ఈరోజు టపా:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 77[రాష్ట్రపతి కలాం, సోనియా గాంధీలకి ఫిర్యాదు]

మన రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఐ.వి.సుబ్బారావు కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు. దేశంలో ఇంకా మూడు విడతల పోలింగు మిగిలి ఉంది.

ఈ సందర్భంగా ఓ ఎన్నికల లీల…..

రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకూ పత్రికలు, టీవీలు ప్రజల్ని జాగృతం చేస్తూ – ఓటు అతి పవిత్రమైనదనీ, దాన్ని అమ్మకోకూడదని చెప్పాయి. అదెంతో సంతోషించదగ్గవిషయం. డబ్బుకాశపడి నోటుకు ఓటు వేయటం – చేజేతులా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోవటమేనని పత్రికలు, టీవీలు ఎలుగెత్తి చెప్పాయి. అదెంతో నిజం కూడా! ఈనాడులో అయితే దీనికోసం కొన్ని ప్రత్యేక పేజీలు, శీర్షికలు నిర్వహించబడ్డాయి. ప్రతీరోజు కుర్రతారలు ఈవిషయమై చాలా సుద్ధులు కూడా చెప్పారు. ఏదిఏమైనా నోటుకు ఓటు అమ్ముకోకూడదని, ఓటు పవిత్రమైనదని అందరూ చెప్పారు. బాగుంది. బాధ్యతాయుతంగా ఉంది.

అయితే, ఇంత బాధ్యతనీ సదరు పత్రికలు 22, జూలై 2007 న ఎందుకు నిర్వహించలేదన్నది ప్రశ్న! ఒక్క ఓటే పవిత్రమైనది కదా! మరి అలాంటి లక్షల ఓట్లతో గెలుపొందిన ఎం.పి.లు తమ ఓటును కోట్లకు అమ్ముకోవడం ఎంతనీచం? మరి ఎం.పీ.ల ఓటు పవిత్రమైనది కాదా? అమ్ముకోదగినదా? ఆరోజు ఒక్కో ఎం.పీ.ఓటు కోట్లరూపాయాలు పలికిందని వార్తలొచ్చాయి. పత్రికలే వ్రాసాయి, పార్లమెంటులో నోట్లకట్టల ప్రదర్శన ప్రత్యక్షప్రసారం చూశాము. శిబూశోరెన్ తన, తన పార్టీవారి ఓట్లకు ప్రతిఫలంగా బహిరంగ బేరాలు, బెదిరింపులు చేసి జార్ఖండ్ ముఖ్యమంత్రి సీటు తీసుకున్నాడు. ఇది ఓటు అమ్మకం కాదా? ఇదే విషయమై సమాజ్ వాదీ పార్టీ అమర్ సింగ్ తమని కాంగ్రెస్ ఉపయోగించుకుని, ఆ తర్వాత చారులో కరివేపాకులా తీసి అవతల పారేసిందని వాపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో అయితే, అలా ఓటు అమ్ముకున్న ఆదికేశవులు నాయుడు తెదేపా నుండి బహిష్కృతుడైనా, సంతోషంగా, టీటీడి ఛైర్మన్ పదవిలో సెటిల్ అయిపోయాడు. తెదేపా పార్టీ మాత్రం ఇతణ్ణి బహిష్కరించటానికి చాలా బాధపడింది. తప్పని సరిగా బహిష్కరించింది. మందా జగన్నాధందీ అదే కేసు. ఢిల్లీ ఏపీ భవన్ లో కేబినెట్ మంత్రి హోదాగల పదవి పొందాడు. వీటన్నిటి సాక్షిగా, చట్టబద్దంగా కిశోర్ చంద్రదేవ్ అసలు విశ్వాసపరీక్షలో ఓట్లు అమ్ముడుపోలేదంటూ నివేదిక ఇచ్చేశాడు. మరి పార్లమెంట్ లో డబ్బు ఎలా ప్రత్యక్షమయ్యింది అన్నవిషయమై అందరూ కిమ్మనకూడా ఉన్నారు. డబ్బు ప్రత్యక్షం కావటం డ్రామా అయితే కావచ్చు. గాని పదవులు పొందటం మాత్రం నిజమే కదా!

ఓటుకు బదులు పదవులిచ్చిన కాంగ్రెస్ ప్రధానమంత్రి, అధ్యక్షురాలు ఓటుకు నోట్లు ఇవ్వలేదను కోవటం భ్రమ. ఇంత బాహాటంగా ఓట్లు కొనుగొలు/అమ్మకాలు జరిగిన సందర్భంలో పత్రికలు గానీ, టీవీలు గానీ ఎంపీల ఓట్లు పవిత్రమైనవనీ, వాటికి అమ్ముకోవడం నీచం అనీ, ఎందుకు ఎలుగెత్తి అరవలేదు? సాక్షాత్తు లోక్ సభాపతే సొంతపార్టీని విడనాడి, జీవితంలో మళ్ళీ రాదనిపించిన ‘అవకాశాన్ని’ సద్వినియోగం చేసుకున్న ఈ ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యపరిరక్షణ అనేపవిత్ర బాధ్యతని భుజల మీద మోస్తున్న మీడియా ఆ రోజెందుకు గొంతెత్తి ప్రచారించలేదు? ఎవరయితే ఓటు అమ్ముకుని పదవులు పొందారో, వారందరి గురించి పత్రికలు బహిరంగపరిస్తే, బహిష్కరిస్తే మరోసారి ఎవ్వరయిన తప్పుచెయ్యటానికి భయపడతారు కదా?

సామాన్యుల ఓట్లు పవిత్రమైనప్పుడు, లక్షలాది సామాన్యుల ఓట్లతో గెలుపొందిన ఎంపీల ఓట్లు పవిత్రమైనవి కావా? సామాన్యుడు అమ్ముకుంటే వందా, అయిదువందలకి అమ్ముకున్నాడు. అదీ ఆ పదిరోజులు కడుపునిండితే చాలనుకునేంత పేదరికంలో ఉన్నవాడు. [ఆకలితో, పేదరికంతో బాధపడుతున్నవాడికి నీతులు, సిద్దాంతాలు బోధించడం నిజంగా ఘోరం.] అదే ఎం.పి.లైతే ఒక్కొక్కరు బొజ్జలు పెంచినవారు, ఆదికేశవులు నాయుడు వంటివారైతే స్వంత హెలికాప్టర్లు కలిగినంత భాగ్యవంతులు. మరి వాళ్ళు ఏ కక్కుర్తితో ఓట్లు అమ్ముకున్నట్లు? అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన బాధ్యత పత్రికలకి గుర్తు రాలేదేం పాపం! నిన్నటికి నిన్న పోలింగ్ రోజున ఎన్నికల అధికారులుగా విధులకు వెళ్తున్న వాళ్ళ జేబులో, ఒక్కొక్కరి జేబులో వెయ్యిరూపాయల నోట్లు పెడుతూ, ఫోటోకి చిక్కిన కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టరు ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించినా, మొత్తం అయిపోయిన తరువాత పోలీసులు తీరిగ్గా వచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇలాంటి సంఘటనలు జరిగినా పట్టించుకోకుండా ఉండటానికి పోలీసు కానిస్టేబుల్ స్థాయి నుండి పైస్థాయి దాకా అందరూ డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారు. పత్రికావిలేఖరులు కూడా ఎన్నికల ప్రారంభంలో అభ్యర్ధుల నుండి డబ్బులు డిమాండ్ చేసారు. పత్రికలు ప్రకటనలకి, తాము వాస్తున్న వార్తలకి తేడా లేకుండా ప్రకటనలు జారి చేసి డబ్బులు చేసుకుంది.

అంటే నీతులన్నీ సామాన్యులకి చెప్పేందుకేనా, పత్రికలున్నది?

ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం?

గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లు గాకపోతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

ఆదికేశవులు నాయుడు is the most corrupt person. But Samuel Reddy appointed him as TTD Chairman. There was no protest from Hindus. Shame on Hindu leadership.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu