ఇప్పటికే ప్రభుత్వ పనితీరులో, రాజకీయ నాయకుల, బ్యూరాక్రాట్ల వ్యవహార సరళిలో రెడ్ టేపిజం  పేరిట అవినీతి, అవకతవకలు, విధుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం ఎలా జరుగుతుందో పలుమార్లు పరిశీలించినా....
                మరో స్పష్టమైన దృష్టాంతాన్ని గమనించండి. ముందుగా మే 19, 2010 న ఈనాడులో ప్రచురింపబడిన దిగువ వార్త పరిశీలించండి.
>>>అఫ్జల్ గురు ఫైల్ పై కదలిక:
గవర్నర్ కు పంపిన ఢిల్లీ ప్రభుత్వం!
నాలుగేళ్ళ తర్వాత చలనం!
పరిస్థితులను సమీక్షించాకే శిక్ష అంటూ మెలిక!

నాలుగేళ్ళుగా కదలకుండా పడి ఉన్న అఫ్జల్ గురు ఫైల్ పై ఢిల్లీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఫైల్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజిందర్ ఖన్నాకు మంగళవారం పంపించింది. గవర్నర్ నుండి తిరిగి వచ్చాక కేంద్ర హోంశాఖకు అందజేయనుంది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయాల్సిందే కానీ, శిక్షను అమలు పరిచే ముందు శాంతిభద్రతల పరిస్థితులనూ క్షుణ్ణంగా పరిశీలించాలిఅంటూ ఢిల్లీ ప్రభుత్వం ఫైల్ లో పేర్కొన్నట్లు సమాచారం. పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టే విషయంలో ఢిల్లీ అభిప్రాయం కోరుతూ కేంద్ర హోంశాఖ దాదాపు నాలుగేళ్ల క్రితం ఫైల్ ను పంపించింది. ఆ తర్వాత ప్రతీ మూడు నెలలకోసారి రిమైండర్లు జారీ చేస్తూనే ఉంది. ఇప్పటికి 16 రిమైండర్లు జారీ అయ్యాయి. ముంబై దాడుల కేసులో కసబ్ కు ఉరిశిక్ష పడటంతో అఫ్జల్ గురు విషయం తెరపైకి వచ్చింది. అఫ్జల్ క్షమాభిక్ష ఫైలు ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సర్కార్ అఫ్జల్ ను టెర్రరిస్టుగా కాకుండా టూరిస్ట్ గా చూస్తోందంటూ ప్రతిపక్ష భాజపా ఆరోపించింది. ఈ నేపధ్యంలో, ఢిల్లీ ప్రభుత్వ అసాధారణ జాప్యాన్ని తప్పుబడుతూ తీవ్రపదజాలంతో కేంద్ర హోంశాఖ ఇటీవల లేఖ రాసింది. దీంతో అఫ్జల్ ఫైలుపై ప్రభుత్వంలో చలనం వచ్చింది. మరో వైపు కేంద్రహోంశాఖకు ప్రత్యుత్తరం పంపించామంటూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళ వారం తెలిపారు.
 పరిణామక్రమం:
13డిసెంబర్, 2001- పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి.
18డిసెంబర్, 2002 - దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురుకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధింపు.
29అక్టోబర్, 2003 - ఉరిశిక్షకు ఢిల్లీ హైకోర్టు ఆమోదం.
4ఆగస్టు 2005 - అఫ్జల్ అప్పీల్ కు సుప్రీంకోర్టు తిరస్కరణ.
20అక్టోబరు 2006 - తిహార్ జైలులో ఉరి అమలుకు సెషన్స్ కోర్టు తేదీ ఖరారు.
రాష్ట్రపతి క్షమాభిక్షను వేడుకుంటూ అఫ్జల్ గురు 2006 లో విజ్ఞప్తి దాఖలు చేసాడు. నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రపతి ఆ విజ్ఞప్తిని పరిశీలన కోసం కేంద్రహోంశాఖకు పంపించారు. అక్కడి నుండి ఫైలు ఢిల్లీ హోంశాఖకు చేరుకుంది.
                ~~~~~~~~~
పార్లమెంటు పై దాడి జరిగి 8 ½  సంవత్సరాలైంది. సదరు కుట్రదారుడికి ఉరిశిక్ష విధించి 7 ½  సంవత్సరాలైంది. ఫైల్ నింపాదిగా, నిబంధనల ప్రకారం ప్రయాణం చేస్తోంది. కారాగారంలో నేరగాణ్ణి మేపడానికి, రక్షించడానికి కోట్లాది రూపాయలు ఖర్చయ్యి ఉంటుంది.
                ఇంత పకడ్బందీగా నిబంధనల ప్రకారం ఫైలుని నడిపిస్తున్నాయి కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు! నేరం జరిగింది భాజపా హయంలో! వీళ్ళంతా ఇంతగా నిబంధనలు పాటిస్తున్నారే, మరి ఏ నిబంధనలు పాటిస్తూ ఆ ముస్లిం ఉగ్రవాదులూ, పాక్ కుట్రదారులూ, పాక్ ప్రేరేపిత నేరగాళ్ళు భారత పార్లమెంటుపై దాడి చేసారట? ఆ దాడిలో దేశపు పరువు కాపాడేందుకు అసువులు బాసిన పోలీసు, సైనిక వీరుల కుటుంబాలని, ఏ నిబంధనల ప్రకారం గాలికి వదిలేసారట? 14 డిసెంబరు, 2007మీ సంతాపాలు ఎవరికి కావాలి?’ అంటూ ఆ కుటుంబాల వాళ్ళు ఆక్రోశించారు కూడా! ఈ తిలా పాపాన్ని తలా గుప్పెడు.... ఎన్డీయే, యూపీయే లు రెండూ కుమ్ముకున్నాయి.
                ఇంకా.... షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిత్వాన గల ఢిల్లీ ప్రభుత్వం అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయాల్సిందే గానీ, శిక్షను అమలు పరిచే ముందు శాంతి భద్రతల పరిస్థితులనూ క్షుణ్ణంగా పరిశీలించాలంటూమెలిక పెట్టిందట!
                అంత శాంతి భద్రతలను పరిరక్షించలేనప్పుడు, ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడం ఎందుకు? అందునా సదరు షీలా దీక్షిత్ ఎంతో సమర్ధనారి! 1991, మే 21న రాజీవ్ గాంధీ శ్రీపెరుబుదూర్ లో హత్యకు గురికావడానికి ముందు [ఒకటి లేదా రెండు రోజులు ], ఒడిషాలో ఎన్నికల ప్రచార యాత్రలలో సోనియాకి నమ్మకంగా, రాజీవ్ వెంట ఉండి మరి మృత్యుముఖానికి సాగనంపినంత సమర్ధురాలు. అప్పట్లో ఎన్నికల ప్రచార యాత్రలలో రాజీవ్ గాంధీ తిండితిప్పల బాధ్యత ఈవిడదే లెండి. చల్లారిన బజ్జీల దగ్గర నుండి సమయానికి భోజనం చేసేటట్లు, దగ్గరుండి మరీ చూసుకుంది![ఈ విషయం గురించి వివరంగా భారత రాజకీయ రంగంపై కుట్రఅనే లేబుల్ లో వ్రాసాను.]
                మరి అంతటి సమర్ధ నాయకురాలికి, రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సీనియర్ నాయకురాలికి, అఫ్జల్ గురుకి ఉరి తీస్తే శాంతి భద్రతలని పరిరక్షించే సామర్ధ్యం లేదటనా? అఫ్జల్ గురు ఉరిశిక్ష సాగదీసిందీ, అఫ్జల్ గురు ఉరిశిక్ష ఫైలుకి నాలుగేళ్ళు తొక్కిపెట్టి ఉంచిందీ షీలా దీక్షిత్ ప్రభుత్వం!? వెంటనే ఫార్వర్డ్ చేయనిది పాక్ కి ఆగ్రహం కలుగుతుందనా లేక అధిష్టానానికి ఆగ్రహం కలుగుతుందనా?
                నిజంగా భారత దేశ ముస్లింలు అఫ్జల్ గురుని ఉరి తీస్తే శాంతిభద్ర్రతలకి విఘాతం కలిగిస్తారా? మరి పార్లమెంట్ పై దాడిని "పోన్లే పాపం!" అనుకుంటారా? ఈ దేశపు పార్లమెంటు ముస్లింలది కాదటనా? ఈ దేశం, దేశపు పరువు మర్యాదలు ఈ దేశ ముస్లింలకు పట్టదటనా? దేశం కంటే మతమే తమకు ముఖ్యం అనుకున్నప్పుడు, మత ప్రాతిపదికన దేశ విభజన జరిగిన నాడు ఇక్కడెందుకు ఉండిపోయినట్లు? అటు పాకిస్తాన్ కో, ఇటు బంగ్లాదేశ్ కో పోవలసింది కదా?
                 దేశం కంటే మతమే ముఖ్యం అనుకుంటే, అలాంటి వాళ్ళని.... ముస్లింలైతే అరేబియా సముద్రంలోకి దించి, పడవెక్కించి పాకిస్తాన్ కీ, హిందువులైతే హిందూ మహా సముద్రంలోకి దించి దిక్కున్న చోటికీ, పొమ్మనటం మేలు.
                అసలైనా ఈ దేశపు ముస్లింలు గానీ, హిందువులు గానీ, ఏ ఇతరులు గానీ అఫ్జల్ గురుని ఉరిశిక్ష వేయవద్దంటున్నారా? పాక్ కి అనుకూల ఎన్డీయే, యూపీఏ నాయకులూ, మీడియా తప్ప, మరెవ్వరూ ఆ వాదనకు మద్దతు ఇవ్వటం లేదు! లేకపోతే ఈ రెడ్ టేపిజం మీద మీడియా, ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి కదా!
                సామాన్య ముస్లింలని, కూరలమ్మే వాళ్ళ దగ్గరి నుండి కాసేట్లమ్మే వాళ్ళ దాకా, ఎవరిని కదిపినా, పెరిగిన పప్పూబియ్యాల ధరల పట్ల అదురూ, మరోసారి పెరగనున్న పెట్రో ధరల పట్ల బెదురూ తప్ప, అఫ్జల్ గురు లాంటి నేరగాడికి ఉరిశిక్ష వేస్తే ఊరుకోం అనే హుంకరింపు ఎవరిలోనూ కనబడదు. మరి పాత బస్తీలో వాళ్ళంతా హుంకరిస్తూ ఊగిపోతున్నారేమో! అలాంటి వాళ్ళని చూసి షీలా దీక్షిత్ లూ, సోనియాలూ, చిదంబరంలూ, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కలవర పడుతున్నారేమో’! ఇదీ గూఢచర్యం!

ఇందులో రెడ్ టేపిజం ఏమిటంటే - మచ్చుకి పరిశీలించండి.
నాలుగేళ్ళగా 16 రిమైండర్లు జారీ అయినా ఢిల్లీ హోంశాఖ నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా కూర్చొంది. ఎవరు ఆదేశిస్తే అలా గమ్మున కూర్చొంది? ఎవరూ నియంత్రించక పోతే, ఢిల్లీ హోంశాఖ ఉద్యోగులే ఫైలు తమ సొరుగులో పెట్టుకుని చోద్యం చూస్తారా?
                ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను. 1992 ప్రధమార్దంలో.... అప్పట్లో నేను APS RTC కి బ్యాటరీలు సరఫరా చేసేదాన్ని! ఆర్టీసీ వాళ్ళ వాడకంలో కనీసం 10% రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని నియమం ఉండేది. అయితే ఆర్టీసీలో డైరెక్టరు స్థాయి అధికారి ఒకరికి, బినామీగా బ్యాటరీ తయారీ యూనిట్ ఉండటంతో, అతడు కాగితాల మీదే కొత్త బ్యాటరీల కొనుగోలు, పాత బ్యాటరీల[scrap] అమ్మకమూ కొనసాగిస్తూ, పోటీదారులైన నాలాంటి వారికి ఆర్డర్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు.
                నేను Gowell పేరుతో నడుస్తున్న ఆ యూనిట్ చిరునామా సంపాదించి అక్కడికి వెళ్ళాను. చూస్తే అది ఓ అద్దె ఇంటిలో[రెండు గదులు] కేవలం బ్యాటరీలు అసెంబుల్ చేస్తున్నది.[ఈ మొత్తం వ్యవహారం కార్మికుల యూనియన్ లకు  తెలుసు. వాళ్ళ వాటాలు వాళ్ళకి వస్తాయి. అందుకే వాళ్ళు నోరు మెదపరు. ఆర్టీసీ నష్టాలకు ఇది కూడా ఒక కారణం.]
                నేర్పుగా వాళ్ళ నుండి డాక్యుమెంట్ల కాపీలు సంపాదించాను. పరిశీలిస్తే ఏముంది! డైరెక్టర్ కే గాక, మెటీరియల్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారికి కూడా అందులో వాటా ఉన్నది. వాళ్ళ భార్యల పేరిట ఉన్న భాగస్వామ్య డీడ్ సంపాదించాను. ఈ మొత్తం వ్యవహారం మీద అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేసాను. [ఆ నేపధ్యంలోనే ఈనాడులో ఉపసంపాదకురాలిగా పనిచేసే నా మిత్రురాలి ఇంట కొన్నిరోజులు ఉన్నాను. రామోజీరావు గూఢచర్య కార్యకలాపాలు నా దృష్టికి వచ్చింది అప్పుడే!]
                నా ఫిర్యాదు దరిమిలా ఆర్టీసీలో ఎంక్వయిరీ జరిగింది. ఆ సమయంలో నా ఫైలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు, మరుక్షణం దాని మీద రిమార్క్ వ్రాసేసి తర్వాతి టేబుల్ మీదికి తోసేసారు. ఫైలుని బాంబుని చూసినట్లు చూసారని, ‘తమ దగ్గరుండగా ఎక్కడ పేలుతుందో, ఎందుకొచ్చిన గొడవ?! అన్నట్లు ఎవరికి వాళ్ళు పక్క టేబుల్ మీదికి ఉరికించారనీ, అప్పట్లో జోకులేసుకున్నాను. ఎందుకంటే తేడా వస్తే ఉద్యోగాలు పోతాయని భయం ఉండేది అప్పట్లో! ఆ విషయమై గుమాస్తా స్థాయి ఉద్యోగి నాతో "ఉద్యోగం పోతే ఏముంది మేడం! అడుక్కుతినటానికి కూడా పనికి రాము!" అంటూ తమ భయాన్ని సమర్ధించుకుంటూ వ్యాఖ్యానించాడు.
                ప్రమాదకరమైన వ్యవహారం అనుకున్నప్పుడు ఉద్యోగులు తీరు ఇలాగే ఉంటుంది.
                APSFC హెడ్ ఆఫీసులో నా ఫ్యాక్టరీ పైలు, ఈ రాష్ట్రంలో తొలి పబ్ ఫైలు ఒకేసారి ప్రయాణం ప్రారంభించాయి. నా సంస్థ లాంటి చిన్న తరహా ఉత్పత్తి సంస్థలను ఉద్యోగులు తొక్కేస్తే, పబ్ లు ప్రతీ చోటా పరుగులు పెడుతున్నాయి. ప్రతీ సినిమాలోనూ కనీసం ఒకటి రెండన్నా సీన్లుండే పబ్ లు మరి! తాగి చిందులేసే పబ్ లని ప్రభుత్వమూ, సినీ పరిశ్రమ ప్రోత్సాహించటం, చిన్న కుటీర పరిశ్రమలను ప్రభుత్వమూ, కార్పోరేట్ కంపెనీలు నలిపివేయటమూ కుట్రలో భాగం కదా!
               ఇంతకీ చెప్ప వచ్చేందేమిటంటే - ఏ ఫైలునైనా తాము ఉరికించదలుచుకుంటే ఆఘమేఘాల మీద వ్యవహారం నడుస్తుంది. ముఖేష్ అంబానీకి మేలు చేయాలంటే మూడురోజుల్లో జీవోలూ, చట్ట సవరణలూ కూడా సాధ్యమే! అదే తాము ఏ ఫైలునైనా తొక్కి పట్ట దలుచుకుంటే, నాలుగేళ్ళలో 16 రిమైండర్లూ వచ్చినా ఉలుకూ పలుకూ ఉండదు. వ్రాతపూర్వకంగా రిమైండరు పంపుతూ నోటి పూర్వకంగా స్పందించ వద్దని చెప్పబడుతుందన్న మాట.
                కాబట్టే నోటి పూర్వకంగా చెప్పబడిన వ్యక్తిని ఎప్పటికీ నిరూపించ లేము. తాము నోటి పూర్వకంగా చెబితే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి శ్రద్దా సక్తులతో చేయాలంటే, తాము నిలిపిన బొమ్మైయితే సరి! ఆ వ్యక్తులు రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్ లు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు!
                ఎప్పుడో ఇక తప్పదన్నప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అసాధారణ జాప్యాన్ని తప్పబడుతూతీవ్ర పదజాలంతో లేఖ వ్రాసినట్లు, ఓ స్టంట్ నడిచి, తర్వాత మెల్లిగా ఫైలు నడక మొదలౌతుంది. మళ్ళీ ఎక్కడ బ్రేక్ పడుతుందో ఎవరూ చెప్పలేనట్లుగా!
                ఇది రెడ్ టేపిజం! నిజం చెప్పాల్సి వస్తే.... గూఢచర్యమే, దిగువ స్థాయికి వస్తే, ఉద్యోగులు స్థాయికొస్తే రెడ్ టేపిజం గా పిలవబడతుంది. బ్యూరాక్రాట్ల స్థాయిలోనూ, అగ్ర రాజకీయ నాయకుల స్థాయిలోనూ, ప్రభుత్వాధినేతల స్థాయిలోనూ ఉంటే, అప్పుడూ రెడ్ టేపిజం అనే పిలవబడినా, గూఢచర్యం అన్నది నిశ్శబ్దంగా పలకబడుతుంది.
                వెరసి రెడ్ టేపిజం పేరుతో గూఢచర్యం చాలా మామూలుగా అట్టడుగు స్థాయి ప్రజల వరకూ పాకి గవర్నమెంటులో పనులంటే, ఏళ్ళూపూళ్ళూ పడుతుందిఅనే నిర్లక్ష్యపు వ్యాఖ్యతో స్టాంపు కొట్టబడి చెలామణి అయిపోతోంది. ఈ రెడ్ టేపిజం వలన భారత ప్రభుత్వపు సొమ్ము దోచుకోబడటమే గాక, భారత రాజ్యాంగం పట్ల నమ్మకమూ దోచుకోబడుతుంది.  ఇదే ఇక్కడ గూఢచర్యపు విన్యాసము. అందుకే గూఢచర్యానికి మరో పర్యాయపదమే  రెడ్ టేపిజం అన్నది.
                నిజానికి రెడ్ టేపిజం అంటే పనులలో అలక్ష్యమూ కాదు, అవినీతీ కాదు. అవి పైపొరలు[over leaf reasons] మాత్రమే! లోపలి పొర గూఢచర్యమే! పైస్థాయి వాళ్ళకి, అంటే సోనియాలకీ, చిదంబరాలకీ, షీలా దీక్షిత్ లకీ, రోశయ్యలకీ, ఇంకా అలాంటి వాళ్ళకి రెడ్ టేపిజం అంటే గూఢచర్యానికి పర్యాయపదం అని తెలుసు.
                మన ఊళ్ళో మునిసిపాలిటి ఉద్యోగులకి తెలియదు. వాళ్ళకి సంబంధించి రెడ్ టేపిజంఅంటే కాసులు కురిపించే ప్రభుత్వ ప్రక్రియ అని మాత్రమే తెలుసు! తెలిసినా తెలియక పోయినా.... రెడ్ టేపిజం పేరిట వాళ్ళంతా చేస్తోంది మాత్రం దగా! నిలువునా దేశాన్ని, అవినీతి పేరుతో ముంచేసే దగా!

కొసమెరుపు ఏమిటంటే ఉరి కన్నా దాని కోసం ఎదురు చూడటమే పెద్దశిక్షఅని చిదంబరం అభిప్రాయ పడ్డాడు. కాని, కాందహార్ విమాన హైజాక్ సంఘటన లాంటిది ఒక్కటి జరిగినా ఈ ఖైదీలు చాలా మామూలుగా విడుదల చేయబడతారు. ఈ విషయాలు తెలియకుండానే చిదంబరం కేంద్ర హోంమంత్రి పదవిలోకి వచ్చాడా!?

మరిన్ని  విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.               
              సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

అవినీతి పరోక్షపు పన్ను లాంటిది అంటారు..ఆ బరువు అంతా మళ్ళీ ప్రజలపైనే పడుతూంది..రెడ్టేపిజమ్ ప్రభుత్వ ఉద్యోగులకు కాసుల కురిపించే మాట వాస్తవం అది మన బ్యూ రో క్ర సీ లో నరనారానా పాతుకు పోయింది..అసలు రెడ్ టేపిజం మీద ఎవరైనా పరిసోదనలు చేయా లంటే మనదేశానికి మించి బెస్ట్ సెంటర్ మరోటి లేదేమో...
మీరు బాటెరి ల గురించి చెప్పారు కదా...ఈ మద్య గవర్నమెంట్ ఆసుపత్రులకు సప్లయ్ చేయబడ్డ సిరంజీలు చూస్తే కళ్ళు తిరుగుతాయ్..వాటికి నీడిల్స్ లేవు అవ్వి వేరేగా పంపిణీ చేస్తూన్నారు...ఈ మెలిక ఎమితో?ఎవరెవరికి కాంట్రాక్టులు ఇచ్చారో?బాడీ ఒకడు నీడిల్స్ ఒకరడు సప్లయ్ చేయడమేమిటో?ఎంత సొమ్ములు లేదా రేకమెండేషన్ లు నడచాయో?
ఏది తీస్కొండి అందులో ఏదో ఒక అడ్డ గోలు పని వుంటుంది మన బ్యూరోక్రాట్స్ చేసే పనిలో..సవ్యంగా చేసేది శూన్యం..

దేశ విభజన సమయంలో భారత్ లో ఉన్న ముస్లింలను పాకిస్తాన్ కు , పాకిస్తాన్ లో ఉన్న హిందువులను భారత్ కు పూర్తిగా మార్పిడి జరగాలని అంబేద్కర్ సూచిస్తే అప్పటి పెద్దలు ఆయన మాటలు పెడచెవిన పెట్టారట. అప్పుడు ఆయన మాటలను పట్టించుకుని ఉంటే ఇప్పుడు నట్టింట్లో అరాచకం రాజ్యమేలేది కాదు

గూఢచర్యానికి పర్యాయపదమే రెడ్ టేపిజం. అవును .

KVSV గారు: సూదులొకళ్ళు, సిరంజీలొకళ్ళు బాగుందండి!:)

అజ్ఞాత గారు: అంబేద్కర్ గురించినది ప్రత్యేక ప్రకరణండి. మరోసారి...

నరసింహ[వేదుల బాలకృష్ణమూర్తి] గారు: మీకు ప్రభుత్వ కార్యాలయాలతో మంచి పరిచయం ఉన్నందునా, గతంలో మీరు పరిశ్రమ నడిపి ఉన్నందునా, మా టపాలోని లోతు మీకు బాగా అర్ధమయ్యింది. చాలామంది రెడ్ టేపిజం అంటే ‘అవును అదో ప్రక్రియ’ అనుకుంటారు. అందులో నొప్పి ఎంతో అనుభవపూర్వకంగా అయితేనే బాగా అర్ధమవుతుంది. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu