బంగారం…! అదెప్పుడూ విలువైనదే! అదెప్పుడూ మనిషిని ఆశకు గురి చేసేదే!

ఇదే సూత్రం కార్పోరేటు రంగంలో కీలక దిగ్గిజాల దగ్గరా పని చేస్తుంది.

కాబట్టి… కార్పోరేట్ కంపెనీల బడాబాసులు తమ సంపద నిల్వలని స్థిరాస్థుల రూపంలోది పోగా… మిగిలినది కరెన్సీ రూపంలో కొంతే ఉంచుకుంటారు, బంగారు రూపంలో మరింతగా దాచుకుంటారు.

ఈ బంగారం నేపధ్యంలో, 1990-92 నాటి రాజకీయ నేపధ్యాన్ని ఓసారి పరిశీలిస్తే… అప్పట్లో బంగారం ధర ఇప్పటితో పోలిస్తే 8వ వంతు కంటే కూడా తక్కువే! బయట చూస్తే ఆర్ధికంగా దేశం ఎంత క్లిష్టదశకు చేరిందంటే పీవీజీ కి ముందు ప్రధాని పదవి వెలగబెట్టిన భోండ్సీ బాబా చంద్రశేఖర్, విశ్వవిఫణిలో బంగారాన్ని, భారత ప్రభుత్వం తరుపున తనఖా పెట్టాడు.
చంద్రశేఖర్ ప్రభుత్వానికి ముందటి ప్రభుత్వం (వీపీ సింగ్ ప్రభుత్వం) పదివేల రూపాయల ఋణాలను రద్దు చేయటం వలన ఆర్ధిక స్థితి దివాళా దశకు చేరి పరిస్థితి అక్కడకి దారి తీసింది.

ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఆ తర్వాతి ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురవుతాడనీ, తదుపరి పీవీజీ ప్రధానిగా చేయబడతాడనీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులకి తెలుసు. అది మన బోటి వారికి, సాధారణ ప్రపంచానికీ తెలియకపోవటం వేరే విషయం.

ప్రధానిగా పీవీజీ హయాంలో దేశాన్ని ‘1992 డిసెంబరు ఆరున బాబ్రీ మసీదుని కూలగొట్టటం’ అనే పైకారణంతో ముక్కచెక్కలు చెయ్యాలన్నది వాళ్ళ చిరకాల వాంఛ!

కాబట్టే – బాబ్రీ మసీదుని కరసేవకులు నేలమట్టం చేస్తున్నప్పుడు… అద్వానీ ఆనందంగా “నా శరీరం పులక లెత్తుతోంది. మన చిరకాల వాంఛ నెరవేర బోతోంది. నా జన్మసార్ధక మయ్యింది” ఇత్యాది పరవశోక్తులు పలికాడు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఇతడి లక్ష్యం అదే మరి! [అద్వానీ పరవశాన్నీ, పలుకుల్నీ గురించి పోలీసు అధికారిణి అంజూగుప్తా ఇటీవల సాక్ష్యం చెప్పింది.]

ఆ విధంగా… దేశాన్ని కుప్పకూల్చేందుకు సర్వ సన్నద్ధంగానే ఉన్నారు. కాబట్టే డిసెంబరు 6, 1992 న భాజపా, ఆర్.ఎస్.ఎస్., వి.హెచ్.పి. లు లెక్కకు మిక్కిలిగా కరసేవకుల్ని సమీకరించి, అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన సందర్భంలో, ఆ సంఘటనని కవర్ చేయటానికి బి.బి.సి. వంటి వార్తా సంస్థల దిగ్గజాలతో సహా, ప్రపంచ మీడియా భారత్ లోనే తిష్ఠ వేసింది.

ప్రత్యక్ష ప్రసారాలతో విషయాన్ని రక్తి కట్టించటానికీ, మలుపులు తిప్పటానికీ అది పూర్ణ సన్నధ్దత తో ఉంది. ఇప్పుడంటే – మీడియా, ఏ విధంగా రాజకీయాలనీ, ప్రపంచ దేశాల స్థితిగతులనీ కూడా నడిపిస్తుందో ఇంతగా బహిర్గతం అయ్యింది గానీ, అప్పటికి ‘ఇదీ విషయం, ఇదీ మీడియా పనితీరు!’ అంటే నమ్మగల వాళ్ళు చాలా చాలా తక్కువ.
నిజానికి ప్రపంచ యుద్ధాలకు దారి తీసిన కారణాలలో అయా దేశాల మీడియాది కూడా ప్రధాన పాత్ర అయినా, అది పదో తరగతి పిల్లల సాంఘీక శాస్త్ర పాఠంలో ఓ చిన్న పేరాగా ఉంటుందే తప్ప, ఇంపార్టెంట్ ప్రశ్నల జాబితాలో కూడా ఉండదు. అలాంటి చోట, ప్రజలకి అది తెలిసేంత ప్రచారంలో ఎలా ఉంటుంది? అప్పటికి ప్రచార పట్టు మొత్తం వాళ్ళదే కదా!

ఇక… ఒక వేళ అయోధ్యలోని బాబ్రీ కూల్చివేత వ్యవహారం గానీ తగినంత మోతాదులో దేశ విస్ఫోటనం చెందించక పోతే… భాజపా జాబితాలో అయోధ్యలోని ‘రామ జన్మభూమి - బాబ్రీ మసీదు’ వివాదం తర్వాత, మధుర లోని ‘శ్రీ కృష్ణ జన్మభూమి-మసీదు వివాదం’ ఉంది. ఆ తదుపరి అదే జాబితాలో మరో 500 చోట్ల మసీదులు పడగొట్టి మందిరాలు కట్టే ప్రణాళిక ఉంది. ఈ విషయం పీవీజీ తన అయోధ్యలో స్పష్టంగా వివరించారు. మందిరాలు కట్టినా కట్టకపోయినా… ఆ పైకారణం(over leaf reasons) తో మత ఘర్షణలైతే బాగా రేపవచ్చు.

వాటిని కవర్ చేయడానికే ప్రపంచ మీడియా ఆనాడు భారత్ లో తిష్ఠ వేసింది. ముస్లిం దేశాల అండదండలతో చెలరేగే ముస్లిం తీవ్రవాద సంస్థలు, ఆల్ ఖైదాలూ, తాలిబాన్లు అప్పటికి చాపక్రింద నీరులా ఉన్నాయి గనక, వాటి బలం ఎంతో… ఇప్పుడు తేటతెల్లమైనట్లుగా అప్పటికి తెలియదు కూడా!

అలాంటి చోట… చంద్ర శేఖర్ హయాంలో బంగారాన్ని తనాఖా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. తర్వాతి కాలంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. పీవీజీ ప్రధాని అయ్యాక అనివార్యమై కూడా వెన్వెంటనే సరళీకరణకి ద్వారాలు తెరిచాడు. అయితే ఆయన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టగానే…మన్మోహన్ సింగ్ వంటి ఆర్ధికవేత్తల అభివృద్ధి పరుగెత్తుకు రాలేదు. సదరు మేధావుల మాయాజాలం తో షేర్ మార్కెట్ లో బూమ్ వచ్చింది. అందులోంచి హర్షద్ మెహతా వచ్చి కూర్చున్నాడు.

ఇప్పుడు… దాదాపు 18 ఏళ్ళు గడిచాక…పీవీజీ 1992 లో, ఆ తర్వాతా సమీకరించిన నెం.5 వర్గపు పని తీరు కారణంగా, మెదళ్ళతో యుద్ధం కారణంగా, ఇప్పుడు భారత్ ని ఇలా అమెరికా అధ్యక్షులు ఒబామాలు ప్రశంసిస్తున్నారు గానీ, అప్పటి పరిస్థితి వేరు.

1992, డిసెంబరు 6న బాబ్రీ ఘటన నాటికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల చిరకాల వాంఛ ప్రకారం – భారత్ ని కుప్పకూల్చి, ముక్కచెక్కలు చెయ్యగలిగితే… అందుకోసం మత ఘర్షణలని కార్చిచ్చులా దేశమంతా వ్యాపింప జేస్తే…

అంతకు ముందు సంవత్సరాల్లో చంద్రశేఖర్ గట్రాల హయాంలో బంగారం తనఖా పెట్టిన కేంద్ర ప్రభుత్వం దగ్గర ద్రవ్యనిధులే మాత్రం ఉండి ఉంటాయో ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు. అలాంటి చోట, పెచ్చరిల్లే మత ఘర్షణలని, అణచి వేసేందుకైనా కేంద్రం దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు. ఇటు ముస్లిం వర్గాలకూ, అటు భాజపా, వీ.హెచ్.పీ., ఆరెస్సెస్ వర్గాలకూ మాత్రం, గొడవలు రేపేందుకు, శరీర దార్డ్యత గల ప్రొఫెషనల్స్ ని కిరాయికి తెచ్చుకునేందుకు… అన్నిరకాలుగా మత కల్లోలాలని ఆర్గనైజ్ చేసేందుకు, కావలసినంత ఆర్ధికబలం ఉండింది.

అందుకే… ద్రవ్యలోటుతో ఉన్న కేంద్ర ప్రభుత్వం, బంగారాన్ని తనఖా పెట్టుకున్న ప్రభుత్వం, పీవీజీ చేతుల్లో కొచ్చింది. ఆ పైన బాబ్రీ కూల్చివేతని ఎదుర్కుంది. కాకపోతే 1992 మధ్యనాటికే పీవీజీ కి గూఢచర్యవలయంలో కీలక స్థానమైన రామోజీరావు ఉనికి తెలియడం, ఆ తీగ లాగితే ప్రపంచాన్ని అల్లుకున్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల గూఢచర్య వలయం తెలియటంతో… వాళ్ళ ఈ వ్యూహాలన్నీ తల్లక్రిందులయ్యాయి.

ఇది రాజకీయ నేపధ్యం!

ఇక… ఆర్ధిక రంగంలో…

ఆ తదనంతర పరిణామంలో వాళ్ళు అనుకున్నట్లే భారత దేశం మత ఘర్షణలతో కుప్పకూలి సుమారు ఓ 500 చిన్న చిన్న రాజ్యాలుగా (సంస్థానాలుగా) విడిపోయి ఉంటే – రూపాయి కి విలువెక్కడి నుండి వచ్చేది? అప్పుడు బంగారానిదే హవా! అంతటి పాత్ర ‘బంగారం’ది.

(అందుకు బదులు గానే… డాలర్, పౌండులకు మాదిరిగా రూపాయికీ ఓ ‘చిహ్నం’ అంతర్జాతీయంగా గుర్తించబడింది. మొదట వాణిజ్యపరంగా భారత్ కు గుర్తింపు వచ్చి, ఆ తర్వాత రూపాయికి గుర్తింపు వచ్చింది. అదీ నెం.5 వర్గానికీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ మధ్య… గూఢచర్య యుద్ధం లేదా మెదళ్ళతో యుద్ధంలో భాగంగా… నడిచే ‘సవాళ్ళు-ప్రతి సవాళ్ళ’తో కూడిన భాష! )

చిన్నచిన్న రాజ్యాలు లేదా సంస్థానాలుగా విడిపోతే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంటే వాళ్ళే ఆయా చిన్న రాజ్యాలకు మహారాజులు! అందుకోసం భారీగానే బంగారం నిల్వలున్నాయి, మాజీ సంస్థానాధీశుల దగ్గరా, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాల తాలుకూ కీలక ఏజంట్ల దగ్గరా! ఆ జాబితాలో కొందరు కార్పోరేట్ దిగ్గజాలు కూడా ఉన్నారు.

ఎటూ జైపూర్ మాజీ రాణులు, రాజులు, సంస్థానాధీశులు తమ ఆనాటి రాజసౌధాలని హెరిటేజ్ హోటళ్ళుగా మార్చి, స్వయంగా కొన్ని కంపెనీలలో వాటాలు కలిగి ఉండి… అదునైన సమయం రాగానే పరిస్థితుల్ని అంది పుచ్చుకోవటానికి సిద్దంగానే ఉన్నారు.
ఇక్కడ ఉదాహరణకి సౌదీ రాజునే తీసుకొండి. అతడి రాజవంశం ఎప్పటి నుండో సౌదీని ఏలిన రాజ వంశం కాదు. బ్రిటీషు వాళ్ళు అంతర్జాతీయంగా చాలా దేశాలలో స్వాతంత్రాలు ప్రకటించిన తరువాత ధనికుడైన సౌదీ వ్యక్తి సౌదీకి రాజుగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత అతడిని సౌదీ రాజుగా వ్యవహరించటం మొదలైంది. ఇంకో తరం తర్వాత ‘సౌదీ రాజు పూర్వీకులు నిజంగానే సౌదీని వంశపార్యపరంగా ఏలేరేమో!’ అనుకుంటాం. అదీ మీడియా ప్రచార బలం.

కాబట్టి ధనికులు, కార్పోరేటు దిగ్గజాలు, భారీ బంగారు నిల్వలని ఆనందంగా, రహస్యంగా దాచుకున్నారు.

ఇప్పుడు, ఈ ఆర్ధిక మాంద్యంలో, అన్నిదేశాలలో ప్రభుత్వాల చేత ప్రకటించుకున్న ఉద్దీపనలన్నీ బావిలో పోసిన బక్కెట్ నీళ్ళలాగా అయ్యేసరికి… గమ్యం చేరటం కోసం నౌక చెక్కలు నరికి తగలేసిన ఫిలియాస్ ఫాగ్ లాగా… (విపర్యయ పోలికే ననుకొండి) ‘ఈ గండం గడిస్తే చాలు’ అనే పరిస్థితికి ప్రయాణించారు.

ఎందుకంటే – కంపెనీలు కూలితే మిగిలేది శూన్యమే మరి! కాబట్టి కూడా షేర్ మార్కెట్ ని నిలబెట్టు కోవాల్సి వస్తోంది. అందుకోసం అనధికార బైబ్యాక్ (అంటే తమ షేర్లని తామే బినామీగా క్రయ విక్రయాలు జరిపించుకోవటం) నిర్వహించాలంటే పైకం కావాలి.

(మార్కెట్ లోకి సామాన్య మదుపరులూ, అమాయక చక్రవర్తులూ రావటం ఎందుకు తగ్గిందో గత టపాలలో వివరించాను.) ఆ పైకం సమకూర్చు కునేందుకు, తమ దాచుకున్న బంగారు నిల్వలు బయటకు తీస్తున్నారు.

అలాంటప్పుడు కొన్నేళ్ళ క్రితం లాగా (అంటే గత అర్ధ దశాబ్దం వరకూ) బంగారానికి తక్కువ విలువ ఉంటే ఎలా? అందుకే… రెండేళ్ళు తిరిగే సరికే, బంగారం విలువ అమాంతం అయిదేసి రెట్లు పెరిగి పోయింది.

‘బంగారం విలువ ఇన్నేళ్ళల్లో అన్నిరెట్లు పెరిగింది, ఇంత శాతం పెరిగింది’ అంటూ గ్రాఫులతో సహా విశ్లేషణలు చెప్పే ఏ మీడియా కూడా, ఎందుకింత పెరిగిందో చెప్పక పోవటానికి కారణం కూడా ఇదే! ఇప్పుడు క్రొత్త ప్రచారం – ‘షేర్ మార్కెట్ మందగమనం వలన బంగారం కొనుగోళ్ళు పెరిగాయని, అందుకే చైనా, భారత్ లు భారీగా బంగారం దిగుమతి చేస్తున్నా’యన్నది.

[ఇక ఇప్పుడు వెండినీ మరింతగా ఆకాశంలోకి ఉరికించ దలుచుకున్నారు గనకనే ‘ఇక పేదవాడి బంగారం వెండీ’ అంటూ వెండి కంఠా భరణాలని నాజూకు డిజైన్లలో రంగుల ఫోటోలని ముద్రించి ప్రచారం ప్రారంభించారు. ఎటూ ‘వెర్రి, మోజు’ ఎక్కించి, కుహనా విలువ పెంచితే… ఆ మాయ లో పడే వాళ్ళు ఇంకా చాలామందే సమాజంలో ఉన్నారు కదా! వారిలో కార్యకారణ సంబంధం తెలీని వారు కొందరు, మీడియా ప్రచారాన్ని నమ్మేవారు మరి కొందరు!
ఇప్పుడు బంగారం ధర ఇరవై వేలు దాటాక, ప్రత్యామ్నాయాలు వెదుక్కునే ఎగువ దిగువ మధ్య తరగతి ప్రజల మీదికి ఒన్ గ్రాం ఆర్నమెంట్ ప్రచార వల విసురుతోంది మీడియా! ఊదర పెట్టే కథనాలు, ఊరించే రంగుల ఫోటోలతో తరచూ ఆర్టికల్స్ ని, ప్రత్యామ్నాయంగా మనకి చూపిస్తూనే ఉంటుంది.

అంటే వెరసి… సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి జేబులు పట్టనంత సంపాదనా అంటూ 5 లక్షల ఫ్లాటు 25 లక్షల రూపాయలకు అమ్మి దోపిడి చేసినట్లు, 10 గ్రాముల బంగారం, నాలున్నర ఐదు వేల రూపాయలలో ఉన్న ధర కాస్తా 20 వేల రూపాయలకి చేరింది. ఇదో రకం దోపిడి. వెండిది కూడా ఇలాంటి దోపిడియే!

ఇంత విపరీతంగా పెంచిన బంగారు ధరతో, తమ వద్దనున్న బంగారాన్ని డబ్బుగా మార్చుకొని, దాంతో తమ షేర్లని తామే దొంగ కొనుగోళ్ళు అమ్మకాలు చేసుకుంటూ నిభాయించుకో ప్రయత్నిస్తున్నారు. (అన్ని గాక పోయినా అధిక భాగం, అలాగే అన్ని కంపెనీలు గాకపోయినా బడా కంపెనీల్లో అధిక భాగం)

నిభాయింపు ఎప్పుడూ గుప్తంగానే ఉంటుంది. నిభాయించుకునే ప్రయత్నాల్లో భాగంగా, కొద్దిపాటి ఒడిదుడుకులే తెరపైన మనకి కనిపిస్తాయి. నిజానికి నిల్వలు పెంచుకునే స్థితి నుండి, నిల్వలు కరిగించుకునే స్థితికి రావటమంటేనే కష్టాల సుడిగుండంలో ఉన్నట్లే! అది బాహాటంగా అందరికీ తెలియటానికి మరికొంత సమయం పట్టవచ్చు గాక, వాళ్ళకైతే తమ ‘కంత’ ఎంత పెద్దదో తెలుస్తుంది కదా!

బయట వాళ్ళకి మొత్తం కుప్పకులాకే తెలియవచ్చు గానీ, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుసు… తమ నిల్వలు పెరుగుతున్నాయో, తరుగుతున్నాయో! అన్ని దేశాలలో, కార్పోరేట్ రంగంలో, ఆ గడబిడనే ప్రస్తుతం మనం చూస్తున్నాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

బంగారం లాంటి నిజం,తెలియ జేసారు.
:)

Saudi Arabia and Gulf states major sources of terror funding

http://www.dnaindia.com/world/report_saudi-arabia-and-gulf-states-major-sources-of-terror-funding_1477441

Saudi Arabia and oil-rich Gulf States continue to be major sources of funding for radical Islamist terror groups like al Qaeda and LeT and militant groups are suspected to be receiving hefty donations during the annual pilgrimage of Haj, leaked US documents have said.
"Private donors in Saudi Arabia constitute the most significant source of funding to Sunni terrorist groups worldwide", a leaked memo from US secretary of state Hillary Clinton in December 2009 reads.
While acknowledging that Saudi Arabia has made "crucial progress" in aggressively trying to close the terrorist funding tap, the document say that while Riyadh is serious about threat from terrorism to the Kingdom, "it is a challenge to persuade Saudi officials to tackle terror funding outflow from its soil".
Much of the terror funding outflows are from the private donors, according to the leaked cables with most of the Gulf States cracking down on terrorist sympathisers, but not running foul of Islamic charitable institutions, so as not to be seen as American stooges before their skeptical public.
US officials have complained that wealthy individuals in the Saudi Kingdom and Gulf States are making direct donations during the Haj or in the religious month of Ramzan and abundant informal money transfers done through hawala networks.
Though the US officials acknowledge that Saudi Arabia is now taking concrete steps to combat terror financing emanating from its soil, the Clinton cables draw a different picture of the situation in other Gulf States like Kuwait, Qatar and UAE.
The leaks said, Kuwait like Saudi is taking action against terror outfits that threaten the country, but "is less inclined to take action against financiers and facilitators based in the country plotting attacks outside.
Kuwait is described in the leaked cables as a "key transit point" for terror fundings as it lacks regulatory framework needed to monitor such activities.
A still grimmer picture is painted of the UAE, which the US cables say is a growing global financial centre, but has weak regulatory mechanism which makes it vulnerable to abuse by terrorist financiers and facilitation networks.
UAE has been identified as also a safe haven for corrupt Afghani officials looking to hide funds in the banks in the country
--------------------
http://www.facebook.com/indiamediawatch

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu