రామోజీ రావు ముందు పెట్టబడిన సవాల్ లో “ప్రపంచమంతటనీ నడిపిస్తున్న నకిలీ కణిక వ్యవస్థ తాలుకూ కీలక వ్యక్తిగా అన్నిటినీ బయటపెట్టుకుంటావా లేక ‘చిన్నవాణ్ణి నేను, చిన్నపత్రికాధిపతి’ని అన్నట్లుగా, మామూలుగా Fade out అవుతావా?" అన్నదే – ఇక్కడ ’కన్నా?’ లేక ’కాలా?’ స్ట్రాటజీ.

ఈ సవాల్ తాలుకూ పర్యవసానాన్ని రామోజీరావు, అతడి నెం.10 వర్గం, మొదట్లో అంతగా అంచనా వేసుకోలేకపోయాయి. కాబట్టే ఓ వైపు తాను చిన్నవాణ్ణన్న పిక్చర్ ఇచ్చుకుంటూ, మరోవైపు తమ గూఢచార వలయాన్ని, వ్యవస్థనీ కాపాడుకునే ప్రయత్నం చేసాడు. అందులో భాగంగానే, చంద్రబాబునాయుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ‘విదేశీపెట్టుబడుల ఆకర్షణ’ నెపంతో ప్రపంచపు అంచుల దాకా పరుగులు పెట్టిమరీ లాబీయింగ్ నిర్వహించాడు. అదేబాటలో కేంద్రప్రభుత్వంలోని కీలక వ్యక్తులూ, ప్రముఖ వ్యక్తులూ కూడా పయనించారు. అయినా గానీ, అతి చిన్న, పేద, దేశమైన పాకిస్తానూ, దానికి భారతదేశంలోని హైదరాబాద్ తో గల సన్నిహిత సంబంధాలూ, ముఖ్యంగా పాతబస్తీ తో గల అవినాభావ, అవిచ్ఛన్న సంబంధాలూ, భారత దేశంలోని రకరకాల సంఘటనలతో [నకిలీ నోట్లు, తెల్గీ నకిలీ స్టాంపుల వ్యవహారంలాంటివి] పాకిస్తాన్ లింకులూ, ప్రపంచం మొత్తమ్మీదా రాజకీయ, ఆర్ధిక, పారిశ్రామిక, సినిమా, మీడియా రంగాల్లో ఒకే శృతి – ఈ విధంగా ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్న ఒకానొక వ్యవస్థా లేదా ఏజన్సీ ఉండటం అన్న ’సంభావ్యత’ అచ్చంగా బహిర్గతమైపోయింది.

ఏ వ్యక్తైనా, ఏదైనా గూఢచార ఏజన్సీకి ఏజంటుగా గుర్తింపబడితే, అతణ్ణి ఆ ఏజన్సీ వదిలేసుకుంటుంది. చాలా స్పల్ప వ్యవధిలోనే ఆ వ్యక్తి, అతడెంత పెద్ద రాజకీయనాయకుడైనా లేక పారిశ్రామికవేత్తయినా Fade out అయిపోతాడు. కనుమరుగైపోతాడు. అలాంటి స్థితి రామోజీరావుకి లేదూ, పాకిస్తానుకు అంతకంటే లేదు. తాలిబాన్లు, వారి నాయకులు బిన్ లాడెన్ వంటి వాళ్ళు ఆఫ్గాన్ తోరాబోరా గుహల్లో ఉన్నారంటే, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు రఁయ్యిన ఆఫ్గాన్ మీద యుద్ధవిమానాలు దించాయి. సైనిక చర్య చేపట్టి ఆఫ్గానిస్తాన్ ని కార్పెట్ బాంబింగ్ తో దున్నిపారేసాయి. అదే తాలిబాన్లు, లాడెన్ లు పాకిస్తాన్ లో ఉన్నారని, ఎన్ని నిరూపణలు, వార్తలు, దృష్టాంతాలు కన్పించినా “పాపం, పాకిస్తాన్ కూడా తీవ్రవాద బాధిత దేశమే. కాబట్టి అందరూ దానికి ఆర్ధికసాయం చెయ్యండి” అంటూ మీటింగులు పెట్టి మరీ, డబ్బు సమకూరుస్తున్నాయి. మరి ఆఫ్గానిస్తాన్ తీవ్రవాద బాధిత దేశం కాదా? ఆఫ్గాన్ మీదకైతే రఁయ్యిన కయ్యానికి పోయిన అమెరికా, బ్రిటన్ లకి పాకిస్తాన్ అయితే అంత వ్యత్యాసం ఎందుకు? మరోప్రక్క తాము చేసిన ఆర్ధిక సాయాన్ని పాక్ దుర్వినియోగం చేసిందని ప్రకటనలిస్తూనే ఉంటారు. సాక్షాత్తూ అమెరికా రక్షణాధికారులు [పెంటగాన్ అధికారులు. గతంలో సి.ఐ.ఏ. అధికార భవనం పెంటగాన్ గా వివరించిన పొరపాటును ఇక్కడ సరిదిద్దడమైనది] దీన్ని ధృవీకరిస్తారు. స్వయంగా పాక్ అధినేతలూ దాన్ని అంగీకరిస్తారు. మళ్ళీ మామూలుగా పాకిస్తాన్ కి మిలియన్ల డాలర్లు అందజేయబడుతున్నాయి. రేపోమాపో పాక్ కి సాయం అందించే దేశాల్లో భారత్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైపెచ్చు దాన్ని ప్రపంచ మీడియా భారత ప్రభుత్వాధినేతలు మన్మోహన్ సింగ్, సోనియాగాంధీల ‘ఉదారత, ఉదాత్తత, పరిణతి’ అని పొగిడినా ఆశ్చర్యపోనక్కర లేదు.

ఇప్పటికే పాకిస్తాన్ ముష్కరులు ముంబాయి పై చేసిన ముట్టడిని ప్రక్కనపెట్టి పాకిస్తాన్ తో చర్చలకి మొన్న ఈజిప్టు పర్యటనలో ఒప్పుకుని వచ్చిన మన్మోహన్ సింగూ, అతడి రిమోట్ ని చేతిలో పెట్టుకుని ఆడిస్తున్న సోనియా గాంధీ అందుకు వెనక్కి తగ్గుతారనుకోలేము. ఈజిప్టులో పాక్ తో కలిసి సంయుక్త ప్రకటన ఇచ్చిన మన్మోహన్ సింగ్ కి కార్గిల్ యుద్దం గుర్తుకురాలేదా? అప్పుడు పాకిస్తాన్, తాలిబాన్లకి ఇచ్చిన సాయం గుర్తుకురాలేదా? పాకిస్తాన్ సువర్ణముఖిని మరోటపాలో వివరిస్తాను. ప్రస్తుత టపాలో రామోజీరావు ’సువర్ణముఖి’తాలుకూ ఒక కోణాన్ని పూర్తి చేస్తాను.

నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ పెట్టబడిన చెక్ [సవాల్] ’కన్నా?’కాలా?’ స్ట్రాటజీలో – ప్రపంచాన్నంతటినీ నడుపుతున్న నకిలీ కణిక వ్యవస్థ గానూ, కీలక వ్యక్తిగానూ బహిర్గతమై ఛస్తావా లేక ఇప్పటి వరకూ భారత ప్రభుత్వాన్ని, ప్రజల్ని నమ్మిస్తున్నట్లుగా ’చిన్న వాణ్ణి, స్థానిక పత్రిక వాణ్ణి’ అన్న ముసుగులోనే ఛస్తావా? అన్న స్ట్రాటజీ చాలా క్లిష్టమైనది. [ఇక్కడ చావు అంటే భౌతికమైన మరణం కాదనీ, గూఢచర్యపరమైన మరణమనీ అర్ధం చేసుకోవాలి. గూఢచార అస్తిత్వం, గూఢచార కార్యకలాపం బహిర్గతమవ్వడంతో పోల్చితే భౌతికమైన మరణం చాలా సుఖవంతమైనది.]

స్వవిషయంలో “కన్నా?కాలా?" అన్న స్ట్రాటజీ ఎందుకు క్లిష్టమైనది అంటే – తనది కాకపోతే కాశీ దాకా డేకమన్నాడట’ అన్నది పెద్దలు చెప్పేసామెత. అందుచేత చావు తన దాకా వస్తే, తన కన్నో, కాలో వదిలేసుకోవాల్సి వస్తే స్ట్రాటజీ ‘క్లిష్టమైనది’ అయిపోతుంది. అదే తనకు ఎంత ఆప్తులూ, ఆంతరంగికులూ అయినా తన ఏజంట్ల విషయంలో అయితే A&B లలో ఎవరో ఒకరిని వదిలేసుకోవాల్సివస్తే, బాధాకరమైనా, అనివార్యమైనది కాబట్టి ‘A’ నో లేక ‘B’ నో ఆ సమయానికి ’కాలు’ అనేసుకుని వదిలేసుకోగలిగారు.

అదే స్వయంగా తమ విషయానికి వచ్చేసరికి కన్నూ ముఖ్యమే అన్పిస్తోంది, కాలూ ముఖ్యమే అన్పిస్తోంది. కాబట్టే నకిలీ కణికవ్యవస్థనీ బహిర్గతం చేసుకోవటం [కన్ను] లేక స్థానిక పత్రికాధిపతి ముసుగులో అణగారిపోవటం [కాలు] అన్న విషయంలో, ఎదురైన ప్రతీ సంఘటనలోనూ, ప్రతీ సవాలులోనూ ఎప్పటికప్పుడు ఓసారి కన్ను తప్పించుకోవటానికి కాలుని వదిలేసుకోవటం, మరోసారి దానికి విపర్యయంగా అప్పటి సంఘటనలో కాలునే ఎంచుకుని కన్నుని వదిలేసుకోవటం చేస్తూ వచ్చింది నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, వీళ్ళ తాలుకూ నెం.10 వర్గమూ.

మరికొంత వివరంగా చెబుతాను. మొదట్లో నకిలీ కణిక వ్యవస్థగా అంటే ప్రపంచాన్నంతా నడుపుతున్న వ్యవస్థగా బహిర్గతమైనా సరే, నిభాయించుకోగలిగేంత బలం తమకి ఉందని నమ్మింది నెం.10 వర్గం.[So what అనేంత బలం తమకుందని నమ్మటం] ఓ రకంగా చెప్పాలంటే రిమోట్ తో DVD ని అపరేట్ చేయటమే గొప్పనైపుణ్యం అని చాలా ఎక్కువగా నమ్మింది. పదేపదే అదే ప్రచారించిన తమ మాయలో తామే పడిపోయినట్లన్న మాట. పదేపదే అదే అనుకొని జబ్బలు చరుచుకున్నతనం, వాపుని బలుపని నమ్మేలా చేసింది. నెం.5 వర్గం తమని వ్యతిరేకించటం, తమకే ఛాలెంజ్ విసరటాన్ని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం లెక్కచేయలేదు. అందుకే అప్పటి వరకూ అలా అలా మెల్లిగా నడుస్తున్న రామోజీ ఫిల్మ్ సిటి నిర్మాణం ఒక్కసారిగా ఊపందుకుని పూర్తయ్యింది. 1992 కు ముందర బాటసింగారం దగ్గర భూసేకరణలో కూడా ’పాపం’ రామోజీరావు కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నాడు. 1992 తర్వాత ఒక్క రామోజీఫిల్మ్ సిటి నిర్మాణమే కాదు, జాతీయంగా వివిధ భాషల్లో టీవీ ఛానెళ్ళు కూడా ఎడాపెడా పెట్టేసాడు. [అసలు ప్రైవేటు ఛానెళ్ళే భారతదేశంలోని 1991 తర్వాత ఆర్ధిక సరళీకరణంతో ప్రవేశించాయిలెండి.] ఎడాపెడా అంతర్జాతీయ సంస్థలూ, గిన్నెస్ రికార్డులూ కూడా వచ్చేసాయి. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలూ, భారీ నిర్మాతలూ, దర్శకులూ కితాబులు కూడా ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేసారు. ఇదే కాలంలో చంద్రబాబునాయుడూ అంతర్జాతీయంగా తిరిగి లాబీయింగ్ చేసి పెట్టాడు.

కానీ ప్రతీ సంఘటనలోనూ [లేదా సంఘటనాత్మక సవాలులోనూ] అపజయమే ఎదురయ్యింది. ఎప్పటికప్పుడు నకిలీ కణిక వ్యవస్థా, దాని స్ట్రాటజీనే బహిర్గతం అయ్యింది. మొదట్లో ఇది – విదేశాల్లో జరగటం లోనూ, మీడియా బండారం ప్రపంచవ్యాప్తంగా ఇంతగా బయటపడకపోవటంతోనూ బయటకు అంతగా తెలియకుండా నిభాయించుకునే ప్రయత్నం చాలా చేశారు. తొలి సంఘటనలు కాబట్టి సహజంగానే కొంత వెసులుబాటు పొందారు. క్రమంగా…. కాలం గడిచే కొద్దీ… బహిర్గతమౌతున్న సంఘటనలు, స్ట్రాటజీలు పెరిగాయి. మొదటవి అర్ధంకాకపోయినా, మెల్లిగా జనాలకూ అలాంటి సంఘటనలూ, స్ట్రాటజీలూ, ఒకటికి పదీ ఇరవై….. ఇలా సంఘటనలు పెరిగే కొద్దీ అర్ధం అవుతుంది కదా! అందునా నెం.5 వర్గం రిమోట్ అపరేట్ చెయ్యటమే గొప్ప చారకళ అనుకునేది కాదు. భారతీయ ఇతిహాసాల దగ్గర నుండి ప్రాధమిక గూఢచార తంత్రాలనీ, అన్నిదేశాలలోనూ, మేలిమిజ్ఞానం, సత్యం, నిజాయితీల మిశ్రితాన్ని కలగలుపుకున్నది. మానవత్వం పట్ల నిబద్దత ఉన్నది. కాబట్టే సహనంగా, ఏకాగ్రంగా, పట్టువిడవని కార్యనిర్వహణతో ప్రతీ సంఘటననీ నడుపుకొచ్చింది.

దాంతో, దశాబ్ధం గడిచేటప్పటికి, నకిలీ కణికవ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ, నెం.10 వర్గానికీ రామోజీరావుకీ, కన్నుపోగొట్టుకోక తప్పదని పించింది. దాంతో కనీసం కాలు నిలబెట్టుకుంటే…. అంటే ప్రస్తుతానికి ’చిన్నవాణ్ణి’ అన్నముసుగులో తెరమరుగైపోతే భవిష్యత్తులో మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడన్నా మళ్ళీ తన భావితరాలన్నా ప్రాణం పోసుకోవచ్చు, మళ్ళీ చక్రం తిప్పవచ్చు.

మరో దశాబ్ధం గడవనుండే సరికీ అదీ సాధ్యం కాదనీ, తమ పాకిస్తాన్ మూలాల దగ్గర నుండి హైదరాబాద్ కు అంతర్గత సంబంధాల దాకా – అన్నీ వెలికి వస్తాయనీ అర్ధమౌతూ వస్తోంది. ఈ లోగానే, మరోవైపు నుండి, అప్పటి వరకూ తము గుప్పిలి బిగించి ‘తాము చెప్పిందే నిజమని’ నమ్మిస్తూ వచ్చిన మీడియా బండారం, అంతర్జాతీయంగా బయటపడి, తమ ప్రాణనాడి అయిన విశ్వసనీయతని పోగొట్టుకుంటోంది. తర్కరాహిత్యాన్ని, అనవసర మోజుల్నీ, విపరీత పోకడలనీ, ప్రజలకి నూరిపోసిన సినిమా రంగం, డివీడి పైరసీల టెక్నాలజీతో కుప్పకూలటంతో – మనుగడ కోసం, డబ్బుకోసం, గత దశాబ్ధాలకు భిన్నంగా సినిమాలలో కొత్తదనం చూపించటం కోసం, తార్కిక కథల్నీ, వాస్తవాల్ని ప్రజలకి చూపించాల్సి వస్తోంది. దాంతో కుట్రల గురించి, మోసాల గురించి, వాస్తవాల గురించి ప్రజలకి కొంత అవగాహన కలిగించగల కథాంశాలతో సినిమాలు రావటం వ్యాపారరీత్యా అనివార్యమైంది. దాంతో, నకిలీ కణిక వ్యవస్థ పట్టు ప్రజలలో కొంత జారిపోయింది. పైరసీ వలన డబ్బుపరంగా కూడా నష్టపోయింది. ఇది ఎవరు పరిశీలించినా, పరిశీలించకపోయినా నిజం. నమ్మినా నమ్మకపోయినా సత్యం. ఇది భారీ పరిమాణంలో ఉంది గనుకా, విస్తారత ఎక్కువ గనుకా, ఆ మార్పు బాగా దృగ్గోచరం కావటానికి కొన్ని సంవత్సరాల పట్టింది, పడుతోంది. ఇంతకు ముందు చెప్పినట్లు మనిషి జీవితంలో సంవత్సర కాలం అంటే, దేశాల విషయంలో అది దశాబ్ధాలతో సమానం. కాబట్టి ఆయా మార్పులు బాగా స్పష్టపడటానికి ఆపాటి సమయం పట్టటం సహజమే. అదే విధంగా ఆర్ధికరంగం కూడా! ద్రవ్యోల్పణానికీ సరుకుల ధరలకీ సంబంధం ఉండదని పదేళ్ళక్రితం చెబితే ఎవరైనా ఒప్పుకునే దేనా? స్టాక్ మార్కెట్ మాయాజాలంల గురించి ఎవరైనా పుస్తకాలు వ్రాసినా, అవి ఆంబోతుల రంకెల్లో అణగారిన లేగదూడల అంబారావాలే కదా! కార్పోరేట్ కంపెనీల పట్టు ప్రభుత్వాల మీద ఇంతగా ఉంటుందని ఎవరో ’మేధావుల’కు తప్ప సామాన్యులకు తెలిసే విషయమేనా? అర్ధమయ్యే విషయమేనా? నమ్మగలిగే విషయమేనా?

నెం.10 Vs నెం.5 ల సవాళ్ళ, ప్రతిసవాళ్ళ వంటి సంఘటనల్లో – సినిమా రంగం, మీడియా, రాజకీయం, ఆర్ధిక రంగం, వ్యాపార రంగం, ఏదీ అతీతం కాదు. ప్రతీ సంఘటన [Event]లోనూ కన్నో, కాలో పోగొట్టుకుంటేనే, ఇంతగా… ఇన్ని విషయాలు… ఇప్పటికి… బహిర్గతమయ్యాయి.

ఎప్పుడూ నాబ్లాగులో ముందుగా ఓకథ చెప్పి, దాని అనువర్తనతో టపా ముగించటం చేస్తుండేదాన్ని. ఈసారి అనువర్తన ముందుగా చెప్పాను. కథతో ముగిస్తాను. ఈ కథ ’పిసినారి ధనయ్య’ అని మూడవతరగతి పిల్లల తెలుగుపాఠంలోనిది.

అనగా అనగా….
ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు. ఓసారి ఊరికామందు ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి. దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది. వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు. వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు. అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు. కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు. దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు. నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు.

పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు.

నకిలీ కణిక వ్యవస్థా, రామోజీరావూ కూడా ’తనది కాకపోతే కాశీ దాకా డేకమన్నా’ చందాన ఇతర అనుచర ఏజంట్ల విషయంలో అయితే నిస్సంకోచంగా కన్నో, కాలో వదిలేసుకున్నారు గానీ, తీరా తమదాకా వచ్చేసరికి కన్నూ, కాలూ దేన్నీ వదులుకోలేక, అచ్చంగా పిసినారి ధనయ్య లాగా అన్ని శిక్షలూ అనుభవిస్తున్నారు. ఇదీ వాళ్ళ ’సువర్ణముఖి’ లో భాగమే! ఎందుకంటే ఎవరి చేతుల్లో నుంచి తప్పించుకున్నా భగవంతుడి చేతి నుండి ఎవరూ తప్పించుకోలేరు కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

ఒకప్పుడు పెద్దవాళ్ళు ప్రభుత్వాల్ని నియంత్రించే వాళ్ళంటే అర్ధమయ్యేది కాదు.
మీడియా చేసే జిమ్మిక్కులు ఇప్పుడు అర్దమవుతున్నంత అప్పుడు అర్దమయ్యేవి కాదు కదా.....

అమ్మా మీరు "ఒక దళారి పశ్చాత్తాపం" పుస్తకం చదివారా?

మీరు చెప్పే చాలా విశయాలకు బలం చేకూర్చే పుస్తకం.

ఒక అమెరికను రాసిన "confessions of an economic hitman"

కి తెలుగు అనువాదం

Anonymous garu,
ఆ పుస్తకం నేను చదవలేదండి. మంచి సమాచారం ఇచ్చినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu