నిన్నటి టపాలు:


ఆరోజంతా ఆంధ్రజ్యోతి ఎడిటర్ ని కలవటానికి ప్రయత్నించాము. ఉదయం ఇదిగో వస్తారు, అదిగో వస్తారు అంటూ ఫోన్ లో సాయంత్రం దాకా గడిపి, తరువాత నింపాదిగా ఆయన తిరుపతి వెళ్ళారని, ఎప్పుడు వస్తారో తమకి తెలియదు అని చెప్పారు. ఆ మర్నాడు CBCID Office కి వెళ్ళాము. ఆ సంవత్సరం ఉగాదిపండుగ గురించి గందరగోళం నెలకొంది. మార్చి 19, 20 తారీఖుల్లో నిర్వహించారు. ప్రభుత్వసెలవు కూడా ఐచ్చికంగా తీసుకున్నారు. మాకు ఇంతకు ముందు ఫిబ్రవరి 6 వతేదిన CBCID, IG కృష్ణరాజ్ నంటూ ఫోన్ వచ్చినందున, అతణ్ణి కలిసేందుకు ప్రయత్నించాము. అతడే ఉండవల్లి అరుణ్ కుమార్ కారణంగా రచ్చకెక్కిన మార్గదర్శి కేసుని డీల్ చేస్తున్నాడు. ఆ ఫైల్స్ ని తరిలించటం, ఆపైన కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా, అతడి విజువల్స్ అప్పటికి టి.వీ.న్యూస్ లో చూసి ఉన్నాము. మేము అతడి పి.ఏ.కి విజిటర్ స్లిప్ ఇచ్చాము. అయితే ఆ అధికారి, మమ్మల్ని తన తర్వాతి అధికారిని కలవాల్సిందిగా చెప్పాడట. అతడి పి.ఏ. ఆ విషయం మాకు చెప్పి, మమ్మల్ని వేచి ఉండమని, ఫోన్ లో సదరు అధికారితో మాట్లాడాడు. ఆ అధికారి మమ్మల్ని తను రిసీవ్ చేసుకోవడానికి నిరాకరించాడు. దాంతో పి.ఏ. మమ్మల్ని అక్కడే కూర్చోమని, తాను మళ్ళీ లోపలికి వెళ్ళి ఐ.జి.కృష్ణరాజ్ కి విషయం ఇన్ ఫార్మ్ చేశాడు. మేమిదంతా మౌనంగా గమనిస్తూ విజటర్స్ లాంజ్ లో కూర్చున్నాము. కొంతసేపటి తర్వాత ఐ.జి. కృష్ణరాజ్ మమ్మల్ని లోపలికి పిలిచాడు. అతడికి నమస్కరించి కూర్చొని, మావ్యక్తిగత వివరాలు క్లుప్తంగా చెప్పి, కేసు గురించిన ఉపోద్ఘాతం చెప్పాను. పదిరోజుల క్రితం శ్రీశైలం సి.ఐ. మాదగ్గర స్టేట్ మెంట్లు తీసుకున్న వైనం వివరించి, ఆపైన దేవస్థానం మాకు జారీ చేసిన రూం కాన్సిలేషన్ ఆర్డర్ చూపించాను. అతడు ఒక్కసారిగా “ఆరోజు ఫోన్ లో మాట్లాడింది నేనే. మీ attititude wrong. ఈ attititude తో ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం కావు. రామోజీరావుకి – రాజీవ్ గాంధీ హత్యతో గానీ, మీపైన organized harrasment తో గానీ అసలే సంబంధమూ లేదు. మాకు ప్రతీరోజూ ఇలాంటి ఆకాశరామన్న ఫిర్యాదులు ఎన్నో వస్తుంటాయి. అది నిర్ధారించుకునేందుకు ఆరోజు మీకు ఫోన్ చేసాను. మీరు సరియైన వివరాలు ఇవ్వలేదు. అందుకే చెబుతున్నాను మీ attitude తప్పని. మీరు అవీ ఇవీ కలెక్ట్ చేసి కేసు ఫ్రేం చేస్తున్నారు. అందులో మీభ్రమ తప్ప సత్యమన్నదే లేదు “ అన్నాడు.

ఎంత అడ్డగోలు వాదన ఇది? వాళ్ళకి ప్రతీరోజూ ఎన్నో ఆకాశరామన్న ఉత్తరాలు, ఫిర్యాదులు వస్తే నిర్ధారించుకునే పద్దతి ఫోన్ లో అడగటమా? వాళ్ళ స్థానిక పోలీసు స్టేషన్ కి ఒక్క మెయిల్ ఇచ్చినా, ఒక్క ఫోన్ చేసినా, క్షణాల్లో వివరాలు వస్తాయి? అసలు ఫిర్యాదులో ఏ ఫోన్ నంబర్ ఉందో, ఆనంబరుకే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కంప్లైంటీ చెప్పేది ఎలా నిర్దారణ అవుతుంది? అసలైనా ఇలాంటి ప్రమాదకర విషయాలు ఎవరైనా, పైస్థాయి వాళ్ళపేర్లు రిఫర్ చేస్తూ ఊసుబోని ఫిర్యాదులు వ్రాస్తారా? ఏళ్ళ తరబడి పోరాడతారా? అసలైనా ఫిర్యాదు వ్రాసింది ఆకాశరామన్నో, అడ్రసున్న సీతమ్మో, వాళ్ళ స్థానిక పోలీసు స్టేషన్ ని అడిగితే క్షణాల్లో చెబుతారు గదా! ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి “నేను I.G. of CBCID , కృష్ణరాజ్ ని, చెప్పు నీకేసు వివరాలేంటి?" అంటే నేనెందుకు నమ్మాలి? ఫోన్ లో ఉంది ఐ.జి. యేనని నాకేమిటి గ్యారంటీ? అయినా ఫోన్ లో చెప్పగలిగేటంత చిన్న కేసా ఇది? టూకీగా వ్రాస్తేనే 18 పేజీల పైన పట్టింది. [2006 వరకూ జరిగిన విషయాల వరకూ వ్రాస్తేనే] అలాంటిది ఫోన్ లో ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి?

ఈ అడ్డగోలు వాదనతో, నా attitude ని నిందిస్తూన్న వ్యక్తికి, ఇక ఏంచెప్పి ఏం ప్రయోజనం? అందుకే కృతఙ్ఞతలు చెప్పి లేచి రాబోతున్నాను. అతడు నన్ను ఆగమంటూ చెయ్యి ఊపి, "You won’t hear others and you won’t appreciate others work .మీరు మీ జీవితాన్నే గాక, మీ భర్త, మీ కూతురి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు” అన్నాడు. ఇదంతా నాకు విచిత్రంగా అన్పించింది. బాధితులమైన మేము ఎవరినైనా appreciate చేసేది ఏమిటి? అందునా అతడు నా attitude తప్పనీ, నేను [hellusination] భ్రమల్లో ఉన్నాననీ అంటున్నాడు. అదే అయోమయంలో అతడి వైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ నిలబడి పోయాను. అతడు కొనసాగిస్తూ “ఆ రామోజీరావేం చేస్తాడు? వాడి ఖర్మ వాడు అనుభవిస్తున్నాడు. అసలు మీరు వ్రాసిన కంప్లైంటు నాకే అర్ధం కాలేదు. ఇక మా సి.ఐ.కి ఏం అర్ధమౌతుంది?" అన్నాడు. ఓ క్షణం ఆపి మళ్ళీ “మాకు పైనుండి వచ్చిన ఆ ఫైల్ మొత్తాన్ని కర్నూలు ఎస్.పి.కి పంపించేసాను. నేనసలు మిమ్మల్ని కలవకూడదు, అయినా సరే కలిసాను. నాకు ఎస్.పి. మాత్రమే జవాబుదారి. ఏవిషయమైన ఎస్.పి. నుండి తెలుసుకుంటా. మీసమస్యలు అన్ని ఎస్.పి.కి చెప్పుకొండి మీరు వెళ్ళి అతణ్ణి కలవండి” అని సలహా ఇచ్చాడు. ఇంత చేదు అనుభవాన్ని, అయోమయాన్ని వెంటబెట్టుకుని ఆ ఆఫీసులోంచి బయటికొచ్చాము. అయినా ఇతడు నా attititude wrong అని ఎందుకు అంటున్నట్లు? Disputes మీద కంప్లైంట్లు పెట్టటం గాకుండా, ఏంచేస్తే నాది right attitude అవుతుంది ఇతడి దృష్టిలో?

మర్నాడు ‘వార్త’ ఆఫీసుకి వెళ్ళాము. టాంకు బండుకు దిగువున ఉంది వీరి ఆఫీసు. అక్కడ ఉన్న సబ్ ఎడిటర్ ని కలిసాము. అతడు నింపాదిగా ఓ గంటపాటు మేం చెప్పిందంతా విన్నాడు. ఇక తర్వాత మొదలుపెట్టాడు. దాదాపు CBCID, IG కృష్ణరాజ్ చెప్పిందే. “మీరిదే దారిలో వెళ్తూ మీ జీవితమే గాక, మీ పాప జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. కావాలంటే శ్రీశైలంలో చుట్టుప్రక్కల గిరిజన తండాలకు మీరు వెళ్ళి సేవ చేయండి. మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను, మీరు వ్రాసి పంపండి. మేం పేపర్లో వేస్తాం. నేను 18 ఏళ్ళు ఈనాడులో పనిచేసాను. ఎల్.టి.టి.ఇ. సానుభూతిపరుణ్ణంటూ లంకలో పనిచేస్తుండగా జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు ‘వార్త’లో పని చేస్తున్నాను. మేం పేపరులో వేస్తే ఓ రెండురోజులు మీకేసు పాపులర్ అవుతుంది. అంతే! తర్వాత అందరూ మర్చిపోతారు. తర్వాత మీజీవితం మరింత అధ్వాన్నం అవుతుంది” అని సలహా ఇచ్చాడు. “అయినా అందుకు నేను సిద్దమే. పేపరులో ప్రచురించండి” అన్నాను.

“ఆ నిర్ణయం తన చేతుల్లో లేదని, యాజమాన్యం చేతుల్లో ఉందనీ, యాజమాన్యం కూడా వారి పరిమితికి లోబడే వార్తలు ప్రచురిస్తారనీ, ఎండోమెంట్ కమీషనర్ తనకు తెలుసునని, కావాలంటే ఆయనకి రికమెండ్ చేసి శ్రీశైలంలో మీ రూం కాన్సిల్ ని, రికాల్ చేసేటట్లు చేస్తానని” చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అప్పుడే ’పోటీ పత్రికలకి కూడా వారి వ్యాపారపరిమితులు వారి కుంటాయన్నమాట’ అనుకొని చేసేది లేక వెనుదిరిగాను. ఈ.వో. దగ్గరికి మాత్రం నన్ను వెళ్ళవద్దని, నా భర్తని మాత్రం వెళ్ళి అడగమని సలహా ఇచ్చాడు.

ఇక హైదరాబాదులో చేయగల ప్రయత్నం మాకేమీ కన్పించలేదు. ఉగాది సెలవులూ పూర్తవుతాయి. వెనుదిరిగి శ్రీశైలం వచ్చాము. మా విద్యార్ధులు తల్లిదండ్రులతో సమస్య పరిష్కరించుకునే ప్రయత్నాలు ప్రారంభించాము. మేం సమాచారం సేకరిస్తున్నప్పుడు మా విద్యార్ధుల తండ్రి, కానిస్టేబుల్ సుధాకర్, తానే క్రింది అంతస్థువారిని సి.ఐ. పిలుచుకురమ్మంటే పిలుచుకుపోయానని చెప్పాడు. మేం ఢిల్లీలో ప్రధానమంత్రికీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి పెట్టిన కంప్లైంట్లలలో ఎవరెవరి పేరుని ఉటంకించామో, వాళ్ళందరి దగ్గరా స్టేట్ మెంట్లు తీసుకున్నాడట. ఈ ప్రక్రియ అంతా దాదాపు రెండునెలలుగా జరిగిందట, అంటే జనవరి నుండీ అన్నమాట. అప్పుడెప్పుడూ అతడిది మాటమాత్రంగా కూడా మాకు చెప్పలేదు.

మాకు నోటీసు జారీ చేసింది మార్చి 13 న. 15 రోజుల గడువు ఇచ్చారు. విద్యార్ధుల తల్లిదండ్రులూ, మిత్రులూ సానుభూతి చెబుతున్నారు, అదిగో ఇదిగో అంటున్నారు గానీ ఏదీ ముడిపడటం లేదు. దాంతో మార్చి 29 న నేను, నాభర్త దేవస్థానపు ఆఫీసుకి వెళ్ళి ఈ.వో.ని కలిసాము. అతడెంతో అమర్యాదగా మమ్మల్ని డీల్ చేశాడు. అయినా మేం సహనంగా చేతివ్రాతలో ఉన్న రిక్విజేషన్ అతడికి ఇచ్చి, పరిస్థితి చెప్పి, మేం అప్పటికి నాలుగేళ్ళుగా అక్కడ ప్రీ స్కూల్ కమ్ ప్రైవేట్ ట్యూషన్ హోం నడుపుతున్నామనీ, వివరించాను. గొడవలు, తగవులు పెట్టుకునేంత తీరిక కూడా మాకు ఉండదనీ, ఉదయం 6గంటల నుండి రాత్రి 7.30 దాకా విద్యార్ధులతోనే సరిపోతుందనీ, కావాలంటే వారి దేవస్థానపు ఉద్యోగుల్లో చాలామంది పిల్లలు మాదగ్గర చదువుతున్నందున వారిని కనుక్కోమనీ చెప్పాము. అతడవేవి పట్టించుకోనట్లు “మా స్టాఫ్ మీమీద ఏదో చెప్పారని మీ రూమ్ కాన్సిల్ చెయ్యలేదు. శ్రీశైలంలో కాటేజ్ లన్నీ అడ్డదిడ్డంగా ఎలాట్ అయి ఉన్నాయి. కొందరు నాల్గవ తరగతి ఉద్యోగులు పెద్దపెద్ద కాటేజీలలో ఉంటున్నారు. కొందరు పైస్థాయి అధికారులు చిన్న కాటేజీలలో అవస్థలు పడుతున్నారు. అందుకని అన్ని రూములు, కాటేజీలు రెగ్యులరేట్ చెయ్యాలనుకుంటున్నాము. మీకే కాదు, అందరికీ నోటీసులు ఇస్తాం. అందర్నీ ఖాళీ చెయిస్తాం. ఇక మీరు వెళ్ళవచ్చు?” అన్నాడు. మేం మా స్కూల్ విద్యార్ధులకు వచ్చే నెలలో ఫైనల్ పరీక్షలున్నాయనీ మరింత రిక్వెస్టు చెయ్యబోతే చాలా rude గా ‘ఇకవెళ్ళండి’ అన్నాడు.

తర్వాత మా విద్యార్ధుల తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ చేసి “మేడం! మీరు వెళ్ళిపోయాక వేరేపనిమీద నేనూ, మా ఆఫీసర్ చక్రవర్తి గారూ, ఈ.వో. కాబిన్ లోకి వెళ్ళాము. అప్పటికే ఈ.వో.గారు కృష్ణయ్యకి ఫోన్ చేసి “వాళ్ళది స్కూలని అంటున్నారు” అని అడిగాడు. కృష్ణయ్య “స్కూలా,పాడా? ఏదో సాయంత్రం ఒకగంట ట్యూషన్ చెప్పుకుంటారు” అన్నాడు. చక్రవర్తి గారు “లేదుసార్! వాళ్ళది స్కూలే. మన స్టాఫ్ లో చాలామంది పిల్లలు అక్కడే చదువుతున్నారు. నాలుగేళ్ళగా నడుపుతున్నారు. బాగా చెబుతారు సార్! మంచివాళ్ళు” అని చెప్పాడు. నేను కూడా ఈ.వో.గారికి చెప్పాను. అయినా ఈ.వో.గారు “మరి కృష్ణయ్య కాదంటున్నాడు!” అనేసి ఊరుకున్నారు, మేడం! మీ రిక్విజేషన్ మీద రిగ్రేటెడ్ అని వ్రాశాడు” అని చెప్పాడు.

మర్నాడు మార్చి 30 వ తేదిన, మేము పిల్లలకి స్కూల్లో క్లాసులు తీసుకోకుండా తిప్పి పంపించాము. అప్పటికి గానీ తల్లిదండ్రులకి చురుకు రాలేదు. ఒక్కొక్కరూ ఫోన్ చెయ్యటం, స్కూలు దగ్గరకు రావటం ప్రారంభించారు. అందరికీ పరిస్థితి వివరించి చెప్పి, సమస్య ఎదురుగా ఉంచాము. దాదాపు 20 మంది పైగా తల్లిదండ్రులు గుమిగుడారు. తల్లిదండ్రుల్లో దేవస్థాన ఉద్యోగులు, వ్యాపారులూ, ఇతరులూ ఉన్నారు. ఈ.వో. ఇంకో డ్రైవరు గణపతి అని ఒకవ్యక్తి ఉన్నాడు. అతడి పాప, బాబు అప్పటికి నాలుగేళ్ళుగా మాదగ్గరే చదువుతున్నారు. అతడూ, పోలీసు కానిస్టేబుల్సూ కలిసి క్రింది అంతస్థులోని రమణయ్యని తీసుకొచ్చారు. మాగదిలో కూర్చోబెట్టి పంచాయితీ మొదలు పెట్టారు.

ఈ.వో. డ్రైవరు గణపతీ, కానిస్టేబుల్ సుధాకర్, ఈనాడు శివ ఇంకొంతమంది తల్లిదండ్రులు గదిలో కూర్చున్నారు. మరికొందరు బయట వరండాలో ఉన్నారు. గణపతి “అదికాదు రమణయ్యా! ఈమేడం ఏకేసూ ఇక్కడ పోలీసు స్టేషన్ లో పెట్టలేదట. అదెప్పుడో 1992 లో రామోజీరావు మీద ఢిల్లీలో పెట్టిన కేసు. మళ్ళీ 2005 లో ప్రధానమంత్రికి ఢిల్లీలోనే పెట్టారట. అంతే తప్ప ఆ కేసుకూ మీకు ఏసంబంధమూ లేదు. మరి ఇదంతా ఏమిటి, ఎందుకు? నువ్వేదో కృష్ణయ్య సార్ కు చెప్పటం, ఆసారు వీళ్ళ రూం కాన్సిల్ చెయ్యటం, ఏందిది? ఇక్కడ ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడిలా అర్ధాంతరంగా స్కూలు మూసేస్తే మాపిల్లలంతా ఏంకావాలా?" అన్నాడు. దానికి రమణయ్య “లేదన్నా! ఈ మేడమ్ పోలీసు స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టింది. రెండుసార్లు వెళ్ళొచ్చింది. ఇదిగో ఈ సుధాకర్ సారే మా ఆడోళ్ళనీ, మమ్మల్నీ సి.ఐ. పిలుచురమ్మన్నాడంటూ పిలుచుకుపోయాడు. ఆ సి.ఐ. మాచేత ఏంటో స్టేట్ మెంట్లంటు రాయించుకున్నాడు. మా ఆడోళ్ళు పోలీసు స్టేషన్ గడప తొక్కబట్టింది ఈ మేడం మూలంగానే గదా! అందుకే, నేనే అందరి చేతా పిటిషన్ రాయించి సంతకాలు పెట్టించి సార్ కి ఇచ్చిన” అన్నాడు.

రమణయ్య చెల్లెలు పోలీసుకానిస్టేబుల్ తో ఆక్రమ సంబంధం కలిగిన నేపధ్యంలో తగుమాత్రం రచ్చ గతంలో జరిగింది. అలాంటి వారి ఆడవాళ్ళు గౌరవనీయులు, పోలీసు స్టేషన్ గడప తొక్కటంతో వారి గౌరవానికి గ్లాని ఏర్పడింది. బూతులు తిట్టే వాళ్ళు ఆత్మగౌరవం అంత గొప్పది. వారి ఆత్మగౌరవం ముందు, దేవస్థానపు ఈ.వో.కీ, డి.ఈ.వో.కీ చదువుకున్న దాన్ని, పంతులమ్మని, గౌరవనీయులైన కుటుంబం నుండీ, ఆర్ధికస్థాయి నుండీ వచ్చిన దాన్ని అయిన నా ఆత్మగౌరవం దిగదుడుపుగా కన్పించింది. ఎందుకంటే మరి నేను అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసాను కదా? ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రామోజీరావు మీద ఫిర్యాదు చేసి ఘోరనేరం చేసాను కదా!

ఈ ఆలోచన్లలో నాకు లోలోపల రగిలిపోతుంది. అయినా సహనంతో మనస్సు కంట్రోలు చేసుకున్నాను. గీతలోని ఆత్మసంయమన యోగం గుర్తు తెచ్చుకున్నాను. అప్పటికి గణపతి, ఇతరులు రమణయ్యని కన్విన్స్ చేసి తమ representation వెనక్కి తీసుకోమని చెబుతున్నారు. నేను, మావారు దాదాపు గమ్మున చూస్తున్నాం. ఇంతలో సుధాకర్ “అదికాదు సార్! మాకు ఎస్.పి. దగ్గర నుండి ఈ మేడం, పైన ఢిల్లీలో పెట్టిన కంప్లైంటు వచ్చాయి. మా సి.ఐ.సార్ వీళ్ళందరినీ ఒక్కొక్కరినీ ఒక్కోరోజు పిలుచుకు రమ్మన్నాడు. నేనే పిలుచుకుపోయాను. కృష్ణయ్య సార్ కి మొన్న ఆక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది కదా! అందుకని మా సి.ఐ. సార్ వెళ్ళి కృష్ణయ్య సార్ దగ్గర కూడా స్టేట్ మెంటు తీసుకున్నాడు. అంతా అయ్యాక ఈ సారూ, మేడం, వాళ్ళ పాప దగ్గర కూడా స్టేట్ మెంట్లు తీసుకున్నారు. కదా సార్?" అంటూ మమ్మల్ని అడిగాడు. నేను, మావారు కూడా “అవునండీ! మొన్న మార్చి 8,9 తేదీల్లో మా స్టేట్ మెంట్లు కూడా తీసుకున్నారు. అది పూర్తిగా రామోజీరావుకి సంబంధించిన కేసు. ఆ ఫిర్యాదులో మా జీవితంలో జరిగిన మంచీ, చెడూ, రెండూ వ్రాసాను. మేలు చేసిన వాళ్ళు గురించి వ్రాసాము, వేధించిన వాళ్ళ గురించీ వ్రాసాము. అది రాజీవ్ గాంధీ హత్యకి, ఎంసెట్ కీ, మాపైన వేధింపుకి సంబంధించిన కేసు. పెట్టింది కూడా ఇప్పుడు కాదు. ఇన్నేళ్ళ తర్వాత ఇక్కడి కొచ్చింది” అన్నాము.

దానితో సుధాకర్ “మేడం మీరు కంగారు పడకండి, మా సి.ఐ.సార్ ఈ మేడంకి మెంటల్ అనీ, అందరితో ఇలాగే ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటుందనీ వ్రాసి పంపాడు. మేడం! మీరు కంగారు పడకండి” అన్నాడు. కంగారు పడటానికి మాత్రం ఏముంది అక్కడ? అడ్డగోలు వ్యవహారాలు అంతకంతకూ పెరిగిపోవడాన్ని చూస్తూ ఉన్నాము. ఇంతలో గణపతి “విన్నావు గదా రమణయ్య!” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. అంతలో రమణయ్య బెట్టుచేస్తూ లేచిపోబోవడం, తల్లిదండ్రుల్లో కొందరు అతణ్ణి కన్విన్స్ చేసి కూర్చోబెట్టే ప్రయత్నం చెయ్యటం చేస్తున్నారు. ఇంతలో నేను “గణపతి గారు! నిన్న నేనూ, సారు ఈ.వో.గారిని కలిసామండి. నేను ఈ రమణయ్య వాళ్ళు పెట్టిన representation గురించి రిఫర్ చేసి, మారూమ్ కాన్సిల్ recall చెయ్యమని అడిగాము. ఆయన, ఎవరూ మాకు వ్యతిరేకంగా ఏ representation పెట్టలేదని, శ్రీశైలంలో రూములూ, కాటేజీల ఎలాట్ మెంట్లన్నీ తాను రెగ్యులరేట్ చెయ్యదలుచుకున్నానని, మాకేగాక త్వరలో అందరికీ నోటీసులు ఇస్తాననీ చెప్పారు” అన్నాను.

దాని మీద తలా ఓమాట అన్నారు. ఈలోపులో రమణయ్య లేచి వెళ్ళిపోయాడు. ఇకపిల్లల తల్లిదండ్రులంతా కలిసి ‘కృష్ణయ్యని కలుద్దాం’ అన్నారు. అతడి కాటేజీ మా సత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. దాదాపు 20 మంది పిల్లల తల్లిదండ్రులూ, మేమిద్దరమూ వెళ్ళాము. ఈనాడుశివ కూడా వచ్చాడు. అతడు కృష్ణయ్య ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోన్నాడు. మిగిలిన వారు నిలబడ్డారు. అందరూ కలిసి కృష్ణయ్యని బ్రతిమాలుతూ “సార్! ఏదో మా పిల్లలంతా అక్కడ చదువుకుంటున్నారు. ఆసారూ, మేడం కూడా ఎవరి జోలికీ వెళ్ళేవారు కాదు. పొద్దున లేచింది మొదలు వాళ్ళకి పిల్లలతోనే సాలైపోయిద్ది. మీరేదో ఆ రమణయ్య మాటలు విని కోపం చేసుకోకండి” అంటూ చేతులు జోడించి మరీ అడిగారు. అతడు ఖయ్యి మంటూ “అసలలాంటి ఆడామెని నేనేక్కడా చూడలేదు. ఆడామె అయి ఉండి మగాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టింది. రామోజీరావు మీద కంప్లైంటు పెట్టింది. చంద్రబాబునాయుడి మీద కంప్లైంటు పెట్టింది. నామీద కంప్లైంటు పెట్టింది. మా దేవస్థానం రూములో ఉంటూ మామీదే కంప్లైంట్లు పెడితే మాకెందుకీ గోల! అందుకే కాన్సిల్ చేసాను” అన్నాడు. నేను, మావారు వెనక నిలబడి ఉన్నాము. పిల్లల తల్లిదండ్రులు అతణ్ణి మరింత బ్రతిమాలుతూ నన్ను “మేడం! లోపలికి రండి!” అన్నారు. నేను ఓ అడుగు వేసి అతడి కాటేజీ వరండా గ్రిల్ వాకిటిదగ్గరికి వెళ్ళాను. అతడు “వద్దు వద్దు! అమ్మా నీకో దండం! నీలాంటి ఆమె నాగడపలో కాలే పెట్టద్దు” అన్నాడు. నేను ఆగిపోయాను. అంతలో ఓ పేరంటు “సార్! మమ్మల్నీ, మాపిల్లల్నీ మీరే దయచూడాలి” అంటూ ఏదో చెప్పబోయారు. అతడు ఒక్కసారిగా “నా దయ ఏమిటి! ఇంత మంది వచ్చారు గదా వాళ్ళకోసం? మీరే ఏమయినా చేసుకొండి” అన్నాడు. అంతలో వెంటవచ్చిన ఓ కానిస్టేబుల్ భార్య “ఏంసార్! ఇంతమందిమి బ్రతిమాలాడుతున్నాం. మాపిల్లల ముఖాలు చూసైనా ఆ రూం విడిచిపెట్టమని అడుగుతున్నా కాదంటున్నారే? అస్సలు న్యాయం ఉందా మీదగ్గర?" అంది. అంతే! అతడు “లేదమ్మా! నాదగ్గర న్యాయం లేదు. మీదగ్గర, మీ టీచరమ్మ దగ్గరే న్యాయం ఉంది. నేనేం చెయ్యలేను. మీరు ఈ.వో.ని అడగండి. ఆయన recall చేస్తే చేయించుకొండి. నేను అడ్డం రాను” అన్నాడు.

పిల్లల తల్లిదండ్రులూ “సార్! మేమంతా ఈ.వో.గారిని అడుగుతాం. మీరు కాదనకపోతే చాలు” అంటూ మరోసారి హామీ తీసుకుని బయటకు వచ్చారు. చాలామంది కి అసలు రామోజీరావుకీ మాకూ ఉన్న సంబంధం ఏమిటో, అతడి మీద మేం కంప్లైంటు ఇవ్వటం ఏమిటో అర్ధంకాలేదు. దాంతో వాళ్ళు ఆ వివరాలు అడిగారు. మాబదులుగా మరికొందరు తల్లిదండ్రులు,[అప్పటికే ఆవిషయం పోలీసుల ద్వారా, మాగదిలో జరిగిన పంచాయితీ లోనూ తెలిసినవారు] మిగిలిన వారికి చెప్పారు. దాంతో ఒక్కసారిగా శ్రీశైలంలో మా గురించిన విషయాలు, రామోజీరావుతో ముడిపడ్డ విషయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతకు ముందు మేం 1993 నుండి 1995 వరకూ గుడిసెలో ఉన్న కారణంతో సహా, అందరికీ అది చర్చనీయాంశమూ, సంచలనవిశేషమూ అయ్యింది. అప్పటికే ఎండమండుతుంది. తల్లిదండ్రుల్లో కొందరు ఈ.వో. గురించి భోగట్టా చేశారు. అతడు త్రిపురాంతకం క్యాంపు వెళ్ళాడనీ, మర్నాటికి గానీ రాడనీ తెలిసింది. అప్పటికి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు.

మర్నాడు మార్చి 31న అందరూ ఉదయమే ఈ.వో. నివాస కాటేజీ దగ్గరికి చేరారు. ఉదయం 8 గంటల కల్లా దాదాపు 25, 30 మంది వచ్చారు. అయితే అప్పటికే అతడు బయటకు వెళ్ళాడనీ, ఆఫీసుకి రమ్మనీ చెప్పబడింది. మళ్ళీ 11 గంటలకి ప్రయాస తీసుకుని తల్లిదండ్రులంతా దేవస్థాన ఆఫీసుకి చేరారు. దాదాపు ముప్పావుగంట వేచి ఉన్నాక పిలుపువచ్చింది. తల్లిదండ్రులూ, మేము దాదాపు 25, 30 మందిమి అతడి కాబిన్ లోకి వెళ్ళాము అతడు నాటకీయంగా ఆశ్చర్యం అభినయిస్తూ “ఎవరు మీరంతా?" అన్నాడు. [ముందుగా ఎవరో తెలిసే కాబిన్ లోకి పిలిపిస్తాడు గదా!] సత్యదేవ్ అని బ్యాంకు ఉద్యోగి “మేమంతా గీత పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ పేరెంట్సుమి సార్!” అన్నాడు. “అదే! మా స్టాఫ్ మీటింగ్ ఏదీ లేదుకదా ఇంతమంది వచ్చారేమిటి అనుకున్నాను. అయినా చూస్తే మీరు మా స్టాఫ్ కూడా కాదు. ఏదో స్కూల్ వాళ్ళు మాట్లాడటానికి వచ్చారంటే ఒకరిద్దరు అనుకున్నాం. ఇంతమంది వచ్చారేమిటి? చెప్పండి” అన్నాడు. ముందు సత్యదేవ్ [బ్యాంకు ఉద్యోగి] వివరంగా చెప్పాడు. తర్వాత వ్యాపారులు,పోలీసుకానిస్టేబుల్స్, పోస్ట్ మ్యాన్ భార్య ఇలా ఒక్కొక్కరుగా నలుగురైదుగురు అతణ్ణి స్కూలు రూం కాన్సిల్ చేయవద్దని, కాన్సిల్ ని రద్దు చెయ్యమని రిక్వెస్ట్ చేసారు. అతడి కాబిన్ లో దాదాపు 50 కుర్చీలు వేసి కాన్ఫరేన్స్ హాల్ లా ఉంటుంది. అయితే కనీసం అతడు పేరెంట్సుని ఎవ్వరినీ కూర్చోమనలేదు. అందులో దేవస్థాన ఉద్యోగులు నలుగురైదుగురు ఉన్నారు. మిగిలిన వారంతా వ్యాపారులు, వివిధ శాఖల్లో ఉద్యోగులు. అలా నిలబెట్టిందే గాక, అతడు కనీసం ఓ 40 నిముషాల పాటు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు.

వచ్చేసంవత్సరం కేంద్ర సిలబస్ [CBSE] తో మంచి స్కూలు శ్రీశైలంలో నెలకొల్పుతామన్నాడు. ఆ స్కూలు వివరాలు కావాలంటే చూపిస్తానని అన్నా ఎవరు ఆసక్తి చూపలేదు. అతడు పదేపదే చెప్పాడు.[2009 వరకూ ఏ స్కూలు రాలేదు.] ఆస్కూలు వచ్చేవరకయినా దీన్ని ఉండనివ్వమని పేరెంట్సు అన్నారు. “ఆ కృష్ణయ్య సార్ కి రమణయ్య లాంటి అటెండర్లు ఏవో చాడీలు చెబుతున్నారు సార్! అది విని ఆసారు కోపం చేసాడు. మీరి అది విని ఈ సారు, మేడం వాళ్ళు రూం కాన్సిల్ చెయ్యకండి. నాలుగేళ్ళుగా మేమంతా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటున్నాం” అంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారు. అతడు “మీరు మీబిడ్డల గురించి ఎంత బాధపడుతున్నారో, నేను నాబిడ్డల గురించి అంతే ఆలోచిస్తాను. ఈ దేవస్థానంలో పనిచేసే వాళ్ళంతా నాబిడ్డల లాంటి వారే! మీకు తెలుసు గదా! ఈమధ్య శ్రీశైలం నుండి బల్క్ ట్రాన్స్ ఫర్లు అయ్యాయి. కొత్తగా ట్రాన్స్ ఫర్ అయి ఇక్కడికి వచ్చిన ఉద్యోగులలో దాదాపు 30 మంది సెలవులో ఉన్నారు. [దీనికి వేరే కారణాలు ఉన్నాయిలెండి] ఏమిటీ సంగతి అని విచారిస్తే వాళ్ళకి ఇక్కడ accommodation లేదట. ఇక్కడ, ఈ శ్రీశైలంలో చిన్న ఉద్యోగికి పెద్దకాటేజ్ ఎలాట్ అయ్యాయి. పెద్ద ఉద్యోగికి చిన్నచిన్న గదులు ఎలాట్ అయ్యాయి. ప్రైవేటు వాళ్ళకి ఎన్నో రూంలూ, కాటేజీలు ఎలాట్ అయ్యాయి. అందుకే అన్నిటినీ రెగ్యులరైట్ చెయ్యాలనుకుంటున్నాం. ఎక్కడో చోటి నుండి మొదలుపెట్టాలి కదా! అందుచేత ఇక్కడి నుండి మొదలు పెట్టాం. ఈ స్కూలు వాళ్ళకే కాదు, శ్రీశైలంలో మిగిలిన స్కూళ్ళవాళ్ళకు కూడా త్వరలో నోటిసులు ఇస్తాం. మిగిలిన ప్రైవేటు వారికి కూడా ఇస్తాం. అందర్నీ ఖాళీ చేయిస్తాం. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని వీళ్ళకి నోటిసులు ఇవ్వలేదు. నా ప్రయారిటిలు రెండే. ఒకటి వసతి, రెండు వైద్యం. కాబట్టి నేను చెయ్యగలిగింది ఏం లేదు. వీళ్ళు ఖాళీ చేసి తీరాల్సిందే” అన్నాడు.

మేం పిల్లల తల్లిదండ్రుల పేరిట, మా పేరిట ఈ.వో. కి requisation వ్రాసి, దానిపైన మా సంతకం పెట్టి, తల్లిదండ్రులందరి చేతా పెట్టించాము. [కాపీ Coups on World లో చూడగలరు.] సత్యదేవ్ అది అతడికి అందించి “కనీసం కొంచెం టైం ఇవ్వండి సార్! ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అవి అయిపోతే ఇంకెక్కడయినా వసతి వెదుక్కుంటాము” అని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా అదే రిక్వెస్ట్ చేయటంతో అక్కడ కాస్సేపు మాటలు కలగాపులగంగా అయ్యాయి. అతడు “సరే సరే! ఎంత టైంకావాలి?" అన్నాడు. మావాళ్ళు రెండునెలలు అడిగారు. అతడు మే 8 వరకూ [అంటే 5 వారాలు] టైం ఇచ్చాడు. చేసేది లేక అందరం సరేనన్నాం. అతడు మా requisation మీద green ink తో మే 8 తేది వేసి నోట్ వ్రాస్తూ, "మే 8 తర్వాత వాళ్ళు ఖాళీ చెయ్యకపోతే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా సాక్ష్యం. బాధ్యత కూడా మీదే! నాకూ లీగల్, అడ్మినిస్ట్రేషన్ తెలుసు. అప్పుడు ఖాళీ చెయ్యకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది” అన్నాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

You are really born tough! Hats off!!

waiting for next post

Akka! oka saari Bharatahm chivara chadavandi. Raaboyedi kalikalam ani telusukoni vidurudu dhrutarastrudu & gandharilanu teesukoni himalayalaku velli tanuvu chalistadu. Deeni artham emitante manchi kosam tapinchevallaku ee kaalamlo choto ledu. Be a roman while you are in Rome. I am feeling you are just like mine - Oka tammudu.

మలక్ పేట రౌడి గారు,
‘Born tough’ అన్నది నాకు నేను పెట్టుకున్న పేరు కాదండి. ఫ్యాక్టరీ నడుపుతున్నరోజుల్లో, నా struggle చూసి [అది మరో ప్రకరణం. నా struggle మీద రిసెర్చి చేసిన అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది.] నా స్నేహితులు నా గురించి అన్నమాట అది. నాగురించి నేను ‘ఓటమి అన్నది నాకు లేదు. ఎందుకంటే, గెలిచే వరకూ పోరాటం ఆపను గనుక’ అనుకుంటాను. అందుచేత నిరాశ నిసృహలకి గురికాను. నిరాశ కలిగినా త్వరగానే దాన్ని అధిగమిస్తూ ఉంటాను. మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.

మనోహర్ చెనికల గారు,
మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.

Anonymous గారు,
ఇలా అందరం రోమన్లం అనుకోబట్టే భారతదేశం ఇలా అయ్యింది. ఇటలీ స్త్రీ పరిపాలిస్తుంది.

ఇంకొన్ని రోజులు పోతే దేసంలో ఇటలీ పద్దతులూ, ఇటలీ కరెన్సీ లు రాజ్యమేలుతాయేమో.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu