ఇలా అప్పటికే భారతీయ సమాజంలో, ముఖ్యంగా హిందువుల్లో తక్కువ కులాలు గానూ, వర్గాలుగానూ ముద్రపడిన ప్రజల్లో పేరుకు పోయిన స్వంత మతం పట్ల నిరాసక్తతనీ, అసంతృప్తినీ మహమ్మదీయ రాజులు [బానిసవంశమైనా, ఖల్జీలైనా, లోడీలైనా, మొగలులైనా ........ ఏ వంశమైనా మహమ్మదీయులందరూ] బాగా ఉపయోగించుకున్నారు.


ఇస్లాం మతంలోనూ తెగలూ, వైరుధ్యాలూ ఉన్నా గూడా వాటికి ప్రచారం లేక పోయింది. ఇస్లాం లోని ’సమానత్వం’, అంటరాని తనం లాంటి దురాచారాలు లేనితనం, వారిని ఇస్లాం వైపు ఆకర్షించింది. [నిజానికి ‘గుణాన్ని బట్టిగాక జన్మని బట్టి వర్గీకరణ’ చాతుర్వర్ణ వ్యవస్థ అసలు అర్ధంకాదు. అది మధ్యలో చేరిన దురాచారం. పైగా దీన్ని భగవద్గీతకి అంటుగట్టడం కూడా చదివాను. ఈ విషయమైన విపులమైన చర్చ నా ఆంగ్ల బ్లాగు Coups On Worldలోని Application Of Bhagavad Geetha and Coup on its Application లో చేశాను.]

ఏమైతేనేం, క్రమంగా ఇస్లాం మతం భారతదేశంలో విస్తరించడం ప్రారంభించింది.

ఇక్కడో విషయం గమనించాలి – హిందూ మతం, క్రైస్తవం, ఇస్లాం ఏదైనా మతమే. ఏదైనా మంచే చెబుతుంది. చెప్పాలి. ఏ పేరుతో పిలిచినా దైవం ఒక్కడే కావాలి. ఎందుకంటే ఏ భాషలో చెప్పినా సత్యం సత్యమే కాబట్టి. హిందూ మతం మీద నకిలీ కణికుడు కుట్రని నేను మరోసారి చర్చిస్తాను.[ ఆంగ్లంలో అయితే Coups On World లోని Coup on Hindu Religion and Other Religions లో చూడగలరు.]

ఇక్కడ రాజకీయ రంగమ్మీద కుట్రని వివరించాలన్నదే నా ప్రయత్నం.

ఎప్పుడైతే ముస్లింలు భారత దేశమ్మీద దాడులు ప్రారంభించారో అప్పటి నుండే వాళ్ళు తమ మతాన్నే గాక, తమ కుట్ర కుతంత్రాల మనస్తత్త్వాన్ని కూడా భారతదేశంలోనికి తీసుకొచ్చారు. ప్రాచుర్యంలోకీ తెచ్చారు.


ఘోరీ మహమ్మదు లాంటి వారు దీనికి సజీవ తార్కాణాలు. ఇతడి దండయాత్రలు సమయానికి ఉత్తర భారతదేశాన్ని, ముఖ్యంగా పశ్చిమోత్తర భాగాన్ని రాజపుత్రరాజులు పరిపాలిస్తుండే వాళ్ళు.

వారిలో రాజా జయచంద్రుడు ఒకడు. ఇతడి కుమార్తె యువరాణి సంయుక్త. అందమైన అమ్మాయి. చౌహాన్ వంశీయుడు, ఢిల్లీ రాజధానిగా గల రాజ్యాపాలకుడూ అయిన పృధ్విరాజుని ప్రేమించింది. ఇది జయచంద్రుడికి ఇష్టం లేదు. జయచంద్రుడు తన కుమార్తెకు స్యయం వరం ప్రకటించాడు. అందర్నీ ఆహ్వానించాడు గానీ పొరుగు వాడైనా పృధ్వీరాజుని ఆహ్వానించలేదు, సరి కదా పృధ్వీరాజును పోలిన విగ్రహాన్ని ద్వారపాలకుడి రూపంలో పెట్టించాడు.

స్వయంవరం మంటపంలోకి ప్రవేశించే ప్రతీరాజు, యువరాజు ఆ విగ్రహాన్ని చూసి నవ్వసాగారు. అప్పటికే పృధ్వీరాజు మీద ఆసూయా, క్రోధం గల జయచంద్రుడదంతా చూసి ఆనందిస్తున్నాడు.

వరమాలతో స్వయంవర మండపంలోకి ప్రవేశించిన యువరాణి సంయుక్త చుట్టూ పరిశీలించింది, పరిస్థితి అర్ధమైంది. ఆమె సూటిగా ద్వారం వైపు నడిచింది. చేతి లోని వరమాల ద్వారపాలకుడు రూపంలో ఉన్న పృధ్వీరాజు విగ్రహం మెడలో వేసింది. ఈ సారి రాజులంతా జయచంద్రుణ్ణి చూసి నవ్వసాగారు.

ఇదంతా తన వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పృధ్వీరాజు ఆ సమయానికల్లా అక్కడికి చేరాడు. తనను వరించిన సంయుక్తని తీసికెళ్ళి పోయాడు. పర్వవసానంగా జరిగిన యుద్ధాల్లో జయచంద్రుడు చిత్తుగా ఓడిపోయాడు.

ఈ ‘ఫ్రస్టేషన్’లోనూ, క్షణికమైన భావోద్రేకాలతోనూ జయచంద్రుడు ఘోరీ మహమ్మదుకి పృధ్వీరాజును ఓడించేందుకు సాయం చేశాడు. బయటి నుండి వచ్చిన ఘోరీ మహమ్మద్ కు స్థానిక వాతావరణాన్ని, పరిస్థితుల్నీ, భౌగోళిక స్థితుల్నీ అర్ధం చేసుకొనేందుకు కావలసిన సమాచారాన్ని, విశ్లేషణనీ అందించాడు. పృధ్వీరాజుని జయించాక ఘోరీ మహమ్మదు జయచంద్రుడి రాజ్యాధికారాన్ని కూడా నాశనం చేశాడు. ఆ సందర్భంలో అతడి వాదన “జయచంద్రా! పృధ్వీరాజుని జయించేందుకు నువ్వు నాకు సహాయం చేశావు. ఇందుకు నేను నీకు కృతఙ్ఞతలు చెప్పాలి. కానీ నీ స్వంత కుమార్తెకీ, అల్లుడికీ హాని చేసేందుకు సిద్ధపడిన ప్రమాదకారివి నీవు. నిన్ను నమ్మకూడదు” అని.

నిజానికి ఈ శిక్ష జయచంద్రునికి తగినదే అగు గాక. కానీ ఘోరీ మహమ్మదు స్ట్రాటజీ మాత్రం అవినీతి పూరితం, అవకాశవాదం, మరియు కుతంత్రం. పృధ్వీరాజుని ఓడించక ముందు నుండే అతడికి జయచంద్రుడూ పృధ్వీరాజుల మధ్య బంధుత్వం తెలుసు కదా! మరి అప్పుడెందుకు నమ్మినట్లు?

ఇదీ ఆ మహమ్మదీయ రాజుల కుతంత్రపు రక్తం.

ఇక 13వ శతాబ్ధంలో మరొక మహ్మదీయుడు అల్లా ఉద్దీన్ ఖీల్జీ భారతదేశంలోని, రాజ పుత్ర రాజ్యం చిత్తోడ్ ఘడ్ మీదకి దండయాత్ర చేశాడు. అప్పటికి చిత్తోడ్ ఘడ్ రాజు రాణా రత్నసింహుడు. ఆయన భార్య రాణి పద్మిని. ఆమె అద్భుత సౌందర్యవతిగానూ, విదుషీమణిగానూ, పేరుగాంచింది. ఆమెను కాంక్షించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ ఘడ్ పై అనేక సార్లు దండయాత్ర చేశాడు. కానీ గెలవలేకపోయాడు.

చివరికి ఒక రాయబారి ద్వారా రాణా రత్నసింహుడికి ఒక వర్తమానం పంపించాడు. “రాణి పద్మిని సౌందర్యం గురించి నేను చాలా విని ఉన్నాను. ఆ ప్రఖ్యాతి లోని నిజం తెలుసుకోవాలని, ఒక్కసారి ఆమెను చూడాలని కోరుకున్నాను. ఒక్కసారి ఆమెని చూడగలిగితే, నేను యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళిపోతాను” అన్నది ఆ వర్తమాన సారాంశం.

రాజు రాణా రత్నసింహుడు, మంత్రులూ ఆలోచించారు. రాణి పద్మినితో చర్చించారు. చివరికి వారంతా “అల్లా ఉద్ధీన్ ఖిల్జీని మన రాజ్యానికి ఒక స్నేహితుడిగా భావించి విందుకు ఆహ్వానిద్దాం. మన సౌహార్ర్ధాన్ని, స్నేహాన్ని మనం చూపిద్దాం. ఏవిధంగా చూసినా యుద్ధం కంటే శాంతి గొప్పది కదా! రాణి పట్ల అతని దృష్టి నీచమైనది కాదని అతడి వర్తమానం చెబుతోంది. ప్రఖ్యాతి గాంచిన విషయం పట్ల గల కుతుహలమే నంటున్నాడు కాబట్టి రాణి ప్రతిబింబాన్ని అతడికి అద్దంలో చూపుదాం. మన రాణి గారికి సోదర తుల్యుడుగా అతణ్ణి గౌరవిద్దాం” అని తీర్మానించారు.

ఆ విధంగానే అతడికి కబురుపంపారు. అతడీ ఆహ్వానాన్ని అందుకుంటూ తనను తాను రాణీ పద్మినికి సోదర తుల్యుడిగానూ, రాజూకూ, చిత్తోడిఘడ్ ప్రజలకూ మిత్రుడిగానూ ప్రకటించుకున్నాడు. విందు రోజున రాజు రాణారత్నసింహుడు, మంత్రులూ, చిత్తోడ్ ఘడ్ ప్రజలూ అల్లా ఉద్దీన్ ఖీల్జీని విశిష్ట అతిధిగా గౌరవించారు. విందు తర్వాత రాణీ పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో అతిధికి చూపారు. ఆ సౌందర్యం చూచి అతడు అబ్బురపడ్డాడు. తన నైచ్యాన్ని పైకి ప్రదర్శించలేదు. తన అతిధి నటనను కొనసాగిస్తూ రాణా రత్నసింహుని ప్రతి విందుకు ఆహ్వానించాడు. రాజు ఇది అంగీకరించాడు.

తదుపరి రత్నసింహుడు కొద్దిపాటి పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి విందుకు వెళ్ళాడు. అతిధి మర్యాదని ఊహించారే గానీ కుట్ర అనుకోలేదు. ఎందుకంటే నమ్మకద్రోహం అంతగా భారతీయులకి తెలీదు. అతిధి మర్యాదులకు బదులుగా రత్నసింహుడు దగాని అందుకున్నాడు. రాజును బంధించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మినికి తనకు లొంగిపోవలసిందిగా కబురు పంపించాడు.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ రత్నసింహుణ్ణి ’అతిధి’ అంటూ ఆహ్వానించాడు. మానవీయ విలువల్ని నమ్మి, రాణా రత్నసింహుడు పరిమిత పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి వచ్చాడు. కాబట్టే అతడు రత్నసింహుని బంధించగలిగాడు. ఇది కుట్రే కదా! ఇదే పని అల్లా ఉద్దీన్ ఖిల్జీ అతిధిగా చిత్తోడ్ ఘడ్ కు వచ్చినప్పుడు [అప్పుడతనిదీ పరిమిత పరివారమే] రత్నసింహుడు చేసి ఉంటే? అతిధిని ఆదరించాలి, నమ్మించి మోసగించ కూడదు లాంటి నీతుల్ని తలచకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీని బంధించిన, చంపేసినా ఏం చేయగలిగి ఉండేవాడు? కేవలం మానవతా విలువల్నీ, సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లాంటి నీతి, ధర్మం పాటించారు గనుక భారతీయ రాజులు అలాంటి కుట్రలు చేయలేదు. నేటికీ పాకిస్తాన్ మన పట్ల అదే విధమైన మోసాలు చేస్తూనే ఉంది.

ఆ విధంగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ చేతిలో మోసానికి గురయ్యాక, రాణి పద్మిని, మంత్రులు కలిసి బాగా ఆలోచించి అల్లాఉద్దీన్ ఖిల్జీకి మరునాడు రాణి పద్మిని అతడికి లొంగిపోగలదని కబురు పంపారు.

మరునాడు పల్లకీల ’కాన్వాయ్’ అల్లాఉద్దీన్ ’కాంపైన్’ చేరింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆనందానికి అంతులేదు. ప్రఖ్యాతి గాంచిన అపురూప సౌందర్యవతి తన సొత్తు కాబోతోంది. తానామెను అందుకోబోతున్నాడు. ఆ పరవశంతో అతడు రాణీ గారి పల్లకీకి ఎదురు వెళ్ళి స్వాగతించాడు. అయితే అతడు స్వాగతించింది పరిచారికుల వేషంలో ఉన్న సైనికులకి. రాణి పద్మిని పల్లకీలో సైతం స్త్రీ వేషంలో ఉన్న యోధుడున్నాడు. ’మోసం’ అంటూ గావు కేకలు పెట్టిన అల్లాఉద్దీన్ ఖిల్జీ అనివార్యమైన యుద్దాన్ని ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడిన రాజ పుత్ర వీరులు రాణా రత్నసింహుని విడిపించుకొని పోయారు. దీనితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ క్రుద్ద్రుడయ్యాడు. సహజమే కదా! తాను ఎదుటి వాళ్ళను మోసగించగలిగినప్పుడు అది తన తెలివీ లేదా సామర్ధ్యం అనుకొని సంతోషాన్ని గర్వాన్ని పొందినప్పుడు, తాను ఇతరుల చేతిలో మోసపోతే అసహనానికి క్రోధానికి గురవుతారు కదా!

తర్వాతి ప్రయత్నంలో అల్లా ఉద్దీన్ ఖీల్జీ మరింత సైన్య సమీకరణ చేసుకొని మరీ, చిత్తోడ్ ఘడ్ మీదికి దండయాత్ర చేశాడు. కోటని వశపరుచు కొన్నాడు. రాణా రత్నసింహుణ్ణి, ఇతర యోధుల్ని చంపేసాడు. కానీ ఎంతో కాంక్షతో అంతఃపురాల్లోకి ప్రవేశించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి కనబడింది అందాల రాశులు కాదు, బూడిద రాశులు. రాణి పద్మినితో సహా రాణివాసపు స్త్రీలందరూ శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల మీదా కూడా నిరోధించటానికి, వారి రాకకు ముందే అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకొన్నారు. ఆవిధంగా నైతికత కాపాడు కోవటానికీ తమ జీవితాల్ని తృణప్రాయంగా, [ గరిక పోచల్ని వదిలినంత తేలికగా] వదిలివేశారు. అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు. అత్యాచారాల్లాంటి నైచ్యాన్ని భరించటం కంటే మరణం మేలన్నది వారి వివేచన. అలాంటి నైచ్యాన్ని నివారించటానికి వారు ఇతరుల్ని హత్య చేయాటానికైనా వెనుదీయరు, ఆత్మహత్య చేసుకోవాటానికైనా వెనుదీయరు. భారతీయ రక్తంలోనే అంతటి పౌరుషం నైతికత, సత్యం విషయంలో ఉంది. [ ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెంతగా విషప్రయోగాలు చేసినా, తిరిగి తిరిగి ఇది చిగురిస్తూనే ఉంటుంది.] ఇదే నైతికతని సీతాదేవి లంకలో రావణుని చెరలో చూపింది. అందుకే ఆమెని భారతీయులు సీతమ్మతల్లిగా కొలుస్తారు. అంతేగాని సీతాదేవి అందమైనది అయినందుకో, రాణి అయినందుకో కాదు.

ఇలాంటి భారత గడ్డపైకి ఎప్పుడైతే మహమ్మదీయులు, [ముస్లింలు] ప్రవేశించారో అప్పుడే తమతోపాటుగా రాజకీయల్లోనూ, మానవ సంబంధాల్లోనూ కుట్రలూ తెచ్చారు. ఇది చరిత్ర! ఎవ్వరూ, చివరికి మీడియా కూడా మార్చలేని చరిత్ర! మీడియా చరిత్రని రంగుమార్చి చెప్పగలదేమో, దాచి పెట్టగలదేమో గానీ చరిత్రని మాత్రం మార్చలేదు. [కాలం మానవాతీతమైనది గదా. జరిగిపోయిన కాలాన్ని గానీ, ఘటనల్ని గానీ మార్చడం ఎవరి తరం?]

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

3 comments:

Adi Lakshmi గారు,

"అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు".

Very well written. Keep up the good work.

Please read the books written by Professor P.N. Oak, author of Taj Mahal: The True Story.

http://www.stephen-knapp.com/was_the_taj_mahal_a_vedic_temple.htm

http://www.bbc.co.uk/dna/h2g2/alabaster/A5220

who told u tht all religions say good
please visit my blog
islamgurinchinijalu.blogspot.com

well written

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu