‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీ గురించి గతటపాలలో చెప్పిందే అయినా, దానికి తాజా ఉదాహరణలివ్వ బోయే ముందు మరోసారి ‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీని వివరిస్తాను.

మనం చదరంగం ఆడుతున్నప్పుడు, ఒక ఎత్తుగడ మూలంగా, మన ప్రత్యర్ధి… మన బంటునో, శకటునో చంపగల పరిస్థితిలో పడ్డామనుకొండి. ఏం చేస్తాం? శకటు కంటే బంటు ప్రయోజనం తక్కువ కాబట్టి, బంటుని వదిలేసుకుని, శకటుని కాపాడుకుంటాం. అయితే మరికొంత ఆట కొనసాగాక… ఈ సారి, ఇందాక కాపాడుకున్న శకటు, గుర్రంలలో ఏదో ఒక పావుని కోల్పోవాల్సిన స్థితిలో పడ్డామనుకొండి. అప్పుడేం చేస్తాం?

ఇంతకు మునుపు కాపాడుకున్న శకటుని వదిలేసుకుని, గుర్రాన్ని కాపాడుకుంటాం. అంటే ఇంతకు మునుపు విలువైనదిగా, ప్రయోజనకరమైనదిగా కనిపించిన శకటు, ఇప్పుడు గుర్రంతో పోలిస్తే తక్కువ విలువైనదిగా, తక్కువ ప్రయోజనకరమైనదిగా కనిపించింది.

ఆపైన గుర్రం, మంత్రి పావులలో ఏదో ఒక దాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైతే, ఈ సారి గుర్రాన్ని వదులుకుంటాం.

దాన్నే ‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీగా ఉటంకించాను.

గూఢచర్యపరంగా, ‘కన్ను, కాలు’ రెండింటిలో ఏదో ఒకదాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తే… ‘కాలు?’ వదిలేసుకుని ‘కన్ను వంటి విలువైన ఏజంటునో, సమాచారాన్నో, విషయాన్నో కాపాడుకుంటారు.

మరోసారి… మునుపు ‘కన్ను’గా భావించి కాపాడుకున్న విలువైన ఏజంటు/సమాచారం తో బాటు, మరో ఏజంటు/సమాచారం… రెండింటిలో ఏదో ఒకదాన్ని వదులు కోవాల్సివస్తే ఏది విలువైనదనిపిస్తుందో ఆ ‘కన్ను’ని కాపాడుకుంటారు.

ఇలాంటి ‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీకి, ఇప్పటి రాజకీయ నేపధ్యంలో, తాజా ఉదాహరణని పరిశీలిద్దాం.

నవంబరు 6 నుండి 8వ తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ సందర్శించాడు. 8 వ తేదిన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాడు. ‘నమస్తే ఇండియా’ మొదలు చాలా శ్లాఘనలు చేసి, తనకు కావలసిన వాణిజ్య ఒప్పందాలు చేసుకుని చక్కా పోయాడు.

ఆ మర్నాటి నుండి (నవంబరు 9వ తేదీ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై, డిసెంబరు 13వ తేదీ దాకా కొనసాగాయి.

9 వ తేదిన, సమావేశపు తొలి నాటికి… ప్రతిపక్షాలు అజెండాలో – ముంబై ఆదర్శ్ అక్రమాలు, 2జీ స్ప్రెక్ట్రమ్ అవకతవకలు ప్రధానమైనవి.

అయితే 10వ తేదీ (బుధవారం) ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్, మీడియా సమావేశంలో ‘సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తున్నారనీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ’ ఆరోపించాడు.

ఒక్కసారిగా దాని మీద సంచలనం చెలరేగింది. కొందరు కాంగ్రెస్ వాదులు, అధిష్టాన భక్తులు (వీరు బహుళ నిగ్గర్లన్న మాట) సుదర్శన్ మీద ఖఁయ్యిమన్నారు. ‘త్యాగమయి సోనియాని అంతమాటంటారా?’ అంటూ కొందరు, ‘సుదర్శన్ మీద కోర్టులో కేసు వేస్తామని’ మరికొందరు ఆయాసపడ్డారు, ఆగ్రహపడ్డారు. రోశయ్య అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉండీ స్వయంగా రోడ్డెక్కి ధర్నా చేశాడు.

పార్లమెంటులోనూ ఆ రోజు, మరునాడు రచ్చ జరిగింది.

ఇంతలో ఆర్.ఎస్.ఎస్., భాజపా గట్రా పార్టీలన్నీ ‘అది సుదర్శన్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు’ అంటూ సోనియా గురించిన సుదర్శన్ వ్యాఖ్యలతో తమకి సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు. కానీ పార్లమెంట్ లోపల కొంత, బయట మరి కొంత ఎక్కువగా రచ్చ మాత్రం కొనసాగింది.

‘సోనియా సీఐఏ ఏజంటు వ్యవహరణ, ఇందిరా, ఆమె తనయుడి హత్యల్లో సోనియా కుట్ర’ అనే వ్యవహారాన్ని ఇలా వదిలేస్తే… అది ప్రజలని మరింత ఆకర్షించి, విషయం మరింత అడుగుతట్టు దాకా ప్రాకి పోవచ్చు. మరింత లాగితే తెగి ఎక్కడ నుండి ఏ సాక్ష్యాధారాలు బయటపడతాయో? ఇది ‘కన్ను’ వంటిది.

ఈ ‘కన్ను’ని కాపాడు కోవాలంటే కాలుని వదిలేసుకోవాలి. ఆ ‘కాలు’… 2జీ స్ప్రెక్ట్రం, రాజా రాజీనామా అయ్యింది. నిజానికి రెండేళ్ళ నుండీ నలుగుతున్న వ్యవహారం 2జీ స్ప్రెక్ట్రమ్ లోని అక్రమాలు! అయినా చలనం లేని కేంద్రప్రభుత్వం, రకరకాల డ్రామాల తర్వాత, నవంబరు 14వ తేదిన, రాజా చేత రాజీనామా చేయించింది.

అప్పటి వరకూ ససేమిరా అన్న రాజా, ‘ఠాఠ్’ కుదరదన్న కరుణానిధి, ఢిల్లీ నుండి అధిష్టానం తరుపున, వారి ‘ట్రబుల్ షుటర్’ ప్రణబ్ ముఖర్జీ చెన్నై పర్యటన తర్వాత రాజీ రాజీనామాకు అంగీకరించారు.

ఆ తర్వాత ఒక్కసారిగా నీరా రాడియా టేపుల వ్యవహారం బయటికొచ్చింది. తెలుగు పత్రికలలో అయితే ఆ ‘రచ్చ’ ఆలస్యంగా ప్రారంభమైంది. యధాప్రకారం ‘కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక’ ‘ఈనాడు’ ప్రాధాన్యత లేని వార్తాంశం గానే ఈ టేపులను పరిగణించింది.

కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో, మంత్రిపుంగవులతో సంభాషించిన టేపులు బయటకి రావడంతో చెలరేగిన గగ్గోలులో… ‘సుదర్శనం వ్యాఖ్యలు’ గాలి కెగిరి పోయాయి. అంతటితో ప్రతిపక్షాలన్నీ పకడ్బందీగా,వ్యూహాత్మకంగా… రాడియా 2జీ స్ప్రెక్ట్రమ్ వ్యవహారంపై జేపీసీకి పట్టుబట్టి, పార్లమెంటుని స్తంభింపజేయటంతో మీడియా దృష్టి మొత్తం దానిమీదే కేంద్రీకరింప బడింది.

సోనియా వ్యవహారాలు బయటికి రావటం అనే ‘కన్ను’తో పోల్చుకుంటే – ఎంతో మంది కార్పోరేట్ కంపెనీల అధిపతులూ, బ్యూరాక్రాట్లు, కేంద్రమంత్రుల నియామకాలూ, వ్యవహారాలతో ముడిపడి ఉన్న లాబీయిస్ట్ నీరా రాడియా టేపులు ‘కాలు’ వంటిదన్న మాట!

ఇందులో చురుక్కుమని పించే ఒక చమక్కు ఏమిటంటే – రతన్ టాటా ‘నన్ను ఓ మంత్రి 15 కోట్లు లంచం అడిగాడు. అటువంటి పనులు నాకు ఇష్టం లేదు. అందుకే విమాన యాన రంగంలోకి ప్రవేశించ లేదు’ అంటూ నంగనాచి కబుర్లు చెప్పాడు, నవంబరు 15వ తేదిన.

అక్కడికీ… ఇన్నేళ్ళుగా టాటాలు, అసలు లంచాలే ఇవ్వకుండా వ్యాపారం చేసినట్లు! లంచగొండితనానికి మహా‘రాణి’ పోషకులైన బ్రిటీష్ వాళ్ళ హయాంలో వ్యాపారాలూ, పరిశ్రమలూ ప్రారంభించిన ఈ పార్శీ వంశీయులు, లంచాలు ఇవ్వకుండానే వ్యాపారాలు చేశారట!

సరిగ్గా… అతడు అలాంటి నంగనాచి మాటలు చెప్పిన నాలుగు రోజులకే… నీరా రాడియాతో అతడి సంభాషణల టేపుల బయటకొచ్చాయి!

అయితేనేం లెండి! మన్మోహన్ వంటి ఆర్ధికవేత్త, రాజకీయ నాయకుడు, వాళ్ళకి అండగా ఉన్నంతకాలం, వాళ్ళకి ఇబ్బందేం ఉండదు. [అందుకే గదా ‘మన్మోహన్ వంటి నాయకుడు దొరకడం అదృష్టం’ అంటూ టాటా సెలవిస్తున్నాడు.]

కాబట్టే వాళ్ళ Right of Privacy ని కాపాడటానికి, శక్తివంచన లేకుండా నడుం కట్టాడు మన్మోహన్ సింగ్.

మొత్తానికీ టాటా తన నిజాయితీ గురించి ఢంకా బజాయించుకున్నాక, రాడియా వ్యవహారాలు బయటికి రావడమే ఇక్కడ గమ్మత్తు!

ఇంతటితో టాటా Vs నీరా రాడియా వ్యవహారాన్ని ప్రక్కన బెట్టి, మళ్ళీ మొదటి కొస్తే…

సోనియా గురించి సుదర్శన్ వ్యాఖ్యల్ని మరుగు పరచటానికి, నీరా రాడియా వ్యవహారాన్ని బయట పెట్టుకున్నారు.

నకిలీ కణిక వంశీయులకి… సోనియా, అంత విలువైన ‘కన్ను’ మరి! ఆమె గురించిన గుట్టు బయట పడకుండా ఉండేందుకు, దేన్నైనా వదిలేసుకుంటారు! అది ప్రభుత్వపరువైనా, ప్రధాన మంత్రినైనా, మరి దేన్నైనా!

ఏతావాతా…2జీ స్ప్రెక్ట్రమ్ అక్రమాలు, అవినీతి, నీరా రాడియా టేపుల వ్యవహారం బయటపడితే, అవినీతి మకిలి ప్రభుత్వానికీ, ప్రధానమంత్రికీ, ప్రభుత్వ కుర్చీవ్యక్తి సోనియాకీ కూడా అంటుకోవచ్చు గాక! ప్రతిష్ఠ మరింత మసక బారవచ్చు గాక.

అయినా… ‘గూఢచార ఏజన్సీ సీఐఏకి ఏజంటుగా వ్యవహరించటంతో’ పోల్చుకుంటే, అవినీతి మరక సురక్షితమైనది.

ఎందుకంటే – ఇప్పటికే అవినీతి అందరి చేతా అంగీకరింపబడినదే కదా! “ఆఁ ఎవరు మాత్రం అవినీతి చెయ్యకుండా ఉన్నారు? ఇవ్వాళ్ళా, రేపూ అవినీతి చెయ్యకుండా గడిచేదెలా? పార్టీ నడపాలంటే ఆ మాత్రం అవినీతి నడుస్తుంది”అంటూ అంతో ఇంతో అందరూ అవినీతిని అంగీకరిస్తున్నదే!

అందుచేత అదే `Safe’ అన్నమాట. అదే సీఐఏకో, మరో గూఢచార ఏజన్స్ కో ఏజంటుగా వ్యవహరించటం, దేశనేతల హత్యల్లో కుట్ర చేయటం, గూఢచారిణి వంటివి తెలియటం భవిష్యత్తుల్లో మరింత ప్రమాదం కదా?

ఇది కన్నా? కాలా? స్ట్రాటజీకి ఒక తాజా మచ్చుతునక?

మన రాష్ట్ర రాజకీయాల్లోనూ, దీనికి బలమైన తాజా ఉదాహరణ ఉంది గానీ, పరిస్థితులు మరికొంత స్పష్టపడే వరకూ వేచి చూద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

correct chepparandi ..
meru okasari janata party subramanya swamy gurinchi article raste marinta clear ga vuntundi ani na abripramayam..
endukante desamlo anni pedda kumbhakonalani ayane bayatapedutunnapatiki ivvalti varaku ayanani evaru emi cheyalekapovatam ascharyam ga vundi.. monna last week yS jagan ki anukulamga vyakyalu kuda chesadu...

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu