మహా భారతంలోని యవక్రీతుడి కథ నైనా, వాస్తవాన్నైనా పరిశీలిస్తే....శ్రమించకుండా ఏ విద్యనీ అభ్యసించలేమన్న సత్యం బోధ పడుతుంది. ఒక చిన్న బిడ్డ మంట పట్ల ఆకర్షణతో, నిప్పుతో ఆడుకోవాలని ప్రయత్నిస్తూ, దరి చేరాడనుకొండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? "వద్దు తండ్రీ! అది నిప్పు! తాకితే కాలుతుంది" అని నచ్చజెపుతారు. అయినా పిల్లవాడు వినలేదనుకొండి. అప్పుడు? రెండు పీకుతారు. నిప్పుతో చెలగాటమాడి ఒళ్ళు కాల్చుకోవటంతో పోలిస్తే, అమ్మానాన్నలు వేసే రెండు దెబ్బలు భద్రమైనవే!

పిల్లల్లో క్రమశిక్షణారాహిత్యం, నిప్పుతో ఒళ్ళుకాలడం కంటే మరింత ప్రమాదకరం. నిప్పు కేవలం పిల్లల చేతినో, కాలినో కాలుస్తుంది తప్ప జీవితాన్ని కాదు. కానీ క్రమశిక్షణా రాహిత్యం, మొత్తంగా పిల్లవాడి భవిష్యత్తునే కాల్చి పారేస్తుంది. నిప్పుతో కాలిన ప్రమాదం క్షణాల్లో మన కళ్ళెదుట కనబడుతుంది. క్రమ శిక్షణా రాహిత్యం తాలూకూ ప్రమాదం, మనకి అనుభవానికి రావటానికి సుదీర్ఘసమయం తీసుకుంటుంది. అప్పటికి జీవితం తగలబడి ఉంటుంది. కాపాడుకునేందుకు మిగిలి ఉండేది ఏమీ ఉండదు.

అలాంటి చోట.... ‘తల్లిదండ్రులూ, గురువులూ పిల్లల్ని దండించటం చట్ట విరుద్దం’ అంటూ చట్టాలు ఎందుకు? ప్రజలకు మేలు చేసే చట్టాలు కేవలం కాగితాల మీదే ఉంటాయి. ఆచరణలో అమలు కావు. అయితే మానవాళికి కీడు కలిగించే ఇలాంటి చట్టాలు మాత్రం, చాలా పకడ్బందీగా అమలు చేయబడతాయి. అదే విచిత్రం ఇక్కడ! తల్లిదండ్రులు తమ స్వంత బిడ్డల మీదా, గురువులు తమ చిన్నారి శిష్యుల మీదా ప్రేమ, వాత్సల్యం లేకుండా ఉంటారా?

అక్రమ సంబంధాల కోసం స్వంత పిల్లల్ని హత్యలు చేసే తల్లిదండ్రులనీ, ఇతరుల మీద కోపతాపాలని పసి పిల్లల మీద చూపించే రాక్షస గురువులనీ ఇక్కడ నేను ఉద్దేశించటం లేదు. అలాంటి వాళ్ళని ఏ చట్టాలూ ఆపలేవు, సంస్కరించ లేవు. అసలలా పసిబిడ్డల మీద పైశాచికత్వం చూపించే పెద్దలెవరైనా, వాళ్ళ బాల్యంలోనూ, ఎదిగిన తర్వాత కూడా క్రమశిక్షణా రహితులే అయి ఉంటారు.

నిజానికి పిల్లలపై హింసని నివారించేందుకు నిజాయితీగా పని చేసే చట్టాలు గానీ, ఉద్యోగులు గానీ, వ్యవస్థ గానీ ఉంటే, అలాంటి వాటి గురించి నేను ఈ మాటలు వ్రాయటం లేదు. అలాగ్గాక, తల్లిదండ్రులు తమ పిల్లల్ని, గురువులు తమ శిష్యులని, అవసరమైనప్పుడు దండిస్తే, సదరు పిల్లలు పోలీసు ఠాణాలకి ఎక్కి కేసులు పెట్ట వచ్చు - అనే చట్టం ఇప్పటికే విదేశాలలో దుష్పలితాలనివ్వడం గురించి తెలిసిందే! అలాంటి నేపధ్యంలో అవే చట్టాలను ఇక్కడ అందుబాటులోకి తేవడం ఎందుకు జరిగినట్లు? దానికి విద్యార్ది సంఘలూ, సదరు సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షాది విద్యార్ది నాయకులూ ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు?

నిజానికి ఈ విద్యార్ధి సంఘలూ, వాటి నాయకులూ, వారిని నడిపే రాజకీయ నాయకులూ కూడా, విద్యా సంవత్సర ప్రారంభంలో చేసే ‘సీజనల్ వ్యాపారం’ ఇది. అధిక ఫీజులూ, పుస్తకాల ధరలూ, మోతలూ, ఇలాంటి చట్టాలూ, విద్యా సంస్థల నాణ్యతలూ గట్రాల గురించి, తగినంత ఆందోళనలు జరిపి సంవత్సర చందాలు, సీజనల్ దందాలు పుచ్చుకొని ఆనక అన్నీ మామూలు చేస్తారు. వీళ్ళకి ప్రైవేటు విద్యాసంస్థలు ఇచ్చే డబ్బూ, మందుపార్టీలు గట్రా ఖుషీల ముందు, విద్యార్ధుల శ్రేయస్సు అస్సలు పట్టదు. ‘విద్య ప్రైవేటీకరించబడకూడదు’ అన్న విషయం ఈ విధంగా కూడా నిరూపితమౌతోంది.

ఇవన్నీ చూసినా కూడా విద్యారంగం మీదే కాదు, ఆ రూపేణా మొత్తం మానవత్వం మీదా, మానవ జాతి మీదా కుట్ర జరుగుతోందనవచ్చు. మానవజాతిని వారి బాల్యం నుండీ బానిసలుగా, మర బొమ్మలుగా మార్చే కుట్ర ఇది. మరబొమ్మలు ఆలోచించలేవు. రిమోట్ కంట్రోలుతో నియంత్రించబడినట్లు ఈ బానిసలు కూడా పడి ఉంటారు.

‘ఎందుకిలా?’ అని ఆలోచిస్తే జవాబు ఆసక్తి కరమే కాదు, నమ్మశక్యం కానట్టిది. ఎందుకంటే - భావవాదం సమాజంలో వ్యాప్తి లోనూ, ఆదరణ లోనూ ఉంటే, జనాలందరూ డబ్బుతో పెద్దగా అవసరం లేని ప్రకృతినీ, అనుబంధాలనీ, అనుభూతులనీ ఆస్వాదిస్తూ బ్రతికేస్తారు. అప్పుడు జనాలంతగా ’లక్జరీ’లుగా ప్రచారింపబడే వస్తు వ్యామోహం వెంట, కుహనా మోజుల వెంట పరుగులు తీయరు. వస్తు వినిమయాన్ని కూడా సహేతుకంగా, పరిమితుల మేరా ఆనందిస్తారు. ‘లక్జరీ’ లని, అంటే సౌఖ్యాలని కూడా, కొంత నిలకడగా ఆనందిస్తారు. బ్రాండ్ మోజులూ, మోడల్ మోజులూ అంటూ అర్ధరూపాయని అయిదు రూపాయలకి కొనరు. అప్పుడు కార్పోరేట్ వ్యాపారం ఏం కాను?

ఇందుకోసం సుదీర్ఘకాలంగా [తీవ్ర స్థాయిలో దశాబ్దాలుగా] విద్యారంగం మీద, చాపక్రింద నీరు వంటి ఈ కుట్రని అమలు చేస్తున్నారు. ఎందుకంటే పొలం నుండి వచ్చే పంట వంటిది కాదు గదా, ఒక్క సంవత్సరంలో చేతికందేందుకు? దీని వెనుక ఉన్నది నకిలీ కణిక వ్యవస్థే! పైపైన సిఐఏ ముసుగు వేసుకోనివ్వండి, ఐఎస్ ఐ ముసుగు వేసుకొనివ్వండి. గతంలో బ్రిటీషు ముసుగు వేసుకున్నా, ఇప్పుడు శ్రీ చైతన్యల వంటి కార్పోరేట్ ముసుగు వేసుకున్నా.... అన్నిటికి రూపకర్త మాత్రం నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యమే!

ఒక్కసారి, ఈ కుట్ర మూల స్వరూపాన్ని పరిశీలిస్తే.... మన రాష్ట్రంలో దీని అమలు తీరు పరిశీలిద్దాం. దశాబ్దాలుగా.... ఎంతో నైపుణ్యంతో, రాజకీయుల అండదండలతో అమలులోకి వచ్చిన, మెల్లిగా పుంజుకుని జడలు విరబోసుకున్న కుట్ర ఇది.

దాదాపు 35 నుండి 40 ఏళ్ళక్రితం, డిటెన్షన్ విద్యావిధానం అమలులో ఉండేది. విద్యార్ధులు ఏ తరగతికి ఆ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైతేనే పై తరగతిలోకి పంపబడేవారు. ఉన్నవన్నీ ప్రభుత్వ పాఠశాలలే! నిరుద్యోగులు నడుపుకునే వీధిబడులు కొన్ని ఉన్నా.... పరీక్షలు గట్రా నిర్వహించలేరు గనుక, అంతిమంగా అందరూ ప్రభుత్వ పాఠశాలలకే చేరేవారు. అక్షరాస్యతా శాతం పెంచడం అనే పైకారణం చూపిస్తూ, ఆ డిటెన్షన్ విద్యా విధానం ఎత్తి వేయబడింది. హాజరు ఉంటే చాలు, విద్యార్ధులు పైతరగతికి పంపబడతారు. దీన్ని ప్రవేశపెట్టిన ఘనుడు కాసు బ్రహ్మనంద రెడ్డి. [మరి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో దాదాపుగా అందరూ అప్రకటిత డిటెన్షన్ విధానమే అమలు చేస్తున్నారు కదా!]

పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేని విద్యార్ధులు, అందులోనూ పేదవారు, అసలు బడికి హాజరు కావటమే మానేస్తున్నారట. కాబట్టి అక్షరాస్యతా శాతం పెరగటం లేదట. కాబట్టి హాజరు ఉంటే పైతరగతికి వెళ్తారంటే, అలాంటి పేద వెనుకబడిన [చదువుల్లోనూ, ఆధికంగానూ కూడా] విద్యార్ధులందరూ బడికి వెళ్తారట. దాంతో అక్షరాస్యతా శాతం పెరుగుతుందట. ఈ పైకారణంతో అదంతా చేయబడింది.

అక్షరాస్యతా శాతం పెరిగి ఉండవచ్చు. గానీ మానవీయ విలువలు, విద్యా ప్రమాణాలు పెరిగాయా? పరీక్ష తప్పినా, మరు సంవత్సరం అదే తరగతిలో కొనసాగవలసి వచ్చినా, విద్యార్ధులకి అధిక భారం ఏదీ లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువు ఉచితం గనుక! కానీ ఆ నెపంతో అన్ని తరగతులకీ పరీక్షలు రద్దు చేసి, పదవ తరగతికి మాత్రం పరీక్షలు పెట్టటంలో,[వచ్చే సంవత్సరం నుండి వాటినీ రద్దు చేస్తారట!] విద్యార్ధులలోనూ టీచర్లల్లోనూ నిర్లక్ష్యం పెరిగిపోవటమూ, అవినీతి అంతకంతకూ అవధులు మీరి పోవటమూ ఇప్పుడందరూ చూస్తున్నదే!

నిజానికి కాసు బ్రహ్మానంద రెడ్డి అనబడే ఆనాటి నకిలీ కణిక ఏజంట్ పాపమా అని .... ఆనాడు అంటే 35 - 40 ఏళ్ళ క్రితం పరీక్షా విధానం, డిటెన్షన్ పద్దతి రద్దు చేయబడి, తరగతులు దాటుకుంటూ వచ్చిన తరంలోని వారే, ఇప్పుడు అత్యధికంగా అన్నిరంగాలలో కీలక స్థానాలలో, తగిన స్థానాలలో ఉన్నారు. ప్రభుత్వంలోనూ, ప్రైవేట్ రంగంలోనూ, పాలిటిక్సులోనూ కూడా! [ఇతడు 1992 నాటికి మహారాష్ట్రకు గవర్నర్ గా ఉన్నాడు. తన గవర్నరు గిరిని పొడిగించమని 1992 తర్వాత పీవీజీకి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఫలించక పోయే సరికి ‘బుద్ది ఉన్నవాడెవడూ గవర్నర్ పదవి కోరుకోడంటూ’ రుసరుసలాడాడు.]

ఎవరైతే... కష్టపడి చదివి పరీక్ష వ్రాసి పాసయ్యి పైక్లాసులకి ప్రమోట్ అవటం కాకుండా, కేవలం బడికి హాజరయేతే చాలు ఉత్తీర్ణులవ్వటమే ననే సులభ మార్గాలని అలవాటు పడ్డారో... ఆ తరం, అదే సులభమార్గాలని అటుపైన పదో తరగతికీ, ఆపైన తరగతులకీ అమలు చేయటమే గాక, అన్నీ పూర్తయి ఉపాధి రంగాలలోకి వచ్చాక కూడా, అవే సులభ మార్గాలని అమలు చేస్తున్నది!

కాబట్టే అలాంటి వాళ్ళు అవకాశం దొరకటమే విషయం తప్ప, ‘ఎలా సంపాదించాం అన్నది అనవసరం, సంపాదించామా లేదా అన్నదే ముఖ్యం’ అనే సిద్దాంతాన్ని అన్నిటా అమలు చేస్తున్నారు. మరి వాళ్ళు నేర్చిన విద్య అదేగా మరి! దాన్నే డబ్బుకీ, కెరీర్ కీ కూడా అనువర్తించారు. కాబట్టే అవకతవకలు నిర్వహించగలగటమే సామర్ధ్యానికి పర్యాయ పదం అయిపోయింది. లంచాలు ఇవ్వటం, పుచ్చుకోవటం, ఇంకా అవసరమైతే మకార త్రయానికి ముందడుగు వేయటం - ఇవే అర్హతలైపోయాయి.

ఓ ఉదాహరణ చెబుతాను. సూర్యాపేటలో వ్యవస్థీకృత వేధింపు ఎదుర్కొంటున్న రోజుల్లో.... మా ఇంటి యజమానురాలు [ఈవిడ చికెన్ కొట్టునడుపుతుంది. గతంలో ఆదే ఊళ్ళో పనిమనిషిగా కెరీర్ ప్రారంభించింది. ‘ప్రక్క’దారి పద్దతుల్లో ఆస్థికూడ బెట్టిన చరిత్ర కలిగిన మనిషి.] మమ్మల్ని వేధిస్తున్నదనీ, మరింకెవ్వరూ ఇల్లు బాడుగకూ కూడా ఇవ్వనంతగా మేము వేధింపుకి ఎదుర్కొంటున్నామనీ, వ్రాత పూర్వక ఫిర్యాదులతో నల్గొండ ఎస్.పి. శివధర్ రెడ్డిని నాలుగైదు సార్లు కలిసాము.

సదరు ఐ.పి.ఎస్. అధికారి, తాను గతంలో ‘లా’ చదివి Advocate గా ప్రాక్టీసు కూడా చేసాననీ, ఆ అనుభవంతో చెబుతున్నాననీ అంటూ, మాకు ఓ సలహా చెప్పాడు. అదేమిటంటే ఈ వ్యవహారాన్ని ప్రైవేట్ పంచాయితీ [అంటే చట్టానికి ఆవల]లో పరిష్కరించుకొమ్మని. అదీ ఒక ఐపిఎస్ అధికారి క్యారెక్టర్!

[అప్పటికి అతడి సలహా మాకు మింగుడు పడకపోయినా, స్థానిక కాలేజీనే అదంతా చేస్తున్నారనుకొని, దాన్ని ప్రైవేటు పంచాయితీలో పరిష్కరించుకునే ప్రయత్నం చేసాం. ఫలించలేదు. ఆ వివరాలన్నీ ‘మా కథ’లో వ్రాసాను. 2005 తర్వాత అర్ధం అయ్యింది, అతడు ప్రైవేటు పంచాయతీ అని చెప్పింది "ఇలా ఫిర్యాదులు పెట్టటం కాదు. రామోజీరావు తో రాజీ పడండి" అని! అప్పటికి మా జీవితాల్లో రామోజీరావు గూఢచర్యపు ప్రమేయాన్ని గుర్తించనందున అది మాకు అర్ధం కాలేదు.]

ఇక, బాపూ ‘సత్య శోధన’లో, లండన్ లో, బారిస్టర్ చదువుల పరీక్షా విధానాలలో మందు పార్టీల ప్రస్తావన చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అసలలాంటి పార్టీల అవసరం ఏమిటో బాపూకి అర్దం కాలేదని వ్రాసారు. వాళ్ళు చెప్పిన కారణం సబబుగా లేదని కూడా వ్రాసారు. తాను మద్యం సేవించడు గనక, అందరూ తమ జట్టులోకి అత్యంత ప్రేమతో ఆహ్వానించేవారట. అది తన మీద ప్రేమ కాదనీ, తన వంతు ‘మద్యం’ మీద ప్రేమ అనీ బాపూ చమత్కరించాడు.

అప్పటి ఆ బ్రిటీషు వాడి అవినీతి చదువు, ఇప్పుడు ప్రపంచపు నలుమూలలా పాకి, ఊడల మర్రిలా, ఒక విష వృక్షంలా విస్తరించింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu