ఇటలీ నుండి ఇందిరాగాంధీ కోడలిగా ఇండియాలో పాగా వేసిన సోనియా గాంధీ – నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు కీ, అత్యంత ముఖ్యమైన ఏజంట్ అని ముందటి టపాలలో వివరించాను. ఈ ట్రాన్స్ ప్లాంటర్, భారత ప్రధానమంత్రి ఇంట్లో సుస్థిరంగా కుదురుకున్నాకే, దాదాపు ఏడేళ్ళ తర్వాత, ’ఈనాడు’ పురుడుపోసుకుంది. అప్పటి వరకూ ప్రచ్ఛన్నంగా ఉన్న నకిలీ కణిక వ్యవస్థ, అందులో కీలక వ్యక్తులు, మెల్లిగా మీడియా ముసుగు వేసుకుని తమ ఉనికి బహిర్గతం చేసుకుంటూ, ‘రామోజీరావు ఒకవ్యక్తి కాదు ఒక వ్యవస్థ’ అంటూ సగర్వంగా ప్రకటించుకునే దాకా పరిణమించారు.

అయితే 1992 లో ఎప్పుడైతే పీవీజీ దృష్టికి, నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, వాళ్ళ గూఢచార వలయమూ దృగ్గోచరమయ్యాయో, అప్పుడే వాళ్ళ మూలబలం వంటి ప్రధాన గూఢచారులు ఎక్కడెక్కడ పాదుకున్నారో కూడా అర్ధమయ్యింది. ప్రధాని ఇంట్లో సోనియాగాంధీ, ప్రతిపక్షనేతగా ఎల్.కె.అద్వానీలు…. ఇంకా ఇలాంటి వారు మరికొందరు.

ఇక పీవీజీ ప్రపంచవ్యాప్తంగా సమీకరించిన నెం.5 వర్గం ఎంచుకున్న గూఢచర్య స్ట్రాటజీ గురించి, అందులోని సువర్ణముఖి కాన్సెప్ట్ గురించీ, ‘కన్నా?కాలా?’ స్ట్రాటజీ గురించి, గూఢచర్య స్ట్రాటజీలని [Expose] బహిర్గతం చేయటమే ప్రధాన అజెండా అవ్వటం గురించి గతటపాలలో వివరించాను.

అందులో ముఖ్యమైన భాగమే సోనియాగాంధీ సువర్ణముఖి:

అప్పటి వరకూ గడపదాటని ఇల్లాలు….

మరిది సంజయ్ గాంధీ మరణానంతరం [ఇదీ నకిలీ కణిక గూఢచర్య కుట్రలోని భాగమేనని గతటపాలలో మీరు చదివి ఉన్నారు] తల్లికి బాసటగా నిలవాలనుకున్న రాజీవ్ గాంధీతో, అతడి రాజకీయ రంగ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, ఆడబెబ్బులిలా పోరాడిన సాధారణ మహిళ……

ఇటలీ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి, సామాన్య విమాన పైలట్ భార్యగా జీవితం గడిపేయాలని అభిలషించిన సాదాసీదా మహిళ……

1998 తర్వాత, ఇక సీతారాం కేసరిలనడ్డం పెట్టుకున్న తెరచాటు రాజకీయాలు వదిలేసి, నేరుగా రాజకీయ రంగంలోకి దిగిన రాజకీయ నాయకురాలు…….. సోనియాగాంధీ!

[ఇక్కడో విషయం గమనించాలి. చేసేవి కుట్రలు, అయినాగానీ వాటికి ’రాజనీతి’ పేరు పెట్టటం మీడియా వైచిత్రి! ఉదాహరణకి పిఆర్పీ చిరంజీవిని, పొత్తంటూ నమ్మించి, ఆపైన ‘తూచ్’ అనేసి, రాజకీయాల్లో అనుభవంలేని ఆ సినిమానటుణ్ణి బంతాట ఆడుకోవాటాన్ని పిఆర్పీ వాళ్ళనడిగితే కుట్ర అంటారు. ఆ రెండు పత్రికలు మాత్రం రాజనీతిజ్ఞత అంటాయి.]

సరే……దానాదీనా ఈ రాజకీయ నాయకురాలూ, కాంగ్రెస్ అధిష్టానమూ అయిన సోనియాగాంధీ గత 17 ఏళ్ళుగా అనుభవిస్తున్న సువర్ణముఖిని ఓ సారి పరిశీలిద్దాం.

1]. 1968 ల్లో ఇందిరాగాంధీ ఇంట్లో అడుగుపెట్టిన ఈ సోనియాగాంధీ, 1980 కల్లా మరిదిని, ఆపైన నాలుగేళ్ళలో అత్తగారినీ, ఆ తదుపరి ఏడేళ్ళల్లో భర్తనీ రంగం మీదినుండి తప్పించటంలో తన శక్తి మేరా పనిచేసింది. దీని గురించిన వివరమైన టపాలు ఇంతక్రితం చదివి ఉన్నారు.

ఇక ఇప్పుడు ఈ 17 ఏళ్ళల్లో, దాని పర్యవసానపు సువర్ణముఖిని ఎలా అనుభవిస్తోందో చూడండి.

సోనియాగాంధీ తన కుమార్తె ప్రియాంకని, రాబర్ట్ వాద్రా అనే క్రిస్టియన్ కిచ్చి వివాహం చేసింది. [అతడి తండ్రి రాజేంద్ర వాద్రా పాకిస్తాన్ నుండి వలస వచ్చాడు. అంతేకాక ఆర్.ఎస్.ఎస్.కి సన్నిహితుడు. పెదతండ్రి రిచర్డ్ వాద్రా కూడా!] అయితే వివాహానంతరం పదిపన్నెండేళ్ళు తిరిగేసరికి ఆ కుటుంబంలో వివిధ కారణాలతో ఒక్కొక్కరుగా మొత్తం కుటుంబసభ్యులందరు పరలోక ప్రయాణం కట్టారు.

ఆ విధంగా తన అత్తగారి ఇంట్లో ఏం చేసిందో, కూతురి అత్తగారింట్లో అదే జరిగింది. అయితే మీడియా ఈ మిస్టరీ మరణాలపై విషయంలో గప్ చుప్ గా ఉంటుంది. అంతేకాదు విభిన్నకధనాలు కూడా ప్రచురించింది. దృష్టాంతంగా ఈ టపాలోని వివరాలు పరిశీలించండి.

ప్రియాంక వాద్రా ఇంటిలో పనిమనుషులు కూడా [కనీసం ఇద్దరు. ఒకరిది హత్య, మరొకరిది కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య] అనుమాస్పదంగా మృతి చెందారు. ఇవి అప్పట్లో పత్రికలలో వచ్చిన వార్తలే!

కుటుంబసభ్యులు, ఇంట్లో పనివారూ బయటివారికి సమాచారం ఇస్తున్నారేమోనన్న అనుమానాలు కారణం కావచ్చు, లేదా తమ ప్రత్యర్ధులెవరైనా ఆయావ్యక్తుల వెనక చేరారేమో నన్న అనుమానం కారణం కావచ్చు, అభద్రతా భావం కారణం కావచ్చు,..... ఇటువంటి కారణాలు ఏవైనా ఉండొచ్చుగాక గానీ, ప్రియాంకవాద్రా భర్త తప్ప కుటుంబసభ్యులంతా తుడిచిపెట్టుకు పోవటం మాత్రం యధార్ధం! ప్రత్యర్ధి పార్టీలో, లేక మరోకారణమో అయితే సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేస్తూ [హత్యలో, ఆత్మహత్యో] వాటి మీద విచారణ చేయిస్తుంది కదా! అంతేగాక తనకూతురు మామాగారు మరణించినప్పుడు గప్ చుప్ గా హిందూసంప్రదాయం ప్రకారం తగలబెట్టదు కదా? అంటే తన ఆత్తగారింట్లో తను ఏమీ చేసిందో అదే తన కూతురు ఇంట్లో తక్కిన వాళ్ళు చేస్తున్నారన్న అనుమానం ఉండి ఉండాలి. అచ్చంగా సోనియాగాంధీ కుటుంబచరిత్రే తిరగబడటం ఇక్కడ గమనార్హం.

2]. ఇక రెండవ అంశం మరింత ఆసక్తికరమైనది. అది సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి సంబంధించినది. అచ్చం ఇందిరాగాంధీ, మొదట తన రెండవ కుమారుడు సంజయ్ గాంధీని, అతడి మరణానంతరం పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి తెచ్చుకున్నట్లే, సోనియాగాంధీ కూడా తన కొడుకు రాహుల్ గాంధీని రాజకీయాల్లోకి తెచ్చుకుంది. ఠపీమని AICC ప్రధానకార్యదర్శిని గూడా చేసేసింది.

ఆనాడు ఇందిరాగాంధీ నియంతృత్వపోకడలనీ, కుటుంబపాలననీ, రాజ్యేంగేతర శక్తులనీ, ఉతికి పిండి ఎండగట్టి ఆరేసిన మీడియా మరియు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఈనాడు, ఈ విషయంలో కిమ్మంటే ఒట్టు. ఇందిరాగాంధీని తాము ఎండగట్టామని స్వయంగా కోర్టుకు సైతం చెప్పికుంది ఈనాడు. ఎందుకు ఎండగట్టమో కూడా వివరంగా చెప్పుకుంది. మరి అదే నియంతృత్వపోకడనీ, కుటుంబపాలననీ అమలుచేస్తోన్న సోనియా గాంధీని విమర్శించదేం? స్వయంగా రాజ్యాంగేతర పదవినే [ప్రభుత్వకుర్చీ వ్యక్తి పదవి] సృష్టించుకున్నా కిక్కురమనవేం ప్రతిపక్షాలు, పత్రికలు?

ఎందుకంటే – అప్పటి ఇందిరాగాంధీలాగా ఇప్పటి ఇటలీ గాంధీ కుట్రకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు కాదు, దేశభక్తురాలు అంతకంటే కాదు కనుక. తమకి మద్దతుగా పనులు చక్కపెట్టే తమ వర్గీయురాలు కనుక! ఇది ఇప్పుడు అందరికీ బహిర్గతమైన యదార్ధం.

ఇక సోనియాగాంధీ సువర్ణముఖి ఏమిటంటే – పెళ్ళిపేరుతో అత్తగారింట అడుగుపెట్టి, తల్లి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, మనవరాలు, మనవళ్ళతో పచ్చగా ఉన్న ఉమ్మడి సంసారాన్ని కకావికలు చేసింది. కోడలు కాదు కుతురన్నంతగా నటిస్తూనే…… నమ్మించి ద్రోహం చేసి మృత్యువు ముందుకు తోసింది. జీవితాన్ని పంచి ఇచ్చినందుకు భర్త జీవితాన్ని మృత్యువుకు అప్పగించింది. భావితరాన్ని వెన్నెముక లేకుండా పెంచింది.

తాగితే తప్పులేదని ప్రజలకు సందేశాలిచ్చే కొడుకు రాహుల్ గాంధీ! జీరో సైజుల మీద మోజులు పెంచుకున్న కూతురు ప్రియంకావాద్రా! కనీసం, ’ఎలాంటి కుటుంబం నుండి వచ్చాము, ఎలాంటి విలువలు పాటిస్తున్నామన్న స్పృహ, కూడా లేనంతగా కూతుర్ని, కొడుకునీ పెంచటం ఈ ఇటలీ మహిళకే చెల్లింది.

ఇదిగో, ఇప్పుడు కొడుకు రాహుల్ గాంధీకి పెళ్ళి చేస్తే…… తన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే అమ్మాయి తనకి ఏమేమి వడ్డిస్తుందో…… అన్న భయం, కొడుకుని ఘోటక బ్రహ్మచారిగా మిగిల్చింది. ఇంతకంటే సువర్ణముఖి ఇంకేం ఎదురౌతుందో నన్నభయం!

తను కోడలి రూపంలో ప్రధాని ఇంట్లో ఇన్ స్టాల్ అయినట్లుగా, నెం.5 వర్గం చేత ప్రేరేపితులైన వారెవరైనా, తన ఇంట్లో కోడలి పేరిట ట్రాన్స్ ప్లాంటర్ ని ఇన్ స్టాల్ చేస్తే? అసలే ప్రపంచవ్యాప్తంగా, డబ్బు ఇస్తే ఏమైనా చేయటానికి వెనుదీయని వారు కోకొల్లలు. తము నేర్పిన విద్యే, తము తయారు చేసిన ఆయుధమే తమని disturb చేసినట్లు! కళ్ళముందు ప్రమోద్ మహాజన్ హత్య, అతడి కుమారుడు రాహుల్ మహాజన్ పెళ్ళి, విడాకుల వంటి కారణాలతో ’దెబ్బలబ్బాయిలు’ కనబడుతూనే ఉన్నారు.

దాదాపు నలభైఏళ్ళు వస్తున్న[ఇప్పటికి 39] ఈ యువకుణ్ణి[రాహుల్ గాంధీని] చూసి ’తమ కలల రాకుమారుడు’ అంటూ అమ్మాయిలు కలవరం చెందుతున్నారంటూ పత్రికలు వ్రాయటమే తప్ప….. పాపం ఆ యువకుడికి మాత్రం…… “పప్పన్నం ఎప్పుడు పెడతారు?” అంటే బిక్కముఖం వేయటమే వంతయ్యింది. తన తోటి వాళ్ళు, తనకంటే చిన్నవాళ్ళు హాయిగా పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో కాలక్షేపం చేస్తుంటే, తానుమాత్రం “పెళ్ళి చేసుకునే తీరిక లేదు” అని విలేకర్ల ప్రశ్నలకు జవాబు చెబుతూ కాలం గడపటం! పోనీ వివాహం మీద ఆసక్తి లేదా అంటే అదీ కాదు! నిజంగా విచారకరం కాదూ?

ఆ ఇటలీ తల్లికి ఏమాత్రం కుటుంబబంధాల మీద నమ్మకం లేకపోయినా….. భారతదేశంలో ఎందరో తల్లులు మాత్రం తము అభిమానించిన ఇందిరాగాంధీ మనమడు, తమ కళ్ళముందే చిరుప్రాయంలోనే దారుణ హత్యకు గురై….. అర్ధాంతరంగా బ్రతుకు ముగించుకు వెళ్ళిపోయిన రాజీవ్ గాంధీ తనయుడు….. రాహుల్ గాంధీ జీవితం అలా ఉండటం బాధకరంగా భావిస్తారు. తమ పిల్లవాడి బ్రతుకే ఒంటరి తనం పాలయ్యిందన్నంత జాలీ, బాధా పడతారు. బహుశః అదే ఇటలీ కి, ఇండియాకి ఉన్న వ్యత్యాసం కాబోలు.

3]. ఇక మూడో సువర్ణముఖి ఏమిటంటే – ఇంటిలోపలి నుండి, ఇందిరాగాంధీ మోటివ్స్ బయటకు చేరవేస్తూ, జయప్రదంగా ఇందిరాగాంధీకి బయట ఎవర్నీ నమ్మనిస్థితిని, అందరిని శత్రువులుగా భావిస్తూ, అందరికి శత్రువుగా తయారయ్యేటట్లు సోనియా గాంధీ చేయగలిగింది. ఇప్పుడదే పరిస్థితిని, కాంగ్రెస్ అధిష్టానంగా సోనియాగాంధీ అనుభవిస్తోంది. వివరంగా చెబుతాను.

సోనియాగాంధీకి, ఎర్రపార్టీవాళ్ళతో సఖ్యత చెడి సంవత్సరం దాటింది. ఉపయోగించుకుని, ఆనక, చారులో కరివేపాకులా తీసి అవతల పారేస్తుందని సదరు నాయకులు విమర్శిస్తూనే ఉన్నారు.

తమనీ కూడా అలాగే ఉపయోగించుకుని నిర్లక్ష్యం చేసిందని అమర్ సింగ్ ఇత్యాదులు [‘అ’ త్రయంగా పేరుపెట్టబడిన అమర్ సింగ్, అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్ లు] ఘోల్లు మంటూనే ఉన్నారు. అదేక్రమంలో జార్ఖండ్ నాయకులు శిబూశోరన్ లూ ఉన్నారు. మధుకోడాలు ఉన్నారు. బీహార్ లో లల్లూప్రసాద్ యాదవ్ కి సిబిఐ కేసులు చూపెట్టి, తన పట్టు తో పక్కన పెట్టింది. యూపీలో మాయావతితో ముందునుండే ఘర్షణ వైఖరి ఉంది. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే తో స్పెక్ట్రమ్ గొడవతోనూ, ఆళగిరితోనూ గొడవ తీరూ అదే! జయలలితతో అసలుకే పడదు.

తనకి మద్దతుగా ఉన్నారనుకున్నవారితో కూడా అదేపరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతబెనర్జీతో సంబంధబాంధవ్యాలు తుమ్ముతే ఊడే ముక్కులాంటివే. మహారాష్ట్రలో ఎన్సీపీ దీ అదేమాట. ఎక్కడి కక్కడ ఏదో ఒక వివాదం, ఘర్షణ! సిబిఐ కేసులతో కావచ్చు, EVM టాంపరింగ్ తో కావచ్చు లేదా వాళ్ళ వ్యాపారమూలాల మీద దెబ్బకొట్టటం ద్వారా కావచ్చు, ఐటి దాడులతో కావచ్చు, పట్టు చూపెట్టి, ప్రత్యర్దుల మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నది – అన్న పైకారణం [Over leaf reasons] ఇప్పటికి బాగానే ఉంది. ‘ఇప్పటికి పైచేయి కాంగ్రెస్ అధిష్టానానిదే’ అనుకుని దిగమింగుకుని ఊరుకున్నా, రేపు సమయం అనుకూలిస్తే, మరణించిన ఆంధ్రా ముఖ్యమంత్రి వై.యస్. చూపించిన తంత్రమే చూపిస్తారు. వై.ఎస్. ని 2004 లో సీ.ఎం. సీటు ఎక్కించే ముందు తగినంత నలగేసి గ్రిప్ చేసినా, అవసరం, అవకాశం కనిపెట్టి ఇరుకున పెట్టాడు కదా?

ఆ అనుభవం హెచ్చరిస్తున్నా కూడా సోనియాగాంధీ, ప్రస్తుతం అందరితో ఘర్షణాత్మక వైఖరితోనూ, దెబ్బలబ్బాయిల్ని చూపిస్తూనూ, గ్రిప్ చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రతిఫలంగా ’ఒంటరి’ ఔతోంది.

పర్యవసానం ఏమవుతుందో వేచి చూడాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

దేశంలో ఉన్న ఒక్క చీడపురుగు పోతే సగం దరిద్రం వదులుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది!

VAammO :(

ఈ విషయాలు అన్నీ ఆ దెబ్బలబ్బాయిలకి (మిహతావారికి కూడా) అర్థమౌతున్నాయంటారా?

రవిగారు,

ఒక్క చీడపురుగు వదిలితే సగం దరిద్రం పోయేమాట నిజమే! అయితే ఈ ప్రధాన చీడపురుగుల దన్నుచూసుకుని చెలరేగిపోయిన, పోతున్న చీడపురుగులు మరికొన్ని ఉన్నాయి. అన్నీ వదిలితే అసలు దరిద్రమే పోతుంది. మీరన్న మాట మాత్రం నిజం. ఆ రోజూ వస్తుంది. నెనర్లు.

****
అజ్ఞాత గారు,

నెనర్లు!

****
రాఘవ గారు,

ఏ విషయమైనా, ఆయావ్యక్తుల అవగాహన మీద ఆధారపడి ఉంటుందండి. నెనర్లు!

రవి కరెక్ట్.. ఆ రొజు కొసం ఎదురుచూద్దాం..
సొనియా, రాహుల్ కి చివర గాంధి తగిలించడం నాకెందుకొ నచ్చదు.. వాళ్ళకా అర్హత లేదు.. ముఖ్యం గా సొనియాకి..

good one,

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu