ఎక్కడో చదివాను, ఓ ప్రఖ్యాత పాశ్చాత్య తత్త్వవేత్త [జాన్ లాకో, డేవిడ్ హ్యూమో లేక మరొకరో, పేరు గుర్తు లేదండి. మన్నించాలి]గురించి. ఆయన ఉటంకింపు ఏమిటంటే – “చీమకి గనుక ఊహాశక్తి ఉంటే 10 వేల చీమ కాళ్ళతో, మరో 10 వేల చీమ మీసాలతో [టెంట కిల్స్] తో ఓ మహాచీమని తన దేవుడిగా ఊహించుకొంటుంది. అంతేకాదు ఆ ’మహా చీమ’ కు ప్రార్ధనలు చేస్తూ కల్పిత కథలని పురాణాలంటూనో, ఇతిహాసాలంటూనో అల్లుకుంటుంది”.

బహుశః ఇది సత్యమే కావచ్చు. చీమ కలాంటి ఊహశక్తి ఉందో లేదో మనకి తెలీదు. చీమలు అలాంటి మహా చీమ దేవుణ్ణి కల్పించుకొని ప్రార్ధస్తూండవచ్చు, తమ పుట్టల్లో చీమ దేవుడికి మందిరాలు నిర్మిస్తుండవచ్చు. చీమ భాషలో వారి మహా చీమ దేవుడి గురించి చీమ పురాణాలు చెప్పుకుంటుండవచ్చు. ఎవరికి తెలుసు?

మొన్నీమధ్య మన జీవ శాస్త్రవేత్తలు డాల్ఫిన్లకు తమదైన స్వంత భాష ఉందనీ, అవి ఇతర డాల్ఫిన్లకు ప్రత్యేకించి కొన్ని పేర్లు పెట్టుకొని గుర్తించుకోగలవనీ, వాటిదైన సమాచార వ్యవస్థ వాటిమధ్య ఉందనీ, గుర్తించామని ప్రకటించారు. ఏనుగులు, పులులూ కొన్ని పక్షులూ కూడా ఇలాంటి వ్యవస్థలు కలిగి ఉన్నాయట.

అలాంటి సమాచార వ్యవస్థల్లో, పులులు వగైరా జంతువులు మధ్య సమాచార మార్పిడి మనం వినలేని తరంగ ధైర్ఘ్యం గల ధ్వని తరంగాలుగా ఉంటుందనీ విన్నాం.

కాబట్టే ఙ్ఞానం, మన పంచేంద్రియాల సామర్ధ్యం పరిమితమైన వని మనం అంగీకరించాల్సిందే.

కాబట్టి చీమల మహాచీమదేవుడి సిద్ధాంతాన్ని మనం అంగీకరించాలి, గౌరవించాలి.

అదేవిధంగా మనం యూదుల మతాన్ని గౌరవించాలి. క్రైస్తవుల క్రైస్తవ మతాన్ని, ముస్లింల ఇస్లాం మతాన్ని మనం గౌరవించాలి. అదేవిధంగా అందరూ [మనతో సహా] హిందూమతాన్ని గౌరవించాలి.

కాని హిందూ మతం మీద ఓ సుదీర్ఘమైన కుట్ర అమలుచేయబడుతోంది, దాన్ని అగౌరవ పరిచేందుకు, అవమానించేందుకు ఇంకా చెప్పాలంటే నాశనం చేసేందుకు. బాహుశః ప్రపంచంలోని ఇతర మతాలు కూడా ఏదో రకంగా ఇలాంటి కుట్రనే ఎదుర్కొంటుండవచ్చు. నకిలీ కణికుడు వంటి ఈ కుట్రదారుల విభజించి - ప్రచారించు అన్న తంత్రం కారణంగా ఎవరికి వారూ తమ మతమ్మీదే అసత్యప్రచారం జరుగుతోంది, కుట్రజరుగుతోంది అనుకొంటుండవచ్చు.

నా శక్తి మేరకు ఈ కుట్రని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఈ కుట్ర కేవలం హిందూ మతం మీద కాదు, భారతీయ సంస్కృతి మీద, భారతీయుల జీవన సరళి మీద, భారతీయ కళల మీద, రాజకీయం, అన్ని రంగాల మీద, మొత్తంగా చెప్పాల్సి వస్తే మానవత్వం మీద, భావ వాదం [idealism] మీద, ఇప్పటికీ అమలు చేయబడుతూనే ఉంది.

వివిధ రంగాల మీద కుట్రని విడివిడిగా వివరిస్తాను.

ఇప్పడు ఇక్కడ భారతీయపురాణాల మీద కుట్రని వివరిస్తాను.

ఇతిహాసాలు, పురాణాలు అంటే భగవంతుడి కథలు.

నిజానికి ’భగవంతుడు’ అన్నది ‘నమ్మకం’ అన్న ఆధారం మీద నిలిచిన ఒక భావన.

[దీని మీద మరింత వివరమైన చర్చని ’భారతదేశంలోని హిందూ మతం, ఇతర మతాలపై నకిలీ కణికుడి కుట్ర’ అన్న అంశం క్రింద చర్చిస్తాను]

భగవంతుడన్న సిద్దాంతమే ’నమ్మకం’ అన్న పునాదిపై నిలిచినపుడు, సైన్సు సిద్దాంతాల మాదిరి దాన్ని ఎవరూ నిరూపించలేరు. వాస్తవానికి సైన్సు సిద్దాంతాలు కూడా అసంప్షన్స్ మీద, నమ్మకాల మీద ఆధారపడి వివరింపబడేవే. ఉదాహరణకి బోర్స్ ధియరీ[అణు నమూనా]. విశ్వపు పుట్టుకకి సంబంధించిన ’బిగ్ బ్యాంగ్ ధియరీ’, యధాస్థితి వాదమూ రెండూ కూడా నమ్మకం మీద నిలిచినవే.

ఎందుకంటే - విశ్వపరివ్యాప్తితో పోలిస్తే మన ఙ్ఞానపు పరిమితి తక్కువగనుక, విశ్వ పరిమితిపై మన అన్వేషణ ఎంత తెలుసుకున్న ఇంకా అసంపూర్ణమే. విశ్వం యొక్క స్పేస్ అండ్ టైమ్ కంటిన్యూయుటి ముందు మన దృష్టి, జీవన ప్రమాణం రెండూ చాలా తక్కువ గనుక.

ఇక్కడ మనిషి నమ్మకాల గురించి మనం కొంత ముచ్చటించుకుందాం.

ఈ నేపధ్యంలో శ్రీ రామకృష్ణ పరమ హంస చెప్పిన చిన్న కధలు మీకు వివరిస్తాను.

అనగా అనగా ...

ఒక గురువు గారు ఓ పల్లె ప్రక్కన గల అడవిలో ఓ గురుకులం నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులుండే వారు. వారిలో ఒక శిష్యుడు గురువు పట్ల ఎంతో వినయం, గౌరవం, మీదు మిక్కిలి నమ్మకం కలవాడు.

ఓ రోజు గురువుగారు కొద్దిమంది శిష్యులతో కలిసి చిన్ననది పాయకి స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో ఈ శిష్యుడు నదికి ఆవలి వైపున ఉన్నాడు. గురువు గారు శిష్యుణ్ణి తన దగ్గరికి రావలసినదిగా సైగ చేసారు. శిష్యుడు పడవకోసం వేచి చూడలేదు. నది కడ్డంపడి నడవసాగాడు. గురువు మీద నమ్మకం ఉంచి, గురునామం ధ్యానిస్తున్నాడు.
ఆశ్చర్యం! అతడు నీటిలో మునిగి పోలేదు. నడవ గలుగుతున్నాడు.

గురువు అది చూశాడు. తన శిష్యుడి శక్తి చూసి అతడికి చాలా సంతోషం, గర్వం కలిగాయి. ’నా పేరుకే ఇంత మహిమ ఉంటే నాకు మరింత మహిమ ఉండి ఉండాలి. నేను నడుస్తాను నీళ్ళమీద’ అనుకున్నాడు గురువు.

నదిలోకి దిగి నడవడానికి ప్రయత్నిస్తూ ’నేను నేను’ అని తన పేరు జపించసాగాడు.

అంతే! నీళ్ళల్లో మునిగి చనిపోయాడు.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి.

ఇదీ కథ!

ఈ కథలో శిష్యుడికి తన గురువుపై నమ్మకం ఉంది. అతడు గురువు నామాన్ని విశ్వసించాడు. అతడి ’నది దాటడం’ అన్న సమస్యని నమ్మకం దాటించింది.

ఇదే విధంగా మనం భగవంతుడి మీద నమ్మకంతో, మన జీవితంలోని సమస్యల్ని దాటుతూ ఉంటాం. ఇది మనలో చాలా మందికుండే సాధారణ అనుభవం.

ఎవరైనా నాస్తికులు “మనలో భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా, ఆ సమస్యని మీరు దాటే ఉండే వాళ్ళు. అది మనసు కున్న శక్తి, దేవుడిది కాదు. ఎందుకంటే దేవుడనే వాడు లేడు” అని వాదించారనుకొండి.

మన జవాబు ఇలా ఉండవచ్చు. “బహుశా ఆ శక్తి మనస్సుదే కావచ్చు, నాస్తికుడుగా మీరు “God is no where” అని నమ్ముతున్నారు. ఆస్తికులుగా నేను “God is now here” అని నమ్ముతున్నాను. మనిద్దరం నిలబడింది ఒకేపునాది మీద, ‘నమ్మకం’ అన్న పునాది మీద. కాబట్టి ఆవిషయంలో వాదించు కోవటంలో అర్ధం లేదు.”

అంతేకాదు.

పై కథలో శిష్యుడు వినయశీలి. గురువు అహంకారి. గురువు తన గురించి తాను అహంకరించాడు, గర్వించాడు. కనుకనే నీట మునిగిపోయాడు.

ఇదే నేపధ్యంలో, నమ్మకం గురించి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన మరో చిన్న కథ చెబుతాను.

అనగా అనగా...

ఓ ఊరిలో ఒక అమాయకుడుండేవాడు. వాడోసారి పనిమీద ప్రక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దారిలో చిన్న నదిని దాటవలసి వచ్చింది. మన వాడికి భయమేసింది. అంతలో అక్కడికొక యోగి వచ్చాడు. ఈ అమాయకుడు తననీ నది దాటేలా చేయమని యోగిని ప్రార్ధించాడు. ఆయోగి ఇతడి కొక రాగి తాయత్తునిచ్చాడు. దాని మీద బీజాక్షరాలు [మంత్రాక్షరాలు] వ్రాసి ఉన్నాయని, చెప్పి అది వాడి కిచ్చి “నాయనా! ఈ తాయత్తునూ చేతబట్టి, శ్రీరామ శ్రీరామ అని జంపిస్తూ నది దాటూ. ఒరవడిని తట్టుకొని నీట నడవగలవు” అని అన్నాడు.

ఈ అమాయకుడు యోగికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. యోగి తన దారిన తాను పోయాడు. అమాయకుడు ’శ్రీరామ శ్రీరామ’ అని జపిస్తూ నదిలో దిగాడు. ఆశ్చర్యం! వాడు నీటిమీద నడవగలుగుతున్నాడు. వాడికి పిచ్చి సంతోషం వేసింది. కించిత్తు గర్వంగా అనిపించింది. అప్పటికి సగం నది దాటాడు. ఉండీ ఉండీ వాడికి ఆ రాగి తాయత్తుమీద ఏమంత్రం వ్రాసి ఉందో అన్న కుతూహలం పుట్టింది. మడిచి ఉన్న రాగి తాయత్తు విప్పిచూశాడు. దాని మీద ’శ్రీరామ’ అని వ్రాసి ఉంది. అది చదివి ‘ఒట్టి రామా అనేనా? మంత్రమో, తంత్రమో కాదా!’ అనుకున్నాడు.

ఆ క్షణమే వాడు నీటిలో మునిగి పోయాడు.

ఇదీకథ!

ఈ కథలోని అమాయకుడు ఎంతసేపైతే తాయత్తు మీద, శ్రీరామ నామం మీద నమ్మకం కలిగి ఉన్నాడో అంతసేపూ నీట మునగలేదు. ఎప్పడైతే నమ్మకం కోల్పోయాడో, సందేహాన్ని ఆశ్రయించాడో ఆక్షణమే నీట మునిగాడు.

ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లోనూ చాలానే ఉంటాయి. మనం స్పృహ కలిగి పరిశీలించుకుంటే కనిపిస్తాయి. ఎప్పడైతే మనం భగవంతుడి మీద నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతామో, అప్పడే మన ఓటమి [ఏ ప్రయత్నంలోనైనా సరే!] మొదలవుతుంది.

హిందువులుగా, భారతీయులుగా మనం ఆత్మవిశ్వాసం అంటే భగవంతుడి మీద విశ్వాసం అని నమ్మకం. ఎందుకంటే అహం బ్రహ్మస్మి అన్నది పెద్దల నానుడి. సర్వజీవులూ, ప్రాణులూ ఆత్మ అయితే భగవంతుడు పరమాత్మ. దేవుడు సర్వప్రాణుల్లో ఉన్నాడు. సర్వప్రాణులూ దేవుడిలో ఉన్నాయి. ఇది భగవద్గీత మనకి చాలా స్పష్టంగా చెబుతుంది.

శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన మరో విషయాన్ని ఇక్కడ వ్రాస్తూన్నాను.

రామాయణంలో ఆంజనేయ స్వామి నూరు యోజనాల సాగారాన్ని లంఘంచి లంకకి చేరాడు. శ్రీరామ నామం మీది నమ్మకంతో. కాని, సాక్షాత్తు శ్రీరాముడు లంకని చేరాలంటే వారధి కట్టవలసివచ్చింది.

అదీ నమ్మకం యొక్క అపారమైన బలం!

భగవంతుణ్ణి నమ్మి, భక్తుడు అద్భుతాలు సాధించగలడు.

చిత్రమేమిటంటే దీన్ని ఆవిష్కరించటానికి దేవుడికి భక్తుడు కావాలి. [అందుకే మన పెద్దలు నరనారాయణ సంబంధం అని చెప్పారు]

భారతీయ ఇతిహాసాలు పాజిటివ్ [ఆశావాహ దృక్పధాన్ని] ఆలోచనా విధానాన్ని జనాల్లో పెరిగేలా చేస్తాయి. పురాణాలని, ఇతిహాసాలని నాశనం చేయటం ద్వారా, విమర్శించటం ద్వారా, వాటిపై జోకులు వేసి పలుచన చేయటం ద్వారా, ఈ కుట్రదారులూ, నకిలీ కణికుడు విజయవంతంగా భారతీయుల్ని నెగిటివ్ గా ఆలోచించేలా మార్చేసాయి. ఆత్మగ్లాని, మనల్ని మనం తక్కువ చేసికోవటం కూడా నెగిటివ్ ధింకింగ్ లో భాగమే.

కుక్కని చంపాలను కుంటే ముందు దానిని పిచ్చికుక్క అని ముద్రవేయాలని అంటారు. ఈ కుట్ర అలాంటిదే. హత్య చేస్తే నేరం. అదే వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పితే అది కుట్ర. నల్లమేక - నలుగురు దొంగలు కథలో దొంగలు ముసలి బ్రాహ్మణున్ని తన్ని మేకను లాక్కుంటే నేరం. అతడే తనంత తానే మేకని విడిచిపెట్టేలా చేస్తే అది కుట్ర..

రామాయణంలో ప్రసిద్దమైన హరిశ్చంద్రని కథ ఉంది. ఆయన సత్యహరిశంద్రుడిగా కీర్తి గడించాడు. అసత్యమాడకుండా ఉండటం కోసం ఆయన రాజ్యాన్ని, సంపదనీ, భార్యనీ, పుత్రుణ్ణీ, తనను తానూ త్వజించాడు. [అదే ఇప్పుడందరు అసత్వమాడటానికి ఎల్లవేళలా రెడీగా ఉంటున్నారు. పాలకులైతే మనకంటే ముందుగా రెడీ] చివరకి తన ఏకైక పుత్రుడి మృత కళేబరాన్ని అందుకొన్నప్పడు కూడా అసత్యమాడటానికి సిద్దపడలేదు. భార్యనీ తెలిసీ, ఆవిడ తల నరకటానికి సిద్దమయ్యాడే గానీ తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఎలాంటి కష్టంలోనూ, ఏ సమయంలోనూ ’సత్యం పలకడం’ అనే తన నైజాన్ని విడిచిపెట్టలేదు.

ఈ కథ మోహన గాంధీ ని మహాత్మ గాంధీగా మార్చింది. భారతీయులు ఈ కథ నుండి నిజం పలకడం, ధర్మంగా ఉండటం, నీతి కలిగి ఉండటం అనే లక్షణాలనీ, అలా ఉండాలనే స్ఫూర్తినీ పొందే వాళ్ళు. నాచిన్నతనంలో శ్రీరామ నవమి, ఇంకా ఇతర పండగ ఉత్సవాల్లో ప్రదర్శించే [సురభి] పద్యనాటకాన్ని చూచి ప్రజలు తన్మయులు అవ్వటం నాకు స్వయంగా తెలుసు.

ఇలాంటి ఈ పౌరాణిక గాధ మీద 1975 నుండి 1992 వరకూ ఒక పక్కా ప్రణాళిక ప్రకారము అన్నట్లు, ఓ ప్రచారం అమలుచేశారు. నకిలీ కణికుడు సినిమాల్లో, వారపత్రికల్లో, సాహిత్యంలో, ఇతర కళాప్రదర్శన కార్యక్రమాల్లో [మిమిక్రీ షోల్లాంటివి] ఓ
జోక్ ప్రచారింప చేశాడు. ఎలాగంటే …

టీచర్: పిల్లలూ! సత్యహరిశ్చంద్రుడి కథనుండి మీరేం నేర్చుకొన్నారు?
పిల్లలు: నిజం చేబితే చాలా కష్టాలొస్తాయని టీచర్!

లేదా
తండ్రి: ఏరా రామూ! సత్యహరిశ్చంద్రుడి కథనుండి ఏంనేర్చుకొన్నావు?
రాము: హాయిగా అబద్దం చెప్పడం మేలు నాన్నా!

ఇదే జోక్ పదే పదే, ఎన్నో రకాలుగా, జనాల్లో చివరిదాకా లేదా అట్టడుగు జనాల దాకా చేరేవరకూ ప్రచారింపబడింది.

అందరూ అదో జోక్ అన్నట్లు నవ్వేసి ఊరుకున్నారే గానీ ఎవ్వరూ ఈ స్లోపాయిజన్ గుర్తించలేదు.

ఒక్క ముద్రణా సంస్థగానీ, ఒక్క పత్రిక గానీ[దిన, వార, పక్ష, మాస పత్రికలతో సహా] ఒక్కమాటా పాజిటివ్ గా ప్రచురింపలేదు.
ఒక్క కాలమిస్టు , ఒక్క విలేఖరి కూడా ఒక చిన్న వ్యాసం కూడా వ్రాయలేదు, హరిశ్చంద్రుడు సత్యం పలికాడు గనుకే మన హృదయాల్లో సత్యహరిశ్చంద్రడై నిలిచిపోయాడని కులదీప్ నయ్యర్, లేదా నక్కీరన్ గోపాలన్ లేదా ఎన్.రామ్ లేదా రామచంద్రగుహా వగైరా వగైరా ఏ మేధావీ కూడా “వేల కొద్దీ రాజులు పుట్టారు, గిట్టారు. వారిలో సత్యహరిశ్చంద్రుడులాంటి మహానుభావులు కొందరే మనకి మార్గదర్శనం చూపారని” చెప్పలేదు, వ్రాయలేదు.

ఒక్కవార్తపత్రిక కూడా ప్రజలకి సత్యహరిశ్చంద్రుడు వేల సంవత్సరాల తర్వాత కూడా ఒక సాధారణ బాలుణ్ణి భారత జాతిపితగా మలిచాడనీ, అంత స్ఫూర్తి ప్రదాత అని వ్రాయలేదు. [ఎందుకు వ్రాస్తారు, సాక్షాత్తు అవే ఇదంతా చేయిస్తున్నప్పడు?] కనీసం ఉషశ్రీ, విశ్వనాధ లాంటి వారు నెత్తీ నోరు బాదు కున్నా అవి పత్రికలకు పట్టింది కాదు. అదే రంగనాయకమ్మలు పురాణాన్ని, ఇతిహాసాల్ని విమరిస్తే పేపర్లో పెద్దచ్చరాల్లో పడేవి.

ఇవేగాక ఎన్నో వ్యంగ్యాలూ, ఆక్షేపణలూ, సినిమాల్లో, సాహిత్యంలోనూ ఉండేవి. [ఇదంతా 1975 నుండి 1992 వరకూ ముమ్మరంగా జరిగింది] ఉదాహరణగా ఒక సినిమా పాటనూ పరిశీలించండి.

ఏ సినిమాలోనో నాకు తెలీదు. శ్రీమతి సుశీల పాడారు.

పల్లవి:

అదేవిటో! ఆడదంటే మగవారికి అలుసులే!
అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే.

చరణం:

ఆలిని అమ్మాడొకడు.
అడవికి పంపాడొకడు
ఒకడేమో జూదంలో పందెం బడ్డాడూ ..... అదేమిటో....

చరణంలోని తొలి పంక్తిలో పాటరచయిత సత్యహరిశ్చంద్రుణ్ణి రిఫర్ చేశాడు. హరిశ్చంద్రుడు భార్య చంద్రమతీ దేవిని అమ్మాడని ఎద్దేవా చేశాడు. ఆ వ్యంగ్యంలో అతడు దాదాపు హరిశ్చంద్రుణ్ణి, భార్యల్ని అవమానించి, అమ్మేస్తున్నా తాగుబోతులైన వారితో సమానం చేశాడు. అవినీతి పరులై భార్యల్ని, స్త్రీలని వ్యభిచార గృహాలకి అమ్మే పురుఘలతో సమానం చేస్తూ వ్యంగ్యోక్తి ప్రచారించాడు. ఆ పాట రచయితకి చంద్రమతీ దేవి స్వయంగా, స్వచ్చందంగా భర్త వెంట అడవికీ, కాశీ నగరానికీ వచ్చిందని గానీ, ఆయన సత్యవాక్పరిపాలనలో అధైర్యపడ్డప్పుడో, చింతపడినప్పుడూ ధైర్యాన్ని, స్ధైర్యాన్ని ఇచ్చి తోడుగా నిలబడిందని గానీ, తాను స్వయంగా సత్యాచరణకు నిలబడిందని గానీ గుర్తులేదు. లేదా కావాలనే మరిచి పోయాడు. ధర్మరాజు గురించి కూడా ఇలాంటి వ్యంగ్యము, అక్షేపణే.

ఇక రెండో వాక్యంలోని ఉత్తర రామాయణం గురించైతే చెప్పనే అక్కర్లేదు. ఆపాట రచయిత శ్రీరాముడు సీతమ్మని అడవికి పంపాడని ఎద్దేవా చేశాడు. అందులో శ్రీరాముడు తన స్వసుఖం కోసం సీతని అడవికి పంపినట్లుంటుంది, అతడి వ్యంగ్యం. సీతని అడవికి పంపాక శ్రీరాముడు మరో స్త్రీతో జీవితాన్నీ సుఖించాడా లేక మరో వివాహం చేసుకున్నాడా? సమాజంలో నీతి నియామాల్ని, సత్యధర్మాల్ని ప్రతిష్టించేందుకు శ్రీరాముడూ, సీతా తమ జీవితాల్లో స్వసుఖాల్ని త్యాగం చేశారు. [త్యాగమంటే ఒక్క ప్రధాని మంత్రి సీటుని త్యాగం చేసి ఆ పి.యం. రిమోట్ కంట్రోల్ ని చేతిలో పెట్టుకూర్చున్న కుర్చీవ్యక్తి త్యాగం లాంటి త్యాగం కాదది. భర్త బ్రతికున్నప్పడు భర్తకు రాజకీయాలు వద్దు అని ఆడపులిలా కొట్లాడి, అధికారం తన చేతికి రాగానే రాజకీయాలు కూడా బాగానే ఉన్నాయి అనే వ్యక్తి ది త్యాగం అనరనుకుంటా. ఈ కాంగ్రెస్సోళ్ళకు ఇదెప్పటికి అర్ధమౌతుందో నబ్బా!]

విషయాలు తెలుసుకోకుండా, ఉంది గదా అని తాటిపట్టనుపయోగించినట్లు నాలుకని ఉపయోగించడం నిజంగా చాలా తప్పు. అలాంటి తప్పుని చాకలి వాడు చేశాడు ఉత్తర రామాయణంలో. అయినా సరే, అది ప్రజా వాక్యమని శ్రీరాముడు దాన్ని నైతిక బాధ్యతగా తీసుకొన్నాడు. సీత మౌనంగా భరించింది. వారిద్దరూ ప్రజల్లో సద్వర్తన కోసం అష్టకష్టాల్ని భరించారు. భర్త సాహచర్యం కోసం రాజ్యసుఖాల్ని వదిలేసిన సీత, ఆమె కోసం మహా సంగ్రామాన్ని నడిపిన శ్రీరాముడు, ఒక్కడు, తనప్రజల్లో ఒక్కడన్న మాటకు కట్టుబడి చేసిన పనిది. [నూరు కోట్ల మంది నోరారా తిట్టినా సిగ్గు రాని ఈ పాలకులకీ, కరుణానిధిలకీ శ్రీరాముడు ఎలా అర్ధమౌతాడు చెప్పండి. అర్ధం చేసుకోనేంత మానసిక స్థాయి ఉండాలి కదా!] ఆవిధంగా, అంతకష్టం భరించి, స్వయంగా చేసి చూపించి సమాజానికి సరైన దారినీ, నైతిక వర్తననీ గురించిన సంకేతాలు పంపించారు వారిద్దరూ. పాపం పై పాటరచయితకీ, ఆ చిత్ర దర్శకుడికీ, నిర్మాతకీ ఈ విషయం తెలియదు మరి!

ఈ పాట ఏ సినిమాలోదో, ఎవరు వ్రాశారో, ఎవరు నటించారో, దర్శకుడెవరో, నిర్మతేవరో తెలియదు గానీ ఇలాంటి ప్రక్రియల వెనుక మాత్రం సినిమారంగంలోని గాడ్ ఫాదర్ ఉన్నాడన్నది మాత్రం సుస్పష్టం.ఈ గాడ్ ఫాదర్ లూ నకిలీ కణికుడు బాహ్యరూపాలే! ప్రారంభంలో వీరి పట్టు బిగింపు కార్యక్రమాలు తెర వెనుక, పరోక్షంగా ఉండి క్రమంగా వ్యవస్థీకృతమయ్యాయి. ఇందుకు కొన్ని దశాబ్దాల కాలం పట్టింది. నిగూఢ కార్యకలాపాల్లో, గూఢచర్య కళలో ఒక్కో ప్రణాళిక ఏళ్ళపాటు అమలు చేయబడటం, ఫలితాన్ని దశాబ్ధాల ఇంకా చెప్పాలంటే శతాబ్ధాల తర్వాత ఆశిస్తారు. [ఇదే నకిలీ కణికుడు జనాలకి మాత్రం ’ఇన్ స్టంట్’ ఫలితాల్ని అలవాటు చేస్తాడు] గూఢచార నైపుణ్యం అంత సహనంతో కూడినదని మన చరిత్ర,, ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి. తిమ్మరుసు మంత్రి 16 ఏళ్ళపాటు శ్రీకృష్ణదేవరాయాల్ని నేల మాళిగలో ఉంచి శిక్షణ నిచ్చాడని ఓ కథ ప్రచారంలో ఉంది.

తదుపరి టపాలలో ఈ ప్రయత్నాన్ని మరింత కొనసాగిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

12 comments:

అన్నీ conspiracy లే...బాగున్నాయ్!

మీ వ్యాస పరంపర అద్భుతంగా ఉంది. కొనసాగించండి.

there an adage... "If two people agree upon everything, only one of them is thinking." But in spite of that quote, I must say that I find in agreement most of the times, probably because the theme is so familiar in my mind and you express them nicely!

Looking forward to the next.

saagilapaDi mIku namaskaristunnaanu. alaanTI kutra ikkaDa bllaglOkam lO kUDA amalu avutOndi ani naaku chaala saarlu anipinchindi. [:)]

మహేష్,
మీరు ఊరకుండలేరా :-)

వ్యాఖ్యవ్రాసినందుకు కృతఙ్ఞతలు.

బొల్లోజు బాబా గారికి,
మీ బ్లాగు చూశానండి. కవితలు బాగున్నాయి. స్వాతంత్ర సమరయోధుడి కడుపున పుట్టిన మీరు ధన్యులు. వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

మంచివ్యాసం. కణికుడి వారసులు, మెకాలే పుత్రులు కోకొల్లలు. మనమీద, మన సంస్కృతి పట్ల మనకే అసహ్యం వేసేలా చేసి చవటలని చేయడం వాళ్ళ ఉద్దేశ్యమైతే, వాళ్ళ ఆలోచనలని గుడ్డిగా అనుసరించడం మనవాళ్ళ బానిసతనం.

మీరు చెప్పే విధానం బాగుంది. మిగతా వ్యాసాల కోసం ఎదురు చూస్తూ...మనం రాస్తే "సెన్సేషను" ఇంకోడు రాస్తే "కాన్స్పిరసీ" .......:)....కణికుడి తీరు ఇదే...వందనం... అర్ధమయినవాడు ఏకోనారాయణ.. మీకు అరచేతి మందాన అర్ధశేరు పెసరట్టు...

చాలా మందిమి రాయాలనుకొని, రాయగలమో లేమో అని ,రాసిన వాటిని conspiracy లు కాదు అని రుజువు చేసుకోలేమోనని భయపడే వాళ్ళ గళాలన్నీ మీ గళంలో పలికిస్తున్నారు.
great..

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

Excellent, Kudos to you

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu