"నెం.5 వర్గం నన్ను నమ్ముతోంది. ఇదిగో ఈ సీనియర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇదిగో ఈ XYZ లు నన్ను ఇరుకున బెడుతున్నారు. ఈ problem solve అయితే మరింకా చాలా ప్రోగెస్ వస్తుంది” అంటూ నమ్మబలికాడు. అతడన్నదానికల్లా నెం.5 కూడా ఇతోధికంగా అవునన్న Picture ఇచ్చింది. ఆ XYZ లు సీనియర్లు కాకా, వీ.హెచ్.ల వంటి వారు కావచ్చు. కే.కే.ల వంటి వారు కావచ్చు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి వంటి వారు కావచ్చు. పి.జె.ఆర్., మర్రిశశిధర్ రెడ్డిల వంటి వారు కావచ్చు. ఒక్కొక్కరినీ ఒక్కోవిధంగా నలగేసి గ్రిప్ వచ్చేటట్లు…. సాక్షాత్తూ నెం.10, రామోజీరావు కూడా ఏ.ఐ.సి.సి. అధిష్టానం ద్వారా గ్రిప్ ఇచ్చేటట్లు…. రాజశేఖర్ రెడ్డి చూసుకున్నాడు.

పంచతంత్రం కథలో గుడ్లగూబకి పిల్లినీ, పిల్లికి వేటగాణ్ణి చూపించి, పబ్బం గడుపుకున్న ఎలుకలాగా తాను చాలా తెలివిగా గూఢచర్యం నడుపుతున్నాననుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇందులో ఉన్న స్ట్రాటజీ గానీ…. రామోజీరావుకీ, నెం.10 కీ, సోనియాగాంధీకి నడవవలసి ఉన్న సువర్ణముఖి రీత్యానూ, వాళ్ళ నిజరూపాలు బహిర్గతం [Expose] కావటం కోసమూ, నెం.5 ఇదంతా allow చేస్తోందనిగానీ…. గ్రహించగలిగేంత తెలివితేటలు రాజశేఖర్ రెడ్డికి లేవు. తనకు నెం.5 ని చూపిస్తూ, మధ్యలో రాజశేఖర్ రెడ్డి ’సందట్లో సడేమియా’ అన్న సామెత చందాన, మరింకేవో నడుపుతున్నాడన్న అనుమానం, నకిలీ కణికవ్యవస్థకి, రామోజీరావుకి రాలేదు. వచ్చిన పరిస్థితులు అందుకు Support చేయలేదు.

ఒక వ్యక్తికీ, ఒక వ్యవస్థకీ ఇనుపతెర[Iron curtain] వేయటం గూఢచర్యంలో సాధారణం. ఎవరికి పట్టు ఎక్కువ ఉంటే వారు ఇది చెయ్యగలరు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఎమర్జన్సీ విషయంలో నకిలీ కణిక వ్యవస్థ అనుసరించింది ఈ తంత్రమే [స్ట్రాటజీనే]. రష్యా విడిపోక ముందు ఇలాంటి తెర వేసే, సోవియట్ రష్యా గురించి ప్రపంచానికి చూపించింది.

ఇటీవల వచ్చిన ’కింగ్’ సినిమాలో, హీరోయిన్ త్రిషకి, హీరో నాగార్జున, ఆమె పాటకి అభిమానులు పడిచచ్చిపోతున్నారని, ఆమె పాడనంటే నిజంగా అత్మహత్యలు చేసుకోబోతున్నారనీ నమ్మిస్తాడు. అతడి అనుచరులంతా కలిసి ఇచ్చిన పిక్చర్ కి, ఆమె నిజంగానే తనకి అందరు అభిమానులున్నారనీ, తానో గొప్ప గాయకురాలిననీ నమ్మేస్తుంది. అది సినిమా కాబట్టి, అందులో అది వినోదార్ధం ఉన్న హాస్యం కాబట్టి మనం నవ్వేస్తాం. పెద్దగా ఆలోచించం. కానీ అది గూఢచర్యంలో అవసరానికి బాగా ఉపయోగపడే బలమైన స్ట్రాటజీ.

’ఇదేమిటి, ఈవిడ అన్ని సినిమాల్లో అంశాలు చూపిస్తుంది’ అనుకోకండి. 1992 కు ముందర వరకూ నకిలీ కణిక వ్యవస్థ, ప్రజలలో తార్కిక శక్తిని నాశనం చెయ్యటానికీ, ఉత్సాహ ధైర్యాలని హరించటానికీ సినిమా మాధ్యమాన్ని వాడుకుంటే 1992 తర్వాత పీవీజీ, నెం.5 వర్గం, అదే సినిమా మాధ్యమాన్ని, టీవీ [సీరియళ్ళ]మాధ్యమాన్ని ప్రజలు కుట్రలని అర్ధం చేసుకునే స్థాయికి తీసికెళ్ళటానికి ఉపయోగించింది, ఉపయోగిస్తోంది.

సరే! మళ్ళీ విషయం దగ్గరికి వద్దాం. నెం.5 వర్గాన్ని నమ్మిస్తున్నానంటూ నెం.10 వర్గాన్ని, అందులోని కీలక వ్యక్తి రామోజీరావునీ, అతడి సోదరతుల్యరాలైన సోనియాగాంధీని నమ్మిస్తూ తన బలం, బలగం పెంచుకుంటూ పోయాడు రాజశేఖర్ రెడ్డి. కాబట్టే ఇప్పుడు తిరిగిచూస్తే అతడి సంపాదన 73వేల కోట్లనీ, అంతకు కొంచెం ఎక్కువో తక్కువో ఉంటుందనీ వార్తలొస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ దగ్గర నుండీ, వీలయిన అన్ని మార్గాల్లో అతడు అక్రమార్జన చేసాడన్నది అతడి మరణానికి పూర్వం నుండే ఉన్న విమర్శలలో ఒకటి.

ఈ నేపధ్యంలో ‘సందట్లో సడేమియా’ అన్న చందాన రాజశేఖర్ రెడ్డి తన బలం బలగం పెంచుకుంటూ పోతుండగా, చివరికి ప్రభుత్వధనంతో పర్సనల్ ఇమేజ్ పెంచుకునే విధంగా ‘నా మనసే మహా శివుడు’ అంటూ ప్రకటనలు ఇచ్చుకున్నా, అందర్నీ తనకు విధేయులయ్యేటట్లుగా మలచుకున్నా నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు గానీ, సోనియాగాంధీ కానీ అభ్యంతర పెట్టలేదు. మీదు మిక్కిలి అధిష్టానం రాజశేఖర్ రెడ్డికి పూర్తి మద్దతుగా ఉందన్న సంకేతాలూ ఇచ్చారు.

అయితే, క్రమంగా ’రాజశేఖర్ రెడ్డి అక్కడున్నదానిని తాను గ్రహిస్తున్నాడా లేక తాననుకున్నది అక్కడుందను కుంటున్నాడా? విషయాన్ని సరిగ్గా గ్రహిస్తున్నాడా లేదా! సమాచారాన్నీ సరిగా గ్రహించి విశ్లేషిస్తున్నాడా లేక తాను అనుకున్నది తమకి చెపుతున్నాడా’ అన్న సందేహం వచ్చింది. అంతే తప్ప రాజశేఖర్ రెడ్డి తమకే ’బుస్సు’ వేసేంతగా తోక ఝాడించగలడని అనుకోలేదు. ఎందుకంటే గూఢచర్య జ్ఞానం ఏమాత్రం ఉన్నవాడైనా తమతో అలాంటి చర్లాటలు ఆడడు గనుక! ముఖ్యమంత్రి సీట్ ఎక్కించే ముందే రాజశేఖర్ రెడ్డిని తగినంతగా నలగేసి ఎక్కించినందున, అతడంత రిస్క్ తీసుకోడన్న అభిప్రాయంతో ఉన్నందున, నెం.10 వర్గం రాజశేఖర్ రెడ్డి గ్రాహ్యశక్తిని మాత్రమే అనుమానించి, అతడి నుండి మరింతగా విషయసేకరణ చేయాలన్న ప్రయత్నం చేసింది.

ఆ క్రమంలో, రాజశేఖర్ రెడ్డి, గూఢచర్యంలో తనదైన ’మిర్చి మసాలా’ కలపటం లేదు కదా అన్న అనుమానం రామోజీరావుకు వచ్చింది. సమాచారాన్ని తమకు పారదర్శకంగా చెప్పడం లేదనీ, ఇంకేదో Hide outs ఉన్నాయనీ తోచింది. అబద్దాలు చెప్పేటప్పుడూ, నిజాలనూ దాచినప్పుడు, అతకూ పొతుకూ లేని సమాధానాలు రావడం, తడబాట్లు పడటం, పరస్పర విరుద్ధమైన సమాధానాలు, వివరణలు చెప్పడం సహజం. అది గ్రహించలేనంత అమాయకత్వం నెం.10 వర్గంలోనూ, నకిలీ కణికవ్యవస్థలోనూ లేదు, రామోజీరావులో అంత కంటే లేదు.

దెబ్బతో గూఢచర్యపు వేగం పెరిగింది. కొంచెం కెలికి చూడటంతోనే రాజశేఖర్ రెడ్డి దగ్గర తేడా ఉందని అర్ధమైంది. మొత్తం వ్యవహారం చక్కదిద్దుకునే క్రమంలో, ముందుగా ఏంజరిగిందో కనుక్కోవాల్సి ఉంది. అది పూర్తయ్యింతర్వాతే తాము ఏ చర్య అయినా తీసుకోగలిగేది. ఏం జరిగిందో సమాచారం సేకరించుకునే ప్రయత్నంలో తానుండగానే, రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయ్యింది. హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయన్న విషయం తెలిసిన తర్వాత, ఏం జరిగిందో తెలుసుకోవటానికి బయటికి చెప్పినట్లు 24 గంటల సమయం పట్టదు. అసలు గాలింపు చర్యలు ప్రారంభం అయ్యేలోపున గడిచిన మూడుగంటల్లోనే హెలికాప్టర్ ఏమయ్యిందో, ఎక్కడ కూలిపోయిందో…. ప్రజలకి తెలియకపోవచ్చు గానీ, అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వానికీ, నెం.10 వర్గానికీ కాదు. గల్లంతు విషయం బయటికి పొక్కేలోగానే తమపని ప్రారంభించారు. ఎందుకంటే తాము విషయసేకరణ అనంతరం, అంటే కొంత వ్యవధి తర్వాత తప్పించదలచుకున్న పాత్ర, ఇంత అర్దాంతరంగా, తమ విషయసేకరణ, తమ పని, సగంలో ఉండగానే ఎలా తప్పించబడింది? యాదృచ్చికంగానే ప్రమాదం జరిగిందా? ఎవరైనా జరిపించారా?

ఇది వెంటనే తేల్చుకునే నిమిత్తమే, గాలింపు చర్యలూ, మిస్సింగ్ వార్త బయటికి పొక్కటమూ కూడా, హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయిన కొన్నిగంటల తర్వాత జరిగాయి. ఉదయం 8.35 కి బయలుదేరిన హెలికాప్టర్ కి రాడార్ తోనూ, భూతల కేంద్రం తోనూ 9.35కి సంబంధాలు తెగిపోతే మధ్యాహ్నం 12 గంటలు తర్వాత గానీ వెదుకులాట ప్రారంభం కాలేదు. రమారమి మూడుగంటలు జాప్యం. ఈ లోపున ఏం జరిగింది? నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలకవ్యక్తి రామోజీరావూ తరుపు ’పరిశోధకులు’ ముందుగా సంఘటనా స్థలంని చేరుకుని, ‘ప్రమాదం యాదృచ్చికమా?, ప్రయత్నపూర్వకమా?’ అన్నదానిని నిర్ధారించుకున్నారు. విస్పోటన పదార్ధాలున్నాయా? హెలికాప్టర్ శకలాలు పడి ఉన్న తీరు, మృతులు శరీరాల పరిస్థితి…. అన్నిటినీ పరిశీలించుకుని, తదుపరి పరిశీలనార్ధం సాంకేతికంగా రికార్డు చేసుకున్నాక మాత్రమే, వార్త బయటకి, మీడియాకి పొక్కింది. దాదాపు అదే సమయంలో గాలింపు మొదలయ్యింది. ఆ తర్వాత, సాయంత్రం నాలుగు గంటలకి అప్పటి ఆర్ధికమంత్రి రోశయ్య, అధికారికంగా, సీ.ఎం. హెలికాప్టర్ గల్లంతయ్యిందని ప్రకటించాడు.

అనధికారికంగా, సీ.యం.హెలికాప్టర్ క్షేమంగా లాండ్ అయిందనీ, వర్షం వల్ల బయటికి రావటానికి ఇబ్బంది పడుతుండవచ్చనీ తను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పాడు. ఇక ‘అక్కడ లాండ్ అయ్యిందట. ఇక్కడ లాండ్ అయ్యిందట. సీ.ఎం. నడుచుకుంటూ వస్తున్నాడట’ అంటూ అనేకరకాల ఉహాగానాలూ, కట్టుకథలు ప్రచారమయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువన చూశామని కొందరూ, దిగువున చూశామని కొందరూ, నీరుగంగ దగ్గరని కొందరూ, అక్కమహాదేవి గుహదగ్గరని కొందరూ, రిజర్వాయర్ నీటిలో ఇంధనం తెట్టుకట్టిందనీ, మెరుపు మెరిసిందనీ, పెద్దచప్పుడయ్యిందనీ, అలాంటివేవీ గమనించలేదనీ…. ఇలా రకరకాల వదంతులు. వీటికి మీడియా కూడా తనవంతు ప్రాధాన్యం ఇచ్చి మరింత సంచలనాలు రేపింది.

అదేదో నల్లమల అడవులు, భట్టివిక్రమార్క కథల్లోని లాంటి దుర్గమారణ్యాలు అయినట్లు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అయినట్లు వెదుకులాటకు 24 గంటలు సమయం పట్టింది. ఎంత వర్షం కురిసి వాగులు వంకలూ పొంగాయి అనుకున్నా, నల్లమల అడవులు అంత దుర్భేద్యమైనవి కావు. శ్రీశైలంలో ఏడేళ్ళు నివసించిన మాకు తెలిసిన, విన్న సమాచారంతో, అక్కడి గిరిజన యువకులు అడవి లోతట్టుప్రాంతాలకు ఎంత వర్షంలోనైనా వెళ్ళి రాగలరు.

అసలు, వేసవి కాలంలో చూస్తే, నల్లమల కొండలన్నీ గుండు కొట్టినట్లు, ఆకులు రాలిన చెట్లకొమ్మలతో రెండుమూడు కిలోమీటర్ల లోపల ఏముందో, రోడ్డుమీదనుండి కనిపించేటట్లుగా ఉంటాయి. అంతగా అడవిని గొరిగి తినేస్తున్నారు. దీనిలో ప్రధాన వాటా ఫారెస్ట్ డిపార్డ్ మెంటు వారిదే! తత్తూరు జాతరకి నాగలి, ఎడ్లబండి కి కావలసిన కలపను తీసుకురావటానికి అడవి లోపలికంటా వెళ్ళి, పెద్దపెద్ద మానుల్ని కొట్టుకొస్తారు. అది కూడా కొండలోయలు దాటి! ఎక్కడ తమకి కావలసిన కలప దొరుకుతుందో వాళ్ళకి బాగా తెలుసు. ఫారెస్ట్ డిపార్ట్ మెంటు కంటే వీళ్ళకే అడవి గురించి బాగా తెలుసన్న మాట. శివరాత్రి తర్వాత మొదలుపెట్టి, కాలినడకన, ఉగాదికి శ్రీశైలం చేరే, కన్నడ భక్తులు, అడవి దారిలో వస్తూ, చాలా ఎత్తూ, లావూ ఉండే వెదురు బొంగుల్ని కొట్టుకొస్తారు. వాటిని అలంకరించి ఉగాది నాడు రధాన్ని అలంకరిస్తారు. అడవిలో అతి లోతట్టుప్రాంతాలుగా పిలిచే ప్రదేశాల వరకూ కాలిబాటలున్నాయి. మేకలు కాసే వాళ్ళు, గడ్డికోసం, కట్టెల కోసం వెళ్ళేవాళ్ళ ’పుణ్యం’ అది. ఇది గాక దాదాపు ప్రతి రాత్రీ, అడవిని తగలేసి బొగ్గులు తయారు చేసేవారి పుణ్యాన అడవి మరింత పల్చబడింది. ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో తమ వాటా తమకి వస్తూంది కాబట్టి, ఫారెస్టు డిపార్ట్ మెంటు వారు ఆనందంగా అంధులైపోతారు. ఫలనా ఫారెస్ట్ రేంజ్ వాళ్ళు ఇంత తింటున్నారు, మేం తక్కువ తింటున్నామని, తమ ఉన్నతాధికారులతో మీటింగ్ లలో సైతం అందరూ కలిసి వాదించటం మేమే స్వయంగా చూసాము.

వర్షాకాలంలో చిగురించిన చిగురులతో అడవంతా ఆకుపచ్చగా శోభించే మాట నిజం. వాగులూ వంకలూ జలపాతాలూ ఉన్నమాటా నిజమే. అయితే అడుగుపెట్టలేనంత లేదా ఏ అనుపానులూ కనిపెట్టలేనంత దుర్గమం అయితే కాదు. అంత దుర్గమమే అయితే, నక్సల్స్ కదలికలు మాత్రం ఎలా సాధ్యం?

అదీగాక సీ.ఎం. హెలికాప్టర్ మిస్సయ్యిందన్న సెప్టెంబరు 2 వ తేదీన, అప్పటికి రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం, 2 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మా నంద్యాలలో హఠాత్తుగా తెరిపి ఇచ్చింది. వాతావరణం హఠాత్తుగా ఫెయిర్ అయిపోయింది. [బీజింగ్ లో ప్రారంభమైన ఒలింపిక్స్ ఉత్సవాలకి వర్షం ఆటంకం కలిగించకుండా మబ్బుల్ని చెదరగొట్టారు. కృత్రిమ వర్షాలకోసం బడా కంపెనీలు కాంట్రాక్టులని పుచ్చుకుని పనిచేస్తున్నాయి. కాబట్టి వర్షం కురిపించగల, తెరిపి ఇప్పించగల సాంకేతికత ఉందన్న విషయం అందరికీ తేటతెల్లమే.] నంద్యాలకు ప్రమాదస్థలం అయిన పావురాలగుట్ట ప్రాంతం రెడియల్ గా మహాఅయితే 50 కిలోమీటర్లు మించి ఉండదు.

ఇది మైదాన ప్రాంతం, అది కొండలూ గుట్టలూ ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అనుకున్నా, రెండవ తేదీ రాత్రి వరకూ వర్షం తెరిపి ఇవ్వకుండా కురిస్తుందన్నా, సుఖోయె విమానాలకీ, 11 హెలికాప్టర్లకీ జాడ తెలియకపోవచ్చు గానీ, కాలినడకన 5000 మంది CRPF సిబ్బంది[మంత్రి పల్లంరాజు ప్రకటన] అడవిని అంగుళం అంగుళం గాలించినా జాడ తెలియకపోవటం అంటే అసహజమే!

నక్సల్స్ గాలింపులో భాగంగా గ్రౌహోండ్స్ దళాలకి అడవిలో గడపటమూ అలవాటే, అడవిలో తిరగటమూ అలవాటే. ఇక స్థానిక గిరిజనులకి అది పుట్టుకతో వచ్చే అలవాటు. పాములపాడు BSNL టవర్ లో నమోదైన కాల్ కి, నల్లకాల్వ వైపు హెలికాప్టర్ వెళ్ళటం చూసినట్లు గ్రామస్తులు చెప్పిన సమాచారన్ని కలగలుపుకొని, గిరిజనులు సహకారంతో ఆ పరిసరాల్లో వెదికితే అచూకీ పట్టుకోవడం అసంభమేమీ కాదు. ఎందుకంటే రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు తలుచుకుంటే – మనసుంటే మార్గానికి కొదవరాదు, రాజు తలుచుకుంటే దెబ్బలకీ కొదవరాదు. కాబట్టి గల్లంతయిన హెలికాప్టర్ ఆచూకీ, అందులో ప్రయాణిస్తున్న అయిదుగురి క్షేమ సమాచారం 24 గంటలకు పైగా జాప్యం తర్వాత వెలికి రావటంలో చాలా నాటకీయత ఉందని నిర్ధారణగా చెప్పవచ్చు. [ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ టపాల మాలికలోనే, తర్వాత చర్చిస్తాను.]

ఎందుకంటే – హెలికాప్టర్ గల్లంతు వార్త బయటకి పొక్కి గాలింపు చర్యలు ప్రారంభం కావటానికి మధ్య మూడుగంటల జాప్యం ఉంది. ఆ సమయాన్ని నెం.10 వర్గమూ, నకిలీ కణికవ్యవస్థా, రామోజీరావు, హెలికాప్టర్ ప్రమాదం సంభవించిన తీరు[యాదృచ్చికమా, లేక పధకం ప్రకారం జరిగిందా అన్న విషయం] గురించి శోధించడానికి gain చేసుకున్నారు. ఇక ప్రమాద/మరణ వార్త బయటకి తెలియటానికి తీసుకున్న 24 గంటల సమయాన్ని, తదుపరి వ్యూహాన్ని రచించుకోవడానికి gain చేసుకున్నారు.

ఇదంతా బహిరంగం కాకుండా ఉండేందుకూ, ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా ఉండేందుకు, మీడియా ’అతి’ సంచలనాలు రేపింది. అతుకుబొతుకు లేని వార్తాంశాలు ప్రచారం చేసింది. నిరవధిక ప్రత్యక్ష ప్రసారాలు చేసింది. దానికి తగ్గట్లే ప్రభుత్వమూ ’3 హెలికాప్టర్లు, 7 హెలికాప్టర్లు, 11+ హెలికాప్టర్లు రంగంలోకి దింపి, సమయం గడిచే కొద్దీ…. సైనిక ట్రూపులూ, సుభోయ్ విమానాలు, ఇస్రో విమానాలు, చివరికి అమెరికా అన్ని రకాల సాయం చేస్తుందన్న వరకూ, రకరకాల హైరానా పడింది. అంతకంతకూ ప్రయత్నాలు పెరిగిపోయినా, ఫలితం రానందున, ఎల్లెడలా ఉత్కంఠ పెరిగి పోయింది.

1992 కు ముందరైతే, నకిలీ కణిక వ్యవస్థకి ఎదురేలేదు గనుక దశాబ్ధాల క్రితమే, సుదీర్ఘమైన పధకాలు రచించి, వెంట్రుక వాసి తేడా లేకుండా జరిపించగలిగింది. ఎవరికి గూఢచర్య బలమూ, పట్టూ, ఎక్కువ ఉంటే, వారు ఇలా జరిపించుకోగలరు. ఒక సంఘటనను డిజైన్ చేస్తే, తదుపరి కార్యక్రమాన్నంతా కూడా, ముందే సిద్దం చేసుకున్నాకే రంగంలోకి దిగుతారు.

ఉదాహరణకి 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోనూ, మరికొన్ని చోట్లా సిక్కుల ఊచకోత చేసినట్లు! తర్వాత మీడియాకి కావలసినన్ని సంచలనల వార్తలు! 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరమూ ఇదే కథ. LTTE గురించీ, వారి సైనేడ్ గుళికల గురించి, అప్పటికి మానవబాంబులు కొత్తయినందున ఆ సంచలనాల గురించి, ఊపిరి సలపనంతగా వార్తాపత్రికల పేజీలు కిక్కిరిసిన వార్తలతో నిండిపోయాయి. ’ఆత్మహుతికి సిద్దపడేటట్లు చిన్నపిల్లల్ని తీసుకుని ’బ్రెయిన్ వాష్’ చేయటం తప్పుకదా’ అన్న విమర్శలు వస్తే, మరుక్షణం ’అసలలా Train up చేయగలిగారంటే ఆ LTTE నాయకత్వం ఎంత గొప్పది కదా’ అన్న ప్రశంసలూ వెల్లువెత్తాయి. అదే ఇప్పుడైతే మానవబాంబుల్ని తయారుచేయటం అతి సాధారణం, అతి చౌక అయిపోయాయి. అమ్మఒడిలో ఆటలాడుకునే పాలబుగ్గల పసిపాపల వయస్సునుండే బ్రెయిన్ వాష్ చెయడం ఎంత ’అమానుషమో’ అందరికీ అర్ధమయ్యేంతగా బహిర్గతమయ్యింది.

ఇలాంటి వాటికి మరో ఉదాహరణ వంగవీటి మోహనరంగా హత్యకేసు. హతుడు రౌడీ. తర్వాత రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. అతడేమీ అహింసావాది కాదు, గాంధీమహత్ముడు అంతకన్న కాదు. అలాగే హంతకులూ అలాంటివాళ్ళే. అదీగాక హతుడూ, హంతకులూ కూడా నకిలీ కణిక గూఢచార వలయంలో ఛోటామోటా పావులే! ఆ స్పృహ వారికి కూడా లేనంత ఛోటా మోటా పావులు. అంటే తమపైన, తమ చుట్టూ, అంతగా గూఢచర్యం అల్లుకుని ఉంటుందని వారికే తెలియనంతగా అన్నమాట. హత్యాకాండ గూఢచర్య తంత్రంలోని భాగమే. పధకం ఎంత పక్కాగా ఉండిందంటే, అతడి హత్యానంతరం విజయవాడ, గుంటూరులలో చెలరేగిన దమనకాండలో…. లూటీ, దహనాలు విపరీతంగా జరిగాయి. అవన్నీ organized గా జరిగాయి అని స్థానిక వ్యాపారులు తర్వాత మొత్తుకున్నా అతీగతీ లేకుండా పోయింది. స్థానిక ఆంధ్రప్రదేశ్ మీడియానే గాకుండా, ఢిల్లీ డి.డి. తో సహా, దాదాపు 15 రోజులకు పైగా తొలివార్తా, వార్తల సమయం, పేజీల్లో సగానికి పైగా ఆక్రమించిన ప్రధాన వార్తా ఇదే![అమెరికా లో నల్లవారు కూడా ఇదేవిధంగా దోపిడి చేయటం గమనార్హం!] అంతగా ఒక ముఖ్య సంఘటన, దాని తదుపరి పరిణామాలు, వాటిపై మీడియా వ్యూహమూ ఒక పద్దతి ప్రకారం ఉంటాయి.

అటువంటిది ఈ వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం విషయంలో, మీడియా చేసిన ’అతి’ సందడిలో తాత్కాలికంగా చేసిన Time gain మాత్రమే ఉంది. సెప్టెంబరు 2 వతేదీ సీ.ఎం. మిస్సింగ్ మాత్రమే కాదు, మూడవ తేదీ ఉత్కంఠ, 4 వతేదీ అంతిమ యాత్ర…. తదుపరి వరుసగా ఆగిన అభిమానుల గుండెలూ, ఆత్మహత్యల పరంపర. నెలకి ’200రూ.’ వృద్దాప్యఫించను ఇచ్చే ’దేవుడు’ ఇక లేడన్న సత్యం మింగుడుపడక గుండెలాగి మరణించిన అభిమానులు, వికలాంగ ఫించన్లు రావని గుండెపోటులు తెచ్చుకున్న అభిమానులు! ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు ఇక రావని అన్నం నీరూ మానేసి టీవీ చూస్తూ ఏడ్చి ఏడ్చి మరణించిన వందలాది పౌరులూ! తిరుపతిలో కోటిరూపాయలతో గుడికట్టిస్తానన్న చెవిలో పువ్వురెడ్డి. ఇంకానయం! వై.యస్. స్వర్ణప్రతిమ పెట్టి అష్టోత్తర శతనామావళి, క్షీరాభిషేకమూ చేయిస్తారంటూ మీడియా ఊదర బెట్టలేదు గానీ, పెట్టి ఉంటే, టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన భక్తుల ఫోటోలు కూడా ప్రచురణకు నోచుకుని ఉండేవి.

ఈ విధంగా మీడియా, వై.యస్.రాజశేఖర్ రెడ్డిని ఎందుకు అంత అర్జంటుగా దేవుణ్ణి చేసేసిందంటే – ఆ సంచలనం, ఆ ’అతి’ హడావుడి పేరిట, జనాల దృష్టిని హైజాక్ చేయటానికి. ఆ విధంగా దాదాపు కొన్నిరోజులపాటు [10 నుండి 14 రోజులపాటు] Time gain చేసుకునేందుకు. ఇప్పుడు తాము [అంటే మీడియా] దేవుడంటే – ఇప్పటికిదే ట్రెండు అనుకుంటూ అనుసరించే నాయకులూ, వారిక్రింది [తమ్ముళ్ళు] మంది మార్భలమూ, వ్యూహాత్మక కార్యకర్తలూ, అమాయక కార్యకర్తలూ పొలోమంటూ అదే అనుసరిస్తారు. అందరూ అదే అంటున్నారు, మనం అనకపోతే ’ఉలిపికట్టెలం’ అయిపోతామని మరికొందరు అమాయక పౌరులు హడావుడీ పడిపోతారు. పదిమంది వెళ్ళిన దారిలో వెళ్ళాలనుకోవడం మనిషికి సహజ లక్షణం. పుట్టుకతో వచ్చే లక్షణం. ఎందుకంటే మనిషి సంఘజీవి గనుక!

కాబట్టి ఆ విధంగా చచ్చిపోయిన ముఖ్యమంత్రిని అర్జంటుగా దేవుణ్ణి చేసేస్తే, భజన చేస్తూ కొందరూ, ’ఇదెక్కడి గోల? ఇతడు దేవుడేమిటి?’ అంటూ చికాకూ, ఆందోళనా పడుతూ మరికొందరూ…. ఎవరి గొడవలో వారుంటారు. ఈ లోపున తము, ఆనూ పోనూ తెలుసుకోవచ్చు, ఏం జరుగుతోందో అర్ధం చేసుకుని తదుపరి వ్యూహాం సిద్ధం చేసుకోవచ్చు.

ఇది నెం.10 వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ. అయితే ఇదే విషయంలో నెం.౫ వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ ఏమిటంటే…..

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

నల్లమల అడవులు మీరు వ్రాసినంత సుగమమైన అరణ్యాలు కావు. జనావాసాలైన పట్టణాలకు దగ్గఱలో ఉన్న అడవి పల్చగా ఉంటుంది. కానీ పోనుపోను భయంకరంగానే ఉంటుంది. ఆ అడవిలో నక్సలైట్లు తిరగ గలగడానికీ, మామూలు మనుషులు తిరగలేకపోవడానికీ సంబంధం లేదు.

క్రైస్తవ రెడ్డి యొక్క మృతావశేషాల్ని కనుగొనడంలో/ కనుగొనలేకపోవడంలో ఏదో కుట్ర ఉందని నేననుకోవడం లేదు. భౌగోళిక పరిస్థితుల ముందు, ప్రకృతి ముందు ఎంత శక్తిమంతమైన ప్రభుత్వాలైనా బహు నిస్సహాయమైనవి. ఈ ప్రభుత్వాలు మనం అనుకుంటున్నంత knowledgeable కాదు. సర్వశక్తిమంతాలు అంతకంటే కాదు. వాళ్ళు దేవుళ్ళూ కారు. మూడేళ్ళ క్రితం నార్త్ సీ లో ఐసులో ఇఱుక్కున్న తన జలాంతర్గామిని రష్యన్ ప్రభుత్వం సకాలంలో ఆదుకోలేకపోవడంతో అందులోని 115 మంది సిబ్బందీ అక్కడే జలసమాధి అయ్యారు.

ఇవన్ని తేలీదు కాని.. రెడ్డి మరణం లొ ఎదో కాన్స్పిరసి వుంది.. ఇది సహజమయిన ఇన్సిడంట్ కాదనిపిస్తుంది. అంతా అర్గనైజిడ్ గా జరిగిందంది అని నా అభిప్రాయం.. ఎవరు చేయించారొ తెలీదు కాని..
బాలయొగిది ..ఇది ..మాత్రం జస్ట్ మిస్టకెస్ మాత్రం కాదు అని నా అభిప్రాయం.

aacident vishayam lo naaku antagaa samdehaalu levu kaani, tarvata jarigina time gain vishayamlo naaku kuda chaalaa anumaanaalunnaayi.
set avvadaniki tisukunna time laa anipistundi

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu