ఇలా... సహనంగా వేచి ఉండి, దొంగని పట్టుకున్నాక... అప్పటి దాకా దగా పడిన ఆ సామాన్యులు, అతణ్ణి, సూటూ బూటూ విప్పించి, విరగదన్ని తరిమారు.

ఇదీ కథ![http://ammaodi.blogspot.com/2011/02/03_15.html]

ఇది కొత్త కథ కాదు. గతంలో బాపూజీ బ్రిటీషు వాళ్ళ హయాంలో నిజం చేసిన చూపించిన కథ!
వర్తమానంలో పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం నిజం చేసి చూపిస్తున్న కథ!


నాటి స్వాతంత్ర సమరయోధులు..... భారతీయులందర్నీ జాగృతం చేసి, దోపిడి గురించి అవగాహన కలిగించారు. బాపూజీ సత్యాహింసలతో ‘సత్యాగ్రహ’మనే ఆయుధంతో ప్రజలని సహనంగా వేచి ఉండేలా నడిపించారు.


దాంతో.... ఆయుధం చేపట్టని సత్యాగ్రహల మీద తమ దౌష్ట్యానికి..... ఎన్ని రోజులని, ఎన్ని పైకారణాలని బ్రిటీషు వాళ్ళు చూపిస్తారు? మానవత్వం గురించీ, స్వేచ్ఛా స్వాతంత్రాల గురించీ తెగ ఉపన్యాసాలు దంచే బ్రిటీషు వాడి దౌష్ట్యం, కౄరత్వం అమానుష దోపిడి, అక్రమం, ప్రపంచానికి బాగా వెల్లడి అయ్యింది స్పష్టంగా బహిర్గతపడింది ఫలితంగా బ్రిటీష్ వాళ్ళకు తట్టాబుట్టా సర్ధుకు పోక తప్పలేదు.

కాబట్టే – బ్రిటీషు వాళ్ళకీ, వాళ్ళని పైకారణంగా ధరించి గూఢచర్యం నడిపిన నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ బాపూజీ అంటే అంత కడుపు మంట, ద్వేషం.

స్వాతంత్రానంతరం, ఇటీవలి రోజుల వరకూ కూడా, బాపూని తిట్టడం ఓ ఫ్యాషన్ గా నడిపించబడింది. ఇప్పుడంటే చిరంజీవులూ, చంద్రబాబులూ కూడా బాపూ బొమ్మ పెట్టుకుంటున్నారు, నామజపం చేస్తున్నారు గానీ, కాంగ్రెస్ తో సహా అందరూ బాపూని నిర్లక్ష్యం చేసిన వారే!

ఓ సజీవ ఉదాహరణ చెబుతాను.

ఇది నా జీవిత సంఘటన.

అప్పటికి నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఓ రోజు ‘ఈనాడు’ పత్రికలో గుంటూరుజిల్లా, దాచేపల్లి దగ్గర ఓ పల్లెటూరులో బాపూజీ విగ్రహం ఫోటో వేసి ఓ వార్తాంశం వ్రాసింది. చాలా ఏళ్ళయినందున ఆ ఊరి పేరు నాకిప్పుడు గుర్తు లేదు.

ఆ వార్తాంశంలో వేసిన ఫోటోలో బాపూజీ విగ్రహం తలమీద, భుజాల మీద కొంగలూ, కాకులూ రెట్టలు వేసి అసహ్యంగా ఉంది. దుమ్ముధూళి కొట్టుకొని, పరమ నిరాదరణ స్థితిలోనూ, అవమానకర స్థితిలోనూ ఉంది.

సదరు వార్తాంశంలో అదే ఉటంకిస్తూ..... పత్రికా విలేఖరి, బాపూ విగ్రహ దైన్యతని వర్ణించాడు. ఊరివాళ్ళ నిరాసక్తని మాటవరసగా విమర్శించాడు. బాపూ విగ్రహాన్ని అవమానిస్తున్న తీరు గురించి మాత్రం అతిశయించిన ఉపమానాలతో వ్రాసాడు.

వార్త చదివిన నాకు ఒళ్ళు మండి పోయింది. చాలా ఉక్రోషంగా తోచింది. అప్పటికి నేను వక్తృత్వ పోటీలకీ, వ్యాస రచన పోటీలకీ ఆటలకీ వేరే ఊళ్ళు వెళ్ళి ఉన్నాను. ఏపీ దర్శన్ టూర్ లోనూ పాల్గొని ఉన్నాను. అయినా గానీ.... చెబితే నాన్న ఒప్పుకోడని.... ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, ఆదివారం రోజు, క్లాస్ మేట్ ఇంటికని చెప్పి బయలు దేరాను.

నేరుగా బస్టాండు వెళ్ళి దాచేపల్లి బస్సు ఎక్కాను. అక్కడకి వెళ్ళి ఆ పల్లె గురించి వాకబు చేస్తే.... అక్కడికి బస్సులు లేవు. పల్లెల్లో ఆటోలప్పటికి ఇంత ప్రాచుర్యంలో లేవు. సెవెన్ సీటర్స్ అసలెక్కడా లేవు. ఉదయం ఒకటీ, సాయంత్రం ఒకటీ బస్సు వస్తుందనీ, జట్కా బండ్లు దొరుకుతాయని చెప్పారు.

సర్లెమ్మని జట్కా ఎక్కేసి ఆ పల్లెటూరు చేరాను. వాకబు చేసుకుని సర్పంచి ఇంటికి వెళ్ళాను. అతడు లేడు. దాచేపల్లి వెళ్ళాడట. అతడి భార్యాపిల్లలున్నారు. వాళ్ళతో మాట్లాడుతుండగా అతడొచ్చాడు. సర్పంచి యువకుడే! తండ్రి వారసత్వంగా పదవిలోకి వచ్చినట్లున్నాడు.

ఇక అతడితో వాదన పెట్టుకున్నాను.

“దేశ నాయకులేమైనా వచ్చి.... బాబూ! మా విగ్రహాలు పెట్టండి అని మనల్ని బ్రతిమిలాడారా! మన గౌరవం కొద్దీ మనమే పెట్టుకున్నాం. నిజానికి ‘వాళ్ళు చెప్పింది ఆచరించి చూపించటం’ మనం వాళ్ళకి ఇవ్వగలిగిన అసలైన నివాళి. అది చెయ్యటం లేదు. కనీసం మన గౌరవం మనం చూపుకునేందుకు నెలకొల్పుకున్న విగ్రహాలనైనా గౌరవించాలి కదా! బదులుగా ఇంతగా అవమానించటం ఏమిటి?” అని నిలదీసాను.

అతడు ‘ఊరివాళ్ళు కలిసి రానిదే తనేం చెయ్యలే’నని అన్నాడు. రెండు మూడు గంటల్లో ఊళ్ళో వాళ్ళని పోగేసాడు. వాళ్ళ పంచాయితీ భవనంలో చిన్న సభ లాంటిది ఏర్పాటు చేసాడు. నేను ఓ అరగంట పాటు ఆ ఊరి వాళ్ళని వాయించేసాను.

“““‘చేతనైతే గౌరవం చూపండి. లేకపోతే ఆ విగ్రహాన్ని కూలగొట్టి పారేయండి. లేదా గునపం నా చేతికిస్తే నేనే ముక్కలూ చెక్కలు చేసి పోతా”నన్నాను. “కొంగా, కాకి రెట్టలతో అసహ్యంగా కనబడుతున్న బాపూజీ ముఖం ఎలా చూడగలుగుతున్నారు? కనీసం పేపర్లో ఫోటో తో సహా వార్త వచ్చాకైనా సిగ్గని పించలేదా? ఊరి పరువు పోయిందని కూడా తోచలేదా?” అనేసాను.

వాళ్ళంతా ‘తమది తప్పేనని, కనీసం విగ్రహాన్ని శుభ్రపరిచి, షెల్టర్ కడుతామనీ’ చెప్పారు. వాళ్ళ దగ్గర అలా మాట తీసుకుని వచ్చేసాను. నాపేరూ ఊరూ చెప్పాను. అడ్రసు చెప్పలేదు. మా నాన్నకి తెలిస్తే... తిడతాడని భయపడ్డాను. కాకపోతే మా ఇల్లు మాయాబజార్ దగ్గర అని చెప్పాను.

ఓ పదిహేను రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం.... ఆ ఊరి వాళ్ళు ఓ నలుగురు మా ఇల్లు వెదుక్కుంటూ వచ్చారు. మాయా బజార్ లో వాకబు చేసారట. ముందుగా మా నాన్నని షాపులో కలిసారు. జరిగిన విషయాలన్నీ చెప్పి..... ‘నా ఉపన్యాసం మూలంగా తామెంతో స్ఫూర్తి పొందామనీ, ఊరి బాగుకి నడుం కట్టామనీ, బాపూ విగ్రహానికి షెల్టర్ వేసుకుని చుట్టూ గ్రిల్ పెట్టుకున్నామని’ చెప్పారు. నన్నొకసారి కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నారట. మానాన్న వాళ్ళతో మాట్లాడి పంపించి ఇంటికి వచ్చారు.

నన్ను వివరాలు అడిగేసరికి ముందు భయపడ్డాను. నాన్నకి కోపం వస్తే చదువు మానిపిస్తానంటాడేమోనని నా భయం. నాన్న నన్ను “అలా ఇంట్లో చెప్పకుండా వెళ్ళవచ్చా! తప్పు కదా! ఏదైనా ప్రమాదం ఎదురైతే” అని తిట్టారు. అయితే నేను భయపడినంతగా తిట్టలేదు. తర్వాత అమ్మతో చెబుతూ నన్నెంతో మెచ్చుకుని సంతోషించారు. అది తెలిసినప్పుడు నేనూ చాలా సంతోషపడ్డాను.

అయితే.... ఇందులో కొసమెరుపు ఏమిటంటే.... ‘ఈనాడు పత్రిక’లో ‘బాపూ విగ్రహానికి అవమానం’ అంటూ వార్త వచ్చినప్పుడు పెద్ద అక్షరాలలో శీర్షిక, ఫోటోతో, నాలుగు కాలమ్ ల వార్తాంశం వచ్చింది.

నేను ఆ ఊరికి వెళ్ళి, ఊరివాళ్ళతో వాదన పెట్టుకుని వచ్చిన తర్వాత, ఊరి వాళ్ళు, సర్పంచి, అందరూ కలిసి బాపూ విగ్రహాన్ని సంరక్షించుకుని, కలిసికట్టుగా షెల్టర్ గట్రా నిర్మించుకున్నారన్న వార్తాంశం.... సింగిల్ కాలం x 10 సెం.మీ. వార్తగా చాలా చిన్న శీర్షికతో, అప్రాధాన్య వార్తాగానే కాదు, అనాసక్తికర వార్తగా వ్రాయబడింది.

అందులో ‘ఈనాడు వార్తకు స్పందించిన గుంటూరుకు చెందిన ఓ విద్యార్ధిని, ఫలానా ఊరుని దర్శించి, గాంధీ విగ్రహానికి పట్టిన గతిని చూసి ఆవేదన చెందింది’ అని వ్రాసారు. అప్పటికి ఆ ఊరివాళ్ళు మానాన్నని కలుసుకోలేదు. నేను వార్త చదివి “పోన్లే పెద్దగా ఫోకస్ చెయ్యలేదు. నా పేరు వచ్చినట్లయితే నాన్నకి తెలిసి పోయేది” అనుకొని ఊపిరి పీల్చుకున్నాగానీ.... “నేను ఆవేదన చెందానా? ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోయాను. ఇలా వ్రాసారేమిటి?” అనుకొని ఊరుకున్నాను.

కాని ‘తర్వాత ఊరి వారందరు కలిసి బాపూజీ బొమ్మకి షేల్టర్ నిర్మించుకున్నారు కదా! దానినేందుకు పెద్దగా ఫోకస్ చెయ్యలేదో?’ అప్పుడు నాకర్ధం కాలేదు.

చెడుని పెద్దగా ఫోకస్ చేయటం, మంచిన విస్మరించటం ఈనాడు, మీడియా నిర్వహిస్తున్న కుట్రలో భాగమని అప్పుడు నాకు తెలియదు మరి! అలాగే.... బాపూజీని నిర్లక్ష్యం చెయ్యడం, అవమానించడం వాళ్ళకి గొప్ప వార్తలుగా ఉంటాయి తప్ప, బాపూజీ వంటి నాయకులని గౌరవించడం, వారి నుండి స్ఫూర్తి పొందడం కంటగింపు కలిగిస్తాయి.

అంతగా బాపూజీ అంటే కడుపుమంట ఈ నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ!

ఇక పీవీజీ అంటే మరెంతగా అక్కసో ఇప్పుడందరికీ కనబడుతుందే గదా!

ఎందుకంటే.... బాపూజీ, పీవీజీ.... ఇద్దరూ సహనంతో కుట్రదారుల దౌష్ట్యాన్ని కుటలతనీ బహిర్గతం చేసిన, చేస్తున్న వారే గనక!

వర్తమానంలో పీవీజీ ఆయన సమీకరించిన నెం.5 వర్గం నిజం చేసి చూపిస్తున్న కథే గత టపాలో వివరించింది.

నాడు బాపూజీ సత్యాహింసలతో ‘సత్యాగ్రహ’మనే ఆయుధం చేపట్టి నిజం నిరూపించాడు.

నేడు పీవీజీ, నెం.5 వర్గం సత్యం ధర్మాలతో, ‘గూఢచర్య’మనే ఆయుధం చేపట్టి కుట్రదారుల దోపిడి తీరునీ, నిజ రూపాలనీ నిరూపిస్తున్నారు.

ఆ నాటికి ఈ గూఢచర్యపు ఆనుపానులు భారతీయులకి అంతగా తెలియనందున దోపిడిదారులదే పైచేయి అయ్యి.... అర్ధశతాబ్దం పైగా(ఖచ్చితంగా చెప్పాలంటే దాదాపు శతాబ్దం 1857 నుండి 1947 వరకూ) స్వాతంత్ర సంగ్రామం నడిచింది.

విభజించి పాలించే కూటనీతితో స్వాతంత్ర సమర యోధులని రకరకాల వాదాలతో, వర్గాలుగా చీల్చి, ప్రజలలో మత చిచ్చురగిల్చి, దేశాన్ని ముక్కలు కొట్టగలిగారు.

బాపూజీ తర్వాతి తరం.... సహనాన్ని మరికొంత కాలం భరించలేక పోవటంతో, దేశ విభజనకి అంగీకరించారు. ఫలితంగా..... దేశమంతా స్వాతంత్ర వచ్చిందని పండుగ చేసుకుంటుంటే..... బాపూజీ భారమైన హృదయంతో, కన్నీరు నిండిన కళ్ళతో, బెంగాల్ లో మత కల్లోలాల బాధితులని పరామర్శిస్తూ పరితపించారు.

ఎందుకంటే – అప్పటికి మనం కుట్రదారుల మూల బలం ఏమిటో తెలుసుకోలేక పోయాం.

కాబట్టే – ఇప్పుడు పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం – కుట్రదారుల గూఢచర్య వలయాన్ని, గూఢచర్య స్ట్రాటజీని పూర్తిగా బహిర్గతం చేయటంతో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ‘జంబలకిడి పంబ’నే మనం చూస్తున్నాం.

దీన్ని ‘జంబలకిడి పంబ’గా ఎందుకు పోల్చానంటే..... ఇటీవల కీర్తిశేషుడైన ఈవీవీ సత్యనారాయణ గతంలో తీసిన సినిమా ‘జంబలకిడి పంబ’.

అందులో..... ఆడవాళ్ళు మగవాళ్ళులా, మగవాళ్ళు ఆడవాళ్ళలా, మానసికంగా మారిపోతారు, ఆ ప్రకారమే ప్రవరిస్తారు. సినిమా చివరిలో వాళ్ళంతా మరింత మానసిక ప్రకోపానికి గురై, ఒకరినొకరు బాదుకుంటారు. చివరికి మరణిస్తారని చెప్పబడుతుంది.

ఆ సినిమాలో లాగే..... కుట్రదారులు....

చెడ్డవాళ్ళని మంచి వారుగా,

దొంగలని దొరలుగా,

చెంచాగాళ్ళని గొప్ప నాయకులుగా,

అవినీతి పరులని పరమ నిజాయితీపరులుగా.... చెలామణి చేసారు.

ఇప్పుడంతా బహిర్గతమై, జాతర బొమ్మలు ‘చంపు లేదా ఛస్తావ్’ అన్న స్థితికి గురై, ఒకరినొకరు చావబాదుకోవటంతో అంతా ‘జంజలకిడి పంబ’గానే పరిణమించింది.

అది మన రాష్ట్ర, దేశ రాజకీయుల దగ్గరి నుండి, ప్రపంచ రాజకీయాల దాకా పరిణమించిన పరిస్థితీ!

రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, కాంగ్రెస్, కేసీఆర్ లతో....

దేశంలో భాజపా ఎర్రపార్టీలు, కాంగ్రెస్ తో!

అలాగే ప్రపంచంలో అమెరికా Vs అసాంజే/వీకీలీక్స్,

ముబారక్ లు ‘అమెరికా నమ్మక ద్రోహం చేసింది’ అని ఆరోపిస్తూ.... ఉద్యమాలు ఎదుర్కోంటున్న స్థితిలో బహిర్గతమౌతోంది ఈ జంబలకిడి పంబ పరిస్థితే! ఇప్పటికి దేశం విడిచి పరారయ్యి, కోమాలో కెళ్ళిన ఈజిప్టు నియంత! (ఇతడి గురించి తర్వాత)

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

http://mirchbajji.blogspot.com/2011/03/blog-post.html

రేణూ: లింక్ ఇచ్చినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu