తొలిరోజుల్లో సినిమా రంగం మిగిలిన కళారూపాలతోనూ, కళారంగాలతోనూ పోటీ పడేందుకు తీవ్రంగా పెనుగులాడవలసి వచ్చింది. అందుచేతే పాత సినిమాలన్నీ[భారతదేశంలోని పాత సినిమాలు, ఏ భాషలోనివైన సరే] పురాణగాధలపైనా, చారిత్రక జానపద కధాంశాల పైనా ఆధారపడి ఉండేవి. నాయికా నాయకులకు త్యాగనిరతి, ధీరత్త్వం ఉండటం తప్పనిసరి. కాబట్టే అప్పటి సినిమాలు సాహిత్య సంగీత విలువలతో నిండి, ఎక్కువ ప్రదర్శనాకాలం కలిగి ఉండేవి. అప్పట్లో సాంఘిక కథలని ప్రజలు తోసిపుచ్చేవారట. “ఆఁ. ఏం కథలురా? ఓ పుణ్యమా, పురుషార్ధమా?" అనేవారట. మెల్లిగా ప్రజలు సినిమాల పట్ల ఆకర్షితులయ్యారు. మెల్లిగా సినిమా రంగంలోని సాంకేతికత, యాంత్రిక పరిజ్ఞానం తాలుకూ అడ్వాంటేజ్ లు పనిచేయటం ప్రారంభించాయి. నటీనటులకు పాడగల నైపుణ్యం లేనప్పుడు [ప్లే బ్యాక్ సింగర్స్] నేపధ్యగాయకులు అందుబాటులోకి వచ్చారు. కెమెరా పరిజ్ఞానం దృశ్యాలని, నటీనటులని అందంగా ఆకర్షణీయంగా చూపించింది. ప్రపంచంలోగల అందమైన ప్రదేశాలని, రమ్యమైన రంగుల్లో చూపించింది. సామాన్య ప్రజలూ, రైతులూ దాదాపు వెళ్ళలేని, లేదా వ్యయప్రయాసలతో మాత్రమే దర్శించగల ప్రదేశాలని చూపించింది. భూమ్మీద లేని వింతల్ని కూడా సెట్టింగ్స్ వేసి, ఇప్పుడైతే గ్రాఫిక్స్ సహాయంతోనూ చూపగలిగి ప్రేక్షకుల్ని అద్భుతలోకాల్లో విహరించేలా చేస్తోంది. ఇవన్నీ ప్రజలనెంతో ఆకర్షించాయి, ఆకర్షిస్తున్నాయి.

ఈ విధమైన ప్లస్ పాయింట్లతో ప్రజలు సినిమాలకు అలవాటు పడటంతో, క్రమంగా మిగిలిన కళారూపాలు మరుగునపడ్డాయి. అయా కళాకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మెల్లిగా వాళ్ళు మరో వృత్తుల్లోకి మళ్ళారు. కాని రక్తంలో ఉన్న సృజనాత్మకత, కళాతృష్ణ వాళ్ళని అటు పదార్ధవాద ప్రపంచంలోనూ సర్ధుకుపోనివ్వడం లేదు. ఇటు భావవాద రసమయి కళాజగత్తులో అవకాశం లేదు. వెరసి వాళ్ళ జీవితాలు, జీవిత సాఫల్యాలూ త్రిశంకు స్వర్గస్తులైనాయి.

ఈ విధంగా, క్రమంగా పోటీ అంతరించింది. దాంతో తదుపరి కాలంలో సినిమా తన విశ్వరూపాన్ని ’డామినేషన్’ అన్న ప్రక్రియతో చూపటం మొదలుపెట్టింది. వాస్తవం చెప్పాలంటే ఇది మెండెల్స్ చెప్పిన పరిణామవాదమే [Struggle for existence]. ప్రతీ జీవి, ముందు జీవన పోటీలో ఆస్తిత్వం కోసం పోరాడుతుంది. పోటీ దారులు నశించాక, గెలిచిన జీవి, పరిస్థితుల మీద ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ఒక్క జీవశాస్త్రానికే కాదు, మోనోపలిగా రూపాంతరం చెందుతున్న ప్రతీ వ్యాపార రంగంలోనూ అనువర్తించవచ్చు.

ఈ దృష్టితో చూస్తే, కళారంగంలో – గతంలో కళారూపాలన్ని పురాణగాధలపై ఆధారపడి రూపొందినవై ఉండేవి. వాటితో పోటీ పడేందుకు సినిమారంగం కూడా పురాణగాధలపైనే ఆధారపడేది. క్రమంగా సాంఘిక సినిమాలు రావటం మొదలైంది. తొలినాళ్ళలో ప్రఖ్యాత నవలలూ, ఇతర అంశాల ఆధారంగా కథా చిత్రాలు వచ్చాయి. మీరు గమనించి చూడండి, పాత సినిమాల్లో ప్రజలని ఆకర్షించేందుకు సాంఘిక చిత్రాల్లో కూడా ప్రధాన కథకు అనుసంధానిస్తూ ఏదో రూపంలో ఓ చిన్ని పురాణ లేదా ఇతిహాస అంశాన్ని జోడించేవారు. ఉదాహరణకి ‘అప్పుచేసి పప్పుకూడు’ అనే పాత సినిమాలో నాయికా నాయకుల స్వప్నం రూపంతో ’నలదమయంతి’ ఉపాఖ్యానం మలచబడింది.

క్రమంగా సినిమా, ఇతర కళారూపాల మీద పట్టు సాధించింది. కాలం గడిచే కొద్దీ డబ్బూ, వ్యాపారం ఇబ్బడిముబ్బడి అయ్యింది. మెల్లిగా గాడ్ ఫాదర్ ల వ్యవస్థ కేంద్రీకృతం అయ్యింది. నియంత్రణ మొదలయ్యింది. వీరి తెరవెనుక నియంత్రణ, మొత్తం సినిమారంగాన్ని, ఎంతగా గుప్పెటలోకి తీసుకుందంటే, కథ దగ్గర నుండి నిర్మాణంలోని ప్రతీ అంశం దాకా, [Success] సఫలత దగ్గర నుండి సాఫల్య పండగల [Success functions] దాకా! ఈ మొత్తానికి ‘డబ్బూ, వ్యాపారం’ అన్నది పైకి చెప్పబడిన పైకారణం [over leaf reason] మాత్రమే. గూఢచర్య స్ట్రాటజీ, కుట్ర, అంతర్గత కారణం. ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటానికి, సినిమా, తిరుగులేని, ఏకైక సాధనం అయ్యింది. నిజానికి ఈ సినిమా రంగపు గాడ్ ఫాదర్ లు కుట్రదారులైన నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ ఏజంట్లు లేదా భాగస్వాములే.

ఈ గాడ్ ఫాదర్ ల వ్యవస్థ కారణంగా నైపుణ్యహీనులు అద్భుతనిపుణులుగా, నిర్వీర్య నిర్వేద కథలు అద్భుతమైన, బలమైన కథలుగా ’స్టాంపు’ వేయబడ్డాయి. ఆ విధంగా ’ఫట్’ సినిమాలు కూడా ’హిట్’ సినిమాలుగా చెప్పబడేవి. [ఇప్పుడూ ఆ ఒరవడి కొంత ఉంది] అప్పట్లో అంటే 1975 నుండి 1992 దాకా ఓ బహిరంగ వ్యాఖ్య ఉండేది, ఫట్ సినిమాలని హిట్ సినిమాల పేరిట ప్రదర్శిస్తున్న ధియేటర్లు, నష్టాల్లో నడుస్తున్నాయని! తర్వాత పంపిణీ వ్యవస్థ మాయాజాలంతో అసలు ఏ సినిమాకు డబ్బూ బాగా వచ్చాయో, దేనికి నష్టాలొచ్చాయో ఎవరికీ తెలీని స్థితి ఏర్పడింది. మీడియా, సినిమా పత్రికలూ, ఇతర పత్రికలు దేన్ని హిట్ అంటే అది హిట్, ఏది ఫట్ అంటే అది ఫట్ అనిపించుకోబడింది. ఒకోసారి హిట్ సినిమా తీసిన నిర్మాణ సంస్థలూ, నిర్మాతలూ నష్టాల్లో కూరుకుపోయేవారు, పంపిణీదారులకు లాభాల పంట పండేవి. ఫట్ అయినా ‘హిట్ అన్పించుకున్న’ నిర్మాణ సంస్థలూ, నిర్మాతలూ లాభపడేవారు. క్రమంగా నిర్మాణసంస్థలకీ, నిర్మాతలకి లాభసూత్రం తెలిసిపోయింది. దాంతో గాడ్ ఫాదర్ ల నియంత్రణానుసారం, వారిచ్చిన కధాంశాలతో చిత్రనిర్మాణం సాగించటం చేశారు. దాంతో ధియేటర్లలో ఫట్ సినిమాలు హిట్ పేరుతో ప్రదర్శింపబడుతూ నష్టాలొచ్చినా సరే, 50 రోజుల లేదా 100 రోజుల పండగలు మాత్రం జరపబడేవి. కేవలం కొందరు రచయితలూ, గాయకులూ, నటులూ, నటీమణులూ, అలాగే దర్శకులూ ఇతర సాంకేతిక నిపుణులూ మాత్రమే ఖ్యాతినీ, కెరియర్ నీ పొందారు. మిగిలిన వాళ్ళు పోటీపడలేక తెరమరుగైపోయారు. క్రమంగా ’మోనోపలి’ స్థాపించబడింది. తమకి నచ్చని వ్యక్తులపైనా, లేదా తమమాట వినని వ్యక్తులపైనా [వాళ్ళెవరైనా సరే! నటీనటులు కావచ్చు, దర్శక నిర్మాతలు కావచ్చు] దుష్ర్పచారాలు, వత్తిళ్ళు నడిచాయి. ఇందులో భాగమే శ్రీమతి భానుమతీ రామకృష్ణకు మీడియా ఇచ్చిన బిరుదు ’అహంకారి’. అలాగే మహానటి సావిత్రికిచ్చిన దుష్కీర్తి తాగుబోతు. ఇందిరాగాంధీకి ప్రత్యామ్నాయంగా, ఇమేజ్ ఇచ్చి ఉపయోగించదలిస్తే సావిత్రి అంగీకరించలేదన్న కసీ,కోపం, ఆవిడపై ఒత్తిళ్ళు కలగజేసి, వ్యక్తిగత జీవితం వైఫల్యాల పాలై, వ్యసనపరురాలైందన్న ప్రచారం హోరెత్తింది. నిజంగా కూడా ఆవిడ, కెరియర్, డబ్బూ అన్నీ నష్టపోయి అవసానదశలో నరకం చవిచూసిందని పేరు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ ల పట్టు మరింతగా పెరిగిపోవటం కూడా సత్యం. తమకు అనుకూలురైన వారికి ఇమేజ్, అనుకూలం కాని వారికి డామేజ్ ఇవ్వగల సత్తా, అప్పటికి గాడ్ ఫాదర్ లూ, మీడియా వ్యవస్థీకరించుకున్నారు. మీరు 75 నుండి 92 వరకూ గల సమయాన్ని పరిశీలించనట్లయితే, సినిమా రంగానికి సంబంధించిన వివిధ విభాగాలు సంగీతం, దర్శకత్వం, నాయికా నాయకుల కెరియర్ మొదలైన విషయాల్లో ఈ స్థితి మరింతగా పెరగడం గమనించవచ్చు.

ఓ ఉదాహరణ పరిశీలించండి. 1970 లలో, 1980 కు ముందు తెలుగు సినిమా సంగీత రంగంలో కనీసం 20 మంది గాయనీగాయకులు ఉండేవాళ్ళు. ఘంటసాల, పీబీ శ్రీనివాస్, పిఠాపురం, మాధవపెద్ది సత్యం, కెబికె మోహన్ రాజు, ఎ.ఎం.రాజా, [అప్పడప్పుడూ బాలమురళీకృష్ణ, జేసుదాసులు పాడేవారు] జిక్కీ, జమునారాణి, లీల, సుశీల, రాణి, రమోలా, ఎల్.ఆర్. ఈశ్వరి మొదలైన వాళ్ళు, ఎంతోమంది ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో అంటే 1980 ల తర్వాత నుండి 1992 వరకూ గమనించండి. మొత్తం పరిశ్రమని అధిపత్యం చలాయిస్తూ గాయకుడు బాలసుబ్రమణ్యం, గాయనీమణులు సుశీలా, జానకి, చిత్రలు మాత్రమే తెలుగు సినిమా పాటల్ని పాడారు. 1990 ల తర్వాత బాలసుబ్రమణ్యం ప్రభ హిందీ సీమకి సైతం పాకింది.

ఈ విధమైన ’మోనోపలి’ని సృష్టించడం ద్వారా, మొత్తం సినిమారంగాన్ని, సినిమావ్యాపారాన్ని, నియంత్రించటం, దాన్ని డబ్బుగా మార్చుకోవటం, గాడ్ ఫాదర్ లకు సులభసాధ్యమైంది. ఎవరైతే గాడ్ ఫాదర్ లకు విధేయులో వాళ్ళు మాత్రమే సినిమారంగంలో రాణించేవారు, అవిధేయులు తెరమరుగైపోయేవారు. ఈ స్థితి నటీనటుల దగ్గర నుండీ, దర్శక నిర్మాతలూ, కథారచయితలూ, సంగీత దర్శక, గాయకుల వరకూ, ఇతరుల వరకూ ఉండేది. అంతేకాదు అన్నిభాషల చిత్రసీమల్లో ఇదే స్థితి ఉండేది.

ఈ విధంగా ఎవరినైనా, దేనినైనా Fade in or Fade out చేయగల శక్తి, అంటే హిట్ లేదా ఫట్ స్టాంపు వేయగల శక్తి, గాడ్ ఫాదర్ లకి సినిమా రంగమ్మీద 100% పట్టునిచ్చింది. పైకి కనబడటానికి ఈ గాడ్ ఫాదర్ ఒకవ్యక్తి కావచ్చు లేదా ఒక సంస్థ కావచ్చు. అయితే సదరు వ్యక్తుల లేదా సంస్థల వెనుకా ఉండేది అచ్చమైన గూఢచర్యమే. ఈ మేలి ముసుగు వేసుకుని పనిచేసింది నకిలీ కణిక వ్యవస్థే. కాబట్టే భారత దేశంలోని అన్ని భాషాచిత్రాలదీ ఇదే కథ కాగా, ప్రపంచభాషల్లోనూ పరిస్థితి తద్భిన్నమేమి కాదు. బాలీవుడ్ చిత్రసీమలో తొలినాళ్ళలో హాజీ మస్తాన్, మొదలియార్, ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఇలా పరంపర కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళ ఆశీస్సులుంటే పెట్టుబడి దగ్గర నుండి విజయోత్సవ సభ దాకా అన్నీ సజావుగా సాగిపోతాయి. లేకుంటే ఇంతే సంగతులు.

ఓ ఉదాహరణ పరిశీలిస్తే ఈ విషయం మరింత సుస్పష్టంగా కనబడుతుంది. 2000 సంవత్సరంలో ప్రముఖ పత్రికలన్నింటిలోనూ ప్రచురితమైన ఉదంతం ఇది. అప్పట్లో దావూద్ ఇబ్రహీంతో, హిందీ సినిమా నటుడు సంజయ్ దత్ [ఇతడి తండ్రీ సునిల్ దత్ కూడా, రాజ్ కపూర్ లా దేశవిభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారత్ కి వచ్చినవాడే] సంభాషణ గల టేపులు, [టెలిఫోన్ ట్యాపింగ్ వట] బయటికొచ్చాయి. వాటిల్లో స్కూలుకుర్రాడు, సహవిద్యార్ధుల గురించి ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేసినట్లుగా, సంజయ్ దత్, తన సహనటీనటుల గురించి ఫిర్యాదు చేస్తున్నట్లుంది. ఆ విషయమై ఎంతో సంచలనమూ రేగింది. సందేహాస్పదమూ అయ్యింది. అదొక్కటే కాదు 2008, నవంబర్ 26న ముంబై ముట్టడి నేపధ్యంలో సైతం, ఈ నటీనటులెవ్వరూ పాక్ తీవ్రవాదాల్ని పల్లెత్తుమాట అననూ లేదు. భారతీయుల వేదనను పంచుకోనూ లేదు. ప్రాణాలు కోల్పోయిన వారిపట్లగానీ, ప్రజల ప్రాణాలని కాపాడటానికి తమ ప్రాణాలు ధారపోసిన పోలీసుసిబ్బంది, వీర జవానుల గురించి గానీ, ఒక్క సంతాపమూ చెప్పలేదు. తమిళ పరిశ్రమలో చిన్ననటులు మాత్రమే సంతాపసభ నిర్వహించారు. రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా సంతాపం తెలియజేయటానికి ఆ సభకు రాలేదు. అంతగా, కెరియర్ కోసం, గాడ్ ఫాదర్ ల పట్ల దాసులు, సదరు నటీనటులు! నకిలీ కణిక వ్యవస్థకు చెందిన గాడ్ ఫాదర్ లకు పాక్ ప్రాణసమానులు కదా మరి? పరిశీలించి చూస్తే ఇలాంటి తార్కాణాలు కోకొల్లలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

Well written.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu