>>>ఆఫ్రికా ఖండంలోని టునీషియా రిపబ్లిక్‌లో రాజకీయ విప్లవం వచ్చింది. 64వేల చదర పు మైళ్ళ విస్తీర్ణంతో, కోటి మందికి పైగా జనాభా కలిగిన ఈ దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ప్రజా ఉద్యమాల దెబ్బకు 23ఏళ్లపాటు అధ్యక్షుడుగా కొనసాగుతున్న నియంత జైనె అల్ అబిదైన్ బెన్ అలీ గత శుక్రవారం దేశం విడిచి పారిపోయాడు.

 విశ్లేషణ:

23 ఏళ్ళుగా కొనసాగుతున్న నియంత జైనె అల్ అబిదైన్ బెన్ అలీ! మన దేశంలో 1998 లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అధిష్టానం సోనియా..... పార్టీ సంస్థాగత ఎన్నికల్లేకుండా, ఏకగ్రీవంగా వరుసగా ఎన్నిక అయిపోతున్నట్లుగానే, జైనె అల్ అబిదైన్ బెన్ అలీ అయినా! ఈవీఎం లూ నవీన్ చావ్లాలూ సాయం చేస్తే.... ఆరేళ్ళేం ఖర్మ, ఇరవై ఆరేళ్ళయినా యూపీఏ సోనియాలే రాజ్యమేలగరన్నట్లుగానే!


ఈ విధంగా వీలు కుదిరిన దేశాల్లో, ఇలాంటి వాళ్ళని అధ్యక్షులనీ, అధిష్టానాలనీ అంటారు, కుదరక పోతే నియంతలనీ, సైనికాధ్యక్షుడనీ అంటారు. పేరు లోనే తేడా! ప్యాకింగులో తప్ప లోపలి సరకు ఒకటేనన్నట్లుగా!


>>>ఇస్లాం మతవాదం, సైనిక జుంటా, విదేశీ సాయుధ మూకల ప్రమేయం లేకుండా కేవలం సాధారణ ప్రజలు ఒక నియంత పాలనను అంతమొందించడం అరబ్ ప్రపంచంలో ఇదే ప్రప్రథమం. గత ఏడాది డిసెంబర్ 17 జరిగిన సైదీ బావుజీద్ తిరుగుబాటు తర్వాత దేశ వ్యాప్తంగా 29 రోజుల పాటు నిరంతరాయంగా సాగి ప్రజా ఉద్యమాలు బెన్ అలీ పాలనకు చరమగీతం పాడాయి. టునీషియా జాతీయ పుష్పం పేరుతో ప్రజా ఉద్యమాలకు 'జాస్మిన్' విప్లవం అన్న పేరు వచ్చింది. టునేషియా ప్రజల పోరాటాలను అరబ్ ప్రపంచంతోపాటు, యావత్తు అంతర్జాతీయ సమాజం పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

విశ్లేషణ:
ఇస్లాం మతవాదం పేరుతో, పాకిస్తాన్ లాంటి పలు దేశాల్లో చక్రం తిప్పడం మామూలే! ఆ చక్రం తిప్పడంలో భాగంగానే..... విప్లవాలు, ప్రభుత్వ మార్పిడులూ సంభవిస్తాయి. నిజానికి మత ఛాందస వాదమూ, కమ్యూనిజమూ, సైనిక పాలకులూ గట్రా.... పేర్లు మార్పేగానీ, అందరూ చేసేదీ ఒకటే.... ప్రజలని దగా చేయటం! శ్రమ దోపిడి దగ్గరి నుండి అన్ని రకాల దోపిడులూ, అక్రమాలూ చెయ్యడం!! 

అవేవీ లేకుండా సాధారణ ప్రజలు ఒక నియంత పాలనని అంత మొందించాడని చెప్పాలంటే మీడియాకి ఎంత కష్టంగా అన్పించిందో! కాబట్టే – 29 రోజుల పాటు ట్యునీషియాలో జరిగిన ప్రజా విప్లవాన్ని గానీ, ముబారక్ ని తరిమేసిన ఈజిప్టు ప్రజల చైతన్యాన్ని గానీ, ఇప్పుడు గడాఫీని గడగడలాడిస్తున్న లిబియా ప్రకంపనలని గానీ (నామ మాత్రపు ఫోకస్ తప్ప) ఏమాత్రం ప్రచారించటం లేదు. అంత నొప్పి మరి!

అదే తమకి ఇష్టమై ఉంటే.....

ఒకప్పుడు ఈనాడు దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రచారించినట్లు.....
లేదా వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం నేపధ్యంలో అన్ని వార్తాపత్రికలూ, టీవీ ఛానెళ్ళు ఎడతెగని ఉత్కంఠని హోరెత్తించినట్లు.......
లేదా వైయస్ మరణించిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు ఏక వార్తగా ఈనాడు వై.ఎస్.ని దేవుణ్ణి చేసి ప్రచారించినట్లు.....
లేదా ఎక్కడో ఫోర్డ్స్ పత్రిక ప్రపంచ ప్రభావశీలుర జాబితాలొ, ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రచురించారని ఆఘమేఘాల మీద వ్రాసేసినట్లు......
అన్ని ప్రచార సంస్థలు కూడా ప్రచారించి ఉండేవి.

>>>ఫ్రాన్స్ వలస పాలనలో 75ఏళ్ళపాటు మగ్గిన టునీషియా 1956లో స్వాతంత్య్రం పొందింది. రాజకీయంగా విముక్తి పొందినప్పటికీ ఆర్థికంగా ఫ్రాన్స్పైనే ఆధారపడటంతో యూరోపియన్ యూనియన్తో టునీషియా 'సహకార ఒప్పందం' చేసుకుంది. భౌగోళికం గా ఆఫ్రికా ఖండంలో ఉండడం మూలాన ఆఫ్రికన్ యూనియన్ లోను, ఆరబ్ సంస్కృృతి ఉండడంతో అరబ్ లీగ్లోను ఏకకాలంలో సభ్యదేశంగా కొనసాగడం టునీషియా ప్రత్యేకత. ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో కీలక మధ్యవర్తిగా కూడా టునీషియా వ్యవహరించింది.

విశ్లేషణ:

ఒకప్పుడు ఇజ్రాయేల్ పాలస్తీనా వివాదం ప్రపంచానికే పచ్చిపుండు. ప్రతీరోజూ వార్తాపత్రికల్లో పశ్చిమాసియాలో శాంతి ఒక ప్రధాన వార్త! రాజీవ్ గాంధీ హత్యని ముందే హెచ్చరించిన అరాఫత్ మరణం వరకూ మరింతగా మరిగిన నిప్పుల కుంపటి. ఇప్పుడు తీవ్రత చాలా తగ్గినా, సలుపుతున్న సమస్యే!

మతం అది యూదులలో అయినా, హిందువులలో అయినా, ముస్లింలలో అయినా, బౌద్దులలో అయినా మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. వేర్పాటు వాదాలైనా ఇంతే! ఇలాంటి సెంటిమెంటువ్యవహారాలు తక్కువ డబ్బు ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించుకోగలిగినవి, నకిలీ కణిక వ్యవస్థకి! అందుచేత, అలాంటి మంటలు అన్నిచోట్లా, ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ఆపై కారణాలతో తమ బొమ్మల్ని బాగా పైకి తెచ్చుకోవటం నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి రివాజు!

ఇక ఇక్కడ గమనించాల్సింది – ట్యునీషియా ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో కీలక  మధ్యవర్తిగా వ్యవహారించిందట! అంటే ఇప్పుడు విప్లవం చేపట్టిన సామాన్య ప్రజానీకం కాదు. అక్రమాల నియంత అలీ నే! ఆఫ్రికా ఖండంలో అంత బుడ్డి దేశం ట్యునీషియా నియంత, అమెరికా బ్రిటన్ లతో సహా ప్రపంచ రాజకీయాలని ప్రభావితం చేసిన ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదంలో, కీలక పెద్దమనిషిగా వ్యవహారించాడన్న మాట. అంత పెద్ద మనిషి కాబోలు ఈ చిన్ని దేశపు నియంత!

ఆ వంకతో ఎవరికి ఎంత లాబీయింగ్ చేసి పెట్టాడో..... ఇప్పటి నీరా రాడియాల గురించి కలిగిన అవగాహనతో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి అలీలు, వెయ్యిమంది నీరా రాడియాల పెట్టు.

 >>>యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా ఫ్రాన్స్ సహకారంతో ఇక్కడ పరిశ్రమల ఆధునీకరణ, ప్రైవేటైజేషన్ కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచీకరణలో భాగంగా ఎగుమతి ఆధారిత దేశంగా అవతరించింది. 1990 నుంచి సగటున 5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో కొనసాగుతున్న దేశ ఆర్థికవ్యవస్థలో అవినీతి నరనరాల్లో వ్యవస్థీకృతమైంది. దాంతో ప్రజా సంక్షేమం మూలన పడింది, ధరలు అదుపు తప్పాయి.

ఆశ్రిత పెట్టుబడీదారీ విధానం (క్రోనీ కే పిటలిజం) మూలాన ప్రభుత్వాధినేతలు వారి కుటుంబాలు, సన్నిహితు లు కోట్లకు పడగలెత్తారు. నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. చేసేందుకు పనుల్లేక, తినేందు కు తిండికి నోచుకోక ప్రజలు దుర్భర జీవితాలను వెళ్ళదీస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు సాగిన కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రటిక్ ర్యాలీ (ఆర్‌సీడీ) పార్టీ అధినేత బెన్ అలీ అధ్యక్ష పాలనలో దేశ ఆర్థికవ్యవస్థ మరింతగా దిగజారి, ప్రజల జీవన ప్రమాణా లు పూర్తిగా పడిపోయాయి.

విశ్లేషణ:
ఎక్కడైనా ఇదే స్థితి! దేశాలు వేరు. ఆయా దేశాల నేతలు వేరు. కానీ చేతలు మాత్రం ఒక్కటే! ఎంత సారూప్యత!? 


>>>పౌరహక్కులు మృగ్యమైనాయి. సైదీ బావుజీద్ పట్టణంలో మహమ్మద్ బావుజిజి అనే 17ఏళ్ల గ్రాడ్యుయేట్ యువకుడు ప్రభుత్వ అనుమతులు లేకుం డా వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణపై టునీషియా పోలీసులు అతని కూరగాయలు, పండ్లను స్వాధీనం చేసుకున్నారు.

విశ్లేషణ:
అవును. ఏ దేశంలోనైనా పోలీసులు చెయ్యగలిగింది బీదా బిక్కిలపై జులుం మాత్రమే!

>>>మరో బతుకుదెరువులేని యువకుడు ప్రభుత్వ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చి మరణించాడు. సంఘటనతో సైదీ బావుజీద్ పట్టణ ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల, అధికార పార్టీ ఆర్సీడీ కార్యాలయాలపై ప్రజలు దాడి విధ్వంసం సృష్టించారు.

విద్యార్థులు, కార్మికులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలందరూ తిరుగుబాటులో పాల్గొన్నారు. పోలీసులకు ఉద్యమకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరుద్యోగం భరించలేనిస్థాయికి చేరుకోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైన విద్యార్థి, యువజన శ్రేణులు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. విద్యాసంస్థలన్నీ మూతపడ్డా యి. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. మీడియాపై ఆంక్షలు విధించడంతో ఉద్యమానికి సంబంధించిన వార్తలు బయట ప్రపంచానికి తెలియలేదు. పోలీసు కాల్పుల్లో 60 మందికి పైగా మరణించారని ట్రేడియన్ నాయకులు, ప్రతిపక్ష నేతలు ప్రకటించారు.

వ్యవసాయం, మైనింగ్, వస్తూత్పత్తి, పెట్రోలియం ఉత్పత్తులు, టూరిజం లాంటి పలు రంగాలతో కూడిన బహుముఖ ఆర్థిక వ్యవస్థ టునీషియాలో సంపద వ్యత్యాసాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. 4.5 జీడీపీతో ఆఫ్రికాలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ ఆర్థిక వేదిక వేసిన తప్పుడు అంచనాను ఉద్యమకారులు సవాలు చేశారు.

విశ్లేషణ:
ప్రపంచ ఆర్దిక వేదికే తప్పుడు అంచనాలు వేసింది. మళ్ళీ అవే నివేదికలను, ఇక్కడి మన మీడియా సంస్థలు (ఎక్కడివైనా అంతే లెండి) ప్రతిష్ఠాత్మక so and so నివేదిక.... ఇలా చెప్పింది అంటూ..... కళ్ఫార్పుకుంటూ చెబుతాయి, పెద్దచ్చరాలతో ప్రచురిస్తాయి.

అసలైనా.... ప్రపంచ ఆర్ధిక వేదికలు, ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చేందుకు తప్పుడు అంచనాలు వేసాయి? సామాన్యుడి బ్రతుకులకు సంబంధం లేని ఈ ఆర్ధికాభివృద్ది అంచనాలు ఎవరికోసం?

ఏ దేశంలోనైనా సరే..... క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు గానీ, ప్రపంచ వేదికలు గానీ, ఐక్యరాజ్య సమితి చేత నడిపించబడే సంస్థలు గానీ..... చాలా వరకూ..... చేసే సర్వేలన్నీ, ఇచ్చే నివేదికలన్నీ సామాన్యుల్ని కొల్లగొట్టేందుకూ, కార్పోరేట్ సంస్థల జేబులు నింపేందుకూ అనుకూలంగా ఉంటాయి. అప్పటికప్పుడూ చూస్తే షుగర్ కోటెడ్ తో కనబడినా, కాలం గడిచే కొద్దీ, అసలు రంగు బయటపడి, నివేదికల సారం తేట తెల్లమౌతుంది. అప్పుడు మళ్ళీ వాటి పై సమీక్షలూ, వైఫల్యానికి పైకారణాల చర్చలూ చేస్తారు.

అంతగా కేవలం కార్పోరేట్ సంస్థలకి మాత్రమే మేలు చేకూర్చేట్లుగా..... ఈ సర్వేలనీ, నివేదికలనీ కేవలం లంచంమాత్రమే నియంత్రిస్తుందా?

కాదు. ఖచ్చితంగా కాదు.

లంచంతో పాటుగా, మరింకో శక్తి కూడా నియంత్రిస్తోంది.
అదే గూఢచర్యంతో నడపబడుతున్న వ్యవస్థ.
ఒకప్పుడు కేజిబీల వెనకా, సీఐఏల వెనకా, ఐఎస్‌ఐ ల వెనకా దాక్కున వ్యవస్థ!
ఇప్పుడు ఆల్ ఖైదా వంటి వాటిని, లాడెన్ ల వంటి వ్యక్తుల్ని పైముఖాలుగా తగిలించుకున్న వ్యవస్థ!
ప్రపంచ వ్యాప్తంగా మీడియాఅనే ఆయుధాన్ని పట్టుకుని, ప్రపంచాన్ని ఆడించిన, ఆడించ చూస్తున్న వ్యవస్థ!

దాన్నే నకిలీ కణిక వ్యవస్థగా చెప్పాను!

>>>అలీ అధికారంలోకి రాకముందు దేశంలో కొనసాగుతున్న బహుభార్యత్వ నిషేధం, సార్వత్రక నిర్బం ఉచిత విద్యలాంటి మహిళా హక్కులను తిరిగి కల్పించాలని, ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజాఉద్యమాలు వెల్లువెత్తాయి. దాదాపు నెలరోజుల పాటు దేశమంతా స్తంభించిపోయింది.

 విశ్లేషణ:
అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్నఅన్నట్లు.... ఈ ట్యూనీషియా నియంత అలీ, తాను అధికారంలోకి వచ్చాక, బహుభార్యత్వ నిషేధం ఎత్తేసాడన్న మాట. సో, ఎంత మందినైనా కట్టుకుని ఊరేగొచ్చు. పేదవాడు ఒక్కపెళ్ళాన్నే పోషించలేక ఛస్తున్నాడు. ఇక పదిమందినేం చేసుకు ఛస్తాడు గనక!

అలాంటప్పుడు..... ఇలాంటి వెసులు బాట్లతో అలీగారు, ఎవరికి ఏ ఫేవర్ చేసాడో తెలుస్తూనే ఉంది కదా!
కాబట్టే ప్రభుత్వాధినేతలు, వారి కుటుంబాలు, సన్నిహితులు..... కోట్లకు పడగలెత్తారు మరి! పాకిస్తాన్ లో అయినా, ఇండియా లో అయినా ఇదే వరుస!

>>>ఉద్యమకారులను ఉపశమింపజేసేందుకు అంతరంగిక భద్రతా వ్యవహారాల శాఖ మంత్రికి ఉద్వాసన పలికి, అవినీతి వ్యతిరేక కమిటిని అధ్యక్షుడు బెన్ అలీ నియమించాడు.

విశ్లేషణ:
మన సీవీసీ థామస్ కి లాగా! లేదా ఓటుకు నోటు వ్యవహారాన్ని తేల్చిపెట్టిన కిశోర్ చంద్రదేవ్ కి లాగా! గొడవలు జరిగినప్పుడు కమీటీలు వేయటం, తర్వాత వాటిని నీరుగార్చటం అనే ప్రక్రియలు ప్రభుత్వాలకు వెన్నతో పెట్టిన విద్యలు.

>>>ప్రజా ఉద్యమాలు మరింతగా విజృంభించడంతో 2014లో తాను పదవి నుంచి తప్పుకుని సార్వత్రక ఎన్నికలను నిర్వహిస్తానని కూడా ప్రకటించాడు.

విశ్లేషణ:
అప్పటి దాకా దేశాన్ని ఉద్దరిస్తానన్నాడన్న మాట. సరిగ్గా ఈజిప్టు ముబారక్ కూడా పీఠం దిగడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈజిప్టు ఏమై పోతుందోననే నా ఆందోళన అన్నట్లుగా!

వీళ్ళందరికీ తమ దేశాలంటే అంత ప్రేమా భక్తీ మరి! మరి పదుల ఏళ్ళల్లో అంత నిరుద్యోగం, అంత దుర్భర జీవితం ఎందుకు సంప్రాప్తించాయి సగటు జనాలకి? అంత సంపద ఎలా బలిసింది తమ ఆశ్రిత జనాలకి?

>>>గత శుక్రవారం రాజధాని టునిష్, ఇతర ప్రాంతాల్లో వెల్లువెత్తిన ప్రదర్శనలు, చెలరేగిన హింసాత్మక ఘటనల కారణంగా బెన్ దేశం విడిచి పారిపోక తప్పలేదు. అల్లర్లలో బెన్ అలీ అల్లుడు మహమ్మద్ సఖేర్ ఎల్ మతేరిని ఉద్యమకారులు సజీవం దహనం చేశారు.

విశ్లేషణ:
దొరికితే తనకీ అదే గతిఅన్నంత స్థితి వచ్చాక గానీ పలాయన బాట చేపట్ట లేదు సదరు అలీగారు.


మరిన్ని  విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.      
              సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

"మరో బతుకుదెరువులేని ఆ యువకుడు ప్రభుత్వ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చి మరణించాడు"

ఆహ్... ఎంత సాధారణ విషయమది. ఎవడో ఒకడు అనామకుడు ఆత్మహత్య చేసుకుంటే అది కాస్తా అధ్యక్షుడు పారిపోయేదాకా వచ్చిందన్నమాట. అది అంటువ్యాధిలాగా పాకి ఈజిప్ట్, లిబియా నేడో రేపో చైనా అన్నట్లుగా తయారయ్యిందా. వాహ్... మీరు గమనించేవుంటారు పెద్ద పెద్ద పరిణామాలకి కారణాలెప్పుడూ చిన్నవిగానే వుంటాయి ప్రపంచయుధ్ధాల సాక్షిగా. ఈ విప్లవం cronology మీరు నాకు లింక్‌గా కానీ పుస్తకంగా కానీ ఇవ్వగలరా చాలా ఆసక్తికరంగా వుంది. ఇలాంటిదో విప్లవం మనదేశంలో ఎప్పుడొస్తుందో కదా!!

ఇండియన్ మినర్వా గారు: నడుస్తోన్న ప్రపంచ సంఘటనల గురించి నా దగ్గర ఎలాంటి పుస్తకాలు లేవండి. వార్తా పత్రికల వార్తలు అందరూ చదివినట్లే నేనూ చదువుతాను తప్ప మరేలింకులూ లేవు. పరిశీలిస్తే ఎవరికైనా అర్ధం అయ్యే విషయాలే నేను వ్రాస్తున్నవి. ఇక... అలాంటి విప్లవాలు మన దేశంలో ఎప్పుడొస్తాయో.... అంటే... వేచి చూడాల్సిందే! నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu