మార్కెట్లో డబ్బు సంక్రమణం (Rotate) అయ్యి, కంపెనీలు నిలబడాలి. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయ ఉపాధి పధకం, xyz పధకం పేరుతో పందారం చేస్తుంది. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పధకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించింది కార్పోరేట్ ఆసుపత్రులకే మరి!

ఆ రూపంగా ఓ ప్రక్క ఓట్లు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేట్ కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింప చేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగా లేదా లంచాలుగా రాబట్టు కుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి వర్తులం. (Robery cycle)

ఇది ఎంత దారుణ దోపిడి అంటే… సూక్ష్మ ఋణ కంపెనీలు, వెంటబడి ఋణాలిస్తే సెల్ ఫోన్ల దగ్గరి నుండి చాలా వినిమయ వస్తువుల్నే అలవోకగా కొనేసుకున్న లబ్ధిదారులు…తీరా ఋణ వాయిదాలు కట్టలేక కూలబడితే, సూక్ష్మ ఋణ కంపెనీల ప్రతినిధులు వారిని నానా దుర్భాషలూ ఆడి ఆత్మహత్యలకి తెగబొడే దాక తీసుకెళ్తున్నారనీ, అది భీమా సొమ్ము కోసమేననీ కొన్ని సంఘటనలు కూడా వెలుగు లోకి వచ్చాయి.

ఏది ఏమైనా, అమెరికాలో గృహ ఋణాలు, భారత్ లో సూక్ష్మ ఋణాలు అంటూ… ఎంతకైనా తెగబడే స్థితికి ఆర్ధిక రంగం, రాజకీయ రంగం పెనవేసుకుని మరీ దారి తీసాయి. అది, కార్పోరేట్ రంగంలోని ఆర్ధిక మందగమనాన్ని తగ్గించుకోవడానికే!
అది ఎలా గంటే…

‘Round the World in 80 Days’ అనే ప్రసిద్ది నవల చాలామంది చదివే ఉంటారు. అందులో ఫిలియాస్ ఫాగ్, అట్లాంటిక్ సముద్రాన్ని దాటేటప్పుడు నౌకలో ఇంధనం అయిపోతుంది. కానీ అతడికి గడువు లోపల గమ్యం చేరటం తప్ప
మరేవీ పట్టవు.

ఇంధనం అయిపోయిన క్లిష్ట దశలో, ఓడ చెక్కల్ని నరికి, ఇంథనంగా వాడి నౌక నడుపుతారు. చివరికి ఫిలియాస్ ఫాగ్, భారత్ లో అతడు సతీసహగమనం నుండి రక్షించిన యువతి ఆయుదా, అతడి అనుచరుడు పాస్పార్తూ, కొద్దిమంది నౌక సిబ్బంది… నిలబడేందుకు అడుగు చెక్క తప్ప, ఓడ మొత్తాన్ని వలిచి తగలెట్టేస్తాడు.

ఇది ధీరోదాత్తుడైన ఫిలియాస్ ఫాగ్ లక్ష్యాన్ని ఛేదించిన తీరు! ఇది పాజిటివ్ కోణం!

ఇదే నెగిటివ్ కోణంలో ఉంటే… అదే ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అందులోని కీలక వ్యక్తుల స్థితి! అందులో కార్పోరేట్ కంపెనీల వారు ‘కీలకమైన ఏజంట్లు’ మరి! ఆర్ధిక మందగమనాన్ని దాటేందుకు ఫిలియాస్ ఫాగ్ నౌక చెక్క నరికినట్లు గానే… ‘ముందు ఈ స్థితి దాటితే చాలు! ఆనక ఇప్పుడు మార్కెట్టులోకి పంపిణీ చేసిన విత్తానికి రెట్టింపు తిరిగి రాబట్టు కోవచ్చు. అదేగాక ఈ గండం గడిస్తే…పట్టు సంపాదించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. ఒకసారి గూఢచర్య పట్టు తిరిగి సంపాదిస్తే… ఇక మళ్ళీ దోపిడికి అడ్డేముంది? అసత్య ప్రచారాలకి హద్దేముంది?’ – ఇదే తపన!

ఆ పర్యవసానమే… స్వంత ఇంటి ఋణాలైనా, సూక్ష్మ ఋణాలైనా! సామాన్య ప్రజలకి ఋణం రూపేణా డబ్బు ప్రవహింప చేస్తే…స్వంత ఇంటి ఋణాలంటే… ప్లానింగ్ చేసే ఇంజనీరింగ్ కంపెనీలు… నిర్మాణ సంస్థలు, సిమెంటు ఇనుము ఉత్పత్తిదారులు, వడ్రంగి, ఫర్నిచర్, వస్తు నిర్మాణ సంస్థలు… అందరికీ వ్యాపారం వస్తుంది. అచ్చం రోల్స్ రాయిల్స్ కారు ఆర్డరు కథలో లాగే!

అదే సూక్ష్మ ఋణాల విషయంలో కూడా! అడగకుండానే ఇంటికి వచ్చి మరీ అప్పిస్తే… సెల్ ఫోన్లు, కలర్ టీవీలు, బైక్ లూ, మోపెళ్ళు… ఎంత వ్యాపారం!? చివరికి గొర్రెల కాపర్ల చేతిలో కూడా కిలకిల మన్నది సెల్ ఫోన్!

‘ముఫ్ఫై మూడో నాడు అప్పు తీర్చక పోతే తన్ని వసూలు చేసుకుంటాం! అప్పు తీర్చలేక ఋణ గ్రహీతలు చచ్చినా ఫర్వాలేదు. జీవిత భీమా సౌకర్యం కల్పించుకుంటాం. డబ్బు Rotate కావడం ముఖ్యం!’ – ఇదే ప్రాతిపదికగా నడిచిన వ్యాపారమే అది! ‘నల్లడబ్బు సూక్ష్మ ఋణ సంస్థల ద్వారా మార్కెట్ లోకి ప్రవేశించిందని’ ఓ మాట కూడా బయటికి వచ్చింది.
నాలుగైదేళ్ల క్రితం సూక్ష్మఋణాల సంస్థలు రంగ ప్రవేశం చేసినప్పుడు… “రానున్న కాలంలో తిరిగి పట్టు సంపాదించుకోలేమా? ఈ
లోపున ఇరుకును దాటక పోతే కష్టం” అనుకుని చేపట్టిన ప్రణాళిక అది.

2007లో ఈనాడు ఆదివారపు సంచిక సెంటర్ స్ప్రెడ్ లో… అమెరికాలో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి, బంగ్లాదేశ్ లో విజయవంతమైన సూక్ష్మ ఋణాల స్ఫూర్తితో, భారత్ లో నిరుపేదల్ని ఉద్దరించాలనే సదాశయంతో, పేద ప్రజలపై ప్రేమతో, స్వదేశం వచ్చేసిన ఓ యువకుడి గురించి… ఉపమాన ఉత్ర్పేక్ష రూపకాలంకారాలతో వ్రాసింది. ఇంతకీ బంగ్లాదేశ్ లో అది విజయవంతమైందని మీడియా ప్రచారం. భారత్ లో అది విజయ వంతం అయ్యిందని బాంగ్లాదేశ్ లోనో మరో చోటనో ప్రచారించినా ఆశ్చర్యం లేదు. ఎటూ విభజించి ప్రచారించటమే కదా వాళ్ళ స్ట్రాటజీ !?

ఏదేమైనా… స్వగృహ ఋణాలు, సూక్ష్మ ఋణాలు గట్రా పైకారణాలలో మార్కెట్ లోకి డబ్బు ప్రవహింప చేసి (పనిలో పనిగా అందులో నల్లడబ్బు కలిపేసి), ఆర్ధిక మందగమనాన్ని త్వరిత పరచ ప్రయత్నించారు. కాకపోతే ‘బావిలో పోసిన బక్కెట్ నీళ్ళలాగా’ అది నిష్క్రయోజనమైంది. కాలం గడిచినా పరిస్థితి మారక పోవడమే ఇందుకు నిదర్శనం.

ఇదే విషయాన్ని మరో కోణంలో నుండి పరిశీలించండి.

>>> ఆంధ్రజ్యోతి లోని జాహ్నవి గారి ఎడిటోరియల్
>>>07/11

మేధో మథనం

మసకబారిన నల్లసూరీడు
- జాహ్నవి
మంచి మెజారిటీతో ఎన్నికై, ప్రపంచ ప్రజలందరి చేత 'ఔరా!' అనిపించుకున్న ఒబామా రెండే ళ్ళు తిరక్కుండానే పరాజయాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆర్థిక వ్యవస్థ అదుపులోకి రావడం లేదు. ముగుద్దామనుకున్న యుద్ధాలు ముగిసే సూచనలు కనిపించడంలేదు. నిరుద్యోగం తగ్గడంలేదు. డాలరు కొనుగోలు శక్తి రోజురోజుకీ తగ్గిపోతోంది. ఫలితంగా మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం. ఏం జరిగింది? ఎక్క డ తప్పు జరిగింది? దీన్నుంచి మనం నేర్చుకోగలిగిందేమైనా ఉందా?

ఒబామా అధ్యక్షపదవికి ఎన్నికల్లో ప్రచారం చేసే సమయానికే అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. అంతకు ముందు ఎనిమిదేళ్ళు పాలించిన జార్జి బుష్ చేపట్టిన తప్పుడు విధానాల వల్ల 1930లో వచ్చిన స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీనికి ఒక నేపథ్యం ఉంది. 2001-02లో కంప్యూటర్ - ఐటీ రంగం బుడగ పగలడం కారణంగా ఒక మాదిరి సైజులో ఆర్థిక మాంద్యం వచ్చింది. దాన్ని తప్పించుకోవడానికి ఇంకో బుడగను సృష్టించారు.

అసలు ఆర్థిక మాంద్యం అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రభుత్వం చేసే తప్పిదాల వల్లే వస్తుంది. మార్కెట్‌ను తనపని తాను చేయనీయకుండా, ఆర్థిక వనరుల్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. తనకు పేరు తెచ్చి పెట్టే పథకాలు, ఎన్నికల్లో లబ్దినిచ్చే పథకాల అమలుకు ఆ ఆర్థిక వనరుల్ని వెచ్చిస్తారు. జార్జిబుష్ చేసిందదే. 2001- 02లో వచ్చిన మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేస్తానని బీరాలు పలికాడు.

మనకు రిజర్వు బ్యాం కు ఉన్నట్లే, అమెరికాకు ఉన్న ఫెడరల్ రిజర్వు ద్వారా వడ్డీరేట్లను అథమస్థాయికి బలవంతంగా తగ్గించేశారు. "అమెరికా ప్రజలందరికీ సొంత ఇల్లు'' అనే పథకాన్ని మొదలెట్టారు. బ్యాంకులు నిబంధనలు మార్చేసి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకు అతి తక్కువ వడ్డీతో వెంటపడి మరీ రుణాలిప్పిలంచారు. అమెరికలో అన్నీ ప్రైవేటు బ్యాంకులే కదా? తిరిగి చెల్లించలేరు అనుకున్న వాళ్ళకు రుణావ్వరు కదా!

అందుకని కేంద్ర ప్రభుత్వం సొమ్ము తో ఫ్రెడీమాక్, ఫానీమే అనే రెండు సంస్థలను స్థాపించారు. తిరిగి చెల్లించని రుణాల బాధ్యత ఈ రెండు సంస్థలూ తీసుకునేందుకు బ్యాంకులతో ఒప్పందం. ఇక తమకు ఏ రిస్కులేదు కాబట్టి బ్యాంకులు ఎగబడి మరీ రుణాలిచ్చాయి. దాంతో ఇళ్ళకు డిమాండ్ పెరిగింది. ఇళ్ళు ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతున్నాయి కదా ని అవసరమున్నా లేకున్నా ఒక వ్యాపార పెట్టుబడిగా ఇళ్ళు కొనడం మొదలెట్టారు. మన దగ్గర జరిగిన రియ ల్ ఎస్టేట్ బూమ్ లాగే.

కొన్ని బ్యాంకులకు కూడా ఆశపుట్టి సొంత రిస్కు మీద కొన్ని రుణాలివ్వడం మొదలెట్టాయి. అమెరికాలో అర్థిక సేవల మార్కెట్ చాలా సంక్లిష్టమైనది. చాలా పెద్దది కూడా. భవిష్యత్తులో తిరిగి చెల్లించే రుణాల మేర కొన్ని సంస్థలు అప్పులు తీసుకున్నాయి. భవిష్యత్ చెల్లింపులను కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి.

రుణాలు తిరిచి చెల్లిస్తారా లేదా అన్న విషయం మీద కొందరు మార్కెట్‌లో స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధమైన వ్యాపార ప్రక్రియలే. ఒకానొక రోజున ఈ బుడగ పేలింది. వెరసి బుష్‌గారి పథకం పేరుతో, పన్నుల డబ్బును అడ్డంపెట్టుకుని ఆడిన జూదంతో అమెరికా ఆర్థిక వ్యవస్థంతా పతనం అంచున నిలబడింది. ప్రజల నిజమైన అవసరాలు, మార్కెట్‌లతో సంబం ధం లేకుండా ఓట్ల కోసం రాజకీయనాయకులు చేసే ప్రయోగాలు కాస్త ముందో, వెనకో విఫలంకాక తప్పదు.

ఆర్థిక సూత్రాలకు ఏ వ్యవస్థయినా తలవంచక తప్పదు. కృత్రిమ బుడగలాంటి ఇళ్ళ బూమ్ 2007- 08లో బద్ధలయింది. దాంతో ఉపద్రవం స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాలకోసం, ప్రభుత్వాలకున్న విశేషమైన అధికారాలతో ఆర్థిక వ్యవస్థ మెడలు వంచి, సోషలిస్టు పుక్కిట పురాణాలతో "నా ప్రజలకు అది కావాలి, ఇది కావాలి, నేను అది చేస్తాను'' అని ఉపన్యాసాలు దంచి ప్రజలు సంపాదించిన డబ్బు ను పన్నుల రూపంలో లాక్కుని తప్పుదారిలో పెట్టుబడులుపెడితే బుడగలు,బూమ్‌లు, బద్దలవడాలు, మాం ద్యాలు తప్పవు. ఇది వందేళ్ళుగా ఆర్థికవేత్తలకు తెలిసిన వాస్తవం.

అయినా అత్యధిక శాతం ఆర్థిక మేధావులు ఆస్థాన మేధావులై, ప్రభుత్వాలు చేసే పాపాలను వెనకేసుకొస్తారు. జరిగిన ఉపద్రవాలకు వేరే ఎవర్నో కారకులుగా ఎత్తి చూపుతారు. ఎవరికీ అర్థంకాని తర్క భాష లో రకరకాల అంకెలు, గ్రాఫుల గీతలతో ప్రజల దృష్టి మరల్చేస్తారు. అమెరికా కూడా దీనికి అతీతం కాదు.

వచ్చిన మాంద్యాన్ని వాల్‌స్ట్రీట్‌లోని పెట్టుబడిదారులు, స్పెక్యులేటర్ల మీదకి తోసేశారు. దాంతో సమస్య మూల కారణాలు మరుగున పడిపోయాయి. 'అమెరికన్లందరికీ సొంతిల్లు' అనే సోషలిస్టు సంక్షేమ పథకం ద్వారా ఇళ్ళ మార్కెట్‌లో ప్రభుత్వం త్రీవమైన జోక్యం చేసుకోవడం అసలు సమస్య అని గుర్తించడానికి నిరాకరించారు. ఇక పరిష్కారాలు మాత్రం ఏమంత హేతుబద్ధంగా ఉంటాయి? ఒబామా మంచి వాక్చాతుర్యంగల నాయకుడు.

ఉపన్యాసాలతో ఓటర్లను ఉత్తేజపరచగలడు. అమెరికా అర్థిక మాంద్యానికి తాను సూచించిన పరిష్కారాలు పూర్తిగా అసంబద్ధమైనవి. ఈ విషయం తన ఎన్నికల ప్రచార సమయంలోనే ఆస్థానంతో సంబంధంలేని ఆర్థికవేత్తలకు అర్థమయింది. కానీ త్రీవమయిన ఆర్థిక మాంద్యం, ఎటూతేలని ఆప్ఘన్, ఇరాక్ యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న ప్రజలు ఒబామా ఏదో ఒకటి చేసి తమను ఒడ్డునపడేస్తారని నమ్మారు.

పాలన చేపట్టిన నాటినుంచి ఒబామా ఒకదానికి మించి ఇంకో తప్పు చేస్తూనే వచ్చారు. ఆర్థిక మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యమే ఈ ఆర్థికమాంద్యానికి మూల కారణం. అయినా పరిష్కారంగా ప్రభుత్వం జోక్యాన్ని ఇంకా పెంచారు. తప్పుడు అంచనాలతో జూదమాడిన సంస్థలకు దివాళా తీయనీయకుండా ప్రజల పన్నుల డబ్బుతో ఆ సంస్థలను నిలబెట్టారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవా రంగాల్లో నియంత్రణలు పెంచేశారు.

[బావిలో పోసిన బక్కెట్ నీళ్ళ వంటివే సదరు ఉద్దీపన పథకాలు! – అమ్మఒడి]

ప్రభుత్వ రుణాలను విపరీతంగా పెంచారు. డెభ్భైలక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి సరిపడా డాలర్లు ముద్రకొట్టారు. వడ్డీరేట్లు నేలమట్టానికి తగ్గించేశారు. ఈ చర్యలన్నిటి ఫలితంగా డాలర్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రజలు దాచుకున్న డబ్బు విలువ పడిపోయింది. కొనేశక్తి లేక, మార్కెట్‌లో వస్తు, సేవల డిమాండ్ పడిపోయింది. దాంతో కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు రావడంలేదు.

ఉన్నవి విస్తరించట్లేదు, సరికదా, కుదించబడుతున్నాయి. దాంతో ఉద్యోగాలు పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావడంలేదు. నిరుద్యోగం పదిశాతంలో ఉండి క్రిందకు దిగనంటుంది. పరిస్థితులు ఇలా ఉండగా, తగుదునమ్మా అం టూ అమెరికాలోని ఆరోగ్యం, వైద్యం రంగాన్ని పూర్తిగా జాతీయం చేసే దిశగా పథకాలకు తెరతీశారు.

తద్వారా ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలందించిన చారిత్రక పురుషుడిగా మిగిలిపోవాలని కాంక్షిస్తున్నారు. ఈ శాసనం ప్రతినిధుల సభలో నెగ్గితే అమెరికా ఆర్థికవ్యవ స్థ దివాలా తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పొ చ్చు. ఇంగ్లండు, కెనడాల్లో జాతీయకరణ తర్వాత రోగు ల ఇబ్బందులు చూశాక అమెరికా ప్రజల మీద జాలి కలగక మానదు.

అంతే కాదు, త్రీవ సంక్షోభంలో ఉన్న కొన్ని కార్ల కంపెనీలలో ప్రభుత్వం సొమ్మును పెట్టుబడిగా పెట్టి గట్టెక్కించారు. వాళ్ళు తయారు చేసే కార్లకు డిమాండు సృష్టించేందుకు ఇంకో పథకం వేశారు. తక్కువ మైలేజినిచ్చే కార్లు పక్కనపడేసి ఎక్కువ మైలేజినిచ్చే కార్లు కొనేవాళ్ళకు సబ్సిడీలిచ్చారు. ఆ సబ్సిడీ డబ్బు పన్నుల డబ్బులోనిదే. ఇదే పద్ధతుల్లో చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టి, అవి దివాళా తీయకుండా బలవంతాన అపారు.

[వాళ్ళు ఇన్నాళ్ళుగా అత్యుత్తమమైనదిగా శ్లాఘిస్తూ ప్రచారించిన స్వేచ్ఛా విఫణి సిద్ధాంతానికే విరుద్ధం ఇది. మరో మాటగా చెప్పాలంటే స్వేచ్ఛా వాణిజ్యం యొక్క వైఫల్యం ఇది. – అమ్మఒడి]

ప్రజల డబ్బుతో అంటే జార్జిబుష్ చేసిన తప్పులను, దురాశకు పోయిన కొన్ని ఆర్థిక సంస్థలకు మార్కెట్ పోటీలో నిలవలేని కొన్ని కార్ల కంపెనీలకు ప్రజల చేత పరిహారం చెల్లింపచేశారు. ఈ కార్యక్రమాలన్నింటి పేరిటా పన్నులు పెంచారు. టీ (టీఈఏ-టాక్స్డ్ ఎనఫ్ ఆల్‌రెడీ) పార్టీల పేరుతో చాలా చోట్ల స్వచ్ఛందంగా బృందాలుగా ఏర్పడి, ప్రభుత్వ ఆర్థిక విధానాలకు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికి ఫలితమే మధ్యంతర ఎన్నికల్లో తీవ్ర పరాజయాలు.

అమెరికాలో ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఇప్పటిది కాదు. 1930 నుంచే మొదలైంది. రెండు పార్టీలు దీనికి అతీతులు కారు. ఆర్థిక సూత్రాలు విస్మరించి, పాపులారిటీ కోసం తప్పుమీద తప్పు చేయడాన్ని చరిత్ర విస్మరించదు, క్షమించదు. ఇంకా చాలదన్నట్లు ఔట్ సోర్సింగ్ మీద వాగ్దానాలు కురిపించడం సిగ్గుచేటు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల విపరీత జోక్యమే ఆర్థిక మాంద్యాలకు దారితీస్తుంది.

కృత్రిమంగా వడ్డీరేట్ల తగ్గింపు, లోటుబడ్జెట్లు, దానికోసం రూపాయిల ముద్ర ణ, ప్రజల డబ్బులో అత్యధిక భాగం రకరకాల పన్నుల రూపంలో లాక్కోవడం, దాన్ని ఓటర్లకు పంచిపెట్టడం -ఇవీ ప్రభుత్వాలు చేసే పాపాలు. మాంద్యం వచ్చినపుడు ఆర్థిక వ్యవస్థనుంచి ప్రభుత్వం దూరంగా జరగా లి.

కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా వ్యవస్థ తనంతట తాను సర్దుకుంటుంది. తిరిగి వృద్ధి బాటపడుతుం ది. మాంద్యం పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా జోక్యం చేసుకుంటే ఆ మేరకు మాంద్యం నుంచి బయటపడడం ఆలస్యమవుతుంది. వ్యవస్థ ఇంకా తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది ఆర్థిక సూత్రం. ఆర్థిక సత్యం. ఎన్ని ఉపన్యాసాలిచ్చినా దీన్ని మార్చలేము. ఉదాహరణ ఆమెరికాను చూడండి. ఒబామాను చూడండి.

- జాహ్నవి

Pasted from https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/nov/7/edit/7edit2&more=2010/nov/7/edit/editpagemain1&date=11/7/2010

>>> కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా వ్యవస్థ తనంతట తాను సర్దుకుంటుంది. తిరిగి వృద్ధి బాటపడుతుం ది. [ఈ అభిప్రాయంతో అమ్మఒడి ఏకీభవించదు. ఎందుకంటే ఆర్ధిక రంగమేమి పత్తిగింజ కాదు. రాజకీయ రంగం అంటే ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు చేసే తప్పిదాలకు ప్రోద్బలం ఆర్ధిక రంగం నుండే ఉంది. సాధారణ పరిస్థితులలో అయితే ఆర్ధిక రంగం కొద్దికాలం ఒడిదుడుకులకు లోనైనా తనంతట తాను సర్ధుకోగలదేమో! గానీ, గూఢచర్యం ముడిపడి ఉన్నచోట దోపిడి బయట పడి తీరుతుంది. కాగితపు సంపద ఆవిరై తీరుతుంది. ఆ బాటలోనే ప్రస్తుత ఆర్ధిక+రాజకీయ రంగాలు ఉన్నాయి.]

ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటూ, పైకారణాల ప్రచారంగా సూక్ష్మ ఋణాల ఆత్మహత్యలతో మీడియా కాలం గడుపుతోంది.
గృహ ఋణాలు, సూక్ష్మ ఋణాలే కాదు, మరికొన్ని దోపిడి ప్రత్యామ్నాయాలు కూడా ప్రయోగించారు.

ఒక దశాబ్దం కాలం లోపున…ఐటీ ఉద్యోగులకి జేబులు పట్టనన్ని జీతాలొస్తున్నాయంటూ హోరెత్తించబడింది. దరిమిలా ఐదు లక్షల ఖరీదున్న ప్లాట్లు కూడా పాతిక లక్షలై కూర్చున్నాయి. అధిక మొత్తంలో జీతాలున్నాయి, ఋణ సౌకర్యాలు సులభంగా లభిస్తున్నాయి గనుక… తమ కార్యాలయాలకి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంలో అందరూ ఒకే ప్రాంతంలో ప్లాట్ల కోసం ఎగబడేసరికి (అలాగని ప్రచారం చేసారు మరి. అందులో నిజమెంతో?) గిరాకీ ఎక్కువై, 5 లక్షల ప్లాట్లు కాస్తా పాతిక లక్షల పలికాయని హొరెత్తించబడింది.

ఎటూ ‘కామమ్మ మొగుడంటే కామోసను కోవాల్సిందే’ గనక నిజమేననుకున్నాం.

తీరా మాంద్యం దెబ్బకో, మరొకందుకో… ఉద్యోగాలు ‘హుష్ ఫటక్’ అనే సరికి అప్పు భారమై, ఫ్లాట్లు గుండె పోట్లై కూర్చున్నాయి.

పరిశీలించి చూస్తే… ఐటీ ఉద్యోగులు… తిండీ నిద్రలు మాని, భార్యాపిల్లల ముఖాలు చూడటం కూడా కుదించుకుని, 5 లక్షల ప్లాట్లని పాతిక లక్షలకి కొనేందుకు కష్టపడినట్లుంది. ఈ చేత్తో సంపాదించామని పించుకున్నదాన్ని, ఆ చేత్తో ‘సమర్పయామి’ అనటమే కదా? 5 రెట్లు ఎక్కువ విలువకి వస్తువుని కొనటం అంటే దోపిడియే కదా? వెరసి ఎవరి కోసం అహరహమూ మేధస్సు వెచ్చించి శ్రమించినట్లు?

ఇది ‘క్లాస్ దోపిడి’ అన్నమాట!

ఇక మాస్ దోపిడి ఎలాంటి దంటే… నిత్యావసరాల సరుకులు (పప్పూ బియ్యం దగ్గర్నుండీ ఉప్పూ ఉల్లిపాయా చింతపండు దాకా) సిమెంటు ఇనుము వంటి కొంప కట్టుకునే వస్తువులూ, పెట్రోలు వంటి ఇంధనాలు… అన్నిటి ధరలూ సిండికేట్ అయ్యి అంతకంతకూ పెంచేసి చేస్తున్న దోపిడి!

రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, తిండి గింజల వ్యాపారంలోనూ సిమెంట్ వంటి ఉత్పత్తి సంస్థల వ్యాపారంలోనూ ధరల పెరుగుదలని చూసీ చూడనట్లు ఊరుకుంటూ, నియంత్రించకుండా, తెర వెనక మద్దతు ఇస్తూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దోపిడి నుండి, రాజకీయ ఏజంట్ల ద్వారా… నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులకి వాటాలు వెళ్ళిపోతాయి.

అందుకే విజిలెన్స్ దాడులుండవు, బ్లాక్ మార్కెట్ కంట్రోలు ఉండదు. సరికదా… సైకిల్ మీద బియ్యపు మూట వేసుకుని ప్రక్క ఊర్లో అమ్ముకొచ్చినంత సులభంగా… రేవుల ద్వారా ‘అనధికారికంగా’ ఎగుమతులు జరిగిపోతాయి. అది బియ్యమైనా, ముడి ఖనిజాలైనా, మరేదైనా! అన్నిటిలోనూ వాటాలు వస్తాయి.

ఆ డబ్బంతా కూడా ప్రస్తుతం వినియోగింపబడుతుంది షేర్ మార్కెట్ ని నిలబెట్టుకోవటానికే!

ఎందుకంటే కంపెనీలు కూలితే.. సామంతులు కూలితే కుప్పకూలిపోయే చక్రవర్తిలాగా… స్తంభాలు కూలిపోతే కుప్పకూలిపోయే భవనం లాగా… నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ కుప్పకూలిపోతుంది మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

ఆ మహానుబావుడికే(మహ్మద్ యూనస్) గదా 2006లో పనిగట్టుకుని నోబుల్ ప్రైజ్(2006)ఇప్పించారు . బంగ్లాదేశ్‌లో సూక్ష్మఋణ విధ్వంసక పధకాన్ని రచించింది. సూక్ష్మౠణ సంస్థల ద్వారా తీసుకున్న ౠణాలను ఉత్పాదకతకు వినియోగించడం మనేసి వినియోగ వస్తువులను కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ప్రజలను అలా వినియోగ వస్తువులు (TV లు , DVDలు సెల్ ఫోన్లు వగైరా) కొనుగోలుకు ఆ ఋణ సొత్తును తగలేసేటట్టు ఈ సూక్ష్మఋణ సంస్థలు డిజైన్ చేయబడ్డాయి . ఇదంతా చూస్తుంటే పాత తెలుగు సినిమాల్లోని రావుగోపాలరావు విలనిజం గుర్తుకొస్తుంది . అ సినిమాలలో అతను తన దగ్గరున్న సొమ్మును పేదలకు అధిక వడ్డికి అప్పులిచ్చి మరలా ఆ డబ్బును రాబట్టుకోవడానికి ఆ పేదలకు అందుబాటులో సారాయి కొట్లు , రికార్డింగ్ డాన్స్ ట్రూపులు, వినోద కార్యక్రమాలకు వెచ్చించేటట్ట్లు అక్కడే ఏర్పాటు చేస్తాడు . ఇవేవీ తెలియని పేదలు అతని దగ్గర అధిక వడ్డీలకు అప్పుతీసుకుని అతని సారాయి కోట్లోనే సారా తాగి రికార్డింగు డాన్సు చూసి ఆనక తూలుతూ ఉత్త చేతులతో ఇంటికెలతారు. ఆ అప్పు మాత్ర అప్పుగానే మిగిలిపోతుంది. పైగా ఇదంతా చేసినందుకు రావు గోపాలరావుని పొగడటం కొసమెరుపు . అప్పుడు గోపాలరావ్ తానేదో ఉద్దరించేసినట్టు ఫోజు కొడతాడు (ఇప్పుడు సూక్ష్మ ఋణ సంస్థలు ఫోజు కొడుతున్నట్టు ). ఈ రకంగా గోపాలరావ్ సొమ్ము అక్కడికక్కడే Rotat అయ్యి ఒకటికి పదింతలవుతుంది. పేదలు పేదలుగానే మిగిలిపోయి ఆనక మరింత పేదలవుతున్నారు ఆ అప్పులు తీర్చలేక .

అజ్ఞాత గారు: నిజం చెప్పారు. :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu