వేణుగోపాల్ రెడ్డి మరణం ఆత్మహత్య అయ్యే అవకాశం ఎంత?

1]. ఉద్రేకం, ఉద్వేగం... నేతల ఉపన్యాసాలు, స్నేహితులతో చర్చలు కలిగించిన వేడి, [స్ఫూర్తి అనకూడదేమో. విధ్వంసం వైపు మళ్ళించే దాన్ని స్ఫూర్తి అనకూడదు కదా! ఆత్మహత్య విధ్వంసమే]... ఒంటరిగా కూర్చొని, రాత్రివేళ చదువుకుంటున్న పిల్లవాడిలో ఒక్కసారిగా ఉధృతమైన భావాల ఒత్తిడి కలిగితే ఆత్మహత్యకు పాల్పడ వచ్చేమో! అయితే అందుకోసం ముందుగానే పెట్రోలు లేదా కిరోసిన్ సమకూర్చుకొని ఉంటే మాత్రం[ఒంటరిగా?] ఆత్మహత్య చేసుకోవాలని కొన్నిగంటల ముందే నిర్ణయించుకుని ఉండాలి. లేదా ద్విచక్ర వాహనం లాంటిది ఏదైనా వాడుతుంటే దాన్లోని ఇంధనాన్ని తీసుకొని, ఒంటి మీద చల్లుకుని నిప్పంటించుకుని ఉండాలి. అయితే వాహనం అతడి ప్రక్కన ఉన్నట్లుగా ఇంత వరకూ ఏ వార్తల్లోనూ రాలేదు.

2]. ఏదేమైనా... వేణుగోపాల్ రెడ్డి ఉద్రికత్తకీ, ఉద్విగ్నతకీ, గురై రాష్ట్రసాధన కోసం ఆత్మహత్య చేసుకుని ఉండాలి.

నల్లని వన్ని నీళ్ళనీ, తెల్లని వన్ని పాలనీ అనుకోవడం తప్పితే, కనబడేదంతా నిజం కాదనీ, కనబడనిదంతా అబద్దమూ కాదని తెలియని పిల్లలు! నిండా పాతికేళ్ళు లేని, జీవితపు తొలిదశలో ఉన్న యువకులు, విద్యార్ధులు! రాష్ట్ర సాధన కోసమైనా సరే... ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నాయకులు ’తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే నాలుకలు కోస్తాం’, ’తెలంగాణా కోసం తలలు నరుక్కుంటాం’ అంటూ హింసాత్మక వ్యాఖ్యానాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసే కేసీఆర్ ని, తెలంగాణా సాధించేసాడనుకొన్న డిసెంబరు 9,10 తేదీలలో ’తెలంగాణా గాంధీ కేసీఆర్’ అన్న అనుచర నాయకులనీ, దానికి ప్రచారమిచ్చిన మీడియాని, సోనియా పుట్టిన రోజు కానుకగా ’తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ’ అంటూ ప్రకటనలిచ్చిన యూపీఏ ప్రభుత్వాన్ని , ముందస్తు దోషులుగా, విద్యార్ధి హంతకులుగా నిర్ధారించాలి.

ఒక్క హింసాత్మక సంఘటన జరిగినా, అప్పటికి ఉధృతంగా నడుస్తున్న స్వాతంత్ర సమరాన్ని ఆపివేసిన బాపూజీ ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? అహింసామూర్తి గాంధీజీని, ’తలలు నరక్కుంటాం, నాలుకలు కోస్తాం’ అంటూ నిరంతరం హింసని ప్రేరేపించే కేసీఆర్ తో పోల్చటం, ప్రచారించటం ఖచ్చితంగా మీడియా చేసిన నేరమే.

ఆంధ్రా పాలకులు, అదేదో బ్రిటీషు పాలకులు అన్నట్లు తమని దోచేస్తున్నారని, దగా చేస్తున్నారని పదేపదే అరుస్తూ వైషమ్యాలని రెచ్చగొట్టిన పరిణామం ఇది. చంద్రబాబుకి జేజేలు కొట్టిన కేసీఆర్, ఇప్పుడు ఇటలీ నాయికకి మోకరిల్లుతున్న కేసీఆర్, శతాబ్దాలుగా తెలంగాణాని అణిచివేసిన, నగ్నంగా హిందూ మహిళలని బతుకమ్మ ఆడించిన నిజాం నవాబులని ’మా నిజాం మాకు గొప్ప’ అనే కేసీఆర్, అతడి వాదనలని కొనసాగిస్తూ కోదండరాం లూ, రాంరెడ్డి దామోదర్ రెడ్డిలూ చేస్తున్న వాదనలలోని లొసుగులని తర్వాత పరిశీలిద్దాం.

వెరసి నాయకులు ఉద్రేకాలని, విద్వేషాలని ప్రేరేపించే ప్రకటనలు గుప్పిస్తే..., విద్యార్ధులని, యువకులని అహింసాపూరిత, స్ఫూర్తిదాయక ఉద్యమ బాటలో నడపటం గాకుండా హింసామార్గంలోకి మళ్ళిస్తే... జరిగేది విధ్వంసమే. ఆత్మహత్యలు వ్యక్తి హింసకూ, వ్యక్తిగత విధ్వంసానికి మరో రూపాలే!

శాస్త్రీయంగా చూసినా... మనిషి సంఘజీవి. నలుగురు నవ్వితే అప్రయత్నంగా చూస్తున్న వారిలో నవ్వురావటం, సమూహంలో ఉంటే ఒకే భావోద్వేగం వేగంగా అందరిలో విస్తరించటం సహజం. ’మాస్ హిస్టీరియా’గా ఒకప్పుడు మీడియా దీన్ని తెగ ప్రచారించింది కూడా! టీవిలో [అప్పటికి ప్రైవేటు ఛానెళ్ళు రాలేదు] డాక్యుమెంటరీలు కూడా ప్రసారమయ్యాయి. గ్రామీణ మహిళలు బాణామతి, మంత్రతంత్రాల భయంతో మూకుమ్మడిగా నేలపై బడిదొర్లటం వంటి మానసిక రుగ్మతల గురించి అప్పట్లో తెగ ప్రచారాలు నడిచాయి. మరీ ముఖ్యంగా దైవభక్తి విషయంలో, ఈ మాస్ హిస్టీరియా గురించి ప్రచారిస్తూ, మీడియా, ’ఈ ఉద్రేకం ఉన్మాదంగా రూపదిద్దుకొని, సామూహిక ఆత్మహత్యల దాకా పోతుందని’ కూడా అప్పట్లో వ్రాసింది.

అందులో నిజానిజాలు ఎంత ఉన్నా, సమూహంలో ఉన్నప్పుడు ఒకే భావోద్వేగం వేగంగా అందరిలోనూ విస్తరించేంత సంఘజీవి మనిషి - అన్నది మాత్రం అనుభవైక సత్యం!

నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, విశ్వవిద్యాలయ ఆవరణలో నెలకొన్న ఉద్రికత్తలూ పిల్లల్ని ఆత్మహత్యల వైపు పురికొల్పి ఉండవచ్చు. అదే ఉద్రేకం, క్రమంగా ఎక్కువ మందిని ఆక్రమించి ఆత్మహత్యల పరంపరకు పురికొల్పి ఉండవచ్చు. ఫలితం?... జీవితంలో ఇంకా ఏదీ అనుభవించని పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. అవటానికి ఇవి ఆత్మహత్య కావచ్చు, రెచ్చగొట్టే వాదనలతో విద్యార్ధులని ఉద్రేక పరిచిన నాయకులూ, వాటిని ప్రచారం చేసిన వార్తా సంస్థలూ నిజమైన హంతకులు అని చెప్పాలి.

అయితే ఈ విషయానికి మరో కోణం కూడా ఉంది. మొన్న వై.యస్. మరణించినప్పుడు, రాష్ట్రంలో ఎవరు ఎక్కడ మరణించినా, మీడియా జాబితాలో అభిమానుల మరణంగా నమోదయ్యింది. క్రికెట్ స్కోరు స్థాయిలో రోజువారీ స్కోరు పత్రికలలో ప్రచారించబడింది. తీరా వై.యస్. కుమారుడు జగన్, తన తండ్రి అభిమానుల అత్మహత్యల పట్ల స్పందనగా, మృతుల కుటుంబాలని పరామర్శిస్తాననే సరికి... అప్పటికి మారిన రాజకీయ నేపధ్యాల దృష్ట్యా [ఈ పరిస్థితుల గురించి జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య అంతర్లీన పోరు టపాలలో వివరించాను] మీడియా, అప్పుడు బైటపెట్టిన వాస్తవం ఏమిటంటే - ఎడాపెడా, సహజ మరణాలని కూడా, అభిమానుల మృతి ఖాతాలోకి జమ చేసారని! అసలు టీవీ కూడా లేని వారు సైతం టీవిలో వార్తలు చూసి వత్తిడికి గురై, గుండె ఆగి మరణించినట్లుగా చెప్పబడిందని. [జగన్ పరామర్శల పాదయాత్ర మానుకోవటానికి ఇది కూడా ఒక కారణం.]

అదే మోస్తరులో... ఇప్పుడు సైతం... మీడియా... వ్యక్తిగత, ఇతర కారణాలతో మరణించిన విద్యార్ధుల వివరాలని కూడా ’తెలంగాణా కోసం ఆత్మహత్యల’ ఖాతాలో వేయటం లేదని గ్యారంటీ ఏమిటి? ఎందుకంటే - నిన్నమొన్న, వరదలొచ్చి, పూచికపుల్లతో సహా కొట్టుకుపోయిన కర్నూలు వరదబాధితులు, చిల్లుల గుడారాల్లో చలికి గజగజ లాడుతూ అయినా బ్రతుకు పోరాటం సాగిస్తున్నారే కానీ, నెలకి 200/- రూ. ల పింఛను రాదనే బెంగతోనూ, పింఛను ఇచ్చే ’దేవుడు వై.యస్.’ మరణించాడన్న బాధతోనూ, ఆత్మహత్యలు చేసుకున్న అభిమానుల్లాగా ప్రాణాలు తీసుకోలేదు. వాళ్ళు వీళ్ళు చేసిన, చేస్తున్న సాయంతోనే జీవనపోరాటం చేస్తున్నారు. అదీ జీవితంలోని వాస్తవికత! వై.యస్. మరణిస్తే అతడి కుటుంబ సభ్యులలోగానీ, బంధుమిత్రులలోగానీ ఎవరూ, కనీసం ఆసుపత్రిపాలుకూడా కాలేదు. అదీ జీవితంలోని వాస్తవికత!

అలనాడు దేశ స్వాతంత్ర సాధనకో, రాష్ట్ర సాధనకో కొందరు మహానుభావులు ప్రాణాలు ధారపోసారంటే - వారు ఉరిపోసుకునో, పెట్రోలు లేదా కిరోసిన్ ఒంటి మీద పోసుకునో చచ్చిపోలేదు. పోరాడి అసువులు బాసారు. అల్లూరి సీతారామరాజులాగానో లేక పొట్టి శ్రీరాములులాగానో! అంతే తప్ప ఆత్మహత్యలు చేసుకోలేదు.

కాబట్టి, ఎలా చూసినా ’అమాయక విద్యార్ధుల ఆత్మహత్యలు స్వార్ధ రాజకీయ నాయకుల చేతుల్లోని సమిధలు!’ అని చెప్పక తప్పదు. ఒక్కసారిగా వేణుగోపాల్ రెడ్డి మరణంతో వేడెక్కిన తెలంగాణా ఉద్యమం, నాలుగురోజులు తిరిగేసరికి జేఏసీల్లో ముసలం... రాజకీయ నాయకుల రాజీనామాల సాగతీత... పరస్పర నిందారోపణలు... తగవులతో... మెల్లిగా... ఎలా రూపం మారుతోందో ఇప్పడందరమూ నోరెళ్ళబెట్టి చూస్తున్నదే!

నిజానికి బారత స్వాతంత్ర సమరం సైతం, దశాబ్ధాల తరబడి, స్వాతంత్ర సమర యోధుల మధ్య ఐక్యతని దెబ్బతీస్తూ, వైషమ్యాలు రేగటం, అతివాదులూ మిత వాదులుగా నాటి స్వాతంత్ర పోరాటయోధులు విడిపోవటం... పరస్పర విమర్శలూ.. గట్రాలతో దేశ స్వాతంత్రసాధన ఏళ్ళుపూళ్ళు పట్టింది. భారత స్వాతంత్ర సాధన సుదీర్ఘకాలం పట్టటానికి గల అనేక కారణాలలో ఇదీ ఒకటి. దీని వెనక ఉన్నది నకిలీ కణిక వంశీయుల గూఢచర్యమే. అప్పటికి బ్రిటీషు వారి వెనుక చేరింది వారే!

అయితే తర్వాతి రోజుల్లో, దానికి బాపూజీని బాధ్యుణ్ణి చేసి ’గాంధీని తిట్టడం’ యువతరానికి ఫ్యాషన్ గా మారింది. అలా యువతరాన్ని మీడియా ఏమార్చింది. కాకపోతే, అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా! నాటి స్వాతంత్ర సమరంలో అత్యధికులు నిస్వార్ధపరులు, నేటి తెలంగాణా పోరాట ఉద్యమంలో అత్యధికులు స్వార్ధపరులు. అంతే వ్యత్యాసం! నాడు నేడు ప్రయోగింపబడిన, బడుతున్న తంత్రం మాత్రం ఒకటే.[ఎందుకంటే నకిలీ కణికులకి తెలిసింది పదే స్ట్రాటజీలు గనుక.]

ఈ విధంగా... మెల్లిగా... తెలంగాణా ఉద్యమాన్ని, ’నేతల మధ్య అనైక్యత, పరస్పర నిందారోపణలు, అంతర్గత కలహాలు’ అనే పైకారణం[over leaf reasons]తో నీరుగార్చే ప్రయత్నం, సాగదీసే ప్రయత్నం ఈ సరికే ప్రారంభం కావటం కళ్ళముందున్నదే!

అటువంటప్పుడు... వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్ధి బలిదానం, ఆపై వరుసగా విద్యార్ధుల ఆత్మహత్యలతో ఒక్కసారిగా ఉద్యమం ఉవ్వెత్తున ఎందుకు ఎగిసి పడింది? నాలుగురోజులు గడిచే సరికి మళ్ళీ ఎందుకు మెల్లిగా చప్పబడే, సాగదీసే దిశలో ప్రయాణిస్తోంది? చల్లబడిన ఉద్యమాన్ని మళ్ళీ భగ్గుమనిపించేందుకే బలిదానాలు జరిగినట్లయితే ఆ మంట అలా ఉధృతంగా సాగుతూనే ఉండేది. నాయకులూ, మీడియా ఆ దిశలోనే ఉండేవాళ్ళు. ఆపకుండా ఆత్మహత్యల గురించే అరిచేవాళ్ళు.

అంతేగానీ - జేఏసీలో కాంగ్రెస్ ఉంటుంది, ఉండదు, ’తెలంగాణా ధూం ధాంలకు మేమే పైసలు ఖర్చుపెడుతుంటే, మమ్మల్నే తెరాస విమర్శించటమా’ అంటూ కాంగ్రెస్ అలకల లేఖలూ గట్రాలు జరగవు, జరిగినా మీడియా దాన్ని ప్రచారించకుండా దొర్లించేస్తుంది. అంతేగాక ఉద్యమం అన్న తరువాత ఆపాటి గొడవలు మామూలే అన్నట్లు మీడియా, రాజకీయ పార్టీలు ప్రచారించేవి. అలాగ్గాక, ఉద్యమం మళ్ళీ చప్పబడేవిధంగా ఎందుకు నడిపింపబడుతోంది? అంటే కేవలం కొన్నిరోజుల గల్లంతుకోసం విద్యార్ధుల ఆత్మహత్యల ఉపయోగపడ్డాయన్న మాట! ఎందుకలా?

ఈ ప్రశ్నకు జవాబు పరిశీలిస్తే... మన కళ్ళెదుట నిలబడే సత్యం కడు కఠోరమైనది, పరమ విభ్రాంతి కరమైనది!

తర్వాత తాము వెల్లడించబోయే, వై.యస్. హెలికాప్టర్ ప్రయాణంపై నివేదిక, సివిఆర్ సంభాషణల వివరాలలోని అవకతవకల నుండి ప్రజల దృష్టిని హైజాక్ [హైసరబజ్జా] చేయటానికి, విద్యార్ధుల బలిదానాలతో తెలంగాణా ఉద్యమం మరోసారి భగ్గుమనిపించబడింది. అంతే! కావాలంటే పరిశీలించండి.

జనవరి 18 వ తేదీ అర్ధరాత్రి దాటాక వేణుగోపాల్ రెడ్డి ఆత్మహుతి చేసుకున్నాడు. ఆ విషయం తెల్లవారు ఝామున వెలుగులోకి వచ్చింది. అప్పటికే పత్రికలు పాఠకుల చేతుల్లోకి వచ్చేసాయి. 19వ తేదీ టీవీలలో ఈ విషయం ప్రచారమయ్యింది. తర్వాత అంటే 20వ తేదీ, 21వ తేదీ పత్రికలలో పతాక శీర్షికలుగా విద్యార్ధి బలిదానం, తెలంగాణా ఉద్రిక్తత, ఉద్యమ ఉధృతుల గురించి వార్తలొచ్చాయి.

దీనికి సమాంతరంగా... 18వ తేదీ నాటి పత్రికల్లో 2009 సెప్టెంబరు2వ తేదీ వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం గురించి, ఆర్.కె.త్యాగి అధ్యక్షతన గల డీజీసీఏ కమిటీ నివేదిక 15వ తేదీనే ప్రభుత్వానికి సమర్పించించారనీ, రెండ్రోజుల్లో వెల్లడి కావచ్చనీ ’తెలిసిందీ, సమాచారం’ తరహా వార్తలు వచ్చాయి. తదుపరి 21,22,23 తేదీలలో, పౌరవిమానయాన శాఖ అధికారిక వెబ్ సైట్ లో, డీజీసీఏ ఇచ్చిన నివేదిక ఉంచబడింది. ఇక అందులో చాలా అవకతవకలున్నాయని సాక్షి ఘొల్లుమంది.

సరిగ్గా... వై.యస్. మరణానికి సంబంధించిన డీజీసీఏ నివేదిక, అప్పటికి ఎన్నో సందేహాలున్న కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లోని సంభాషణ గురించిన వివరాలని ప్రకటించాల్సిన సమయంలో....

అప్పటికే మెల్లిగా చల్లబడిన తెలంగాణా ఉద్యమం, విద్యార్ధుల బలిదానంతో మరోసారి ప్రజ్వరిల్లింది. మళ్ళీ మామూలుగా చల్లబడే దిశలో, సాగతీత దిశలో ప్రయాణిస్తోంది.

ఈ హైజాక్ కు ముందస్తు ప్రాతిపదికగా... ఈ నెల 7 వ తేదీన, ఎప్పుడో 2009 సెప్టెంబరు 2వ తేదీ వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన మర్నాడే [సెప్టెంబరు 3వ తేదీనే] ఎక్కడో ఓ ఆన్ లైన్ పత్రిక ఎగ్జయిల్డ్... వై.యస్. హెలికాప్టర్ ప్రమాదానికీ, రిలయన్స్ అధినేట ముఖేష్ అంబానీ & వై.యస్.ల మధ్య చోటుచేసుకున్నKG బేసిన్ గ్యాస్ కేటాయింపు చర్చకీ సంబంధాన్ని ఊహిస్తూ, ఉటంకించిన వార్తని హఠాత్తుగా టీవీ5 ప్రచారించింది. గంటల వ్యవధిలో రాష్ట్రంలో రిలయన్స్ ఆస్థులపై దాడులు జరిగాయి. ఆపైన చాలా హడావుడీ జరిగింది. [ఇదంతా గత టపాలలో వివరించాను.]

అయితే ఈ సంఘటనలో తెర వెనుక కథ ఏమిటంటే - ఇప్పటికే నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులైన రామోజీరావు, సోనియాలకి రాజకీయ నాయకుల మీద పట్టు కొంత సడలింది. అలాగే పోటీ వార్తాసంస్థల మీదా పట్టుసడలింది. ’పైసలే పరమావధి అని తాము నేర్పిన విద్యనే, ఇప్పుడు తమ అనుచర బానిస రాజకీయ నాయకులూ, అనుచర బానిస వార్తాసంస్థలూ, తిరిగి తమ మీదనే ప్రదర్శించటం’ నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ పెనుకష్టంగా తయారయ్యింది. దాన్ని బ్యాలెన్స్ చేసే విన్యాసాలే ఇప్పుడు రకరకాల పైకారణాలతో[over leaf reasons తో] మన ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శింపబడుతున్నాయి.

ఈ నేపధ్యంలో, ఎవరి స్వార్ధం కోసం వారు [రాజకీయ నాయకులు తమ కెరీర్, ఇమేజ్, వ్యాపారాల కోసం, మీడియా సంస్థలు తమ రేటింగ్స్, తద్వారా వ్యాపారాల కోసం], ఎవరి అవగాహనా అవకాశాలని బట్టి వారు, తోకలు ఝాడిస్తున్నారు.

దాంతో, వై.యస్. మరణంపై, సీవీఆర్ సంభాషణలపై, డీజీసీఏ నివేదికలోని అవకతవకల గురించి ఆయా వార్తా సంస్థలు, ర్యాంకింగ్ పోటిల్లో పడి సంచలన ప్రచారం నిర్వహిస్తే... నిభాయించుకోవడం తమకి మరింత కష్టం. అందుకే ముందస్తు ’బెత్తం’గా ఎగ్జల్డ్ గందరగోళం నడపబడింది. ఉత్సాహం కొద్దీ దాన్ని ప్రచారించిన టీవీ5[దెబ్బలబ్బాయన్నమాట] వంటి సంస్థలూ, సంపాదకాది ఉద్యోగులూ న్యాయపరమైన కేసులు ఎదుర్కొన్నారు. జైళ్ళూ,బెయిళ్ళూ అనుభవించారు. ఏ విషయం నిర్ధారణగా తేలే వరకూ వై.యస్. మరణం పై ఎలాంటి వార్తలూ ప్రచారం చేయకూడదన్న షరుతులకు లోబడటం అనివార్యమైంది.

దెబ్బతో... తదుపరి వై.యస్. మృతి వ్యవహారంలో సాక్షి దినపత్రికది ఒంటరి గళం అయ్యింది. అదీ ’విభజించి’ వ్యవహారం నడిపింపబడిన తీరు! [ఎగ్జయిల్డ్ ప్రకరణం జరగనట్లయితే, ఈ పాటికి టీవీ ఛానెళ్ళన్నీ వేణుగోపాల్ రెడ్డి మృతి మీదా, డీజీసీఏ నివేదిక మీదా, రోజుల తరబడి ఎడతెగని చర్చోపచర్చలూ, సమీక్షలూ, వాదప్రతివాదనలూ ప్రసారం చేస్తూ ఉండి ఉండేవి.]

ఆ తర్వాత డీజీసీఏ నివేదిక బయటకి వచ్చింది. సాక్షి పత్రిక ఆ నివేదికలోని లొసుగుల గురించి ప్రచురిస్తూనే ఉంది. పెద్దగీత ముందు చిన్నగీతలాగా, తెలంగాణా ఉద్యమ బలిదాన భావోద్వేగ ప్రచారం ముందు, వై.యస్.మృతికి సంబంధించిన నివేదిక చిన్నదయ్యింది. ఇంకా ’సీబిఐ దర్యాప్తు నివేదిక రావాల్సి ఉంది’ అంటూ కొత్తపాట కూడా మొదలపెట్టబడింది. మరికొన్ని నెలలు గడుస్తాయి. సీబిఐ నివేదిక బయటికి వచ్చేనాటికి మరో సంచలనపు హైజాక్ సృష్టిస్తే సరిపోతుంది. ఎటూ ఈ హైజాక్ లతో మీడియా ఎలా తీసుకెత్తే అలా ప్రయాణించటం ప్రజలకి అలవాటయిపోయింది కదా!

వెరసి, మొత్తం విషయం పరిశీలిస్తే... మీడియా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, అన్నిరాజకీయ పార్టీల నాయకులు కలిసి ఒక విషయాన్ని ఎలా హైజాక్ చేయవచ్చో చూపించారు. ఇక్కడ తెలియటం లేదా అందరూ ఒకే వ్యవస్థ క్రింద పని చేస్తున్న విషయం.

నిజానికి డీజీసీఏ నివేదికలోని సాంకేతిక అంశాలని ప్రక్కన బెట్టినా, సామాన్యుల లోకజ్ఞానానికి సైతం కనబడే అవకతవకలు చాలానే ఉన్నాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

Nice article.

మీరు చూసేవుంటారు..

http://maanasasanchara.blogspot.com/2010/01/blog-post_26.html

ఈ మధ్య కాలంలో అత్యంత లేకితనంగా తయారయినది మీడియా. ఏ వార్తను నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలీకపోగా, వార్తలు ప్రచురించే సంస్థలుగా కాక, వార్తలు సృష్టించే సంస్థలుగా మీడియా సంస్థలు తయారయాయి.

రాజశేఖరుడి మరణంపై వచ్చిన రిపోర్టులో అవకతవకలగుఱించి, ఈ వేణుగోపాలుడి (ఆత్మ)హత్యగుఱించీ ఎంతసేపూ విడిగా ఆలోచించాను తప్పితే, రెంటినీ కలిపి ఆలోచించవచ్చని నాకు ఎందుకో తట్టనేలేదండీ! భలే! అద్భుతంగా వ్రాసారు.

రమేష్ గారు : నెనర్లు!

మంచుపల్లకీ గారు : మంచి టపా చూపించారు. బాగుందండి. నెనర్లు!

రవి గారు: మీడియానే అసలు శత్రువండి!

జీవని గారు: మీ సైట్ చూసి చెప్తానండి. నెనర్లు!

రాఘవ గారు: అదే నండి స్ట్రాటజీ అంటే! మరి 17 సంవత్సరాల ఇండస్ట్రీ ! అనుభవం ఊరికే పోతుందా!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu