ఇక 1800 AD లో ఈస్టిండియా కంపెనీకి ఉత్తర దక్షిణ భారత దేశాల్లో కీలక ప్రాంతాల్లో పట్టు దొరకటంతో, చాలావేగంగా, రెండు మూడు దశాబ్ధాల కాలంలోనే, దేశమంతటినీ సుస్థిరంగా తన గుప్పిటిలోకి లాక్కోగలిగింది. 1828 AD లో సతీ సహగమానాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చింది. అప్పటికి భారతదేశంలో వర్ణవ్యవస్థ, మూఢాచారాలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఉన్నదాన్ని వెయ్యిరెట్లకు పెంచి ఈస్టిండియా కంపెనీ ప్రపంచమంతా ప్రచారించింది. దాని వెనుక ఉన్నది నకిలీ కణిక-4 బుర్రే !

నిజానికి ప్రపంచమంతా, అన్ని దేశాలలో, జాతులలో వర్గాలూ, తెగలూ ఉన్నాయి. ఆయా వర్గాల మధ్య, స్థానిక కారణాలరీత్యానో లేకో సంస్థాగత కారణాలరీత్యానో, వైషమ్యాలూ ఉన్నాయి. అందుచేత తెగల మధ్య, వర్గాల మధ్యా, పోరాటాలూ ఉన్నాయి. అలాగే మూఢనమ్మకాలూ, మూఢాచారాలూ కూడా ఉన్నాయి. ఇప్పటికీ పోప్ ’పసరు కక్కించడం’ చూస్తూనే ఉన్నాం. అంత్రాలూ, తంత్రాలూ కట్టటం మసీదుల్లో ఫకీర్లు చేయటం చూస్తూనే ఉన్నాం. దాదాపు అన్ని మతాల వారూ దేవుడితోపాటు సైతానుని నమ్ముతారు. దెయ్యాలని నమ్ముతారు. వాళ్ళ నమ్మకాల ప్రకారం దాదాపు దేవుడితో సమానంగా సైతాను శక్తివంతమైనది. దేవుడి స్వర్గానికి సమాంతరంగా సైతాను లోకం ఉంటుంది. ఇంకా భారతీయుల హిందూ మతంలోనే భూతగణాలు శివుని భృత్యుగణాలు. అదీను ఇక్కడ భూత గణాలంటే అవి మనుష్యులకి పడతాయని చెప్పబడే దయ్యాలు, భూతాల వంటివి కావు. జానపద కథల్లో చెప్పబడే భేతాళుడు భూతనాయకుడే గానీ అతడూ మనుష్యులకి పట్టే దెయ్యం మాదిరి కాదు. శివాలయపూజారి. శాపవశాత్తూ విక్రమార్క సేవకుడైన మంత్ర శక్తి సంపన్నుడు, అంతే! ఎప్పుడూ మంచితప్ప ఎవరికీ చెడు చేయనివాడు.

చివరికి అసురులుగా చెప్పబడే రాక్షసగణాలు కూడా కశ్యపప్రజాపతి పుత్రులే. సురాసురులు దితి, ఆదితులని పిలవబడే కశ్యప పత్నుల బిడ్డలు. ఎక్కడా, ఏ పురాణంలోనూ, ఏ ఇతిహాసంలోనూ, దేవుడితో సమబలమైన, దేవుడి లోకంతో సమాంతరమైన లోకాన్ని నడిపే సామర్ధ్యమున్న సైతాను, హిందూ మతంలో ఉండదు. నరకలోకాధిపతి అయిన యమధర్మరాజు ఒక దిక్పాలకుడు. ఆత్మఙ్ఞాని, సమవర్తి. బ్రహ్మ ఆఙ్ఞానువర్తి. దైవభక్తి గలవాడు. శివకేశవులును భజించేవాడు. తన కర్మను తాను నిష్కామంగా పాటించేవాడు. అంతే! భగవంతుణ్ణే ధిక్కరించి, తమకు గుడులు కట్టి ఆరాధించమని ప్రజలని శాసించారన్న హిరణ్యకశ్యపాది రాక్షసులు సైతం, గతజన్మలో శ్రీమహావిష్ణువు యొక్క పరమ భక్తులూ, వైకుంఠద్వారపాలకులూ అనీ, సనక సనందాది మునుల శాపవశాత్తు రాక్షసజన్మఎత్తారనీ, భాగవతం చెబుతుంది. ఈ కథల్లోని నమ్మకాల మాట అటుంచింతే, భారతీయుల జీవన సరళిలో అడుగడుగునా సంయమనాన్ని [Balance ని] పెంచే ప్రయత్నం, హిందూ మతవిశ్వాసాలు, వాంఙ్ఞ్మయం ఎంతగా చేస్తాయో తెలుస్తుంది. హిరణ్యకశ్యపాది రాక్షసుల పూర్యకథ అయిన జయవిజయలు గురించి – ప్రజలు, తమకు తారసిల్లిన దుష్టులని చూసి కూడా, వారిపట్ల, ‘ఏమో ఎవరు చూడొచ్చారు? హిరణ్య కశ్యపుడూ, రావణ కుంభకర్ణాదులే గతజన్మల్లో వైకుంఠ ద్వారపాలకులట. విష్ణు భక్తులుగా 7 జన్మలెత్తుతారా? విష్ణు ద్వేషులుగా మూడు జన్మలెత్తుతారా? అంటే అన్ని జన్మలు దేవుడికి దూరంగా ఉండలేక, మూడు జన్మల విష్ణు ద్వేషమే ఎంచుకున్నారట. అట్లయ్యీ రాక్షస జన్మల్లో శివుణ్ణి కొలిచిన భక్తాగ్రేసరులు. అలా ఏ పుట్టలో ఏపాముందో? ఇదిగో! మన కళ్ళెదుట ఉన్నా ఈ దుష్టుణ్ణి చూసి, మనం వీడెంత భయంకరుడు అనుకుంటున్నాం. ఒకవేళ వీడు శాపవశాత్తు ఈ జన్మఎత్తిన ఏ గొప్పవాడో అయి ఉండొచ్చు. మనమెందుకు ద్వేషించాలి? ఎవరి పాపం వాడిని కాలుస్తుంది. ఎవరి కర్మానా వాళ్ళే పోతారు అనుకుందాం’ అనుకుని, సామాన్యులు తమ ద్వేషాన్ని నియంత్రించుకోగలిగేవాళ్ళు. అన్నివిధాలా, భావోద్రేకాలని నియంత్రించుకునే, జయించే విధంగా, రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు భారతీయుల్ని ప్రేరేపించేవి. నిజం చెప్పాల్సి వస్తే భారతదేశంలోనికి ముస్లింలు ప్రవేశించాకే భారతీయుల ఆలోచనల్లోకి ‘దెయ్యం’ ప్రవేశించింది. అంత్రాలూ, తాయత్తులూ అంటూ, ఇప్పటికీ, కుంకుమో, విభూతో కలిపి, ‘ఓం’ అనో, మరో మంత్రాక్షరమో వ్రాసిన రాగిరేకులు ఇచ్చే గుడిపూజారుల కంటే, చుట్టచుట్టిన రాగిరేకుని, నిమ్మపండునీ, మంత్రించి ఇచ్చే మసీదుల్లోని ముస్లిం ఫకిర్లే [వీళ్ళకి ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి] ఎక్కువమంది ఉన్నారు. ఇక ఈ ‘దయ్యం’, ‘దయ్యం పట్టడం’ అన్న concepts యూరోపియన్ల ప్రవేశంతో మరింత పెచ్చరిల్లింది. భారతదేశం పట్ల మీడియా చేసే విషప్రచారాన్ని దాటి, నిశితంగా పరిశీలించి చూస్తే, మనకంటే ఐరోపా దేశాల్లోని ప్రజల్లోనే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండటం కన్పిస్తుంది. కానీ అదేదో కులమత భేదాలు, ఇండియాలో తప్ప ప్రపంచంలో అసలు మచ్చుకైనా కానరావన్నట్లు, మూఢాచారాలు అసలు ఇండియాలోనే పుట్టి, ఇండియాలోనే ప్రజ్వరిల్లినట్లు, ఇప్పటి మీడియా, అప్పటి యూరోపియన్ల ప్రచారం అతిగా, బాగా అధికంగా ఉండేది. ఈ కుతంత్రం వెనుక ఉన్నది కూడా నకిలీ కణికుడి వ్యవస్థే.

సరైన పుట్టుకలేని దాసీపుత్రుడు తొలితరం నకిలీ కణికుడై నందున, అతడి మనో వికారాలని, అతడి భావోద్రేకాలని, అనారోగ్య కర మనోవైకల్యాలని, అతి ప్రభావవంతంగా తరువాతి తరాలకి నూరి[inject] పోశాడు. దానికి తన ‘గుర్తింపు తృష్ణ’ని కలిపి, రాజ్య స్థాపనాకాంక్షగా తర్వాతి తరాల్లో ప్రవేశపెట్టాడు. ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను. కొందరు ఆర్కిటెక్ట్చర్స్ [ఇంజనీర్లు] బృందం ఉందనుకుందాం. ఒక భవన నిర్మాణం గురించి ఒకరు ఒక ప్రణాళిక, ఒక ప్రతిపాదన చేస్తారు. దాని మీద మరికొంత చర్చిస్తారు. మరికొందరు మరికొన్ని ప్రతిపాదనలు చేస్తారు. కొన్ని సవరణలు చేస్తారు. కొన్ని సరికొత్త మార్పులు చేస్తారు. పని ప్రారంభిస్తారు. ప్రణాళిక వాస్తవంలో కార్యరూపం దాల్చేటప్పటికి మరికొన్ని సాధక బాధకాలు అనుభవంలోకి వస్తాయి. దాంతో తమ ప్రణాళికకి మరికొన్ని మార్పు చేర్పులు చేస్తారు. పనిచేస్తుండగా మరికొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. దాంతో ప్రణాళికకు కొన్ని మెరుగులు దిద్దుతారు. ఈ పద్దతి కొనసాగుతూ ఉంటుంది. తీరా కొన్నినెలలు పనిచేసి, భవనం పూర్తియ్యేటప్పటికి, తొలిగా తము ప్రతిపాదించిన ప్రణాళికకి, ఇప్పటి సుందర భవనానికి, అసలు పోలిక ఉందా అన్పిస్తుంది. తమ తొలి ప్రణాళిక చాలా మొద్దు పద్దతిలో, రద్దుగా ఉందనిపిస్తుంది. చాలా crude అన్పిస్తుంది. కానీ ఈ సుందర భవనానికి అదే పునాది. ఆలోచన అక్కడి నుండీ ప్రారంభమై, మొలక పెనువృక్షమైనట్లు ఇప్పటి ఈ రూపాన్ని సంతరించుకుందన్న నిజాన్ని అందరం అంగీకరిస్తాం.

అటువంటిదే నకిలీ కణిక వంశీయుల గూఢచార వలయమైనా, గూఢచార భవనమైనా! నకిలీ కణిక-4 కాలం నాటికి అంటే 1800 AD నాటికి ఉత్తర దక్షిణ భారతదేశంలోని పలుప్రాంతాలపై పట్టు సంపాదించిన ఈస్టిండియా కంపెనీ, క్రమంగా 50 ఏళ్ళు తిరిగేటప్పటికి దాదాపు పూర్తిగా అఖండభారతదేశాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగింది. అప్పటికి నకిలీ కణిక-4 కి తన శక్తియుక్తుల మీద, నైపుణ్య సామర్ధ్యాల మీదా నమ్మకం కూడా పెరిగిపోయింది. కాబట్టి, తన తరతరాల లక్ష్యసాధనకి, సమయం ఆసన్న మయ్యిందన్న నిర్ణయానికి వచ్చేసాడు. అప్పటికే పాశ్చాత్యప్రపంచ చరిత్రని, ఫిలాసఫీని ఔపోసిన పట్టానన్న భావన అతడికి ఉంది. [మీరు గమనించి చూడండి. ఇండియన్ ఫిలాసఫీ పూర్తిగా ఔపోసన పడితే, ప్రపంచంలోని ఏ ఫిలాసఫీ అయినా అర్ధమవుతుంది. ప్రపంచంలోని అన్ని ఫిలాసఫీలు అర్ధమయినంత మాత్రనా ఇండియన్ ఫిలాసఫీ అర్ధం అవ్వదు. భారతీయ శాస్త్రీయ సంగీతం వచ్చిన వాడు అధునిక జాజ్, బాజ్, రాక్ సంగీతాలను అలవోకగా అభ్యసింపగలిగినట్లు, భారతీయ శాస్త్రీయ నాట్యం నేర్చిన వాడు అధునిక నృత్యాలు అలవోకగా చేయగలిగినట్లే. ఈ మాట నేను అహంకారంతో అనటం లేదు.] 1664 AD లో అమెరికా ఆక్రమణ దగ్గర నుండి, 1789 AD లో జార్జి వాషింగ్టన్ అమెరికా ప్రప్రధమ ప్రెసిడెంటు అయ్యేవరకూ, ఫ్రెంచ్ విప్లవం మొదలు నెపోలియన్ ఉత్థాన పతనాల వరకూ, కాంగ్రెస్ ఆఫ్ వియన్నాల దగ్గరనుండి బానిస వ్యాపారాలలోని ఒడిదుడుగుల వరకూ, అన్నిటినీ ఔపోసన పట్టానన్న భావన అది. 1825 AD లో బ్రిటన్ లో ప్రప్రధమ రైలు మార్గనిర్మాణం [స్టాక్ టక్ నుండి డార్లింగ్ టన్ వరకూ], పిదప 1853 AD లో ఇండియాలో బొంబాయి నుండి ఠాణా వరకూ నిర్మించిన మొట్టమొదటి రైలుమార్గం, ఒక్కసారిగా ప్రజాజీవితంలో, సమాజంలో ఎంత మార్పు తెస్తుందో అవగతం కాసాగింది. ఇక తనకి ఎదురు లేదన్న భావన ఉదయించింది. అప్పటికే చేతికి అంది వచ్చిన వారసుడు, నకిలీ కణిక-5, మరింత నూతనోత్సాహంతో కదనుతొక్కుతున్నాడు.

అప్పటికి ఈస్టిండియా కంపెనీ వారి ’ఎల్లి మీద మల్లి, మల్లి మీద పిల్లి’ వంటి సాకులతో ఇండియాలోని చిన్నచిన్న సంస్థానాల్ని కబళిస్తున్న తీరు పట్ల ప్రజల్లో, సంస్ధనాధీశుల్లో, తీవ్ర ఆగ్రహావేశాలు పేరుకు పోవటం గమనించాడు. ఇప్పుడు గనుక ఈస్టిండియా కంపెనీని బలహీనపరిస్తే, దాని స్థానంలోకి తనని తాను ప్రతిష్ఠించుకుంటే, యావత్ భారతదేశానికి, అఖండ భారతదేశానికి, ఏకైక సామ్రాట్టుతానే. అప్పటికి బ్రిటన్ కు చెందిన వ్యాపార కంపెనీలు అక్కడక్కడా సామ్రాజ్యాలు స్థాపించినా, బ్రిటన్ రాజవంశం యొక్క కనుసన్నల్లోనే ఉండేవి. బ్రిటన్ రాజవంశపు దృష్టి కూడా, తనదేశాన్ని దాటి పోయేది కాదు. చుట్టుప్రక్కల గల ఫ్రాన్స్ వంటి దేశాలతో ఉన్న గొడవలతోనూ, [నిజానికి అక్కడి రాజవంశాలు కూడా బ్రిటన్ రాజవంశానికి బంధువర్గం లోనివే] వాటితో చేసుకునే శాంతి ఒడంబడికల వంటి నానా వ్యవహారాలతో తలమునకలుగా ఉండేది.

నకిలీ కణిక-4కి పరిస్థితులన్నీ పరమ అనుకూలంగా ఉన్నట్లుతోచింది. తన గూఢచర్య మేధస్సు మధనం లోంచి ‘తూటాల కాటిరిడ్జిలకు పూసిన కొవ్వు గురించిన పుకార్లు’ అనే తంత్రం బయటకి తీసాడు. సైనికులకి ఇవ్వబడిన తూటాలును పంటితో నొక్కి లోడ్ చేయవలసి ఉండింది. వాటికి పూసిన జిగురువంటి పదార్ధం ఆవు మరియు పంది కొవ్వులతో తయారయ్యిందన్న వదంతులు సైనికుల్లో ప్రచారమయ్యాయి. మతవిశ్వాసాల ప్రకారం హిందువులకు ఆవు పవిత్రజంతువు. దేవతా సమం. కనుక ఆవు కొవ్వును వారు నోట తాకరు. ఇక ముస్లింలకు పంది అంటే ద్వేషభావం. అందుచేత వాళ్ళూ దాని కొవ్వుని నోట తాకరు. ఇంకేముంది? సైనికులు ఆ తూటాలను ఉపయోగించటానికి నిరాకరించారు. మత విశ్వాసాలతోనూ, ప్రచారాలతోనూ మిళితమైన స్ట్రాటజీతో అనుకున్న ఫలితం సాధించటం అప్పటికే నకిలీ కణిక-4 కి బాగానే ఒంటపట్టింది. మామూలుగా అయితే సైనికులు తూటాలని ఉపయోగించటానికి నిరాకరించినప్పుడు, సమస్యని, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారులు [వీరు ఉద్యోగులు మాత్రమే. కంపెనీకి అంతిమ యజమానులు సాధరణంగా ఇంగ్లాండులో ఉండేవాళ్ళు. కొన్ని పర్యటనల్లో భాగంగా అప్పుడప్పుడు తమ వలస రాజ్యాలకు వచ్చిపోతుండే వాళ్ళు.] సామరస్యంగా పరిష్కరించుకొని ఉండేవాళ్ళు. ఇక్కడే నకిలీ కణికుడి స్ట్రాటజీ, ‘విభజించు – పాలించు ’ అన్న తంత్రం బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారులకీ, సైనికులకీ మధ్య ప్రయోగింపబడింది. ఫలితంగా పరిస్థితులు మరింత ముదిరిపోయాయి. నిజానికి విభజించు పాలించుమన్న స్ట్రాటజీని భారత ఇతిహాసాల నుండి [మహా భారతం] నుండి గ్రహించినా, నకిలీ కణికుడు దాన్ని ఫ్రెంచి వారిపేరిట ప్రతిపాదించి, బ్రిటీషు వారి పేరిట ప్రచారించాడు. అయినా గానీ పాపం, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారులు, అదే policy తమ మీదే ప్రయోగింపబడినప్పుడు, గుర్తించుకోలేక పోయారు. దాంతో సమస్యని పరిష్కరించుకో లేకపోయారు. సిపాయిల తిరుగుబాటు పెద్దపెట్టున లేచింది. మరో వైపు, అప్పటికే బ్రిటిషు వారి దోపిడితో విసిగిపోయిన ప్రజల్లో సైతం, ఆగ్రహావేశాలు పేరుకుపోయి ఉన్నాయి. దాంతో ఝాన్సీ రాణి, తాంతియా తోపే, నానా సాహెబ్ వంటి వారి నాయకత్వన, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ ఎదురుదాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సంక్షోభాన్ని అది నిభాయించుకోలేక పోయింది. ఇంతవరకూ పరిస్థితులు నకిలీ కణిక-4 ఊహించినవే. ఈ స్థితిలో తను ఆ పరిస్థితుల్ని చేతిలోకి తీసుకోగలనన్నది అతడి ఊహ. అందుకు తగినంత అంగ అర్ధ బలాలని సమీకరించుకున్నానన్నది అతడి అంచనా.

అయితే ఆ అలోచన వాస్తవరూపం దాల్చలేదు. బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ విఫలమయ్యింది. అపజయం పాలయ్యింది. అంతటితో పెట్టే బేడా సర్దుకుని పోలేదు లేదా చతికల బడి కూర్చోనూ లేదు. తమ స్వంత దేశంలో తమకున్న అవసరాలరీత్యా, భారతదేశంలో అప్పటివరకూ తాము స్థాపించిన వలసరాజ్యాన్ని, బ్రిటిషు రాణికి పాదకట్నంగా సమర్పించింది. బ్రిటీషు రాజవంశానికి అప్పటికే తరతరాల చరిత్ర ఉంది. ప్రక్కనున్న ఫ్రాన్స్, స్కాట్లండు వంటి దేశాల రాజవంశీయులతో కూడిన బంధుబలగం ఉంది. వందల సంవత్సరాలుగా అందరు రాజవంశీయులు కలిసి, ఉమ్మడిగానో, ఒంటరిగానో, పరస్పర అవగాహనతోనో, లేక ఎవరి పద్దతిననుసరించి వారు గానో, ప్రజల్ని దోపిడి చేసి కూడబెట్టిన సొమ్ము దండిగానూ ఉంది. అసలే అక్కడ రాజవంశీయులు, ధనిక భూస్వామూలూ, మతాధికారులు [పోప్ లు] లతో కలిసి మరీ, ప్రజల్ని వ్యవస్థాగతంగా దోచుకుంటారయ్యె. ఆ కారణంగానే అక్కడ విప్లవాలు రేగటం, అందులో కులీనుల్ని, రాజవంశీయుల్ని, తలలు నరికి చంపటం, ఆపైన ఉద్యమాలను చల్లార్చటం కోసం, రాజులు రకరకాల [అమెండ్ మెంట్సు, కమిట్ మెంట్సు] సంధి ఒప్పందాలు చేసుకోవటం, మళ్ళీ అదను చూసి అన్నిటికీ కాలరాచి ప్రజల్ని రాచి రంపాన పెట్టటం మామూలే! ప్రజల దృష్టి మళ్ళించటానికి రకరకాల ఎత్తుగడలు పన్నటం కూడా వారికి కొంత తెలుసు.

ఈ నేపధ్యంలో ఈస్టిండియా కంపెనీ తనకి కానుకగా సమర్పించిన భారతదేశాన్ని, బ్రిటీషు రాజవంశం ఆనందంగా స్వీకరించింది. అపారమైన తన ఖజానానుండి కావలసినంత సొమ్ము [ఎటు అది పెట్టుబడేగా! తర్వాత అంతకంతా దోచుకోవచ్చన్నది రాజవంశానికి బాగా తెలుసు] ఇండియాకి తరలించి, అవసరమైన ఆయుధ సంపత్తిని, సైనిక బలగాన్ని సమీకరించింది. విప్లవాన్ని అణచిపారేసింది. నకిలీ కణిక-4 ఆశ, ఆకాంక్ష, ప్రణాళిక మెగ్గలోనే నాశనమైంది. ఇది అతడు ఊహించని పరిణామం. ఈస్టిండియా కంపెనీ అలాంటి నిర్ణయం తీసుకుంటుందని గానీ, బ్రిటీషు రాజవంశం అంతవేగంగా ప్రతిచర్య తీసుకుంటుందని గానీ అతడు అనుకోలేదు. పరిస్థితులు తాను చక్కబెట్టుకోగలనుకున్నాడు. తన కల నోటిదాకా వచ్చి జారిపోయిన మృష్టాన్నం లాగా తోచింది. ఆశాభంగం భయంకరమైన కసిని రగిల్చింది. ఆ కసి మొన్న 2009 ఎన్నికల్లో, మార్చి 3న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, మార్చి 19 న సి.ఐ.ఏ. ఛీఫ్ భారత్ సందర్శించి వెళ్ళాక, యూపిఏ భాగస్వామ్య పక్షాలైన లాలూప్రసాద్, రాంవిలాస్ పాశ్వాన్ లు, అమర్ సింగ్, మూలాయం సింగ్ ల పార్టీలు కాంగ్రెస్ కి సీట్లు ఇవ్వడానికి నిరాకరించినందుకు, కాంగ్రెస్ కీ, దాని అధినేత్రి సోనియాగాంధీకి రేగిన కసివంటిది కాదు. ఈనాడు వార్త[17/05/09] ప్రకారం, పైన చెప్పిన కారణంతో, సోనియాగాంధీకి కసిరేగిందట. దాంతో రెట్టింపుగా శ్రమించి, కాంగ్రెస్ కి గెలుపు సాధించి పెట్టిందట. ఇదేమన్నా బాక్సింగ్ క్రీడా లేక క్రికెట్ పోటీనా? కసి రేగి, రెట్టింపు కష్టపడి ప్రత్యర్దిని నాలుగు కిక్కులు పీకి లేదా బంతుల మీద చెలరేగి బ్యాటుతో షాట్లు పీకి గెలవటానికి? తనకి కసి రేగినంత మాత్రన, జనం నాడి 23 రోజుల్లో మారి పోయి, ’పాపం సోనియా గాంధీకి కసిరేగింది’ అనుకుని ఓట్లు వేస్తారా? అవీ తాము కొత్త పధకాలు గానీ, ప్రణాళికలు గానీ ప్రకటించకుండానే! కసిరేగి ‘ఇక చూస్కో నాప్రతాపం’ అని EVM లని Tamper చేయాల్సిందే తప్ప, బాక్సింగ్ క్రీడలో లాగా ప్రత్యర్ధుల్ని పంచ్ లు కొట్టలేరు గదా! మధ్యలో ప్రజలనబడే ఓట్ల బొమ్మలుంటాయి కదా మరి? కాబట్టి నకిలీ కణిక-4 కి కలిగిన కసి, 2009 ఎన్నికల్లో సోనియా గాంధీకి కలిగిన కసి వంటిది కాదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu