బంపర్ ఆఫర్ సినిమాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూర్యప్రకాశ్ (సాయాజీ షిండే) లాగే... ఆయా దేశాలలో కార్పోరేట్ కంపెనీలు, రాజకీయులూ ప్రధాన ఏజంట్లుగా గల నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గాలు కూడా... అడ్డంగా సంపాయించిన సొమ్మే గానీ అదేమైనా న్యాయంగా సంపాదించిందా!? ఆయా దేశాల ప్రభుత్వాల్లో కీలక వ్యక్తుల సహాయంతో ప్రజాస్వామ్య బద్దంగా, అధికార యుక్తంగా చేసిన దోపిడియేగా! G-2, G-8 G-20, G-xyz లంటూ సమితులు పెట్టుకుని మరీ రచించే ప్రణాళికలూ అవే...! ‘ఏయే చట్టాలూ, స్ట్రాటజీలు అమలు చేసి, ప్రజల నుండి ఇంకా ఎంతగా శ్రమదోపిడి, వ్యాపార దోపిడి చేయగలమా’ అనే!

అలాంటి నేపధ్యంలో... చట్టాల్లోని లొసుగుల్నే ఉపయోగించి, నకిలీ కణిక వ్యవస్థనీ, వాళ్ళ అనుచర వ్యక్తులనీ... వాళ్ళ వేలితో వాళ్ళ కంటినే పొడిపించాలన్నా, వాళ్ళ కాగితపు సంపద వాళ్ళ చేతే దగ్ధం చేయించాలన్నా... జాతరబొమ్మలు/జంట పీతలతో, అది చాలా సుసాధ్యమైన పనే! కేవలం ఎవరికెవరు జాతరబొమ్మలో చూసుకొని, ఒకరి లొసుగుల గురించిన సమాచారం మరొకరికి ‘లీక్’ చేస్తే సరి!

పైకారణం ఏదైనా గానీ గాక ‘సాక్షి Vs. ఈనాడు’ల రూపంలో నడుస్తోందీ, కంపానీ నిధులు సూక్ష్మ ఋణాల్లో ఉన్నాయన్న దానితో బాటు రామోజీరావు లొసుగుల్ని సాక్షి బయటపెట్టటంలో వ్యక్తమౌతుందీ… అలాంటి అంశాలే!

కొన్నాళ్ళక్రితం అమర్ సింగ్ నీ, అమితాబ్ బచ్చన్ నీ వెంటేసుకుని తిరుగుతూ… అనిల్ అంబానీ, తన అన్న ముఖేష్ అంబానీ లెక్కల లొసుగుల్ని బయటపెట్టాడు. ‘తన మీద హత్యాప్రయత్నం సైతం జరుగుతోందని’ ఆరోపిస్తూ ‘తన ఉద్యోగి తన హెలికాప్టర్ ఆయిల్ ట్యాంకులో ఇసుక ఉండటాన్ని కనుగొనడంతో తాను పోలీసుకేసు నమోదు చేయించానని, ఆ ప్రయత్నం వెనక తన ప్రత్యర్ధి కంపెనీ ఉందనీ’ అన్నాడు.

తర్వాత ఏమైందో గానీ సదరు ఉద్యోగి రైలు పట్టాల మీద శవమై తేలటం, పోలీసులు దాన్ని మొదట ఆత్మహత్య అనీ, తర్వాత హత్య అనీ అనటం గురించి… గత టపాల్లో , టపాకాయల్లో ప్రస్తావించాను.

ఇక ముఖేష్ అంబానీ కూడా… అంతక్రితమే, తగురీతిలో స్పందిస్తూ… ‘తన తండ్రి బ్రతికి ఉన్నరోజుల్లో రాజకీయ నాయకుల్ని ‘మానేజ్’ చేసే పనుల్లో, లాబీయింగు నిర్వహించటం వంటి పనుల్లో, తన తమ్ముడు అనిల్ నిమగ్నమై ఉండే వాడన్నాడు’. ఆ మీదట తమ్ముడు అన్న పై పరువునష్టం దావా కూడా వేసాడు. ప్రస్తుతం అది కోర్టులో ఉందో లేక అన్నదమ్ములిద్దరూ రాజీపడినప్పుడు కేసు వాపసు తీసుకున్నారో తెలియదు.

అలా జాతర బొమ్మలు పరస్పరం కొట్టుకుంటాయన్నమాట!
మొదట చిన్న దెబ్బలు కావచ్చు గాక…
కొన్నాళ్ళు విషయాన్ని మాఫీ చేసుకునేందుకు, మూసిపెట్టుకునేందుకు ప్రయత్నాలు చేయవచ్చు గాక… అది పునరావృతం అయినప్పుడూ…
‘చంపు లేదా ఛస్తావ్’ అనేంత పరిస్థితి ఎదురుగా నిలిచినప్పుడూ…
ఏం చేస్తారు?

ఆ విధంగా ఇప్పుడు తెర వెనక మరుగుతున్న వ్యవహారాలు… ఇప్పుడు గుట్లు!
బయటపడినప్పుడు… అదే రచ్చ!
కాకపోతే బయటపడే లోపున నడిచే తతంగమే ఇప్పుడు నడుస్తోంది.
ఇక, ఇది షేర్ మార్కెట్ దాకా ఎలా ప్రయాణించిందో చెప్పేముందు, మరికొన్ని ఉదాహరణలు చెబుతాను.

గత టపాల్లో వ్రాసిన ‘చిల్లపెంకుల బిందె వ్యాపారం కోట్లాది రూపాయలు !’ కథని (http://ammaodi.blogspot.com/2010/10/29.html) మరోసారి ప్రస్తావిస్తాను.

ఆ కథలో బంగారు బిందెలో మణిమణిక్యాలున్నాయనుకొని అంతకంతకూ ఎక్కువ ధర పెట్టి కొంటారు. తీరా పరిపక్వ(మార్కెట్ కుప్పకూలినప్పుడు) సమయం వచ్చాక చూస్తే, అందులో నిండా చిల్లపెంకులు నింపి ఉంటాయి. అప్పటికి అది ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళ నెత్తికి ఆ నష్టమంతా చుట్టుకుంటుంది.

అదే కథని, ఈ ఉదాహరణ లోనూ ఉపయోగిస్తున్నాను. ఓ వందమంది వ్యక్తులు ఒక వృత్తాకార వలయం మీద నిలబడి ఉన్నారనుకొండి. ఓ పది బంగారు బిందెలు వాళ్ళ చేతుల్లో తిరుగుతున్నాయనుకొండి. బంగారు బిందెలు వరుసగా చేతులు మారుతున్నాయి.

ఓ ప్రక్కవారి చేతిలోంచి బిందెనందుకున్న వారు, మరో ప్రక్కనున్న వారికి అందిస్తున్నారు. ఇళ్ళ నిర్మాణంలో శ్లాబు వేస్తున్నప్పుడు, కూలీల చేతుల్లో కాంక్రీటు కలిపిన బొచ్చెలు తిరుగుతాయి చూడండి, అలాగన్న మాట! నిజానికి ఆ బిందెలు చూడటానికి బంగారు బిందెల్లానే ఉన్నాయి. వృత్త పరిధిపై నిలబడి, బిందెల నందుకుని ప్రక్కవారి కందిస్తున్న ప్రతీ ఒక్కరూ, ఆ బిందెల్లో మణిమాణిక్యాలున్నాయని శ్లాఘిస్తున్నారు.

బిందెల నందిస్తున్నప్పుడు, వాటిల్లోకి చూస్తూ, ఆ మణి మాణిక్యాల వెలుగుల్ని తమ ముఖాల మీదా, కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తున్నారు. అది చూసి చుట్టూ ఉన్నవాళ్ళు చప్పట్లు చరుస్తున్నారు. అంతకంతకూ బిందెల బరువు పెరిగి పోయినట్లుగా వృత్త పరిధి మీద నిలబడి ఉన్నవారు అరుస్తున్నారు, అభినయస్తున్నారు. చూస్తున్న వాళ్ళు ‘అవును కామోసు’ అనుకుంటున్నారు.

కార్పోరేటు కంపెనీలు, బ్యూరాక్రాట్లు, ఆర్ధికవేత్తలు, రాజకీయ నాయకులు వృత్తపరిధి మీద నిలబడిన వ్యక్తుల్లాంటి వాళ్ళయితే, వాళ్ళ చేతుల్లోని చిల్లపెంకులతో నిండిన బంగారు బిందెలు, షేర్లవంటివి, ఆర్ధికాభివృద్ధి లెక్కల్లాంటివి. వాళ్ళ ముఖాల మీద మెరుపులకి కెమెరాలు, వాళ్ళ అరుపులకి మైకులూ అందిస్తూ, ఈ ఆటనంతటినీ రక్తి కట్టిస్తున్నది మీడియానే! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి ప్రధాన అండాదండా మీడియానే కదా! నకిలీ కణిక అనువంశీయులు వేసుకున్నదీ మీడియా ముసుగునే నయ్యె!

నెం.5 వర్గం సమీకరింపబడక ముందు, కేవలం నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గపు పట్టే ప్రపంచమంతా నడుస్తున్నప్పుడు… ఇదంతా వాళ్ళకి నిరాఘటంగానే నడిచింది. ఆట రక్తి కట్టింది కూడా!

నెం.5 వర్గానికి, కుట్ర తీరు అర్ధమయ్యాక…

ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియ ఏమిటంటే--- పైన చెప్పిన ఉదాహరణలో వృత్తపరిధిపై నిలబడిన కార్పోరేట్ కంపెనీలు, బ్యూరాక్రాట్లు, ఆర్ధిక వేత్తలు, రాజకీయ నాయకులు గట్రాల మధ్య…నెం.5 వర్గం ఎవరికెవరు జాతర బొమ్మలో పరిశీలించుకుని ప్రత్యర్ధుల లొసుగుల్ని ఒకరి కొకరికి ‘లీక్’ చేస్తోంది. జాతర బొమ్మలకి ఒకరి మీద ఒకరికి ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు ఉంటాయి. నెం.5 వర్గపు పనితీరుతో, సమాచార వెల్లడి కారణంగా, అవి మరింతగా పెచ్చు పెరిగి పోయాయి.

దాంతో ‘చంపు లేదా ఛస్తావ్’ అనే స్థితి ఎదురయ్యింది. ఇక ఈ స్థితిలో ఒకరి లొసుగుల్ని ఒకరు బయట పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అలాంటివి పదే పదే జరిగితే…? పై ఉదాహరణలో వృత్తపరిధిపై నిలబడిన వందమందిలో, తడవకి కొందరు, తమ చేతుల్లోకి వచ్చిన బిందెని, తమ భావోద్వేగాల రీత్యా, బోర్లా వేసి చూపిస్తున్నారనుకొండి. (తమ జాతర బొమ్మల గుట్టు బయట పెట్టినట్లుగానన్నమాట!) అప్పుడేమవుతుంది?

చుట్టూ చూస్తున్న వాళ్ళకి బంగారు బిందెల్లో ఉన్నది మణిమాణిక్యాలు కావని, ఒట్టి చిల్లపెంకులనీ అర్ధమై పోతుంది. ఒకసారికి…చెప్పబడిన పైకారణాలని (over leaf reasons)ని నమ్మి “ఈ సారికి పొరబాటు అయ్యిందేమో” అనుకుంటారు. రెండోసారి జరిగితే…? “ఏమో, మరో పొరబాటేమో” అనుకుంటారు. పదిసార్లు జరిగితే…? పదే పదే జరిగితే…?

అప్పుడు ఖరారుగా… బంగారు బిందెల్లా కనబడుతున్న వాటిల్లో ఉన్నవి మణి మాణిక్యాలు కావని, అలాగని తమ కిన్నాళ్ళు ‘బుస్సు’ కొట్టారనీ, అందులో ఉన్నవి నికార్సుగా చిల్ల పెంకులేనని నిశ్చయంగా తేలిపోతుంది. అదే ఇప్పుడు జరిగింది, జరుగుతోంది,

ఇందుకు కొన్ని దృష్టాంతాలు పరిశీలించండి.

ముందుగా రాజకీయ, మీడియా రంగాలలోని దృష్టాంతాలని చూద్దాం. ఎందుకంటే అవి బాహాటంగా కనబడేవి, స్పష్టంగా అర్ధమయ్యేవీ గనక!

1989-90లలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డిని దించేసి నేదురుమల్లి జనార్ధన రెడ్డిని ఎక్కించుకోవాలను కున్నాడు. పాత బస్తీ మత ఘర్షణలు, ఘట్ కేసర్ రైలు ప్రయాణీకుల సజీవ దహనాలు జరిగాయి.

జరగాల్సినంత రగడ జరిగాక… చెన్నారెడ్డి సీటు దిగిపోయాడు, నేదురుమల్లి జనార్ధన రెడ్డి సీటు ఎక్కాడు. చెన్నారెడ్డికి తెలుసు తనని ఎవరు దింపేసారో? నేదురుమల్లికీ తెలుసు తనని ఎవరు ఎక్కించారో! వెరసి ఇద్దరికీ తెలుసు… రాజకీయాలని మీడియా, మీడియా ముసుగు వేసుకున్న ‘కింగ్ మేకరూ’ ఎలా ఆడిస్తున్నాడో!

అయినా కిక్కుర మనకుండా కూర్చున్నారు. ఎందుకంటే – మొత్తం పట్టు వాళ్ళదే అయినప్పుడు తముకిక్కుర మంటే ఏమవుతుంది? తాము నొక్కి వేయబడతారు. ఇక ఆపాటి కెరీర్ కూడా ఉండదు. కాబట్టి విధేయత చూపటమే కెరీర్ కి రహదారి, సంపాదనకి మార్గం. కాబట్టే కిక్కుర మనలేదు.

ఆ విధంగా విధేయత చూపినందుకే, తర్వాత చెన్నారెడ్డికి తమిళనాడు గవర్నరు గిరీ దక్కింది. నేదురుమల్లికి ఎంపీ సీటు తప్ప ఇంకేం ఒరగలేదు లెండి. అప్పటికి గూఢచర్య ఏకచ్ఛత్రాధి పత్యమూ నకిలీ కణిక వ్యవస్థకి, నెం.10 వర్గానికి చేయి జారిపోయింది మరి!

అయితే, 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు, రామోజీరావు బృందానికి చంద్రబాబుని సీటు దించేయాల్సిన, వై.యస్.ని సీటు ఎక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. (అది ఎందుకో గత టపాలలో వివరించాను.) అదే అసైన్ మెంట్లు జారీ చేయబడితే చంద్రబాబు గునిసాడు. ఎంతగా అంటే – అలిపిరిలో చావు తప్పి కన్ను లొట్టబోయినంతగా! అంతగా మెడ మీదికి కత్తి వచ్చి తృటిలో తప్పి పోయాక గానీ, చంద్రబాబు ఇంకించుకోలేదు.

అప్పటికి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికి వ్యతిరేకంగా నెం.5 వర్గం పని చేస్తుందని చంద్రబాబుకీ, వై.యస్.కీ ఇద్దరికీ తెలుసు! కాకపోతే ఎవరి పట్టు ఎంతో, ఎవరు ఎంత బలాధిక్యత కలిగి ఉన్నారో తెలియదు. అదే NDAని (అద్వానీని) దింపేసి UPA(సోనియా)ని ఎక్కిస్తానంటే అద్వానీ చంద్రబాబులాగా ఎందుకు గింజుకోలేదో గత టపాలలో వివరించాను.

ఏ కారణంగా తాము సీఎంని చేసినా గానీ, ఆ సీఎం సీటులో కూర్చున్న వై.యస్. ఏ కారణంగానో అర్ధాంతర మరణం పొందినప్పుడు, 2008 లో తిరిగి ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే సీటు నాశించిన వై.యస్.జగన్… మొన్నటి చెన్నారెడ్డి లాగానో, నిన్నటి చంద్రబాబు లాగానో కిక్కురమనకుండా కూర్చున్నాడా? కూర్చుంటే తానూ మర్రి శశిధరరెడ్డి లాగా అయిపోతానని తెలుసు.

కాబట్టే – రామోజీరావు ని సాధ్యమయినంత కంపు కంపు చేస్తున్నాడు. అంబానీలతో, కంపానీలతో అనుబంధాలను గురించి అల్లరల్లరి చేస్తున్నాడు. ఏడుపుగొట్టు రామోజీరావు ఎప్పుడెప్పుడు ఏడుస్తాడో ఏకరువు పెడుతున్నాడు. ‘సహనం నశిస్తే ఉప్పెనే’ అంటూ కాంగ్రెసులోని కుట్రదారులకి అల్టిమేషన్ ఇస్తున్నాడు. పైకారణంగా వీ.హెచ్. గట్రా సీనియర్లని చూపించవచ్చుగాక కానీ అసలు గురి పెట్టింది సోనియా ప్రభృతులకే!

తత్కాల అవసరాల కోసం తాత్కాలిక రాజీలు పడినా, అంతర్గత ఒప్పందాలతో సర్ధుబాట్లు చేసుకున్నా, అసైన్ మెంట్లు తీసుకున్నా… తీరా పీక మీదికి పరిస్థితులు వస్తే… అది రామోజీరావైనా, సోనియా అయినా, వై.యస్. జగన్ అయినా… తమ ప్రాణమే తమకి విలువైనది, తమ కెరీర్ తమకి ముఖ్యమైనది. అంతేగానీ, ముందటి రాజీలూ ఒప్పందాలూ కావు.

ఇచ్చిన మాట కోసమో, దేశం కోసమో, ధర్మం కోసమో, లక్ష్యం కోసమో… ప్రాణాలు అర్పించేందుకు వీళ్ళేమీ భగత్ సింగ్ ల వంటి దేశ భక్తులు కారు, పచ్చి స్వార్ధపరులు!

ప్రయోజనం ఉంటుందనుకుంటే రాజీలు పడతారు, ప్రయోజనం ఉండదనుకుంటే రగడలు పడతారు, ప్రమాదం అనుకుంటే హోరాహోరీ తలపడతారు. అప్పుడు ఒకరి లొసుగులు మరొకరు బయటా పెట్టుకుంటారు, ఒకరి ఉసురు మరొకరు తీయనూ ప్రయత్నిస్తారు.

అదే ఇప్పుడు మనం రాజకీయ, మీడియా రంగాలలో చూస్తున్నాం. ఇదే చాలా రంగాలలో నడుస్తోంది. ఇవి బహిరంగమైన రంగాలు కాబట్టి స్పష్టంగా కనబడుతున్నాయి, మిగిలిన రంగాలలో బయటికి తెలియటానికి మరికొంత కాలం పడుతుంది. అంతే తేడా!

ఇక ఈ పర్యవసానం కార్పోరేట్ వ్యాపార రంగంలోనూ, షేర్ మార్కెట్ లోనూ అయితే…

మీడియా ప్రచారం కంటే కూడా మౌఖిక ప్రచారమే ప్రభావశీలమైన కార్పోరేట్ కంపెనీల అంతర వలయంలో, బుల్ ల నెట్వర్క్లో… జారత బొమ్మలైన ప్రత్యర్ధి కంపెనీల కారణంగా, ఒకరి లొసుగులు మరొకరు బయటపెట్టినప్పుడు షేర్ మార్కెట్ లో కుదుపులు తయారౌతున్నాయి.

ఎప్పటి కప్పుడు వాటికి ‘సెంటిమెంట్’ అనో, ‘FII ఆగమన, తిరోగమనలనో’ ‘ఫలానా ప్రణబ్ ముఖర్జీ లేదా చిదంబరం ఫలానా ప్రకటన ఇవ్వడం షేర్ మార్కెట్ పై ప్రభావం చూపింది’అనో మీడియా పైకారణాలని ప్రచారిస్తుంది. నిజానికి… నిజాలని దాచిపెట్టే ప్రయత్నం అది! మరోమాటగా చెప్పాలంటే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ చేస్తున్న ‘నిభాయించుకునే పెనుగులాట’ అది!

నిజానికి…1993లోనే ఒక్కుమ్మడిగా ప్రపంచ ప్రతిష్ఠాత్మక బ్యాంకు ఒకటి కుప్పకూలడం, అలాగే ఒక యూరప్ దేశీయ షేర్ మార్కెట్ ఉన్నట్లుండి పేక మేడలా కూలిపోవటం జరిగింది. వాటి పేర్లు నిర్ధిష్టంగా గుర్తులేనందున వ్రాయటం లేదు.

ఇప్పుడు, 20 ఏళ్ళ క్రిందటే మాంద్యంలో ఇరుక్కుపోయిందని చెప్పబడుతున్న జపాన్, ఇన్నాళ్ళు గడిచినా బయటపడలేక పోవటానికి ఇలాంటి ‘బంగారు బిందెని బోర్లాపడేసి అందులోని చిల్లపెంకుల్ని ప్రదర్శించటమే’ కారణం.

చిన్నదేశమైన జపాన్ ఆర్ధిక మాంద్యానికి రెండు దశాబ్దాలు గడిచినా పరిష్కారం కనుక్కోలేని వాళ్ళు, అమెరికా, యూరప్ లతో సహా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్ధికమాంద్యానికి, రెండేళ్లలో పరిష్కారం కనుగొనగలిగారా? అలాంటి చోట, ‘అదిగో మాంద్యం నుండి బయటపడ్డాం, ఇదిగో మాంద్యం అంతమయ్యింది’ అనటం అంటే – పచ్చి అబద్దాలు చెప్పటం కాదా మరి!? పక్కా 420 తనం కాదా!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

Please check this..

http://udayms.wordpress.com/2005/09/12/do-you-know-your-sonia/
It says Rahul and Priyanka were born Italian citizens because Sonia was Italian when she gave birth to them [Italian law based on jure sanguinis]. Hence, they continue be Italians since they never renounced it. Both have been traveling abroad on Italian passports.

Can RTI be used to get the nationality of these people?

2G scam: Hot tapes expose mediamen as power players

http://indiatoday.intoday.in/site/Story/120436/Top%20Stories/2g-scam-hot-tapes-expose-mediamen-as-power-players-.html

2G Spectrum Scam: What To Read And Listen To, And Where

Yesterday, Open magazine and Outlook published audio files and transcripts of conversations that Niira Radia, who runs several PR and consultancy companies, allegedly had with Tata Group Chairman Ratan Tata, Telecom Minister A. Raja, and the DMK’s Kanimozhi, as well as with senior journalists Barkha Dutt (from NDTV) and Vir Sanghvi (Editorial Director, HT Media), around the appointment of the Telecom Minstry in India. This follows previous revelations published by Mail Today and The Pioneer, and broadcast by HeadlinesToday. For reference purposes, we’re putting together is a list of information related (and allegedly related) to the appointment, and the 2G Spectrum scam that preceded the appointment, that has been published online; if true, it is shocking commentary on how the Telecom sector is manipulative, and policies manipulated. We’re updating this list, so feel free to suggest more links in the comments below.

Introduction

Some of these are alleged to be recordings of conversations that Niira Radia had with several people, in the aftermath of the Parliamentary elections that took place last year, discussing alleged issues with the appointment of ministers from the DMK, a regional political party from Tamil Nadu, as well as appointments to India’s Cabinet of Ministers. The context of these discussions is appointment of A. Raja as Telecom Minister, who allocated 2G mobile licenses in India, on a controversial first-come-first-served basis, by choosing an arbitrary cut-off date for allocation, and it was expected at the time that he would not head the ministry again.

Cortsy from
(1) http://www.medianama.com/2010/11/223-2g-spectrum-scam-what-to-read-where/
(2) http://www.lkadvani.in/forum/viewtopic.php?f=38&t=7503
(3) http://outlookindia.com/article.aspx?268068"

చంద్రబాబు అలిపిరి సంఘటన నాకింకా గుర్తుంది. నిజానికి ఆ రోజు సి.ఎం (చంద్రబాబు) ప్రోగ్రాంలో అలిపిరి టూర్ లేదు. ఆరోజు అన్నీ పేపర్లలో చదివాను సి.ఎం తూర్పుగోదావరిజిల్లాలో బాలయోగి ఘాట్ ప్రారభోత్సవం చేయాల్సిఉంది. కానీ. కానీ అకస్మికంగా ఆ ప్రోగ్రాం మారిపోయి అలిపిరి ప్రోగ్రాం తెరమీదికొచ్చింది. అప్పటికి అలిపిరిలో కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని గుర్తు . స్వామివారికి సి.ఎం పట్టువస్త్రాలు సమర్పించే ప్రోగ్రాంను తెరపైకి తీసుకొచ్చారు . అప్పుడే ఈ సంఘటన జరిగింది .

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu