‘దాడులకు కుట్ర’ పేరుతో ఆగస్టు 18 వ తేదిన వచ్చిన ఈనాడు వార్తలో –
సోమవారం [17 Aug.2009] నాడు దేశరాజధానిలో అంతరింగిక భద్రత, కరువుపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం పలు కీలక ప్రతిపాదనలు, హెచ్చరికలు చేసింది. దేశం జాగరూకతతో ఉండాల్సిన అవశ్యకతను నొక్కిచెప్పింది. పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ప్రధాని అమలు చేశారు. “భారత్ పై తాజా దాడులకు పాకిస్తాన్ లోని తీవ్రవాద గ్రూపులు కుట్రలు పన్నుతున్నాయి. ఈ మేరకు మా వద్ద విస్పష్ట సమాచారం ఉంది. కాబట్టి దేశమంతటా అప్రమత్తంగా ఉండాల”ని హెచ్చరించారు.[ అంటే ప్రజలంతా తమని తాము కాపాడుకోవటానికి కాపలా కాసు కోవాలి కాబోలు!] తద్వారా… పాక్, అంతర్జాతీయ సమాజాలు స్పందించాలన్న సంకేతాల్ని పంపారు. ఈ ఏడాది చొరబాట్లు కూడా పెరిగాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని ప్రధాని చెప్పారు. “తీవ్రవాదుల కార్యకలాపాలు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి” అని ఆయన ముఖ్యమంత్రుల భేటీలో బహిరంగ హెచ్చరిక చేశారు. తీవ్రవాద ప్రణాళికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తమవద్ద ఉందని ఆయన తెలిపారు. జాలర్ల వేషంలో పాకిస్తాన్ కు చెందిన తొమ్మిదిమంది భారత్ లోకి ప్రవేశిస్తూ కచ్ తీరంలో పట్టుబడిన నేపధ్యంలో ప్రధాని ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మరో ముంబై తరహా దాడులకు తీవ్రవాదులు కుట్రపన్నుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఎన్నడూ భారత ప్రధాని ఒకరు ఇలాంటి హెచ్చరిక చేయలేదు” అని వ్రాసింది.

చాలాబాగుంది. మరి ఇన్ని తెలిసి ఉండీ, ఈ మన్మోహన్ సింగ్, ఇటీవలి ఈజిప్టు పర్యటనలో…. ముందస్తు అజెండాలో లేకపోయినా…. ఆకస్మికంగా….[వ్యక్తిగత ఆసక్తితో కాబోలు] పాక్ ప్రధాని గిలానీతో చర్చలు జరిపేసి, సంయుక్త ప్రకటన కూడా ఇచ్చేస్తూ….”బెలూచిస్తాన్ తో సహా, అన్ని విషయాలపై, ముంబైదాడుల ప్రసక్తి ప్రక్కన పెట్టి మరీ చర్చిస్తామని” ఎందుకు ప్రకటించినట్లు? ఈ విషయాన్ని పురస్కరించుకునే ప్రతిపక్షనేత యశ్వంత్ సిన్హా, సాక్షాత్తూ పార్లమెంట్ లోనే “భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా పాక్ శిబిరంలో చేరిపోయారు” అన్నాడు. [అలా అన్నందుకు మూల్యం చెల్లించుకుంటున్నాడు లెండి. దృష్టాంతం కావాలంటే – ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం, యశ్వంత్ సిన్హాకు, స్వంత పార్టీ బిజేపి కూడా, పార్లమెంటు కమిటీల ఛైర్మన్ పదవుల్లో మొండిచెయ్యి చూపెట్టింది. తమ ప్రత్యర్ధి పార్టీ యూపిఏ ని అంత ఘాటుగా విమర్శించినందుకు, అలాంటి విషయాల్లో పార్టీ నాయకత్వాన్ని ఒత్తిడి చేస్తూ, ఎదిరిస్తూన్నందుకు భాజపా ఇచ్చిన బహుమతి అది. ఇక్కడ తెలియటం లేదూ భాజపా అగ్రనాయకులు అద్వానీ గట్రాలు కూడా, యూపిఏ మరియు కాంగ్రెస్ అగ్రనాయకుల్లానే నకిలీ కణిక వ్యవస్థలో సహచర సభ్యులని?]

నిజం చెప్పాలంటే యూపిఏ ప్రభుత్వం ఏవిధంగా ’సాచాటు ధోరణి,’ అనే పైముసుగులో దేశంపై టెర్రరిస్టుల దాడులు జరగనిస్తూన్నారో, అదేవిధంగా పాక్ ’భాదిత దేశం’ అనే పైముసుగులో తమ దేశపు గడ్డమీది నుంచే భారత్ పై టెర్రరిస్టు దాడులకు పధక రచన, అమలూ కూడా నిర్వహిస్తోంది.

ఈ విషయమై ఈనాడు మరో వ్యాఖ్య కూడా చేసింది. ’గతంలో ఎన్నడూ భారత ప్రధాని ఒకరు ఇలాంటి హెచ్చరిక చేయలేదు’ అని. నిజమే మరి! గత కాలంలో భారత ప్రధానులు ప్రజల పట్లా, దేశం పట్లా నిబద్ధత గలవారు. కాబట్టి ఆ దాడుల్ని ఎలా ఆపాలా, పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలా అని ప్రయత్నించేవాళ్ళు. మరి ఈ సింగ్ ఈజ్ కింగ్ కదా! అంచేత ఈయన గారు ప్రజల్ని అధికధరల విషయంలో [2008 మార్చి నాటి నుండి] లాగే ప్రజల్ని హెచ్చరించటంతో తమ బాధ్యత తీరిందంటూ చేతులు దులిపేస్తాడు.

ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. మన సింగ్ గారి దృష్టిలో పాక్ వేరు, పాక్ తీవ్రవాదులు వేరు. అక్కడికి అదేదో పాక్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ, ప్రభుత్వ నిఘా ఏజన్సీ ఐ.ఎస్.ఐ. గానీ పాక్ తీవ్రవాదుల్ని ప్రోత్సహించటం లేదన్నట్లు! ఆ విధంగా ఎంత చక్కని తోడ్పాటును పాకిస్తాన్ కు అందిస్తున్నారో, నాడు పాక్ నుండి వలస వచ్చిన నేటి భారత ప్రధాని! అంతేకాదు, ఆ విధంగా, భారత్ [ప్రజలతో సహా] వేరు, యూపిఏ ప్రభుత్వం వేరు అని కూడా నిరూపిస్తున్నారు. ఎటూ యూపిఏ ప్రభుత్వం పాక్ శిబిరంలో చేరి పోయిందన్నది తేలిపోయింది కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu