వ్యాపారం! కలబంద మొక్క వ్యాపారానికి పనికి రాకూడదనీ, కలబందకు ఆదరణ రాకూడదనీ నేను ఆనటం లేదు.

అదే కలబంద పొలం గట్ల మీద, తుప్పల్లో ఉన్నప్పుడు, దానికి ఏ గుర్తింపూ లేదు. ఎప్పుడైతే మీడియా దాన్ని అలోవెరా గా, అద్భుత సౌందర్య ఆరోగ్యదాయిని గా ప్రొజెక్ట్ చేసిందో, ఆ తర్వాత ఊపందుకున్న వాడకం, ఆపైన కార్పోరేట్ ల ప్రవేశం గురించి పరిశీలించమంటున్నాను. వాటి మధ్య కార్యకారణ సంబంధం చూడమంటున్నాను.

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం నాటికి... క్రమంగా వంటింటి వైద్యం కూడా మూలబడింది. వంటింటి దినుసులతో జలుబూ, జ్వరం, చిన్నపాటి ఆరోగ్య ఇబ్బందులకి చేసే వైద్యం గురించిన పరిజ్ఞానం... క్రమంగా ఆనాటి వృద్దులకి పరిమితమై, అంతరించే దిశలో ఉండింది.

అదృష్టవశాత్తూ మళ్ళీ ఈ మధ్య కాలంలో, ఈ ఒకటిన్నర దశాబ్దాలలో.... వారపత్రికలలో, వార్తా పత్రిక మహిళల పేజీలలో మళ్ళీ చిట్కా వైద్యాలు దర్శనమిచ్చి, మళ్ళీ ఆ వారసత్వ వాస్తవిక జ్ఞానం సజీవ దిశ వైపుకు ప్రయాణిస్తోంది.

ఈ నేపధ్యంలో.... ఆసుపత్రులు కూడా ‘కార్పోరేట్’ అయిపోవటం అందరూ ఆహ్వానించిన, ఆనందించిన పరిణామం. ఆ ‘కార్పోరేట్’ ముసుగు మాటున ఉన్న అమానుష వ్యాపారం తెలియని అమాయకత్వంతో, మొదట్లో కార్పోరేట్ ఆసుపత్రులని చాలామంది ఆహ్వానించారు. వాటి రాకని ఆనందించారు.

కార్పోరేట్ ఆసుపత్రి వ్యాపార దోపిడి అనుభవంలోకి వచ్చాక గానీ.... తళతళలాడే కార్పోరేట్ ఆసుపత్రి భవనాలు, ఫెళఫెళ్ళాడే ఆసుపత్రి సిబ్బంది యూనిఫారంల లాగే ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయో, డాక్టర్లూ రిసెప్షనిస్టులూ నర్సులూ గట్రా సిబ్బంది నవ్వు ఎంత రమణీయంగా ఉంటుందో, అంతే నిర్ధాక్షిణ్య వ్యాపారం నడుస్తుందని అర్ధం కాలేదు.

ఈ విషయమై ప్రజలకి అవగాహన కలిగించటానికి బదులు, ప్రజల అవగాహనని కూడా ఏమారుస్తూ, ప్రభుత్వం.... ‘ఆరోగ్యశ్రీ’ లంటూ ఆకర్షణీయమైన పేర్లు పెట్టి, పేదలకి కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామంటూ ప్రజాధనం కార్పోరేట్ ఆసుపత్రులకు ధారాదత్తం చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వటం, సిబ్బందిని నియమించటం, నిధులు మంజూరు చెయ్యటం ఎంచక్కా మరిచిపోతోంది, పోయింది.

నాయకులలో లేని సేవా తత్పరత, సిబ్బందికి ఎక్కడి నుండి వస్తుంది? ఒకప్పుడు ఉచితంగా, భరోసాతో పొందిన పెద్దాసుపత్రి సేవలు ఇప్పుడు గత చరిత్ర అయిపోయాయి. జలుబూ, జ్వరం లాంటి చిన్న జబ్బుల దగ్గరి నుండి గుండెజబ్బుల దాకా, ఉచిత వైద్యం మా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మా చిన్నప్పుడు లభించటం నాకు ప్రత్యక్షంగా తెలుసు!

ఇవేవీ మాట్లాడకుండా.... మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ఇతర అధికారులూ ఆరోగ్యశ్రీ కార్డు పేరిట భారీ ప్రకటనలు గుప్పించి మరీ, కార్పోరేట్ ఆసుపత్రులకు ప్రతినిధుల్లా పనిచేసారు. [వై.యస్. మరణం తర్వాత టీవీ ప్రకటనల ఉధృతి కాస్త తగ్గింది లెండి.]

ఇక మీడియా ముసుగు వేసుకున్న కుట్రదారులు, జన బాహుళ్యంలో చిన్నపాటి జబ్బులకు కూడా ‘స్పెషలైజేషన్ చేసిన డాక్టరు చేతే వైద్యం చేయించుకోవటం మంచిది’ అనే భావాన్ని బలంగా ప్రవేశపెట్టారు. ఎంతో వ్యూహాత్మకంగా, సుదీర్ఘ కాలంగా, చాపక్రింద నీరులా పనిచేసి మరీ, ప్రజాదృక్పధాన్ని ప్రభావపరిచారు.

వైద్యం అన్నది ప్రాణాలకూ, శారీరక బాధకూ సంబంధించినది కావటంతో ఎవరూ రిస్క్ తీసుకోరు. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, గూఢచర్యాన్ని మిళితం చేసి అమలు చేసిన ఈ కుట్రలో, క్రమంగా MBBS డాక్టరు అర్దడాక్టరు గా మిగిలిపోయాడు. దాంతో M.S., MD వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ , స్పెషలైజేషన్ చేయటం వైద్యవిద్యార్ధులకి అనివార్యమైంది.

ఇక ఊహించండి, కార్పోరేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వైద్య విద్యకు ఎంత డిమాండ్ ఉంటుందో! అడ్డదారులలో ప్రవేశాలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఈ రోజు[15 జూన్, 2010] ఈనాడులో వచ్చిన గంగాధర్ రెడ్డి వార్తాంశమే దీనికి చక్కని ఉదాహరణ.

అంత ఖర్చుపెట్టి చదువుకు వచ్చిన తర్వాత సదరు వైద్య విద్యార్ధులు, ఎంత లేసి ఖరీదైన వైద్యం చేస్తే, తమ పెట్టుబడి తిరిగి పొందేట్లు? ఇక లాభాల సంగతేమిటి?

పరిశీలించండి. ప్రభుత్వాధికారంలో ఉన్న రాజకీయులూ, బ్యూరాక్రాట్లు, మీడియా ఎంతో అంతర్గత సహాయ సహకారాలతో, ప్రజలని మరింతగా దోపిడి చేయటానికి తగినట్లుగా చట్టాలు మారుస్తుంటారు, కొత్త చట్టాలు, జీవోలు తెస్తుంటారు. ప్రజా దోపిడిని నియంత్రించేందుకు ఉద్దేశించిన చట్టాల అమలును ప్రయత్నపూర్వకంగా నీరుగారుస్తుంటారు.

రెడ్ టేపిజం, లంచగొండితనం, అవినీతి, పైకారణాలుగా[over leaf reasonsగా] చెప్పబడుతూ, పెంచి పోషించబడుతుంటాయి. అంతర్గత కారణం ఒక్కటే!
గూఢచర్యం!
అది కుట్ర!
భారతదేశం మీద కుట్ర!
మానవత మీద కుట్ర!
కుట్రదారులు నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీ గట్రాలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu