ఎప్పటిలాగా ముందుగా ఓ కధవ్రాసి, దాని విశ్లెషణా, మనజీవితాల్లో కధాసారపు అనువర్తనా మీకు వివరించాలనుకొన్నానండి!

కానీ చిన్న బిర్రే....క్!

ఈలోగా సరదాగా కాసిన్ని కబుర్లూ, సామెతలూ, చెణుకులూ.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

నవంబరు 24 న కేంద్ర ప్రభుత్వ కుర్చీవ్యక్తి నాయకురాలు నాగమ్మ[సోనియమ్మ] “ఉగ్రవాదాన్ని మతంతో ముడి పెట్టవద్దు” అని చాలా విశాలహృదయంతో ప్రకటించింది.

నవంబరు 26 న ముంబాయి మీద దాడి చేసిన ఉగ్రవాదులు తాము దక్కన్ ముజాహిదీలమనీ ప్రకటించుకున్నారు.

ఈ ముట్టడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, సంఘటన జరిగిపోయాక ప్రధాన మంత్రి చల్లగా సెలవిచ్చారు. అఖండ హైదరాబాద్ దేశాన్ని కోరుతూ చేశామంటున్నది దక్కన్ ముజాహిదీన్ సంస్ధ. దీనివెనుక ఆల్ ఖైదానే ఉండనీయండి, పాకిస్తానే ఉండనీయండి, పాతబస్తీనే ఉండనియ్యండి, ఉన్నది మాత్రం ముస్లిం ఉగ్రవాదులే.

[మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, భారతదేశంలో ఎక్కడ ఏ బాంబులు పేలనీయండీ, ఉగ్రవాదం పెచ్చరిల్లనీయండి, వాటి మూలాలు మాత్రం హైదరాబాద్ కి ముడిపడి ఉంటాయి.]


మరి ఉగ్రవాదాన్ని మతంతో గాక దేనితో ముడిపెట్టాలి? ఈవిడతో ముడిపెట్టాలా?

ఇది చదివినప్పుడు గుర్తుకొచ్చిన సామెత ఏమిటంటే

’పట్టినోడు పక్కె అంటే పక్కనున్నోడు జెల్ల అన్నాట్ట’

[అంటే సాక్షాత్తూ చేపని పట్టినోడు, తను పట్టిన చేప పక్కె రకానికి చెందింది అంటే పక్కనున్నవాడు కాదు అది జెల్లరకం అన్నాట్ట.]

ఉగ్రవాదం చేసిన వాడు మతం పేరు చెబుతుంటే, ప్రక్కనున్న ఈవిడ కాదంటోంది. ఔరా! ఏం విచిత్రం?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***


నవంబరు 26 రాత్రి 10:30 గంటలకీ ముంబైలో వరుస బాంబులు పేలి వందల ప్రాణాలు గాల్లో కలిసాయి. మరికొన్ని వందలమంది గాయాల పాలయ్యారు.

ఇందుకు ఒక్కరోజు ముందు అంటే నవంబరు 25 సాయంత్రం, సప్తగిరి ఛానెల్లో భారత హోం శాఖ ప్రధాన కార్యదర్శి మధుకర్ గుప్తా, పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళిన వార్త చూసి ఇది వ్రాస్తున్నాను.

సామెత వ్రాసే ముందు మరికొంత వివరణ వ్రాస్తాను.

డిసెంబరు6, 1992 లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూలినప్పడు ఆ జిల్లాకు ఎస్.పి.గా ఉన్న మధుకర్ గుప్తా అనే ఈ ఐ.పి.యస్. అధికారి ఆ తర్వాత 15 సంవత్సరాలలో పదోన్నతల నిచ్చెనలో పై కెగబాకి 2007 కల్లా కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హోదానధిష్టించారు. అయన పాక్ పర్యటనకి వెళ్ళిన మర్నాడు ఇంత దారుణ మారణ కాండ జరగడం [వాజ్ పేయ్ హయంలో ఇండియా-పాక్ బస్ సర్వీసు ప్రారంభించిన తర్వాత కార్గిల్ యుద్దం జరిగినట్లు] యాదృచ్చికమే కావచ్చు లేదా వ్యూహత్మకం కావచ్చు, లేదా ప్రణాలికా బద్దమే కావచ్చు. ఉగ్రవాద నిరోధానికి మార్గాలు అన్వేషించడానికి, చర్చించడానికి ఆయన పాక్ సందర్శనకు వెళ్ళారట.

ఈ సందర్భంలో గుర్తొస్తున సామెత ఏమిటంటే

‘కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడొచ్చిందట’.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇప్పటి వరకూ, మనం సినిమా పాటలకి పేరడి చూశాం కదా! ఇప్పడు సరదాగా హోంశాఖ ప్రధాన కార్యదర్శిలాంటి వారి శాంతి చర్చలకి పేరడీ చూద్దామా?

ముందుగా అసలు వారి చర్చ ఎలా ఉంటుందంటే:

భారత్ కార్యదర్శి: ఇది చాలా దురదృష్టకరం! ఇలా ఉగ్రవాదం పెచ్చరిల్లటం, మాదేశ ప్రజలూ, మీ దేశ ప్రజలూ ప్రాణాలు కోల్పోవటం మనం సహించకూడదు. ఈ ఉగ్రవాదాన్ని ఎలాగైనా అరికట్టాలి.

పాక్ కార్యదర్శి: అవునవును. మీరన్నది అక్షరాలా నిజం. ఉగ్రవాదాన్ని మనమంతా కలిసి తుదముట్టించాలి.

ఇకపేరడీ ఎలా ఉంటుందంటే:

భారత్ కార్యదర్శి: ఏమిటండీ ఇది? 1992 లో మా శాయశక్తులా, బాబ్రీ మసీదు కూలగొట్టే సంఘటనని రక్తికట్టించాం. సాంకేతికంగా, న్యాయశాస్త్రపరంగా, చట్టబద్దంగా మీకెంతో సహకరించాం. అయినా మీరు ఇండియాని, స్వాతంత్రానికి పూర్వంలాగా ముక్కచెక్కలు చెయ్యలేకపోయారు. ఆ తర్వాత, ఇప్పడూ మేమింతగా సహకరిస్తూన్నా, ఏవో కొన్ని బాంబులు వేయడం తప్పితే ఇండియా అంతు చూడలేక పోతున్నారు. ఇలా అయితే ఎలా? మీ పని తీరు ఏం బాలేదు. మెరుగుపరుచుకోండి.

పాక్ కార్యదర్శి: మాఫ్ కీజియె! మీరంత అగ్రహించకండి. మీరన్నది నిజమే. ఇక చూడండి, మేం మరింత రెచ్చిపోతాం. దయచేసి మీరు మాత్రం మీ సహకారాన్ని ఆపకండి. మరింత పెంచండి. మేం మా శాయశక్తుల దాన్ని ఉపయోగించుకుంటాం.]

తరువాత చూశారుగా ముంబాయిలో భీభత్సం.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

26/11/2008, వార్త చదివి ఇది వ్రాస్తున్నాను. భారత పర్యాటక శాఖా మంత్రి అంబికా సోని, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడానికి, పర్యాటక శాఖాదాయపు అభివృద్ది కోసం ఇచ్చిన ప్రకటన [అంటే స్టేట్ మెంట్ అన్నమాట].

ఆర్ధిక మాంద్యం మూలంగా ఉద్యోగాలు కోల్పోయి, తీసికొన్న బుణాలు తిరిగి చెల్లింపువాయిదాల ఒత్తిడి నుండి మనశ్శాంతి పొందటానికి భారత్ ని పర్యటించవలసినదిగా ఆవిడ పర్యాటకులకి స్వాగతం చెప్పారు. అంతేగాక భారత సందర్శించడానికి ఇది తగిన సమయమనీ ముక్తాయించారు.

పర్యాటక శాఖాభివృద్దికై పనిచేస్తూన్న ఆవిడ చిత్తశుద్దిని శంకించలేం గానీ, అది చదవగానే

’ఊరు వెల్లువ పాలయితే పిల్లి పాలకేడ్చిందన్న’సామెతా,

’ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పుడిగాడట మరోకడూ’ అనే సామెతా గుర్తు రావడం లేదూ?

ఉద్యోగం పోయి, తీసుకొన్న అప్పలే కట్టలేక భవిష్యత్తేమిటిరా దేవుడా అని తలపట్టుకూర్చున్న వాణ్ణి, మనశ్శాంతి కోసం మాదేశం పర్యటించు [ఉచితంగా కాదు, నీ డబ్బుల్తోనే సుమా] అనడం అంటే ఇంకే మనాలి? అంతే కాదండోయ్! మరోసామెత కూడా గుర్తొస్తుంది.

’మొదల్లేదు మగడా, అంటే విసిరి పెసర పప్పొండు పెళ్ళమా!" అన్నాడట ఓ భర్త.

నిజమే కదూ! ఎంతగా ప్రభుత్వమే వ్వాపారం చేస్తోన్నా, మరీ ఇంత సంస్కారహీనమూ, అమానుషమూనా? ఇలాంటి అలోచనాధోరణి ఉన్న ప్రజానాయకులకు మనపట్ల మాత్రం ఏపాటి ప్రేమ ఉంటుంది?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

1975-77 ల్లో ప్రముఖంగా విన్పించిన జోక్ ఇది.

ఈ జోక్ నేపధ్యమేమంటే :

1970 లనుండి, 75 లతర్వాత ఇందిరా గాంధీకి ప్రభుత్వం లోపలా, దేశంలో లోపలా ఎన్నో సమస్యలు ఎదురై, ఆవిడ అంతశ్చేతన ఆవిడకి ’ఎక్కడో ఏదో జరుగుతోంది’అని చెప్పింది కాబోలు, దాని కావిడ ’విదేశీ హస్తం’ అని పేరు పెట్టింది. దానితో ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ ఓ ప్రకటన చేసింది.

“భారతదేశం మీద విదేశీ కుట్ర జరుగుతోంది. ఏదో విదేశీ హస్తం మనదేశంలో పనిచేస్తోంది” - ఇదీ ఆప్రకటన.

[అందుకే కాబోలు ఆవిడ ఎవ్వరిని నమ్మక, మంత్రులను, ముఖ్యమంత్రులను తరచు మారుస్తూ అపఖ్యాతిపాలయ్యింది. ఇప్పటికి పాకిస్తాన్ బయటకు వచ్చింది. తర్వాత ఇంకా ఏ విదేశీ శక్తులు బయటకు వస్తాయో!]

ఇక పై ప్రకటన మీద పత్రికల్లో జోకులు వెల్లువెత్తాయి.

వాటిల్లో ఇది నాకు బాగా గుర్తుండి పోయిన జోక్. ఈనాడులో ప్రచురితమైంది.

ఇక జోక్ ఏమిటంటే:
ఓ రాజకీయ నాయకుడు, ఓ బహిరంగ సభలో, మైకు ముందు నిలబడి ఉపన్యాసం దంచుతుంటాడు. అంతలో అతని సెక్రటరీ పరుగెత్తుకొచ్చి “సార్! ఇప్పడే డాక్టర్ రిపోర్టు వచ్చింది. మీ భార్య గర్భవతట” అంటాడు.

వెంటనే ఈ రాజకీయ నాయకుడు ఆవేశంగా “ఠాఠ్! నేను నమ్మను. ఇందులో ఏదో విదేశీ హస్తముంది” అంటాడు.

ఇలాంటి జోక్ లతో అసలువిషయాన్ని ప్రక్కదారి పట్టించారు.

అయితే ఈనాడు మనందరమూ చూస్తూనే ఉన్నాం కదా - ఏ విదేశీ హస్తానికి స్వదేశంలోనూ, పరదేశాల్లోనూ ఎవరు సహకరిస్తున్నారో గానీ, నిరాటంకంగా భారతదేశపు నడి బొడ్డున బాంబులు పేల్చి ప్రాణాలు తీయగలగడాన్ని, భయోత్పాతం సృష్టించడాన్నీ, సెజ్ ల పేరుతో దేశాన్ని అమ్మేయడాన్ని, వైట్ హౌస్ కు సాగిలపడటాన్ని, పాక్ వెళ్ళి ’జిన్నా జిందాబాద్’ అనడాన్ని.

ఇది జోక్ లాంటి నిజమా? నిజం లాంటి జోకా?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇక ఇలాంటి రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలని భరిస్తూన్న దేశ ప్రజల్ని చూస్తూంటే గుర్తు కొస్తూన్న మరో సామెత ఏమిటంటే

"కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు"

అలాగే లేవూ ప్రజల అగచాట్లు?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

3 comments:

ఇది ఇస్లామిస్ట్ టెర్రరిజమని అందరికీఓ తెలిసిందే. ఈ నిజాన్ని ఒప్పుకోవడానికీ మైనారిటీలందరూ టెర్రరిస్టులనే ప్రాపగాండా సృష్టించడానికీ చాలా తేడావుంది.

బాగా విశ్లేషించారు జోక్స్ తో. విదేశీ హస్తం అనేది ఇందిరా హయాం లో బాగా వాడబడింది. ప్రతి నా నాకొడుకు, ప్రతిదానికీ ఈ పదాన్ని వాడే వారు. కొజ్జా నాకొడుకులు, పరిస్తితిలను ఎదుర్కొనే దమ్ము లేక విదేశీ హస్తం అని చెప్పి తప్పించుకునే వారు. మరెందుకోగాని ఇప్పుడు ఎవరు వాడటం లేదు. బహుశః పాత బడి పోయి ఉండ వచ్చు. లేక అది ఒక జోక్ గా మిగలడం వలన అయి ఉండొచ్చు. విచిత్రమేమంటే మన రాష్ట్ర విషయాలలో, వ్యవహారాలలో కూడా ఈ విదేశీ హస్తం అనే మాట ని వాడారు సొల్లు నాకొడుకులు అప్పట్లో.

బాగా చెప్పారు

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu