ముందుగా ఓ పోలికతో నా విశ్లేషణ ప్రారంభిస్తాను.

ఓ కొలను ఉందనుకొండి. ప్రశాంతంగా ఉన్న నీరు. గాలికి కదిలే చిరు అలలు తప్ప పెద్దగా అలజడి లేదు. హఠాత్తుగా అందులో ఓ రాయి విసిరితే? అలలు ఎగసి పడతాయి. వరుసగా రాళ్ళు విసిరితే... అనుశృత అలజడి చెలరేగుతూనే ఉంటుంది.

సరిగ్గా ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు మూడు నెలల క్రితం తెలంగాణాలో మెహబూబ్ నగర్ జిల్లా, రాయల సీమలో కర్నూలు జిల్లా, కోస్తాలో విజయవాడ వరద బారిన పడితే, ప్రాంతాల కతీతంగా ప్రజలు కదిలి వచ్చి, కష్టాల్లో ఉన్న తోటి తెలుగువాళ్ళకి మేమున్నామంటూ అండగా నిలిచారు. అదే తెలుగువాళ్ళు... ఇప్పుడు రావణ కాష్టాల్లా విశ్వవిద్యాలయాలు మండుతుంటే... అందులో కట్టెల్లా జీవితపు తొలిదశలో ఉన్న పిల్లలు కాలిపోతుంటే... కన్నీటితో చూస్తున్నారు. ఎవరు ఈ చితి రగిల్చారు? నిశ్చయంగా రాజకీయ నాయకులే!

నిజానికి తెలంగాణా ఉద్యమం - దాని పర్యవసానంగా చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాల వెనుక గల అసలు కారణాలని పరిశీలించాలంటే - రెండు అంశాలని పరిశీలించాలి. ఒకటి రాజకీయ నేపధ్యం. ఇందుకు దాదాపు 10 నెలల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అంటే 2009 మే ఎన్నికల ముందు నాటికి. ఇక రెండోది గూఢచర్య నేపధ్యం. దీన్ని పరిశీలించాలంటే దాదాపు పదేళ్ళ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

ముందుగా రాజకీయ నేపధ్యాన్ని, మీడియాకి, కాంగ్రెస్ అధిష్టానానికి, కేసీఆర్ కి, ప్రతిపక్షాలకి మధ్య ఉన్న ’మ్యాచ్ ఫిక్సింగ్’ ని పరిశీలిద్దాం.

మే, 2009 లో సార్వత్రిక ఎన్నికలతో బాటు, రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఎంతగా EVM లని Tamper చేసినా, గెలిపోటములకు పైకారణాలు[ovre leaf reasons] కావాలి గదా? సరైన పైకారణాలు లేనట్లయితే - సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు గురించి - ప్రజలు అధిక ధరలని, దైనందిక జీవిత సమస్యలని కూడా విస్మరించి దేశ సమైక్యతనీ, భద్రతనీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కు ఓటు వేసారనీ, భాగస్వామ్య పక్షాలు లెక్కచేయనట్లుగా, తీసిపారేసినట్లుగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ అధిష్టానంలో కసిరేగిందనీ, అందుచేత పట్టుదలతో గెలుపు సాధించిందనీ మీడియా చిత్రించినట్లు ఉంటుంది. [పాపం అమాయక ప్రజలు! దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ కు ఓటు వేసారట. అందుకేనేమో ఇప్పుడు అదే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని, ఆపైన దేశాన్ని ముక్కలు(చిన్నరాష్ట్రాలుగా) కొట్టే పనిలో ఉంది. మరో తమాషా ఏమిటంటే - ఎన్నికలేమైనా బాక్సింగ్ పోటీల వంటివా? కసి రేగి, పట్టుదల జోడించి, పదిదెబ్బలు ఎక్కువ కొట్టి గెలిచి కూర్చోడానికి? ఆ ప్రతిభ ధరల మీద చూపెట్టవచ్చు కద? ]

ఇలాంటి విశ్లేషణలని మీడియా[ఈనాడు తో సహా] మే 2009 ఎన్నికల అనంతరం ప్రచురించింది. అదేం కాదనీ, EVMల Tamparing అనీ బయటకి పొక్కడంతో అలాంటి విశ్లేషణలని అర్జంటుగా ఆపి, ’EVM లని ఎవరూ ఏం చేయలేరు’ అంటూ నవీన్ చావ్లాల చేత ప్రకటనలు గుప్పించి మరీ ప్రచారం ప్రారంభించారు. నిరూపించలేకపోతే కేసులు పెడతామని చెప్పారుకూడా![కేసులు లేవు గానీ, మొత్తంగా విషయం సద్దుమణిగించారు. అచ్చంగా ఓటుకు నోటు కేసులాగా!]

దానా దీనా విషయం ఏమిటంటే - ఎంతగా EVMలని Tamper చేసినా, గెలుపోటములకు పైకారణాలు కావాలి. అలాంటి పైకారణాల[over leaf reasons] కోసమే.... తెరాస అధినేత కేసీఆర్ కీ, కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి మధ్య రహస్య ఒడంబడిక జరిగింది. [దీని గురించే చంద్రబాబు నాయుడు ’మ్యాచ్ ఫిక్సింగ్’ అంటు కొంచెం గొంతెత్తి మళ్ళీ ఎందుకో గమ్మున ఉండిపోయాడు.] ఆ ఒప్పందం ప్రకారం - కేసీఆర్, తెదేపా, ఎర్రపార్టీలు అంతా కలిసి ఏర్పాటు చేసిన మహా కూటమిని వీలైనంత నీరుగార్చాడు. ఎంతగా అంటే - నెలకి 1500/-రూ. నుండి 2000/- రూ.ల దాకా డబ్బు పంపిణీ వంటి ఆకర్షణీయ పధకాలని కూడా పైకారణంగా[over leaf reason] నిష్పలం చేయగలిగేంతగా నీరు గార్చాడు.

సీట్ల సర్ధుబాట్ల విషయంలో వీలయినంత తాత్సారం చేసి కాలయాపన చేసాడు. దాదాపు నామినేషన్ చివరిరోజులలో బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయంలోనూ తెదేపా నే మెట్టుదిగి వచ్చింది. టిక్కెట్ల కేటాయింపులోనూ, కేసీఆర్ టిక్కెట్లు అమ్ముకున్నాడన్న వివాదాలూ, ఎం.ఐ.ఎంకూ, కాంగ్రెస్ కూ అనుకూలంగా ఉండేటట్లు బలహీన అభ్యర్ధులని నిలబెట్టాడన్న వివాదాలూ బయటికి వచ్చాయి. ఇలాంటి రకరకాల ప్రయత్నాల[efforts] తర్వాత, తెరాస కేవలం 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలిచింది. మహా కూటమి ఓటమికీ, కాంగ్రెస్ గెలుపుకీ ఆ విధంగా పైకారణపు బాటలు వేయబడ్డాయి.

ఈ విధంగా చేయటం వలన తెలంగాణాలో కేసీఆర్ ప్రతిష్ఠ మసకబారుతుంది కదా? అందుకు ప్రతిఫలంగా - కేసీఆర్ తెలంగాణా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలి. ఆ నాటకం రక్తికట్టాక తాను ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రకటిస్తుంది. ఆ ప్రక్రియని యధాప్రకారం ఏళ్ళూపూళ్ళూ సాగదీస్తే చాలు. దాంతో కేసీఆర్ తెలంగాణా రాష్ట్రపిత, తెలంగాణా గాంధీ అయిపోతాడు. ’అమ్మా నిన్ను మరవదు ఈ గడ్డ’ అంటూ ఎదురు స్తుతిస్త్రోత్రాలతో సోనియా ఇమేజ్ నీ పెంచవచ్చు. ఎటూ బాకా ఊదేందుకు మీడియా ఉండనే ఉంది కదా? ఇదీ పధకం!

ఆ ప్రకారమే - కేసీఆర్, ఎన్నికలు ప్రభుత్వాల ఏర్పాట్లు పూర్తవ్వగానే సమాయత్తం అయ్యాడు. అయితే ఈ లోపున వై.యస్. తాలూకూ గడబిడ ప్రారంభమయ్యింది. అతడి హెలికాప్టర్ ప్రమాద మరణం, ఆపైన అభిమానుల మరణ మృదంగాలని మీడియా ఇతోధికంగా వాయించడం, వరదలు వగైరా ప్రకరణాలతో కేసీఆర్ తాత్కాలికంగా గమ్మునుండాల్సి వచ్చింది. అందుకే కొంతకాలం కేసీఆర్ ఎక్కడా కనబడలేదు, వినబడలేదు. ఎటూ పార్టీలోనూ అసమ్మతి ఉంది. ఏదో ఒకటి (లాబీయింగ్) చేస్తేనేగానీ మళ్ళీ అందరూ తన నాయకత్వానికి జిందాబాద్ కొట్టరు. ఎటూ విరామ సమయం లభించినందున పెండింగ్ పనులు + ఆరోగ్య పరీక్షలు చికిత్సలు చేయించుకున్నాడు.

కాంగ్రెస్ అధిష్టానాన్ని , బార్టర్ పద్దతి మాదిరిగా తన ఇమేజ్ పున:నిర్మాణం గురించి కేసీఆర్ ఎప్పుడడిగినా.... వై.యస్. మరణపు అంశమే ప్రస్తావనకు రావటంతో, కోపాన్ని, నాలుకనీ కూడా నిగ్రహించలేని కేసీఆర్, అక్టోబరు లో ’దిక్కుమాలిన సావు సచ్చిన వైయస్, పీనుగు రాకముందే రాజకీయాలు మొదలెట్టిన జగనూ’ అంటూ తిట్లు లంకించుకున్నాడు. ఆ వెంటనే తాను ఎక్కిన హెలికాప్టరు కూడా ఆకాశగమనంలో ’చుక్కలు’ చూపించించింది. అది యాదృచ్చికమో, వ్యూహాత్మకమో గానీ, దెబ్బకి కేసీఆర్ వేదాంతం మాట్లాడాడు. ఈ విషయమై అప్పట్లోనే టపాకాయలు పేల్చాను.

తర్వాత కొద్దిరోజులకే - తెలంగాణా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, తెలంగాణా తెచ్చుడో - కేసీఆర్ చచ్చుడో, జైత్రయాత్ర లేదా శవయాత్ర అంటూ ఓ ప్రక్క హెచ్చరికలు చేస్తూ, మరో ప్రక్క రాష్ట్రపతి దగ్గర నుండి గవర్నర్ , అన్ని పార్టీల నాయకత్వాల్నీ , అవసరం ఉన్నా లేకపోయినా ప్రక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిసి, లాబీయింగ్ ఓ ప్రక్క నిర్వహించాడు. నవంబరు తొమ్మిదిన ప్రారంభిస్తానన్న నిరాహార దీక్ష, అలా సాగదీసి ఇలా సాగదీసి చివరికి నవంబరు 29 న ప్రారంభించాడు.

ఈ లోపున - ’నేను నిరాహార దీక్షకి కూర్చొంటాను. అటు ఇటు అవకుండా మీరు కమ్ముకు రండి’ అన్న ప్రయత్నలే చేసాడో, మరేం చేసాడో గానీ... అతడు ఈ లాబీయింగ్ నిర్వహిస్తున్న రోజుల్లోనే, ఎర్రపార్టీ నాయకుల దగ్గరి నుండీ కాంగ్రెస్ వాళ్ళ దాకా అందరూ, ’కేసీఆర్ చచ్చి సాధించేదే ముంది’ అంటూ ’జాగ్రత్తలు’ చెప్పారు.

అప్పటికే పలుమార్లు దీక్షలు ప్రారంభించటం, రెండురోజుల్లో లేచేయటం, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామాలు చేయటం, కార్యకర్తలు బ్రతిమాలాడారంటూ విరమించుకోవటం, గట్రా నాటకాలు శృతి మించే చేసినందునా, మహాకూటమి భాగస్వామ్యంతో కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేసినందునా తెలంగాణాలో అతడి ఇమేజ్ బాగా డామేజ్ అయ్యింది. కెరియర్ కూడా ఆశాజనకంగా లేదు. ఇక తప్పదన్నట్లు నవంబరు 29 న నిరాహారదీక్ష ప్రారంభించాడు. 1990 - 91 లో అయోధ్యలో రామమందిరం కోసం అద్వానీ రధయాత్ర చేపట్టడం, ఆ ఉద్రికత్తలని మరింత రక్తి కట్టిస్తూ వీపీ సింగ్, అద్వానీ అరెస్టు నిర్ణయం తీసుకోవటం లాగా, కేసీఆర్ ని కూడా వెంటనే అరెస్టు చేసి ఖమ్మం జైలుకీ ఆపైన ఆసుపత్రికీ తరలించారు.

రెండోరోజునే పళ్ళరసం తాగేసి కేసీఆర్ దీక్షకి బై కొట్టేసాడు. విద్యార్ధులు ఖస్సుమని లేస్తూ, ’తెలంగాణా రాకుండానే కేసీఆర్ దీక్ష విరమిస్తే మేం దీక్షకు దిగుతాం’ అంటూ అల్టిమేటం ఇచ్చేసరికి, సెలైన్ బాటిళ్ళతో [TPNతో] దీక్ష కొనసాగించాడు. నిమ్స్ డాక్టర్ల ప్రకటనలతో మీడియా దాన్ని మరింత రక్తికట్టించింది.

రాజకీయ కారణాలతోనూ, అంతర్లీనంగా ఉన్న గూఢచర్య కారణాలతోనూ, కాంగ్రెస్ అధిష్టానం, అత్యుత్సాహంగా తన పుట్టిన రోజు కానుకగా డిసెంబరు 9 న తెలంగాణా రాష్ట్రప్రక్రియ షురూ ప్రకటన ఇచ్చేసింది. సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది! సమైక్యాంధ్ర ఉద్యమం రాజుకుంది. దాని వెనుక పైకారణాలూ, అంతర్లీన కారణాలూ ఏదైనా కావచ్చు గాక! ఒక్కసారిగా మాత్రం, అందరి పరిస్థితి ’ఏ నిముషానికి ఏమీ జరుగునో ఎవరూహించెదరూ’ అయిపోయింది.


ఈ రచ్చ పరాకాష్టకు చేరుకున్న దశలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అదృశ్యమూ, నిమ్స్ లో ప్రత్యక్షం గట్రా సన్నివేశాలతో TPN తో 30 ఏళ్ళపాటు ’సుఖంగా’ నిరాహారదీక్ష చేయవచ్చని బహిర్గతం అయ్యింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం, యధాప్రకారం గృహమంత్రి చిదంబరం ముఖతః రెండో ప్రకటన చేయించింది. ’ఏకాభిప్రాయం తర్వాతే ఏదైనా ’ అన్నమాట తెరమీదికి వచ్చింది. దీనికి ముందు ’తెలంగాణా మీద మేం వెనుకకు తగ్గం, ముందుకీ వెళ్ళం’ వంటి ప్రకటనలు ఇస్తూ కాంగ్రెస్ ప్రకటన కర్తలు[అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ, షకీల్ అహ్మాద్, జయంతీ నటరాజన్ గట్రాలు], 'తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి' అన్న అంకానికి తెరతీసారు.

అయితే కాంగ్రెస్ అధిష్టానికి ఎక్కడ పెను ఉపద్రవం కనిపించిందంటే - తెలంగాణా ఇస్తాము అంటే, భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో 11 నుండి 13 లేదా15 దాకా ముక్కలు[విదర్భ, గూర్ఖాలాండ్ లాంటివి] లైన్లోకి వచ్చి నిలబడ్డాయి. ఆ విధమైన వేర్పాటు వాదానికి సమాంతరంగా సమైక్య వాదమూ తలెత్తితే....?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు విభాగాలై... వేర్పాటు, సమైక్యం అని సంఘర్షించుకుంటున్నట్లుగా, క్రమంగా యావద్భారత దేశం రెండు విభాగాలై కూర్చొంటుంది. అప్పుడు తెలంగాణా ఇవ్వటం అనే ప్రక్రియతో, దాన్నంతా ప్రారంభించినందుకు ప్రతిఫలంగా, కాంగ్రెస్ అధిష్టానం, అలనాడు దేశాన్ని విభజించి పాలించిన బ్రిటీషు వాళ్ళ స్థానంలో ప్రతిష్టితమౌతుంది. సమైక్యంగా ఉంటాం అన్న ఉద్యమాలతో, ఆయా రాష్ట్రాల ప్రజలు, అలనాడు దేశభక్తితో నినదించిన, దేశ స్వాతంత్రం కోసం, సమగ్రత కోసం పోరాడిన వారి స్థానంలోకి వస్తారు.

ఆ విధంగా తమ అసలు రూపం ఏమిటో సరిగ్గా బహిర్గత మౌతుంది. ఈ ఉపద్రవం అర్ధం కాగానే కాంగ్రెస్ అధిష్టానం వెనకడుగు మొదలెట్టింది. అయితే - ఇప్పటికి తామే అగ్గి ముట్టించి నందునా, ఎలా నియంత్రించుకోవాలో అర్ధం గాక, రకరకాల మార్గాలు అన్వేషించింది, అన్వేషిస్తోంది. అందులో భాగమే అఖిలపక్ష సమావేశాలు, ఏకాభిప్రాయ సాధన ప్రకటనలూ!

ఈ పరిణామాలలో... గూఢచర్యపు గుట్టు మట్లు, అధిష్టానపు బలహీనతలు రాజకీయ నాయకులలో ప్రచారమయ్యాయి. దాంతో కాంగ్రెస్ లోని వేర్పాటు వాదుల మీదా, సమైక్య వాదుల దాకా కూడా అధిష్టానపు పట్టు సడలింది. ఎంతగా అంటే - షోకాజ్ నోటీసులు, ’ఇలాగైతే అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళాల్సొస్తుంది’ అన్న బెదిరింపులూ, గవర్నర్ పాలన విధింపు బెదిరింపులూ కూడా ఉపయోగపడనంతగా! స్వంత పార్టీలో ఇలా ఉంటే, సహజంగానే ప్రతిపక్షాలకు చులకన అయిపోతారు కదా! మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని, ప్రతిపక్షాలనూ కూడా నడుపుతోన్న నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థ పట్టుసడలింది.

ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు. దీన్ని గురించి వివరించే ముందు ఇప్పటి వరకూ వివరించిన పరిణామాలని ఒకసారి సమీక్షిద్దాం.

నవంబరు 29న నిరాహార దీక్ష ప్రారంభించిన కేసీఆర్, నిమ్స్ లో సెలైన్ బాటిళ్ళ సాక్షిగా దీక్ష కొనసాగించాడు. TPN తో 30 ఏళ్ళపాటు నిరాటంకంగా నిరాహారదీక్ష చేయ వచ్చునని, IB, RAW వంటి సంస్థలు అధీనంలో ఉన్న హోంశాఖ కూ, హోంశాఖామాత్యుడికి తెలియదా? అధిష్టానం అంత అమాయకంగా ఉందా? మరి ప్రణబ్ ముఖర్జీ "డిసెంబరు 9 నాటి పరిస్థితులనీ, కేసీఆర్ ఆరోగ్యస్థితినీ, ఒత్తిళ్ళనీ దృష్టిలో ఉంచుకుని ఆ ప్రకటన [తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ ప్రకటన] ఇవ్వాల్సి వచ్చింది" అని ఎలా అన్నట్లు? ఒక సామాన్య ఎంపీ అయిన లగడపాటికి తెలిసిన పాటి కేంద్ర మంత్రులకీ, కుర్చీ వ్యక్తికీ, తెలియక పోయిందా? ఇక్కడ తెలియటం లేదా కేసీఆర్ కీ, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్న ’మ్యాచ్ ఫిక్సింగ్’?

విచిత్రంగా మీడియాకి, ప్రతిపక్షాలకి కూడా TPN గురించి తెలియదు కాబోలు! కేసీఆర్ ఆరోగ్యబులిటన్లు ప్రచురించిన మీడియా అతడి శరీరంలో సోడియం, పోటాషియం నిల్వలని గురించి కూడా వివరాలు ఇచ్చింది గానీ TPN గురించి అసలు కిమ్మనలేదు. లగడపాటికి తెలిసిన విషయం ప్రతిపక్షాలకు తెలియక పోయింది. TPN గురించి ప్రతిపక్షాలకి, మీడియాకి కూడా తెలియదా? లగడపాటి దాన్ని బయటపెట్టాక కూడా కేంద్రరాష్ట్రాలల్లోని ప్రతిపక్షాలు గానీ, జాతీయ రాష్ట్రీయ మీడియా గానీ కాంగ్రెస్ అధిష్ట్రానాన్ని నిలదీయ లేదేం? విమర్శించనూ లేదు. ఇక్కడ తెలియటం లేదా మీడియాకి, కాంగ్రెస్ అధిష్టానానికి, కేసీఆర్ కి, ప్రతిపక్షాలకి మధ్య ఉన్న ’మ్యాచ్ ఫిక్సింగ్’?

అంటే వెరసి వీళ్ళు అడుకుంటున్న రాజకీయ క్రీడలో సామాన్యులమయిన మనమే బలి పశువులం! విద్యార్ధులంతకంటే అమాయక, అవేశపూరిత బలిపశువులు!

ఇక్కడ ఓ కొసమెరుపు ఏమిటంటే - కాంగ్రెస్ వాడే అయిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ TPN డ్రామా నంతటినీ బహిర్గతం చేయటం. కాంగ్రెస్ అధిష్టానం దీనినంతటిని తొక్కిపడితే, లేదా లగడపాటిని అపితే, ఎవ్వరికీ TPN గురించి తెలిసేది కాదు. సెలైన్ బాటిళ్ళ దీక్ష కావలసినప్పుడల్లా కొనసాగించవచ్చు. అలాగాక వీళ్ళందరి డ్రామాని, మ్యాచ్ ఫిక్సింగ్ ని బహిర్గతం చేసే విన్యాసాలు, ఆత్మహత్యసదృశ్య అసైన్ మెంట్లు పరిశీలిస్తే.... కనబడేది నెం.5 వర్గపు పనితీరే! పరిశీలించండి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

mee viSleaShaNa assalu baagoa leadu.. kontakaalam vraayaTam aapeayanDi..

మీ టపాలొ చెప్పిన విషయాలు అన్నీ నిజాలే..కాని జరుగుతున్న నాటకానికి తొందరగా ఒక ముగింపు వస్తే అందరికి చాలా మంచిది, ముఖ్యంగా విలువైన విద్యా సంవత్సరం కొల్పొవలిసివస్తూన్న విద్యార్ధుల కి.

-శ్రీ రామచంద్ర మూర్తి

కృష్ణమూర్తి గారు,

పోనీ కొన్నాళ్ళు మీరు చదవటం మానేస్తే సరిపోతుందేమో ఆలోచించండి. :)
~~~~
శ్రీరామచంద్ర మూర్తి గారు,

అవునండి. నెనర్లు!

Here the point is How L. Rajagopal came to know that KCR used TPN ? What's about rest of the MLAs, MPs, Governament officers and Media don't they know KCR used TPN?

నాకు సరిగా అర్థం కాలేదండీ, ఇంతకీ లగడపాటి రాజగోపాల్ నెం.5 వర్గానికి చెందినవాడు అంటారా?

ఏది ఏమైనా ఇది ఒక కొలిక్కి వస్తే అందరికీ హాయిగా వుంటుందండి.

ఈ కాన్స్పిరసీ థీరీని మీరే కనిపెట్టారా? సాక్షి పేపర్ వాడి వైఎస్ చాపర్ క్రాష్ థీరీ లాగా మీరు కూడా గాల్లిలోనే ఊహించారా, లేక ఎవైనా ఆధారాలు ఉన్నాయా?

@ అజ్ఞాత గారు: నెనర్లండి!

@ రాఘవ గారు: నేనూ లగడపాటి నెం.5 వర్గం అనలేదండి. ఇంతకు ముందు టపాలలో చెప్పినట్లు, అత్మహత్య సదృశ్యమైన అసెన్ మెంట్లు గురించి గుర్తుకు తెచ్చుకోండి. మొత్తం విషయం మీకే అర్ధమవుతుంది. నెనర్లు!

@ సృజన గారు: రాజకీయ నాయకులు అనుకోవాలి కదండి. నెనర్లండి!

@ కరన్ కుంభ గారు: ఈ టపాలు అర్ధం కావాలంటే ముందు అన్ని టపాలు చదివితే అర్ధం అవుతాయండి. ఇంతకు ముందు మీకు చెప్పినట్లు గుర్తు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu