ముందుగా ఓ చిన్న సంఘటన వివరిస్తాను.

శ్రీశైలంలో ఉండగా మా పాఠశాలలో ఓ విద్యార్ధి ఉండేవాడు. వాడికి బుద్దిమాంద్యం ఉంది. మూడునాలుగేళ్ళు వచ్చేవరకూ దుస్తుల్లోనే మలమూత్ర విసర్జన చేసుకునేంత బుద్దిమాంద్యం! దాదాపు ఏడేళ్ళ వయస్సులో నర్సరీలో చేరాడు. ఆ పిల్లవాడిని బుద్దిమాంద్యుల బడిలో చేర్చడానికి వాడి తల్లిదండ్రులకు నామోషీ! తమ పిల్లవాడికి మాటా నడకా అన్నీ ఆలస్యంగా వచ్చాయి తప్ప, తెలివైన వాడేననీ వాళ్ళ నమ్మకం. వాళ్ళ పెద్దబాబు మా దగ్గర చదవటంతో వీడికీ సీటు ఇవ్వక తప్పలేదు. వారంలో ఒకరోజో, రెండురోజులో బడి సమయం అయ్యేసరికి ఈ పిల్లవాడు కాస్తా ఎక్కడో నక్కేవాడు. తల్లిదండ్రులు వెదుకుతున్నంతలోనే బడి సమయం కాస్తా అయిపోయేది.

వారంలో ఒకటో, రెండో రోజులు వీడు బడి ఎగ్గొట్టే వాడు. ఈ విషయం చెబుతూ వాడి తల్లిదండ్రులు “మా వాడు అలా కనిపిస్తాడే గానీ తెలివి తేటల కేం తక్కువ లేదండి!” అనేవాళ్ళు. నిజానికి పరిశీలించే చూస్తే, ఆ పిల్లవాడు బడి సమయానికి దాక్కునే చోట్లు మహా అయితే ఓ పది ఉండేవి. అంతకంటే కొత్త చోట్లు గానీ, కొత్త పద్దతులు గానీ వాడికి తెలియవు. దానికే వాడి తల్లిదండ్రులు కళ్ళు తిప్పుతూ చెప్పుకునేవాళ్ళు. వాళ్ళంటే అమాయక తల్లిదండ్రులు! తమ బిడ్డ మానసిక అవకరం పట్ల బాధాతప్తులు! కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని గానీ, ఆ పిల్లవాణ్ణి గానీ జాలిగా చూడటం తప్ప, ఎవ్వరమూ ఏమీ అనే వాళ్ళంకాదు.

తరచి చూస్తే….. నకిలీ కణిక వ్యవస్థ ప్రపంచం మీద [దేశాల దగ్గరి నుండి వ్యక్తుల వరకూ] ప్రయోగించే స్ట్రాటజీలు కూడా ఇలాగే పరిమితమైనవి. పైపైన పరిశీలిస్తే వైవిధ్యమున్నట్లు కన్పించినా, తరచి చూస్తే అవే పదిరకాలు !

మరో ఉదాహరణ చెబుతాను. కార్పోరేట్ వ్యాపారరంగంలో ఏ కంపెనీ, ఏ వస్తువుని తయారు చేసి అమ్మినా…. పైపైన ప్యాకింగుల్లోనూ, బ్రాండ్ పేరుల్లోనూ, ఆకారాల్లోనూ వైవిధ్యమే తప్ప, ఆ ప్యాకింగులోపలి అసలు సరుకులో మార్పేమీ ఉండదు చూడండి, అలాగన్న మాట! ఆముదంలోనో లేదా ఆలివ్ నూనెలోనో కాసిన్ని నీళ్ళు, మరికొన్ని పరిమళ పూరిత రసాయనాలు కలిపి XYZ లేదా ABCD మాయిశ్చరైజర్లు అంటూ వందరకాల ఉత్పత్తులు అమ్మినట్లన్న మాట.

నకిలీ కణికుడి స్ట్రాటజీలో ఓ పదిరకాలు ఉంటాయి. అయితే వాటిలో ప్రధానమైనవి రెండే.
ఒకటి ఆడది. రెండు ఆకలి. ఎలాగో వివరిస్తాను.

ముందు మరికొన్ని స్ట్రాటజీలు వివరిస్తాను. తము లక్ష్యంగా ఎంచుకున్న జాతిమీదనైనా, దేశం మీదనైనా చివరికి వ్యక్తులూ, కుటుంబాల మీదనైనా, నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే స్ట్రాటజీ…. అహాన్ని తృప్తి పరచటం లేదా అహాన్ని రెచ్చగొట్టటం! అందుకు ప్రాతిపదికగా తీసుకునేది అరిషడ్వర్గాలనే! అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే! అహంకారం లేదా అహం – దీనికి మరో పేరే మదం. జర్మనీలో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టినా, అమెరికాని ప్రపంచానికి అగ్రదేశం అన్న బిరుదిచ్చి నిలబెట్టినా, ఈ స్ట్రాటజీలలో అంతర్గతంగా ఉన్నది అహాన్ని తృప్తి పరచటమే! ఇది ఫలించకపోతే ‘అహాన్ని రెచ్చగొట్టటం’ ప్రయోగిస్తారు. దేశాల మీదే కాదు, వ్యక్తుల మీద నైనా ఇంతే!

ఒకటి ఆడది:
ఇక తము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల మీదికైతే – సదరు వ్యక్తులు అరిషడ్వర్గాలకీ త్వరగా లొంగిపోయే రకాలైతే వారిపై నకిలీ కణికులు వారిపై ఆవే ప్రయోగిస్తారు. అనైతికతతో మరి కొంతమందిని లొంగదీస్తారు. తము ఎవరిని లొంగదీయాలనుకుంటారో, అలాంటి వారిపైకి, ప్రియులు/ప్రియురాళ్ళని ప్రయోగిస్తారు. సదరు వ్యక్తులు ఆ అనైతికతకీ, అక్రమ సంబంధాలకీ ప్రభావితమైతే ఇక సమస్య లేదు. తమకి కావలసినట్లు నడిపించుకోవచ్చు.

భారత తొలిప్రధాని నెహ్రు మీదకి లేడీ బాటన్ ఈ విధంగానే ప్రయోగింపబడిందని అంటారు. ఈ నేపధ్యంలోనే మొన్నామధ్య బాటన్ మనవరాలు, ఆనాటి లేడీ బాటన్, నెహ్రుల మధ్య నడిచిన లేఖల్ని/బంధాన్ని ప్రస్తావిస్తూ, తానో గ్రంధాన్ని రచించానని ప్రకటించింది. సాధారణ వార్తగా సామాన్యులకి పత్రికల్లో, మీడియాలో ప్రకటింపబడే వార్త ఇంతే! అయితే దీని వెనుక, నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, వాళ్ళతో గూఢచర్య యుద్దాన్ని నడుపుతున్న నెం.5 వర్గానికీ మధ్య నడిచిన సంకేత భాష చాలానే ఉంది.

నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా గట్రాలనీ, వాళ్ళ ప్రవర్తనా సరళినీ బహిర్గతపరచటమూ, సువర్ణముఖి అనుభవింపచేయటమూ మానకపోతే, గతించిన నాయకుల వ్యక్తిగత జీవితాల్లో మచ్చలేవైనా ఉంటే వాటిని మేం బహిరంగపరుస్తాం అన్న హెచ్చరిక నెం.5 వర్గానికి అలా ఇచ్చారన్నమాట. అయితే అందుకు నెం.5 వర్గం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. “ఊఁ కానీయ్! ఎవరైనా మాకు ఒక్కటే! ఏది సత్యమో అదే వెలికి వస్తుందనుకుంటాం. అభిమాన నాయకులనుకునో, దేశపు పరువు ప్రతిష్టలనుకునో మీ బ్లాక్ మొయిలింగ్ కి లొంగేదే లేదు. మెదళ్ళతో యుద్దాన్ని ఆపేదీ లేదు” అన్న సమాధానాన్ని నెం.5 వర్గం నుండి విన్నారు. అదీ మాటల్లో కాదు, ’బహిర్గత పరచటం, సువర్ణముఖీ అనుభవింపచేయటం’ వంటి చేతల్ని ఆపకపోవటం ద్వారా! దాంతో ఇక ఆ వార్త అలాగే గమ్మున పక్కకెళ్ళిపోయిందన్న మాట. లేకపోతే జస్వంత్ సింగ్ పుస్తకం రేపినంతటి కంటే ఎక్కువ సంచలనమే బాటన్ మనవరాలి పుస్తకమూ రేపి ఉండేది.

నిజానికి ఇటు వ్యక్తుల మీదకి ప్రియుడు/ప్రియురాళ్ళు ప్రయోగించటం, ఫలించకపోతే – అంటే సదరు వ్యక్తులు అనైతికతని పాల్పడే వ్యక్తులు కాదనుకొండి. కుటుంబగౌరవం, వ్యక్తిగత నైతిక విలువలూ గట్రా ఉన్నవాళ్ళనుకొండి. అప్పుడు ’పెళ్ళి’ అనే వల విసరబడుతుంది.

ఇక్కడ కొన్ని విన్యాసాలని చూద్దాం. యూరప్ చరిత్రలోనే శతాబ్ధాల కీర్తిగల ఇంగ్లండు రాజకుటుంబంలోకి ’ప్రేమపెళ్ళి’ పేరుతో మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చిన అందగత్తె డయానా అడుగుపెట్టింది. మీడియా ఇచ్చిన ఇమేజి ఆ యువరాణిని మరింత మెరిపించింది. తర్వాత ఆవిడ నడవడిక గురించిన ఉదంతాలూ, వార్తలూ ఎంతగా రాజకుటుంబపు పరువు మర్యాదల్ని మంట గలిపాయంటే – చివరికి బకింగ్ హోం పాలెస్ లోని కాపలా పనివాళ్ళు సైతం, ఒక్కనాడూ ఆమె ముఖం దగ్గర నుండి చూసిన పాపాన పోని అనామకులు సైతం, ఆమెతో తమకు లైంగిక సంబంధాలున్నాయని ప్రకటనలిచ్చేసారు.

ఇలాంటి సంచలనాలలో, ఉన్న నిజాలు ఎన్నో తెలియదు గానీ, ఎన్నో కొన్ని నిజాలున్నాయన్నది మాత్రం నిజం. దాన్నే నిరూపిస్తూ డయానా, తన భర్త యువరాజు ఛార్లెస్ కు విడాకులిచ్చి, ప్రియుడితో ప్రయాణిస్తుండగా మీడియా కంటబడి, మీడియా చేతా వెంటాడపడి రోడ్డు ప్రమాదంలో మరణించింది.

డయానా మరణాన్ని ప్రక్కన బెడితే….అంతకు ముందుజరిగిన అన్ని సంఘటనలలోనూ, ఎక్కువగా నష్టపోయింది ఇంగ్లండు రాజకుటుంబమే. పరువుమర్యాదా ధేమ్స్ నదిలో కలిసాయి.[ప్రపంచానికి చేసిన ద్రోహంతో పోలిస్తే ఈ సువర్ణముఖి ఆ రాజకుటుంబం అనుభవించవలసిందేనకుకోండి.] రాచకుటుంబంతో పోలిస్తే డయానా కుటుంబానికి ఏ పేరు ప్రఖ్యాతులూ లేవు. ఏది వచ్చినా [దుష్కీర్తీ కానివ్వండి, సత్కీర్తీ కానివ్వండి, డబ్బు కానివ్వండి] యువరాజుతో వివాహమయ్యాకే! ఈ నేపధ్యంలో….. రాజకుటుంబం ఎన్నిసార్లు, ఎన్ని వ్యవహారాల్లో ఎంత నష్టపోయిందో, ఎంత వెనక్కి తగ్గిందో ఎవరికి తెలుసు? డయానా వంటి సుందరీమణులతో ప్రపంచవ్యాప్తంగా చాలాపనులే చక్కబెట్టగలిగింది నకిలీ కణిక వ్యవస్థ!

ఇలాంటిదే, మనరాష్ట్రంలో మరో ఉదాహరణ – లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ ని డిస్ కార్డ్ చేయటానికి నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు ప్రయోగించిన అస్త్రం లక్ష్మీపార్వతి. హరికథా కథకురాలైన ఈ వీరగంధం లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ తో వివాహంతో పోయిందేమీ లేదు. ఇంకాపైన ఇమేజ్, ఆస్థి వచ్చిచేరాయి. ఎన్టీఆర్ తో పోల్చుకుంటే ఆమెకు పేరు ప్రఖ్యాతులేవీ లేవు గనుక! ఈ ఇద్దరి ద్వితీయ వివాహంతోనూ, తదుపరి పార్టీ, కుటుంబ వివాదాలతోనూ, పోయింది ఎన్టీఆర్ కుటుంబపు పరువు మర్యాదలూ + ఆస్థులే! ఈమెని ఉపయోగించి కావలసిన విధంగా రాజకీయాల్ని, రామోజీరావు నడిపించుకోగలగటం గురించి మీరు నా గత టపాలలో చదివి ఉన్నారు.

ఇలాంటి ‘స్త్రీ అస్త్రాలకు’ తరగనన్ని ఉదాహరణలున్నాయి. కాన్షీరాంని ప్రక్కకు తోసేసిన మాయావతి మరో సజీవ తర్కాణం. కాన్షీరాం బ్రతికి ఉండగానే అతడు స్థాపించిన బి.ఎస్.పి. కాస్తా మాయావతి హస్తగతమైంది. అతడి తల్లీ చెల్లి కోర్టుకెక్కి ఘోల్లుమనాల్సి వచ్చింది.

ఇలా అక్రమ సంబంధాలకి లొంగే వాళ్ళతో నకిలీ కణిక వ్యవస్థ తేలిగ్గానే తమకి కావలసిన విధంగా నడిపించుకోగలదు. ఎటొచ్చీ, ఇలాంటి అనైతికతకి లొంగని రకాలతోనే వీళ్ళకు ఇబ్బంది. ఇక అలాంటి వ్యక్తుల మీదికి ఏకంగా ’పెళ్ళి’ మిష విసురుతారు. నిజానికి ఈ స్ట్రాటజీ చరిత్రలో చాణిక్యుడు ఉపయోగించిన విషకన్య వంటిదే! కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషకన్యలే గాక విషయువకులూ ఉండటం కద్దు.

ఇందుకోసం, బాల్యం నుండీ శిక్షణ ఇవ్వబడ్డ,[ఒక్కమాటలో చెప్పాలంటే Born Spy అన్నమాట] ఏజంట్లు ఉంటారు. ఇప్పడు 16, 17 ఏళ్ళ మానవబాంబులకు మూడు నాలుగేళ్ళ ప్రాయం నుండే శిక్షణ ఇస్తున్నారు చూడండి, అలా! పసితనం నుండీ…. జీవితంలో నటించటం, నేర్పుగా సమాచారం చేరవేయటం, ఎదుటి వ్యక్తికి [అంటే జీవిత భాగస్వామి], అతడు/ఆమె కుటుంబసభ్యులకి అనుమానం రాకుండా పరిస్థితుల్ని ప్రభావపరచటం, వారి మోటివ్స్ తెలుసుకోవటం, తదనుగుణంగా వ్యూహరచన చేయటం, వారి అభిప్రాయాలని ప్రభావపరచటం గట్రాగట్రా కార్యకలాపాలు నిర్వహించేందుకు తగినంతగా శిక్షణ నిస్తారన్నమాట. ఇందిరాగాంధీ కుటుంబలోనికి ప్రవేశపెట్టబడ్డ సోనియా ఇలాంటి వ్యక్తే! జన్మతః కవిగాయకుల లాగా ఇలాంటి వారు జన్మతః గూఢచార నిపుణులు!

ఇలాంటివి కుదరనప్పుడు నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే మరో స్ట్రాటజీ ఏమిటంటే – తము గురిపెట్టిన కుటుంబంలోని ఎవరో ఒకరితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవటం. కాస్ట్రోల సోదరి జువాలిత్ క్యాస్ట్రో మాదిరిగా నన్నమాట!

స్ట్రాటజీ ఏదైనా గానీ, అందులో ప్రధానమైనది ’స్త్రీని ఉపయోగించుకోవటం!’ వీలయితే అక్రమ సంబంధం లేకపోతే పెళ్ళితో సక్రమ సంబంధం! పోకిరి చిత్రంలో పండు గాడన్నట్లు ’ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి’ నకిలీ కణికులకి సిగ్గు అనిపించదు. ఎందుకంటే – తొలితరం నకిలీ కణికుడు వేశ్యపుత్రుడు. లజ్జారాహిత్యం నుండే జన్మించిన వాడు. లజ్జా రాహిత్యాన్ని, సిగ్గు లేనితనాన్ని ఒక బలమైన లక్షణంగా పుణికి పుచ్చుకుని తరతరాలకి, అంతిమంగా సమాజంలోకి బలంగా ప్రవేశపెట్టిన వాడు.

స్త్రీగా, వేశ్యగా, దాసీగా తన తల్లి ’ఉపయోగపడటం’ లో నుండి కలిగిన మనోవికారం, తొలితరం నకిలీ కణికుడిలో ఎంత జుగుప్సాపూరిత భావనలని పెంచిందంటే – అతడికి నీతిగా, శీలవతిగా మెలిగే స్త్రీలంటే కంపరం, భరింపలేనితనం! అది ఒక్క స్త్రీ పట్లే కాదు, నీతిగా, శీలవంతుడిగా ఉండే పురుషుడి పట్ల అయినా ఇతడికి భరించలేనంత అసూయ, క్రోధం!

కనుకనే – సీత తప్ప మరో స్త్రీని ఎరుగని ఏకపత్నీవ్రతుడు రాముడన్నా, శ్రీరాముడు తప్ప మరో పురుషుణ్ణి తలచనైనా తలచని సీతమ్మ తల్లి అన్నా, తొలితరం నకిలీ కణికుడికి చెప్పలేనంత ద్వేషం. దాన్నే తరతరాలకీ, ముస్లింలకీ, సమాజానికీ ఇంజక్ట్ చేసాడు. కాబట్టే…. ఎంతగా హిందూమతాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడో, అంత ప్రయత్నమూ రామాయణం మీద చేసాడు. రామాయణం మీద విషప్రచారం ఒక ఎత్తు, మిగిలిన భారత భాగవతాలపైనా, వేద వేదాంగాలపైనా, పురాణ గాధలపైనా చేసిన విషప్రచారం మొత్తం ఒక ఎత్తు! రామాయణ విష వృక్షమే దానికి నిలువెత్తు ఉదాహరణ! భారతంలోనికీ, భాగవతంలోనికి ఎన్నో ప్రక్షిప్తాలు జోడించినా భారత విష వృక్షాలు రచింపబడలేదు, అలాంటి రచయితలూ రచయిత్రులకు రంగనాయకమ్మలకు నడిచినట్లు బ్రహ్మరధం నడవలేదు.

అలాంటివి తొలితరం నకిలీ కణికుడి మూలాలు. స్త్రీని గౌరవించని, గౌరవించలేని మనోవికారం ఈ వంశీయులది. కాబట్టే ఎవరు అనైతికతకి పెద్దపీటమేస్తారో, లైంగికంగా అక్రమ సంబంధాల పట్ల ఎవరికి లాలస ఎక్కువో, అలాంటి వారికే నకిలీ కణిక వ్యవస్థ ఆర్ధికంగా, కెరియర్ పరంగా, వృత్తి విజయాల పరంగా సఫలతని సమకూర్చింది. వాళ్ళనే పైకి తెచ్చింది. అలాగని పైకి వచ్చిన అందరికి ఇదే బలహీనత అనికాదు. అలాంటి కేటాగిరిలో కొందరు కరుణానిధి, నేదురమల్లి జనార్ధన రెడ్డి గట్రాగట్రాలు! నిన్నటి కర్నాటక రాజకీయాల్లో గనుల మాఫియాగా పేరుపెట్టబడిన గాలిసోదరులు పైకారణంగా చూపించింది కూడా ముఖ్యమంత్రి యడ్యూరప్పకి సన్నిహితురాలైన మంత్రిగా శోభా కరంద్లాజేనే! ఆమె అన్నిటిలో అతిజోక్యం చేసుకుంటుందన్నది పైకి చెప్పిన ఆరోపణ!

నిజానికి నకిలీ కణిక వ్యవస్థ, లైంగిక అక్రమ సంబంధాలకి, అనైతికతకి లొంగేవాడినే ఎక్కువగా ఎంచుకోవటానికి మరికొన్ని కారణాలున్నాయి. అటువంటి సంబంధాలకు లొంగేవారికి తమ జీవిత సహచరి/సహచరుడి పట్ల నిబద్దత ఉండదు. కుటుంబం పట్ల నిబద్దత లేదంటే, అంతగా స్వార్ధపరులన్న మాటే. అలాంటి వారు స్వసుఖం కోసం, స్వప్రయోజనం కోసం ఏం చేయాటానికైనా సిద్దపడతారు. ఇది ఒక ప్రయోజనం.

అలాంటి వారిని మరింత విషయలాలసలోకి దించి, ఆ రహస్యాలన్నిటినీ గుప్పిటిలో పెట్టుకుంటే ఇక చచ్చినట్లు పడుంటారు. అప్పడిక వాళ్ళని ఖర్చుతక్కువతో ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఇది మరో ప్రయోజనం.

ఇక ఇలాంటి అనైతికతకి అంతగా సిద్దపడని వారున్నారనుకోండి. వాళ్ళపైన ఎంత ఒత్తిడి సృష్టిస్తారంటే ‘మానసిక ఒంటరితనాన్ని’ ప్రయోగిస్తారు. అలాంటి ఎడారిలో, ఒయాసిస్సులా, తమ భావాలని అర్ధం చేసుకునే ఒకే ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలుగా ’ఒకరు’ తారసపడతారు. భావ సారూప్యతా, సహ అనుభూతి గాఢమైనాక, అది నెమ్మదిగా ధృడమైన అక్రమ సంబంధంగా లేదా స్నేహ సంబంధంగా మారుతుంది.

ఇలాంటి అవకాశం కూడా లేకపోతే ఇక అప్పుడు ’పెళ్ళి’ అన్నదే ప్రయోగింపబడుతుంది. అదీ కుదరనప్పుడు ఆ కుటుంబానికి ఆప్తమిత్రులూ, కుటుంబ మిత్రులూ, సోదర సోదరీతుల్యులూ ప్రయోగింపబడతారు.

ఈ విధంగా నకిలీ కణికులు ప్రయోగించే స్ట్రాటజీలో ప్రధాన అంశం, అస్త్రం స్త్రీయే!

ఇక రెండోది ఆకలి!
తము లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తి లేదా జాతి లేదా దేశం మీద, నకిలీ కణికులు ప్రయోగించే స్ట్రాటజీ –
ముందుగా వారి ఆర్ధిక మూలాలని దెబ్బగొట్టటం! ఆదాయానికి గండి కొట్టటం, ఖర్చులు పెరిగి పోయేటట్లు చేయటం, క్రమంగా ఆస్థులూ, ఆర్ధిక నిల్వలూ కరిగించటం – పర్యవసానంగా అప్పలలోనికి, ఆ తర్వాత దారిద్ర్యంలోనికి నెట్టటం. అంతిమంగా ఆకలికి గురి చెయ్యటం.

ఎంతగా నీతికో, నమ్మిన విలువలకో కట్టుబడి, నకిలీ కణికుల ఒత్తిడికి తలొగ్గని వారైనా, చివరికి ఆకలికి తాళలేక అయినా లొంగిపోక తప్పని స్థితి కలిగిస్తారు. లేదా మృత్యువు ఒడికి చేరాలి.

వ్యక్తుల దగ్గరి నుండీ దేశాల దాకా ఇదే తంత్రం అమలు చేయబడుతుంది. వ్యక్తులు మృత్యువుకైనా సిద్దపడతారేమో గానీ దేశానికి దేశాలే సిద్దపడలేవు గదా? ఉదాహరణకు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను, ఆకలి దగ్గరికి తీసుకొచ్చింది నకిలీ కణిక వ్యవస్థ!

నకిలీ కణిక వ్యవస్థ ఏ దేశం మీద పట్టుబిగించ దలుచుకుంటే ఆ దేశం మీద –
ముందు వాళ్ళకి బాగా సాగనిచ్చి, ఆ దేశానికి బాగా ఇమేజినిచ్చి, వాళ్ళ అహాన్ని బాగా తృప్తిపరచి, తర్వాత ఒక్కసారిగా ఆర్ధిక ఇబ్బందులలోనికి నెట్టి అహాం మీద దెబ్బతీస్తుంది. అప్పటి వరకూ అతిశయపు శిఖరం మీద ఉన్నవారికి ఆత్మన్యూనత ఆఖాతంలోకి జారిపోవటం చాలా సహజం అవుతుంది. బ్రిటన్, రష్యా దేశాల మీద ఇదే ప్రయోగించింది. రెండవ ప్రపంచయుద్ధం బ్రిటన్ ప్రాభవం కుప్పకూలటానికి పైకారణం[over leaf reason] అయితే, అసలు సోషలిజం కుప్పకూలటమే, పెరిస్త్రోయికా పేరుతో USSR చిన్నాభిన్నమైపోవడానికి పైకారణమయ్యింది. [over leaf reason]

లేదా ముందు నుండే ఆర్ధికంగా బలపడనివ్వకుండా ఉండటం! ఎక్కువగా – మానసిక స్థైర్యమూ, వృత్తిగత ప్రతిభా, వ్యక్తిగత సామర్ధ్యాలూ ఎక్కువగా ఉన్న వ్యక్తుల మీదా, అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్న దేశాల మీదా, నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే తంత్రం ఇది. భారతదేశం మీద తొలితరం నకిలీ కణికుడి కాలం నుండి [దాదాపు 350 సంవత్సరాలుగా] ఇదే ప్రయోగింపబడుతోంది. అఫ్ఘనిస్తాన్ నుండి ఎడారి దొంగలైన ముస్లింలూ, యూరపు నుండి సముద్రపు దొంగలైన తెల్లవాళ్ళు భారతదేశంలోకి రావటానికి ముందు, దేశాన్ని దోచుకుని పోకముందు, భారతదేశం సర్వసంపదలతో తులతూగుతుండేది. విద్యాసంస్కృతాలతో అలరారుతుండేది. జ్ఞాన జ్యోతులతో వెలుగులు ప్రసరిస్తూ ఉండేది.

అలాంటి ప్రకృతి సహజ వనరలూ, సారవంతమైన భూమినీ, భావవాద మూలాలున్న జాతినీ, కలిగి ఉన్న భారతదేశాన్ని, దోచిదోచి పీల్చి పిప్పిచేసి, చివరికి అప్పలు పాలు చేయటంలో నడిచింది ఈ తంత్రమే! ముస్లిం రాజుల దోపిడి నుండీ క్రమంగా యూరోపియనుల దోపిడిలోకి పరిణమించాక, నకిలీ కణిక వ్యవస్థ అందులో అంతర్గతంగా ఎలా పనిచేసిందో గతటపాలలో వివరించాను. నిజానికి ఇదీ తొలితరం నకిలీ కణికుడి బుర్రలో నుండి పుట్టిందే! అప్పటి నుండీ ఇప్పటి దాకా తరతరాలుగా నకిలీ కణిక వ్యవస్థ అమలు చేస్తున్నదే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

సోదరీ, చాలా సార్లు టపా చదువుతూ సగం దూరం రాగానే ఈ టపాకి ఎలాగైనా కామెంట్ వ్రాద్దామనుకుంటాని. కానీ చివరికొచ్చేటప్పటికి ఏదో సినిమాలో చెప్పినట్టు "ఎవడి పేరు చెపితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో " అన్నట్టు మనసులో మీటపా తప్ప ఇంకేమీ మాటలు రావు. ఇదీ అలాంటిదే... చాలా బాగుంది. విశ్వామిత్రుని మీదకు రంభ(? లేదా మేనకనా? ) ను పంపినట్టు.

:) మేనకనే సోదరా!

భా.రా.రె.గారూ, ఇద్దఱినీనూ! కానీ అది ఇలాంటి వ్యవస్థ మాత్రం కాదు :) శ్రీమద్రామాయణం బాలకాండలో ౫౫వ సర్గతో అనుకుంటాను మొదలు విశ్వామిత్రచరిత్రం ఉంటుంది, చదవండి :)

ఆదిలక్ష్మిగారూ, నాకు ఎప్పటికప్పుడే మీ బ్లాగు మొదటినుండీ చదవాలని అనిపించడమూ, కొంత చదవడమూ, మళ్లీ ఏదో ఒక అవాంతరం వచ్చి ఆగిపోవడమూ... ఇది మామూలైపోయింది. ఈ నకిలీకణికవ్యవస్థ గుఱించి ఏ టపాతో ప్రారంభించారో ఆ టపా వెంటనే చదివేయాలి అని తీర్మానించుకున్నాను. :)

కామినీ-కాంచనాలు అని కదా అంటారు, మీరు కామినీ-క్షుత్తులు అన్నారేమిటి? బొత్తిగా ఆకలివఱకూ తీసుకువస్తారా? అలా చేస్తే మిగతావాళ్లు చూస్తూ ఊరకుంటారా?

రాఘవ గారు,

చంద్రబాబునాయుడు నా సొంత తమ్ముళ్ళని చేరదీసి, మాకే ప్రత్యక్షంగా పస్తులు చూపించాడండి. చుట్టు ఉన్నవాళ్ళు చూస్తూ ఊరుకోవటం నాకు అనుభవమే. తోడపుట్టిన వాళ్ళే కాదు, బంధుమిత్రులు కూడా. పైపెచ్చు ఎదురుతిరగ కూడదు, తలవంచుకు పోవాలి అని సలహాలు కూడా చెప్పారు. ఇది మా స్వానుభవం, పీవీజీ - రామోజీరావు - మా కథ లేబుల్ లో వివరించాను.

మా విషయం వదిలేసినా, స్వాతంత్ర సమర యోధులు ఆకలి, దారిద్ర్య బాధలు భరించలేక ఇప్పటి ఈ రాజకీయనాయకుల కాళ్ళపై పడిన ఫోటోలు కూడా నేను చూశాను. ప్రత్యక్షంగానూ పరిశీలించాను. ఆనాటి దేశభక్తుల వారసులని పరిశీలించి చూడండి. మీకే అర్ధమవుతుంది. నెనర్లు!

Nrahamthulla చెప్పారు...

ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు

అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే

మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష --ఆరుద్ర

వివాహేతర సంబంధాలు ఇస్లాంలో హరాం.జిహాద్ అంటే ధర్మ యుద్ధం.ఇటువంటివన్నీ నీచమైన పాపాలే.నేరం ఏమతస్తుడు చేసినా నేరమే.జిహాదులు చేసే వాళ్ళంతా హంతకులు.మానవత్వం లేని రాక్షసులు.నేను వీళ్లను నమ్మను.మానవత్వమే అన్ని మతాలకంటే మంచి మతం.
మహానుభావుడు గురజాడ పలికిన మాటలు చూడండిః
"మతములన్నియు మాసిపోవును
జ్నానమొక్కటె నిలిచివెలుగును
ఎల్లలోకములొక్క ఇల్లై
వర్ణబేధములెల్ల కల్లై
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమనిలిపిన ప్రేమ నిలుచును
బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు
ప్రీతిగూర్చునో వాడెధన్యుడు"

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu